Tuesday, 28 April 2026

Blog

విశాఖపట్నం

విశాఖ నీ అడ్డా నా?చంద్రబాబు

విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి: *విశాఖ.. నీ అడ్డానా? చంద్రబాబు* ! * *పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే.. ప్రాణ త్యాగాలకైనా సిద్ధం*… * *అభివృద్ధికి వైసిపి వ్యతిరేకం కాదు* ! * *ప్రజలను మోసం చేస్తూ.. విశాఖను నాశనం చేస్తే సహించం* * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* నేల, నీరు, ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్కు ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారాదత్తం చెయ్యడానికి ఈ ప్రాంతం నీ అడ్డానా చంద్రబాబు అంటూ. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ఆసీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో వాసుపల్లి గణేష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు, నారా లోకేష్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు నమ్మి మీకు ఓటు వేసారని, కేవలం ఐదేళ్ల పాలనకు మాత్రమే మీకు ఇచ్చారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను మోసం చేసి ప్రశాంతమైన విశాఖ నగర వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ప్రాణ త్యాగాలకైనా వెనకాడమని అన్నారు. పశ్చిమ దేశాలు తెలివిగా విసిరి కొట్టిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను ప్రశాంతమైన విశాఖ నగరానికి తీసుకురావడాన్నీ వ్యతిరేకిస్తున్నామన్నారు. విశాఖ నగరానికి అవసరాలకు సమానమైన రోజుకు 2500 మెగా వాట్స్ విద్యుత్తు అవసరమన్నారు. ఈ డేటా సెంటర్ లో టెక్నికల్ ఎటువంటి సమస్య వచ్చినా ఇతర ప్రాంతాలలో ఉన్న సిబ్బందితో పరిష్కరించుకుంటారు తప్ప, స్థానికంగా ఉద్యోగాలు ఈ సంస్థకు అవసరం లేదన్నారు. 1.8 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని లోకేష్ చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని వాసుపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ మాటలు నమ్మే ప్రసక్తి లేదని, నిజంగా ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారో చిత్తశుద్ధి ఉంటే గూగుల్ ప్రతినిధి సుందరం పిచ్చయ్యతోని ప్రకటించాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. జగన్ హయాంలో 23 వేల ఉద్యోగాల భర్తీ కి పారదర్శకమైన లింక్డ్ అప్రూవల్ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్నారు. నిజంగా 1.90 లక్షల ఉద్యోగాలు ఇస్తే తాము ప్రాణాలు సైతం అర్పిస్తాం అని స్పష్టం చేశారు. ఎటువంటి ఉద్యోగ కల్పన చేయలేని డేటా సెంటర్ కి 22 వేల కోట్లు సబ్సిడీలను ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. ఐదు టీఎంసీల వాటర్ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంతా ఐదువంతులు నీరు ఈ డేటా సెంటర్కు అవసరమన్నారు. దానిలో 20% వేస్ట్ వాటర్ ను ఎక్కడ వదులుతారని ప్రశ్నించారు. నాయిస్ పొల్యూషన్ తో పాటు దేశవ్యాప్తంగా 495 డిగావాట్స్ విద్యుత్ అవసరమైతే కేవలం ఈ డేటా సెంటర్కు ఒక డిగా వాట్స్ విద్యుత్తు అవసరం అవుతుందన్నారు. పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ సంస్థ వద్దని నిపుణులు మీకు సూచించలేదా చంద్రబాబు అంటూ వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి 50 కోట్ల కేజీల కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తాదని, అంటే పదివేల కోట్లు కార్లు వదిలే కార్బన్డయాక్సైడ్ తో సమానం అన్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 60 లక్షలు చెట్లు ఉండాలన్నారు. నారా లోకేష్ చంద్రబాబు 10 లక్షల కుటుంబాలు కాల్చే కరెంటును ఒక్క డేటా సెంటర్కు రాయితీతో కూడిన విద్యుత్, నో రిజిస్ట్రేషన్ ఫీజు, నో జిఎస్టి.. విశాఖ నేల నీరు అప్పనంగా దారా దత్తం చేస్తావా చంద్రబాబు అంటూ వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎకో సిస్టం. నాశనం చేసే మీ విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలకు, ఈ ప్రాంతానికి మేలు చేసే అభివృద్ధి చెయ్యాలని వాసుపల్లి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షులు, దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ పచ్చిరపల్లి రాము,జిల్లా ఆర్.టి.ఐ సెక్రటరీ అరుగుల రాజు,స్టేట్ ఆర్.టి.ఐ సెక్రటరీ దస్మాంతుల చిన్ని,స్టేట్ మేధావుల విభాగం సెక్రటరీ ఈతలపాక విజయ్,27వ వార్డ్ అధ్యక్షులు సర్వేశ్వరరెడ్డి,30 దశమంతుల మాణిక్యాలరావు,37వ వార్డ్ అధ్యక్షులు గంగళ్ల రాంరాజు,38వ వార్డ్ అధ్యక్షులు గురజాపు రవి,39వ వార్డ్ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, స్టేట్ సంస్కృత విభాగమ సెక్రెటరీ కంటుముంచు సాగర్ ,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ,దస్మాంతుల సంతోషి,వేణు, బాలకృష్ణ,చోడిపిళ్లి శివ, కొండా రామ దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సి ఐ టి యూ సమావేశం

*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి* CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch నరసింగరావు గారు మాట్లాడుతూ, సామాజికన్యాయం నేడు ప్రమాదంలో పడిందని, కార్మిక వర్గం, రైతాంగం నడుంబిగిస్తేనే, అంబేద్కర్ గారి ఆశయం సాధ్యం కాదని, ప్రవేటు రంగాని, రక్షించుకుంటూనే, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, దానికి గట్టిగా కృషి చెయ్యాలని అన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు K సత్యనారాయణ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నాయని, వారి మనుగడకే తీవ్రప్రమాదం రానున్నది అన్నారు. ఇంకా ఈ సభలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు K లోకనాథం గారు, CITU రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గారు,AV నాగేశ్వరరావు గారు, DHPS రాష్ట్ర అధ్యక్షులు,జెవి ప్రభాకరరావు, kvps రాష్ట్ర నాయకులు MD ఆనంద్ బాబు, B రఘురామ్, భాగం లక్ష్మీ, ఆలూరి తిరుపాల్, K క్రాంతి బాబు, K, రంగమ్మ, J నవీన్ ప్రకాశ్, జువ్వుల రాంబాబు, ఈర్ల చిరంజీవి, M కుటుంబరావు రావు గారు, తదితరులు పాల్గొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు మద్దెలసుబ్బన్న గారు వందనమర్పణతో సమావేశం ముగిసింది.

విశాఖపట్నం

సి ఐ టి యూ సమావేశం

*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి* CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch నరసింగరావు గారు మాట్లాడుతూ, సామాజికన్యాయం నేడు ప్రమాదంలో పడిందని, కార్మిక వర్గం, రైతాంగం నడుంబిగిస్తేనే, అంబేద్కర్ గారి ఆశయం సాధ్యం కాదని, ప్రవేటు రంగాని, రక్షించుకుంటూనే, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, దానికి గట్టిగా కృషి చెయ్యాలని అన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు K సత్యనారాయణ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నాయని, వారి మనుగడకే తీవ్రప్రమాదం రానున్నది అన్నారు. ఇంకా ఈ సభలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు K లోకనాథం గారు, CITU రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గారు,AV నాగేశ్వరరావు గారు, DHPS రాష్ట్ర అధ్యక్షులు,జెవి ప్రభాకరరావు, kvps రాష్ట్ర నాయకులు MD ఆనంద్ బాబు, B రఘురామ్, భాగం లక్ష్మీ, ఆలూరి తిరుపాల్, K క్రాంతి బాబు, K, రంగమ్మ, J నవీన్ ప్రకాశ్, జువ్వుల రాంబాబు, ఈర్ల చిరంజీవి, M కుటుంబరావు రావు గారు, తదితరులు పాల్గొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు మద్దెలసుబ్బన్న గారు వందనమర్పణతో సమావేశం ముగిసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రధాన లక్ష్యం తహశీల్దార్ నాగరాజు

దుత్తలూరు పరిశుభ్రత పరిరక్షణ స్వర్ణాంధ్ర ప్రధాన లక్ష్యం అని తహశీల్దార్ నాగరాజు అన్నారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు అనంతరం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్య o లభిస్తుందనరు సంపూర్ణ ఆరోగ్యం తో సమాజా భి వృద్ధి చెందుతుందన్నారు పరిశుభ్రత పైన ప్రతీ ఒక్కరూ అవగాహనను. పెంపొందిందుకావాలన్నారు తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పలు అంశాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

గాజువాక ఆదర్స్ గ్రౌండ్ లో దీపావళి క్రాకర్స్ అమ్మకాలు

*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి*= *గాజువాక ఆదర్శ్ గ్రైండ్ లో దీపావలి క్రాకర్లు అమ్మకాలు* *దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాకాయలు లేదా బాణసంచా అమ్మడం చట్టరీత్యా నిషేధం చేయబడింది.* *ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలు ఈ విషయంలో స్పష్టంగా హెచ్చరికలు జారీచేశాయి,* *ఎవరు లైసెన్స్ లేకుండా టపాకాయల దుకాణాలు నడిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గాని గాజువాక లో బిన్నం* *దీపావళి పండుగ సమయంలో టపాకాయలు అమ్మడం లేదా నిల్వ ఉంచడం కోసం తప్పనిసరిగా పోలీస్ మరియు ఫైరుఅధికారుల అనుమతులు అవసరం.* *అనుమతి లేకుండా టపాకాయలు అమ్మడం లేదా పేల్చడం Explosives Act, 1884 / 1983 నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరం. పోలీసులు లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారని పునరుద్ఘాటించారు* *గాజువాక పెద్దగంట్యాడ పోలిస్ స్టేషను పరిధి ఆదర్శ్ గ్రైండ్ లో బిన్నం* *కనీసం ఒక్క ఫైర్ ఇంజన్ కూడా పెట్టలేదు* *ప్రమాదం జరిగితె ఎవరు బాద్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్న స్థానికులు* *ఇప్పటికీనా పోలిస్ మరియు ఫైరుఅధికారులు స్పందించి* *లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు*

విశాఖపట్నం

తల్లి బిడ్డ ఎక్సప్రెస్ వాహనాల్లో మండుగుండు సామాగ్రి తరలింపు

చోడవరం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ రవాణా శాఖ నెంబర్ బోర్డు లేని తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో మందు గుండు సామగ్రిని యదేచ్చగా తరలిస్తున్నారు. ఎటువంటి అధికారిక అనుమతులు, వే బిల్లులు లేని మందు గుండు సామగ్రిని యదేచ్చగా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం అడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాధికారుల సహకారంతో చోడవరంలో మందు గుండు వ్యాపారులు “ఆడింది ఆట, పాడింది పాట”గా కొనసాగుతోందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నం

తల్లి బిడ్డ ఎక్సప్రెస్ వాహనాల్లో మండుగుండు సామాగ్రి తరలింపు

చోడవరం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ రవాణా శాఖ నెంబర్ బోర్డు లేని తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో మందు గుండు సామగ్రిని యదేచ్చగా తరలిస్తున్నారు. ఎటువంటి అధికారిక అనుమతులు, వే బిల్లులు లేని మందు గుండు సామగ్రిని యదేచ్చగా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం అడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాధికారుల సహకారంతో చోడవరంలో మందు గుండు వ్యాపారులు “ఆడింది ఆట, పాడింది పాట”గా కొనసాగుతోందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం

బీజేపీ నేత బానోత్ విజయ్ కి కిషన్ రెడ్డి పరామర్శ

ఖమ్మం పున్నమి ప్రతినిధి సత్తుపల్లి సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు బానోత్ విజయ్ ఆరోగ్య పరిస్థితిని కేంద్ర హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, దాడికి పాల్పడిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పార్టీ కార్యకర్తలపై ఇలాంటి దాడులను బీజేపీ భరించదని స్పష్టం చేశారు. బానోత్ విజయ్ త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి బీసీ రిజర్వేషన్ల పెంపు, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా కొనసాగింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్ కు బీజేపీ, వివిధ బీసీ సంఘాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు విశేషంగా మద్దతు తెలిపారు. వైరా, సత్తుపల్లి, ఖమ్మం, మధిర పాలేరు నియోజకవర్గ ప్రాంతాల్లో బంద్ కి విస్తృత ప్రజా మద్దతు లభించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే సత్తుపల్లి పట్టణంలో బంద్ సందర్భంగా బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బంద్ నేతలు హెచ్చరించారు. మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి బీసీ రిజర్వేషన్ల పెంపు, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా కొనసాగింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్ కు బీజేపీ, వివిధ బీసీ సంఘాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు విశేషంగా మద్దతు తెలిపారు. వైరా, సత్తుపల్లి, ఖమ్మం, మధిర పాలేరు నియోజకవర్గ ప్రాంతాల్లో బంద్ కి విస్తృత ప్రజా మద్దతు లభించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే సత్తుపల్లి పట్టణంలో బంద్ సందర్భంగా బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బంద్ నేతలు హెచ్చరించారు. మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.