Sunday, 26 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా జరిగిన జాతీయ కవి సమ్మేళనం – స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిచే కవులకు సత్కారం

మార్చి18 @ వెంకటాచలం (నెల్లూరు) సమీపంలో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శతాధిక జాతీయ కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సుమారు 200కు పైగా కవులు రచయితలు పాల్గొని ఉగాది సందర్భంగా వివిధ సామాజిక అంశాలతో తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు పై మక్కువ పెరుగుతుందని, సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇంతమంది కవులు పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయమని అందరినీ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎం. సంపత్ కుమార్, అధ్యయనకేంద్ర సిబ్బంది, ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (బాల సాహిత్యంలో) పొందిన డా. గంగిశెట్టి శివకుమార్, డా. బద్రి పీర్ కుమార్ తదితర కవులు , రచయితలు పాల్గొన్నారు.

E-పేపర్

రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు

రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు…. సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు పున్నమి న్యూస్ ప్రతినిధి 18 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని, సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఆచరించే ఈ రంజాన్ ఉపవాస దీక్షలు సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరూ కలిసి మెలిసి విందులో పాల్గొని, అల్లాహ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ MPTCలు మొరుగు రమేష్ , ముంత జంగయ్య , 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్ , 11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర జంగయ్య , 10వ వార్డు సభ్యులు కలకొండ బీరప్ప , 12వ వార్డు సభ్యులు బూర సురేందర్ , 6వ వార్డు సభ్యులు అండెకార్ అనిల్ ,మాజీ వార్డు సభ్యులు జమ్మ మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. “ఈద్ ముబారక్”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులకు గిట్టుబాటు ధరలో ప్రభుత్వం విఫలం: కాకాణి విమర్శలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మరణించిన కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు.

E-పేపర్

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి మల్రెడ్డి రాంరెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి మల్రెడ్డి రాంరెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి కావున ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకు యాచారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు విచ్చేయుచున్నారు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరుతున్నాను ఇట్లు గౌరారం వెంకట్ రెడ్డి ఈదమ్మ తల్లి దేవాలయ నిర్మాణ & స్థల దాత

తిరుపతి

శ్రీకాళహస్తిలో అనధికార లేఅవుట్లపై కొరడా ఝులిపిన మున్సిపల్ అధికారులు

శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో అనుమతులు లేకుండా వెలుస్తున్న అనధికార లేఅవుట్లపై పురపాలక సంఘం అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పానగల్ ఆర్చి సమీపంలోని సర్వే నంబర్ 204లో నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వేసిన ఈ అక్రమ వెంచర్లను మున్సిపల్ సిబ్బంది తక్షణమే తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు. నిబంధనల ప్రకారం అనుమతి లేని చోట భవన నిర్మాణాలు చేపట్టినా, అవి అక్రమ కట్టడాల కిందకే వస్తాయి. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, ప్లాట్లు లేదా భవనాలు కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలుదారులు ఏదైనా ప్లాట్ కొనే ముందు, సదరు లేఅవుట్‌కు మున్సిపల్ శాఖ నుండి సరైన అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. అనధికార లేఅవుట్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

తిరుపతి

నేడు శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఘనంగా ఇఫ్తార్ విందు

శ్రీకాళహస్తి పట్టణ ముస్లిం మైనారిటీ సోదర, సోదరీమణుల కోసం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం నేడు సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానుంది. ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ విందుకు విచ్చేసి, సామూహిక ప్రార్థనల అనంతరం విందులో పాల్గొనాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమని, నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరితో కలిసి ఈ పవిత్ర మాసాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పట్టణంలోని ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని కోరారు.

తిరుపతి

ఘనంగా టిడిపి బీసీ నాయకులు డాక్టర్ ఉమేష్ రావు జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖ బీసీ నాయకులు డాక్టర్ ఉమేష్ రావు మోరే జన్మదిన వేడుకలు పట్టణంలోని జయరాంరావు వీధిలో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఉమేష్ రావు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాడని అన్నారు.ఆయన ఆయుఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని శ్రీ జ్ఞానప్రసూనాంబ తల్లి సమేత వాయులింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. దశరదాచారి,మిన్నల్ రవి, రెడ్డి వారి గురవారెడ్డి,కాసరం రమేష్, వజ్రం కిషోర్,ఢిల్లీ బాబు, బీమాల భాస్కర్,పేట బాలాజీ రెడ్డి, సుబ్బయ్య,కుమార్, కోట చంద్రశేఖర్, ప్రభాకర్, వివేక్, రాకేష్ బాబునాయుడు, సుబ్బు,నవీన్, శరవణ,శ్రీను,బాల,జమీర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన సీనియర్ అడ్వకేట్ ఆరంభాకం ముని ప్రసాద్ పోటీ చేయగా అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీ చేస్తున్నారు. సెక్రటరీ స్థానానికి ముత్యాల తులసీరామ్, కే వెంకట రమణయ్య పోటీ చేయగా వైస్ ప్రెసిడెంట్, సభ్యులుగా ముగ్గురు, లేడీ రిప్రజెంటేటివ్ ఇతర పదవులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తున్నది. ఈనెల 19వ తేదీన నామినేషన్ ఉపసంహరణ ఉంటాయని ఎన్నికలు మార్చి 27వ తేదీన జరుగుతాయని ఎన్నికల అధికారులు అరుణ్ కుమార్, బాలాజీలు,తెలియజేశారు.

E-పేపర్

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి రెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి

మల్కిజ్ గూడ గ్రామంలో ఈదమ్మ తల్లి దేవాలయ పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమానికి రెడ్డి రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విచ్చేయుచున్న ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి కావున ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకు యాచారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు విచ్చేయుచున్నారు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరుతున్నాను ఇట్లు గౌరారం వెంకట్ రెడ్డి ఈదమ్మ తల్లి దేవాలయ నిర్మాణ & స్థల దాత

తిరుపతి

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది, రంజాన్ పండుగల వేడుక

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు ఉగాది, రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు రంగురంగుల దుస్తులలో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ.. ఉగాది, రంజాన్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ప్రతిభంబించే భారతీయ సంస్కృతిలో ఉన్న ఐక్యతను తెలియజేశారు. అన్ని మతాలకు మధ్య పరస్పర గౌరవం, స్నేహభావం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. రెండు ముఖ్యమైన పండుగలను ఒకేరోజు జరపడం విశేషంగా నిలిచిందన్నారు. అనంతరం పాఠశాల ఎ.జి. యం సురేష్ మాట్లాడుతూ.. మతం కన్నా మానవత్వం ముఖ్యమని, ఉగాది కొత్త ఆశలను ఇస్తే, రంజాన్ మనసుకు శాంతిని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జులు వాసంతి, కల్పన, ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.