Wednesday, 6 May 2026

Blog

భక్తి

డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ భక్తి: డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. 22న వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి దర్శన కోటా డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

ఖమ్మం

అవినీతి నిరోధక శాఖ అధికారుల అదుపులో తల్లాడ తహసీల్దార్

పున్నమి ప్రతినిధి ఖమ్మం తల్లాడ మండల కేంద్రం లో గల తహసిల్దార్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ లు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీ ల్లో తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఓ రైతు దగ్గర 10, వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం ఖమ్మం లో గల అవినీతి నిరోధక శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం కీ తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అవినీతి అధికారులని అవినీతి నిరోధక శాఖ అధికారులు వల వేసి పట్టుకుంటున్నారని ప్రజలని ఎవరు అయినా ప్రభుత్వఅధికారులు లంచం అడిగితే తమని సం ప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచించారూ.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత బకాయిలు వెంటనే చెల్లించాలి

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన పాత బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ముఖ్యంగా CPS ఉద్యోగులకు రావలసిన బకాయిలు PRC ,DA ఏరియర్స్ మరియు EL Encashment (ELs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం దసరాకు పండుగకు రెండు డి.ఏ లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఎన్ క్యాష్మెంట్ కి అప్లై చేసుకొనిదాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే “మెరుగైన PRC తో పాటు పాత బకాయిలు కూడా చెల్లిస్తాం” అని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఈ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ కలిగించింది. ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కులను వాయిదా వేయడం తగదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అన్ని బకాయిలను విడుదల చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా పక్షాన ఏపీ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ (ఆప్టా) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షబ్బీర్ హుస్సేన్, షానవాజ్ హుస్సేన్ మాజీంద్రని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనకి చేసిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) పూర్తి అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ మండలం దోమలపల్లి లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనిఖీ చేశారు. దోమలపల్లికి 70 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, 56 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ లు కలెక్టర్ కు వివరించారు. అయితే ఈ 56 ఇండ్లలో పూర్తి అయినా ఇళ్లకు తక్షణమే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, నల్గొండ తాహసిల్దార్ పరుశురాం తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

వైద్య శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నేతలు

పున్నమి న్యూస్, సీనియర్ జర్నలిస్ట్ రమణ: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ సచివాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ పచ్చిమాల బేబీ కుమారి గోపి అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వారు ప్రధాని మోడీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెంచలుగా ఎదిగి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు మన బలం ఏంటో చూపించారన్నారు. మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. తన అవిశ్రాంత కృషితో భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశారని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువా తో ఘనంగా సత్కరించి, వారికి కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ముద్రగడ నరసింహారావు(చంటి), సేవా పక్వాడ్ మండల ఇంచార్జిలు మోకా ఆదిలక్ష్మి, మిద్దె రవి రాజ్, రాష్ట్ర నాయకులు ఆకుమర్తి బేబీ రాణి, యనమదల రాజ్యలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి మొగలి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సినిమా

ఓజీ బెనిఫిట్‌ షోకి ఏపీ ప్రభుత్వం అనుమతి

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @సినిమా పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ మూవీ ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బెనిఫిట్‌ షోకి, కొన్ని రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ఓజీ బెనిఫిట్‌షో రూ.1,000గా నిర్ణయం.. సింగిల్‌ స్క్రీన్‌ రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి.. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు ఓజీ బెనిఫిట్‌ షో.

ఆంధ్రప్రదేశ్

అమలాపురం లో ఘనంగా ప్రధాని మోడీ పుట్టిన రోజు వేడుకలు

పున్నమి న్యూస్, సీనియర్ జర్నలిస్ట్ రమణ: అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎంపీ హరీష్ మాధుర్ ప్రారంభించారు, ఈసీజీ విభాగాన్ని అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వారు కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జీఎస్టీ తగ్గించినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీశ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలు గా ఎదిగి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని దేశానికి దొరకడం అదృష్టం అన్నారు. ఆయన నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం తో ఉండాలన్నారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన దార్శనిక నాయకత్వం, అవిశ్రాంత కృషితో భారతదేశానికి కొత్త దిశా నిర్దేశం చేశారన్నారు. ఆయన జీవితం పూర్తిగా మచ్చలేనిదన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ తో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. పలు దేశాల ప్రజలు మోడీ లాంటి ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడన్నారు. స్వావలంబన మరియు అభివృద్ధిపై దృష్టి సాధించి భారత దేశాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. నేటి నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరం అయిన వాళ్లకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, అమలాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా, యాళ్ల దొరబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, చిరంజీవి ప్యాన్స్ అధ్యక్షులు నల్లా చిట్టిబాబు, టీడీపీ మహిళా సీనియర్ నాయకులు పెచ్చెట్టి విజయలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను, నల్లా అజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తి

వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ 27 రోజులకు 1.49 కోట్ల ఆదాయం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1,15,09,966లు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.34,11,312 ల ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను రూ.1,49,21,278 లు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదు తో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి,అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలిచేరు గ్రూప్ త్రీ దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది, హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

తుర్కయంజాల్ చెరువులో రిటైర్డ్ పంచాయతీ రాజ్ డిఈ మృతి

పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువులో మునిగి రిటైర్డ్ పంచాయతీ రాజ్ డిఇ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్ నగర్ కు చెందిన రిటైర్డ్ డిఇ పాదూరి రమేష్ (61) మద్యపానానికి బానిసై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చాడు. ఆయన భార్య పాదూరి రోహిణి (51) ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో రమేష్ “మన్నెగూడలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్తున్నాను” అంటూ ఇంటి నుంచి బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో, బుధవారం సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా, బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుర్కయంజాల్ మసాబ్ చెరువు వద్ద బుద్ధ విగ్రహం సమీపంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. పోలీసులు రోహిణి కుటుంబానికి సమాచారం ఇవ్వగా, ఆమె చెప్పుల ద్వారా ఆ మృతదేహాన్ని తన భర్త రమేష్గు గా ర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, రమేష్ చెరువులో పడి మునిగిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. “భర్త మరణంపై నాకు ఎలాంటి అనుమానం లేదు” అని రోహిణి తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్మార్ట్ కార్డుల్లో జిల్లా పేరు సరిదిద్దాం: జేసీ

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.