Tuesday, 10 March 2026

Blog

తూర్పు గోదావరి

“ఉత్తరాంధ్రపై బాబు స్పెషల్ ఫోకస్.. పోలవరం పనులే కీలకం”​

​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఉత్తరాంధ్రపై పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రభావం గురించి చర్చించడమే నేటి అత్యంత కీలక పరిణామం. ​సిఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ (Left Canal) యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ​ఉత్తరాంధ్ర అనుసంధానం: ఎడమ కాలువ పనులు పూర్తయితే, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ​నదుల అనుసంధానం:ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి ప్రధాన ప్రాధాన్యత కలిగిన ‘పోలవరం–వంశధార’ నదుల అనుసంధాన ప్రాజెక్టును సాకారం చేయడానికి ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టడానికి తక్షణ ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోలార్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ దుర్మరణం

ఉదయగిరి Date:27-1-2026 జి.చెర్లోపల్లిలో చోటుచేసుకున్న దారుణంలో సోలార్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు.విధి నిర్వహణలో ఉంటూ అందరితో కలివిడిగా ఉండే ఓ ఆర్టీసీ కండక్టర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. సోలార్ విద్యుత్ షాక్‌కు గురై ఆయన మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడు ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన కే. మధుగా గుర్తించారు. నువ్వుల పంటకు నీళ్లు కట్టేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది..

తూర్పు గోదావరి

పేకాట శిబిరం పై దాడి, ఎస్ఐ.రామకృష్ణ

తాళ్లపూడి మండలం, అన్నదేవరపేట గ్రామం సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు జూదం ఆడుతున్న నేపథ్యంలో తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు నిందితుల నుండి మొత్తం రూ. 4850/- నగదు మరియు 52 పేకలను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి చేయడం జరిగిందని ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు.

తూర్పు గోదావరి

తాళ్లపూడిలో ఘనంగా ఎలక్ట్రిషియన్ డే

తాళ్లపూడి,తూర్పుగోదావరి పున్నమి ప్రతినిధి,జనవరి 28:తాళ్లపూడిలో ఘనంగా ఎలక్ట్రిషియన్ డే ​తాళ్లపూడి: తాళ్లపూడి మండల కేంద్రంలో సోమవారం ఎలక్ట్రిషియన్ డే వేడుకలను యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి వెలుగునిచ్చిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ 1879 జనవరి 27న బల్బును కనుగొన్న రోజును పురస్కరించుకుని ఎడిసన్ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు. 2017లో తాళ్లపూడి మండల ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి చంద్రశేఖర్, కోశాధికారి శీలాబోయిన శ్రీనివాస్, సభ్యులు బొట్టా భాస్కరరావు, బ్రమిదల భీమరాజు, నూతంగి ప్రసాద్ బాబు, వేండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దివోలు గ్రామంలో విజయవంతంగా పశు వైద్య శిబిరం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గేదెలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పిఎసిఎస్ అధ్యక్షులు పి.రామకృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతులు పశువుల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, పశు వైద్యులు గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు

యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయిన ముప్పాళ వెంకట చౌదరి ఈ సందర్బంగా మాట్లాడుతూ నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు జనవరి 27 2023న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైంది ఈ యువ గళం పాదయాత్ర మొత్తం 266 రోజులు పాటు సాగింది ఈ పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు ఆత్మకూరు నియోజకవర్గం లో ప్రవేశించిన తరుణంలో లోకేష్ అన్నతో ముప్పాళ వెంకట్ చౌదరి పాల్గొన్నారు.

E-పేపర్

రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 27 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇంచార్జ్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి నిధుల నుండి రాయపోల్ గ్రామంలో *20 లక్షల* రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన *ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్* రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి రాయపోల్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది* ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.మరియు ఉపాధ్యక్షులు మచ్చ తిరుమలేష్ & రాసురి నర్సింహా & రాసురి శ్రీశైలం &మరియు జనరల్ సెక్రటరీ ఉడుగుల రాకేష్ గౌడ్. &కోశాధికారి బుయ్య శివ శంకర్ గౌడ్ & యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు దోర్నాల భాస్కర్& జనరల్ సెక్రెటరీ D. ఆనంద్ & కార్యదర్శి మల్లేష్ మరియు సీనియర్ నాయకులు చెరుకు జంగయ్య& పోలాగోని శంకర్ గౌడ్ & డొంకని యాదగిరి& రాసురి ఐలయ్య & డొంకని కుమార్ గౌడ్ & మొలుగు నర్సింహా&దోర్నాల బాలయ్య& బియ్య లచ్చనారి & అంకర్ల నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణం 33వ వార్డులో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్న మి ప్రతినిధి/జనవరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఇంచార్జ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చీటి వెంకటనార్సింగరావు గారు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలను కలుసుకుని పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రచారంలో చిప్పలపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాడిచేర్ల దేవయ్య, 33వ వార్డు అధ్యక్షులు మహమ్మద్ పాషా, తటాకర్ల ప్రభాకర్, గూడూరు గ్రామ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, గూడూరు గ్రామ కేటీఆర్ సేన అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్, చిప్పలపల్లి కేటీఆర్ సేన గ్రామ అధ్యక్షులు పోతారం సతీష్, బీఆర్‌ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులుమాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గానికి అందించిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి స్పందన లభించింది

కడప

మహిళను వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం జనసేన టిడిపి బిజెపి కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను వేధిస్తూ రెండు సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు ఒక మహిళ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారంటూ తన భర్తను కూడా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది ఈ విషయంపై జనసేన అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది ఈ ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఇటువంటి వాళ్ళు సమాజంలో చీరపురుగులంటూ మహిళా సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ సేవ పురస్కార గ్రహీత మర్రిపాడు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్

గణతంత్ర దినోత్సవం సందర్బంగా నెల్లూరు నగరం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అధికారి మర్రిపాడు ఈ కార్యక్రమం లో మర్రిపాడు మండలం తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్కు ఉత్తమ సేవ పురస్కారo లభించింది మర్రిపాడు మండలం ప్రజలకు గర్వకారణంగా ఉంది నిలిచింది జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు చేతుల మీదగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను అందుకున్నారు పరిపాలన సేవల్లో నిబద్దత ప్రజలు సమస్యలు పై స్పందించే తత్త్వం పార దర్శకమైన పాలన ముఖ్యంగా సామాన్య ప్రజలు పట్ల చూపుతున్న మనవీయా దృ క్ప దానికి ఈ అవార్డు కు ఎంపికైనట్లు అధికారులు పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.