Tuesday, 10 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండూరు సత్రంలో పెన్షన్ల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని జట్ల కొండూరు పంచాయతీకి చెందిన కొండూరు సత్రంలో నిర్వహించిన పెన్షన్ల అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుల వరకు చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి ,డి చెన్నకేశవులు ,పసుపులేటి శ్రీనివాసులు , అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశుపోషకుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కృషి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) పశుపోషకుల ఆర్థిక జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గురవారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. వీటివల్ల వృద్ధిరేటు 10 శాతం పెరుగుతుందన్నారు. ఎదకురాని పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో హౌసింగ్ డీఈ, ఏఈలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కట్టమని చెబితే ఒక్కో ఇంటికి రూ.70 వేలు తినేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్లు జీతం తీసుకోకుండా ఉంటారా అంటూ సూటిగా నిలదీశారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయాలని సూచించారు. గతంలో ఇద్దరు ఏఈలు చేదు అనుభవాలతో వెళ్లిన విషయం గుర్తు చేశారు. డీఈకి ఫోన్ ద్వారా వార్నింగ్ ఇచ్చి, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు.

అనకాపల్లి

ప్రజా సంక్షేమానికి మరో అడుగు: ఏటికొప్పాకలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ”

అనకాపల్లి జిల్లా జనవరి 31 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నిర్ణీత తేదీకి ఒకరోజు ముందుగానే ఏటికొప్పాక గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, విధవులు వంటి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ప్రజల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.

E-పేపర్

తాండూరులో కల్తీ కోవా స్థావరంపై దాడి 120 కిలోల కోవా స్వాధీనం, ఇద్దరి అరెస్ట్

పున్నమి ప్రతినిధి తాండూరులో కల్తీ కోవా స్థావరంపై దాడి 120 కిలోల కోవా స్వాధీనం, ఇద్దరి అరెస్ట్* వికారాబాద్ జిల్లా తాండూరు: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ కోవాను తయారు చేస్తున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులు రాజస్థాన్ కు చెందిన ప్రకాష్ విష్ణు, హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సల్మాన్ లను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వద్ద ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

నెల్లూరులో మహిళల కోసం టెలీకాలర్ ఉద్యోగాలు – డే షిఫ్ట్

మోడర్న్ మైండ్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థలో మహిళా టెలీకాలర్స్ అవసరం. 🔹 పని విధానం: ప్రఖ్యాత ఇంజినీరింగ్ కాలేజీలు & యూనివర్సిటీల అడ్మిషన్ల కోసం టెలీకాలింగ్ చేయాలి. 🔹 అర్హత: ఏదైనా డిగ్రీ (B.Tech / MBA / M.Com / Any Degree) 🔹 అనుభవం: 0–1 సంవత్సరం (ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు) 🔹 షిఫ్ట్ టైమింగ్: డే షిఫ్ట్ మాత్రమే 🔹 జీతం: ₹10,000 – ₹16,000 / నెల 🔹 వేకెన్సీలు: 10 (మహిళలకు మాత్రమే) 🔹 పని ప్రదేశం: నెల్లూరు 🔹 ఫీజు: ❌ ఎలాంటి ఫీజు అవసరం లేదు 📞 సంప్రదించండి: 9804766766 9052823001

పల్నాడు

ఉద్యోగావకాశం – BIG C MOBILES

ఉద్యోగం: సేల్స్ ఎగ్జిక్యూటివ్ / అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ / స్టోర్ మేనేజర్ అర్హత: 10వ తరగతి – ఏదైనా డిగ్రీ జీతం: ₹13,000 – ₹22,000 + ఇన్సెంటివ్స్ అనుభవం: 0–4 సంవత్సరాలు షిఫ్ట్: డే షిఫ్ట్ ప్రాంతం: పల్నాడు జిల్లా, గుంటూరు ఖాళీలు: 7 లింగ భేదం: లేదు (అందరికీ అవకాశం) 📞 సంప్రదించండి: 73372 35888

కామారెడ్డి

కస్తూర్బా పాఠశాల తనిఖీ చేసిన రామారెడ్డి సర్పంచ్..

– విద్యార్థినుల భవిష్యత్తుకు ప్రాధాన్యత! కామారెడ్డి, 31జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.విద్యార్థినుల భోజ నం, విద్యా నాణ్యత, ఆరోగ్యం, సౌకర్యాలపై ఆధా రంగా పూర్తి పరిశీలన చేపట్టిన సర్పంచ్, పాఠశాల పరిపాలనకు కొత్త దిశా ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్, వంటశాల గది,పాత్రలు పరి శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినులకు అధిక నాణ్యత కలిగిన భోజనం అందించాలని చెప్పారు. భోజనంలో ఏ కాస్త నాణ్యత లోపం వస్తే ఊరుకో మని హెచ్చరించారు.ఈ విషయంలో ఎట్టి పరిహా రాలు కావాలంటే చేస్తాము అని స్పష్టం చేశారు. పదవ తరగతి విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారిం చిన ఆయన,వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించి విద్యలో రాణించేలా తయారు చేయాలని చెప్పా రు.మండలంలోని విద్యార్థినులు మంచిగా చదువు కొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకార ణంగా నిలబడాలని చెప్పారు. జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించాలి అని పిలుపునిచ్చా రు. పాఠశాలలో మిడ్ డే మీల్స్ వంటలు, గదుల పరిశుభ్రత, టాయిలెట్లు, తాగునీరు సౌకర్యాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రామారెడ్డి మండలంలో ఒకటి కస్తూర్బా పాఠశాల లు ఉండగా, ఇక్కడ వందల మంది బాలికలు చదువుతున్నారు. ఇటీవల పంచాయతీ సమావే శాల్లో ఈ పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వా లని ప్రతిపాదించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పం చ్ నవీన్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, పాఠ శాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*​యాదవ మహాసభ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా కొలుసు మోహన్ యాదవ్*

​విజయవాడ, జనవరి 27: అఖిల భారత యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కీలక నియామకం జరిగింది. సంస్థ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (రాజకీయ వ్యవహారాల కమిటీ – పిఎసి ) చైర్మన్‌గా విజయవాడకు చెందిన ప్రముఖ నాయకులు శ్రీ కొలుసు మోహన్ యాదవ్ నియమితులయ్యారు. ​ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చింకా నారాయణరావు యాదవ్ గారు మోహన్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేసి, బాధ్యతలు అప్పగించారు. ​ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులను రాజకీయంగా చైతన్యపరచడానికి, సామాజికంగా వారి హక్కుల కోసం పోరాడటానికి మోహన్ యాదవ్ గారి అనుభవం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో యాదవ సామాజిక వర్గం రాజకీయంగా ఎదిగేందుకు ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ​నూతన చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదవుల ఐక్యత కోసం, వారి రాజకీయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొని మోహన్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ​ప్రచురణార్థం: చింకా నారాయణరావు యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ, ఆంధ్రప్రదేశ్.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్ పార్టీ నుండి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మమతరాజు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్ పార్టీ నుండి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మమతరాజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఐదో వార్డు టిఆర్ఎస్ అభ్యర్థిగా జెర్కోని మమతరాజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : పున్నమి న్యూస్ ప్రతినిధి జనవరి 30 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జెర్కొని రాజు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గా 5వ వార్డు కౌన్సిలర్ గా నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.ప్రజా సమస్యలు తెలుసుకొని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.