*అమెరికా అధ్యయన యాత్ర ముగించుకొని విశాఖకు చేరుకున్న ఎంపీ భరత్ కి ఘన స్వాగతం*
విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): అమెరికా అధ్యయన యాత్రను విజయవంతంగా ముగించుకొని విశాఖ నగరానికి విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ కి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్పోర్ట్లో విశాఖ 35వ వార్డు కార్పొరేటర్, జివిఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు విల్లూరి భాస్కరరావు గారు పార్టీ కార్యకర్తలతో కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు బుచ్చ రామిరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని భరత్ ని పూలమాలలతో ఆహ్వానించారు. విశాఖ అభివృద్ధికి భరత్ చేస్తున్న కృషిని కార్యకర్తలు ప్రశంసించారు.











