Tuesday, 28 April 2026

Blog

తెలంగాణ

*ఇంటి చుట్టు బ్రాహ్మాణులే ఉన్నారు గుడ్లు పెట్టే నాటు కోటి పెట్టను ఎవడు దొంగలించి తిన్నటో అర్థం కావటం లేదు..*

*ఇంటి చుట్టు బ్రాహ్మాణులే ఉన్నారు గుడ్లు పెట్టే నాటు కోటి పెట్టను ఎవడు దొంగలించి తిన్నటో అర్థం కావటం లేదు..* *ఈ బీసీ పోరాటం ఎవడి మీద..?* నాగర్ కర్నూల్ 18,( పున్నమి న్యూస్ ) : బీసీ రి­జ­ర్వే­ష­న్ల అమలు కోసం తె­లం­గాణ వ్యా­ప్తం­గా బంద్ జరిగింది బీసీ వర్గా­లు చే­ప­ట్టిన ఈ బంద్ కు అధి­కార కాం­గ్రె­స్, బీ­జే­పీ, బీ­ఆ­ర్ఎ­స్, జా­గృ­తి, వా­మ­ప­క్షా­లు మద్ద­తు­గా తె­లి­పా­యి. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పు­డు ఏ పా­ర్టీ ఎవ­రి­కి వ్య­తి­రే­కం­గా బంద్ పా­టి­స్తుం­దో తె­లి­య­ని పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­ను భా­ర­తీయ జనతా పా­ర్టీ అడ్డు­కుం­టోం­ద­ని డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క వి­మ­ర్శిం­చా­రు.* బీ­సీల హక్కుల కోసం బీసీ సం­ఘాల జే­ఏ­సీ నా­య­కు­లు పి­లు­పు­ని­చ్చిన బం­ద్‌­కు తమ పా­ర్టీ సం­పూ­ర్ణ మద్ద­తు తె­లు­పు­తుం­ద­ని బీ­జే­పీ తెలంగాణ అధ్య­క్షు­డు ఎన్‌.రాం­చం­ద­ర్‌­రా­వు అన్నా­రు. బీసీ నిరసనలకు బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ బీసీలకు మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. అందరూ బీసీలకు మద్దతు తెలుపుతుంటే.. మరి బీసీలను మోసం చేస్తున్నదెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఖమ్మం

సత్తుపల్లి బీజెపి నాయకులు మీద దాడిని ఖండించిన నెల్లూరు కోటేశ్వరరావు

పున్నమి ప్రతి నిధి సత్తుపల్లిలో బిజెపి నాయకులపై జరిగిన దాడిని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు గారు తీవ్రంగా ఖండించారు. బీసీ హక్కుల కోసం శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పారికి చెందిన వ్యక్తుల గుంపు వల్ల జరిగిన అవినీతిమయ, అమానుష దాడి స్వీకరించదగ్గదైనదని ఆయన పేర్కొన్నారు. కోట్: “ఖబర్దార్ సత్తుపల్లిలోని కాంగ్రెస్ గుండాల్లారా — శాంతియుత ప్రచారం చెయ్యాలంటే నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గరు. హింసకు, బెదిరింపులకు మనం బాధ్యతగా సమాధానం చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం.” అని నెల్లూరు కోటేశ్వరరావు సంచలనంగా అన్నారు (పరిధిని అధిగమించకుండా ఉటంకింపు). అయితే ఆయన హింసకు ప్రత్యుత్తరంగా తేలికపాటి బెదిరింపులు లేదా చర్చల మాదిరిగా కాకుండా, చట్టపరమైన మార్గాన్నే పక్కన పెట్టాలని, సమస్యలకు ఫలితప్రదమైన పరిష్కారం కోసం పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మరిచిపోలేనంతగా హానికరమని, రాజకీయ వివాదాలు శాంతియుత, చట్టబద్ధ రంగంలోనే పరిష్కరించాలని జిల్లా పార్టీ నేతలు పునరావృతంగా వ్యక్తం చేశారు.

ఖమ్మం

సత్తుపల్లి లో బీజేపీ నాయకుల మీద దాడిని ఖండించిన బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్

పున్నమి ప్రతినిధి సత్తుపల్లి పట్టణ బిజెపి అధ్యక్షుడు బానోతు విజయ్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన అమానుష దాడిని బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్మార్గ దాడికి కారణమైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ గారికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు హింసాత్మక దాడుల రూపంలో ప్రదర్శించడం అంగీకారయోగ్యం కాదని ఉపేందర్ గౌడ్ గారు హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలపై దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం

బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం లో బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన స్వచ్ఛంద బంద్‌ను బిజెపి రూరల్ మండలం అధ్యక్షులు శ్రీ జాటోత్ మధు నాయక్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించగా, భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి బీసీల హక్కుల కోసం గళమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే బీసీలకు న్యాయం సాధ్యమని నేతలు స్పష్టం చేశారు.

ఖమ్మం

బీజేపీ , ఏం ఆర్ పి ఎస్ ల ఆధ్వర్యంలో లో బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన తెలంగాణ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపును భాజపా బలంగా సమర్థించింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు గారి సూచనలతో, తల్లాడ పట్టణంలో భాజపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి, బీసీల హక్కుల కోసం గళమెత్తారు. బంద్ సందర్భంగా షాపులు, హోటళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయడంతో తల్లాడ పట్టణం పూర్తిగా బంద్‌గా మారింది. ప్రభుత్వం బీసీలను పట్టించుకోని తీరుపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలకు న్యాయం చేయకుండా పాలన కొనసాగిస్తున్న “కసాయీ ప్రభుత్వం”కు ఈ బంద్ ఒక హెచ్చరికగా మారిందని భాజపా నాయకులు వ్యాఖ్యానించారు. ఈ బంద్ కార్యక్రమంలో భాజపా తల్లాడ మండలాధ్యక్షులు చల్లా నాగులు, నాయకులు ఆపతి వెంకట రామారావు, గాదె కృష్ణారావు, పెరిక కిరణ్, తమ్మిశెట్టి కృష్ణ, చల్లా నరేష్, సంగీతం సాయి చంద్, పులి వెంకటేశ్వర్లు, ఉదయగిరి రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు, దారెల్లి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, బొడ్డు కృష్ణ తదితరులు కూడా పాల్గొని బీసీల న్యాయ సాధనకు ఐక్యంగా నిలిచారు.

తిరుపతి

శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం

శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం నందు శనివారం మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధులుగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి,ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం లో అన్ని మండలాల్లో నుండి మరియు టౌన్ నుండి వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా వైయస్సార్సీపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి గ్రామస్థాయి, వార్డు,మండల కమిటీల నియామకాలను ఎలా చేయాలనేది AV ద్వారా వివరించి ,కూటమి ప్రభుత్వ చుట్టాలపై ఉద్యమం ఉధృతం చేసేందుకు గ్రామస్థాయి, వార్డు,మండల కమిటీలను త్వరగా పూర్తి చేసి రెడ్ బుక్ ఆగడాలను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

నేడు సత్తుపల్లి లో బీజెపి నాయకుల మీద కాంగ్రెస్ నాయకుల దాడి ని ఖండించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి

సత్తుపల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బానోత్ విజయ్‌పై జరిగిన దాడిని బిజెపి సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హింసాత్మక చర్యలు సమంజసం కాదని, సమస్యలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు జి.ఓ. నంబర్ 9 విడుదల చేసిన నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆ జి.ఓ.ను రద్దు చేయగా, సుప్రీంకోర్టులో ఆపిల్ చేసినా అదే నిర్ణయం కొనసాగిందని ఆయన గుర్తుచేశారు. “రిజర్వేషన్లు ప్రజాస్వామ్య, చట్టబద్ధ మార్గాల్లో సాధించాలి. కొట్లాటలు, హింసాత్మక చర్యలతో సాధించేది ఏమీ లేదు,” అని సుధాకర్ రెడ్డి గారు అన్నారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ బిజెపి అని ఆయన పేర్కొన్నారు. “ప్రధాని బీసీ వర్గానికి చెందినవారు. కేంద్ర కేబినెట్‌లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. రాష్ట్రపతి గిరిజన మహిళ. మహిళలకు 33% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10% రిజర్వేషన్ ఇచ్చింది బిజెపి ప్రభుత్వమే,” అని వివరించారు. సత్తుపల్లిలో బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన, “ఒక గిరిజన నాయకుడిపై దాడి చేయడం తగదు. రాష్ట్రవ్యాప్తంగా బంద్ కార్యక్రమంలో ఎక్కడా అపశ్రుతులు చోటుచేసుకోలేదు. కేవలం సత్తుపల్లిలోనే కావాలనే బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా ఖండించదగ్గది” అని అన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం చట్టబద్ధ మార్గాల్లోనే సాధ్యమని, హింసకు దూరంగా ఉండి సంభాషణల ద్వారా ముందుకు సాగాలని సుధాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. “ప్రజాస్వామ్యమే నిజమైన మార్గం,” అని ఆయన స్పష్టం చేశారు.

అన్నమయ్య

బాలికలు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సిఐ వెంకటేశ్వర్లు

అంతర్జాతీయ బాలిక దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ “ఒక విద్యావంతురాలైన బాలిక ఒక కుటుంబానికే కాకుండా సమాజానికే వెలుగునిస్తుంది. అందుకే ప్రతి బాలిక కూడా చదువులో రాణించి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి” అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, (ఐ సి డి స్) సూపర్వైజర్లు వసుంధరమ్మ, సురేఖ రాణి బాలికలు సరోజినీ నాయుడు, కల్పనా చావ్లా, పీవీ సింధు లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరులో ప్రతిభావంతుల విద్యార్థులకు అవార్డులు – జడ్జి తేజ సాయి చేతుల మీదుగా సన్మానం

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభావంతుల విద్యార్థులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సివిల్ జూనియర్ జడ్జి శ్రీ పి.జె.తేజ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జడ్జి తేజ సాయి సూచించారు. దాత పాములపాటి సుబ్బారాయుడు వారి అన్న జ్ఞాపకార్థం ప్రథమ బహుమతిగా రూ.5,000, ద్వితీయ బహుమతిగా రూ.2,000, మహిళా విద్యార్థులకు రూ.3,000 చొప్పున బహుమతులు అందజేశారు. కీర్తిశేషులు యం.సుబ్బారెడ్డి గారి స్మారకార్థం బెస్ట్ స్టూడెంట్ అవార్డులను జడ్జి అందజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమం లో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరామరాజు, సీనియర్ న్యాయవాదులు శంకరయ్య, గజపతివర్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, ప్రతినెల మూడవ శనివారం మండల వారీగా ఏర్పాటు చేసిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సమావేశం ప్రార్థనా గీతంతో ప్రారంభమై, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం కూడా జరిగిందని తెలుస్తోంది. మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరయ్య ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి చేరేలా కృషి చేయాలని సూచించారు. కాంప్లెక్స్ ఇన్‌చార్జీ దుర్గరాజు, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలని అభిప్రాయపడ్డారు. చిట్వేల్ మెయిన్ స్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ కామాటం వెంకటేశ్వర్లు, సి మరియు డి గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఉన్నత స్థాయికి తీసుకోవాలని తెలిపారు. కె కె వడ్డీ పల్లె ప్రాథమిక పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం మూడు రోజులపాటు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు రాకట్టు చేయాలని సూచించారు. సమకాలీనంగా సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్స్ అన్ని పాఠశాలలకు పంపిణీ చేయబడుతున్నాయి. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, సోఫియా, సతీష్, శ్రీనివాసులు, వెంకటరమణ, లక్ష్మీదేవి, రమాదేవి, కళావతి, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.