Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ధూమపానం వల్ల మనిషి జీవితం క్రమంగా కాలిపోతూ, పొగలా మాయమవుతుంది.

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @గెడ్డం ప్రతాప్ సిగరెట్‌పై ఒక మనిషి నడుస్తూ ఉండగా, అతని శరీరం కాలిపోతూ, పొగలో కలిసిపోతున్నట్టు చూపించారు. మరోవైపు అతని భార్య, చిన్న కూతురు అతనివైపు చేతులు చాపి పిలుస్తున్నారు. అర్థం : ధూమపానం వల్ల మనిషి జీవితం క్రమంగా కాలిపోతూ, పొగలా మాయమవుతుంది. సిగరెట్ తాగుతున్న వ్యక్తి తన ఆరోగ్యం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా దూరం చేసుకుంటున్నాడు. భార్యా పిల్లలు అతని కోసం ఎదురుచూస్తున్నారు, కానీ సిగరెట్ అలవాటు అతన్ని వారితో ఉండనివ్వదు. చివరికి, ధూమపానం అంటే ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబ ఆనందాన్ని కూడా నాశనం చేయడం. అంటే ఈ చిత్రం మనకి చెప్పే సందేశం: “సిగరెట్ వల్ల నువ్వు కాలిపోతావు… నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడుతుంది.

హైదరాబాద్

రవీంద్రభారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటు

హైదరాబాద్: గాన గంధర్వుడు, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఘనమైన నివాళిగా, హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల గారి విగ్రహానికి సమీపంగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతికశాఖ అధికారులు, విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ప్రాంగణాన్ని సందర్శించి స్థలాన్ని పరిశీలించారు. అన్ని అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి, విగ్రహాన్ని అందంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. గాన ప్రపంచానికి అందించిన అపారమైన సేవలను గుర్తుచేసుకుంటూ, ప్రజలు, కళాకారులు, సంగీతాభిమానులు అందరూ ఆయనకు నివాళిగా విగ్రహాన్ని సందర్శించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న మనకు దూరమయ్యారు. ఆయన సంగీత సేవలను స్మరించుకునేలా, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచేలా ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు.

క్రైమ్

లంచం సొమ్మును గాల్లోకి విసిరేసిన ఏఎస్ఐ

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ దిల్లీ: లంచం తీసుకొంటూ పట్టుబడిన ఓ పోలీసు అధికారి ఆ డబ్బును గాల్లోకి విసిరేయడంతో చుట్టూ ఉన్న జనం అందినకాడికి ఎత్తుకొని ఉడాయించారు. దిల్లీకి చెందిన ఏఎస్ఐ రాకేశ్ కుమార్ రూ.15,000 ఇవ్వకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారిని రెడ్్యండెడ్గా పట్టుకోవాలనే పథకంతో విజిలెన్స్ అధికారులు రసాయన పొడి చల్లిన నోట్లను ఫిర్యాదికి ఇచ్చారు. స్థానిక హౌజ్ ఖాజీ పోలీస్టేషను సమీపంలో మంగళవారం ఏఎస్ఐకు బాధితుడు సొమ్ము అందజేశారు. విజిలెన్స్ అధికారుల రాకను గమనించిన రాకేశ్ కుమార్ ఆధారాలను నాశనం చేయడానికి లంచంగా తీసుకున్న నోట్లను గాల్లోకి విసిరారు. ఎగబడిన జనాన్ని వారించి మిగతా డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.

అన్నమయ్య

ఆశ్రమ అభివృద్ధికి శ్రీ రామచంద్రయ్య గురువు గారి విశేష కృషి ప్రతి పౌర్ణమి భగవద్గీత పారాయణం – కుటుంబ సభ్యుల నివాళి

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండల పరిధిలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ దతగిరి నారాయణ తపోవన ఆశ్రమ అభివృద్ధి కోసం గురువు శ్రీ రామచంద్రయ్య గారు చేసిన కృషి అపారమని ఆయన కుటుంబ సభ్యులు స్మరించారు. ఆశ్రమ నిర్మాణం, విస్తరణ, భక్తుల సౌకర్యాల కోసం అహర్నిశలు శ్రమించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడంలో గురువు గారి పాత్ర అపూర్వమని వారు తెలిపారు. ప్రత్యేకంగా ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తుల సమక్షంలో భగవద్గీత పారాయణం నిర్వహించడం ఆయన జీవితంలో ఒక శాశ్వత సంప్రదాయమని గుర్తుచేశారు. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో నాటడమే లక్ష్యంగా ఆయన వ్యవహరించారని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ కలతితం చెందని మనసుతో భగవద్గీత బోధనలను ఆచరణలో చూపిన గురువు గారి త్యాగం, సేవా భావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక కేంద్రముగా తీర్చిదిద్దడంలో గురువు గారి కృషి ఎప్పటికీ మరువలేనిదని వారు నివాళులర్పించారు.

కడప

డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా.అవగాహన సదస్సు.

జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరం రాధాకృష్ణ నగర్ లోని బాలుర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నెంబర్ 3 విద్యార్థులకు డ్రగ్స్,మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు.జిల్లా’ఈగల్’ బృందం,మరియు నార్కోటిక్ బృందము స్థానిక1టౌన్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో,డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని అధికారులు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులపాత్రచాలాముఖ్యమైనదని,రేపటి సమాజరూపకర్తలు నేటి విద్యార్థులేనని విద్యార్థులు బాగా చదివి సమాజానికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని,మత్తు పదార్థాల బారినపడి తమజీవితాలను కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్చరించడం జరిగింది.మీ సమీప ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ దుర్వినియోగం జరుగుతున్నట్లు మీకు తెలిసిన యెడల టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేసి వివరాలుతెలియజేయాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హాస్టల్ వార్డెన్ డ్రగ్స్ నివారణలోభాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రమేష్ బాబు,1టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ప్రతాపరెడ్డి వారి సిబ్బంది,నార్కోటిక్ సెల్ నుండిఏఎస్ఐమల్లయ్య,ఈగల్ బృందం సభ్యులు అయూబ్ ఖాన్,గురు శేఖర్ పాల్గొన్నారు.

కడప

జిల్లాలోని ఉల్లి రైతులు ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

….జిల్లా జాయింట్ కలెక్టరు అదితి సింగ్ కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికేప్రారంభమైన.మైదుకూరు,కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగంచేసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్,జాయింట్ కలెక్టర్ అదితిసింగ్.పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుండి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై.జిల్లా ఇంచార్జి కలెక్టరు,జేసీ అదితి సింగ్ సంబంధిత ఉద్యాన,మార్క్ ఫెడ్ శాఖల అధికారులతోసమీక్షించారు.ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టరు మాట్లాడుతూ.ఒక క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుండి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు.జిల్లాలోని మైదుకూరు,కమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని మార్కెట్ యార్డుల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించడం జరిగిందన్నారు.జిల్లాలోని ఉల్లి రైతులకు ఎలాంటి నష్టంవాటిల్లకుండా,నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఈకొనుగోలుప్రక్రియనుప్రణాళికాబద్ధంగా,పకడ్భందీగానిర్వహిస్తున్నట్లు జేసీ తెలిపారు.ఈ అవకాశాన్ని జిల్లాలోని ఉల్లిపంట పండించిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహనపెంచాలన్నారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు,జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి,మార్కెటింగ్ ఎడి ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

ఇక వైద్యులూ స్వచ్ఛంద సేవకు రండి..! — ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలకు టీటీడీ ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక వైద్యులూ స్వచ్ఛందంగా ఉచిత వైద్య సేవలు అందించవచ్చు. ఇందుకోసం వైద్యులు ఆన్లైన్లో స్వచ్ఛంద సేవ బుకింగ్ చేసుకోవడానికి టీటీడీ ఒక ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోంది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి గురువారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు టీటీడీ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోగులకు వైద్య సేవలు అందించే అంశంపై అదనపు ఈవో చర్చించారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు శ్రీవారి సేవలో భాగంగా ప్రొఫెషనల్ సేవలను ప్రవేశపెట్టాలనే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ముందుగా వైద్య రంగం నుండి ఈ ప్రొఫెషనల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన చర్యలను టీటీడీ ప్ర్రారంభించింది. అందులో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా. జగదీశ్, ఎస్పీసిహెచ్‌సి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, టీటీడీ సీఎంఓ డా. నర్మద, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి చీఫ్ డా. రేణు దీక్షిత్ లతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందించదలచిన వైద్యులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలని జిఎంఐటి ఇంచార్జ్ ఫణికుమార్ నాయుడును ఆదేశించారు.మొదటిసారి టీటీడీ ప్రొఫెషనల్ సేవలను ప్రవేశ పెడుతున్న కారణంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఈ సమావేశంలో చీఫ్ పీఆర్వో డా. టీ.రవి, అశ్విని ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డా. కుసుమ కుమారి, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకా రెడ్డి, స్విమ్స్ ఆస్పత్రి ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డా. ఆలోక్ సచన్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అమరావతి ORR(ఔటర్ రింగ్ రోడ్) రూ.25వేల కోట్లు

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి@అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మొత్తం రూ.25 వేల కోట్ల వ్యయమవుతుందని తాజాగా అంచనాలు వేశారు. 190 కి.మీ. మేర ఆరు వరుసలతో ORR, దానికి ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు కలిపి.. మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు. తాజాగా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపి, ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు రూ.25వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు.

ఆంధ్రప్రదేశ్

ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు: DGHS

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) స్పష్టం చేసింది. వారి పేర్ల ముందు ‘డాక్టర్‌’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది. అలా చేస్తే ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్‌ – 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సునీత శర్మ సెప్టెంబర్‌ 9న జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్‌ ప్రాక్టీస్‌ చేయరాదని ఆమె తెలిపారు.

బిజినెస్

ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ

సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @ ప్రముఖ డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఒరాకిల్’ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సంచలనం సృష్టించారు. 393 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ల్యారీ నిలిచారు. ఆయన ఆస్తి ఎలాన్ మస్క్ ($385 బిలియన్ల) సంపదను దాటేసిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. 81 ఏళ్ల ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ స్థాపించారు. 2014 వరకు ఒరాకిల్ CEOగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.