Monday, 27 April 2026

Blog

చిత్తూరు

ముఖ్య మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం పాలాభిషేకం జరిపారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 3.640 (కరువు భత్యం) డి.ఏ. ను ప్రకటించిన సందర్భంగా నగరంలోని తపోవనం పాఠశాలలో చిత్తూరు జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి పాలాభిషేకం జరిపారు. కార్యక్రమంలో జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శి లు డాక్టర్ జయప్రకాష్ నాయుడు,చందనం రామయ్య, ఆర్థిక కార్యదర్శి బాబు రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందన హర్షణీయం — AGTUPSS*

దీపావళి కానుకగా దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వంతో సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించ గలిగిన ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్,ప్రధాన కార్యదర్శి డి.వి. రమణకు అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ల సంఘాల తరఫున అభినందనలు తెలపడమైనది.ఈ సందర్భంగా ఆదివారం అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాద్యాయ పెన్షనర్ ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. 👉నవంబర్ నెల నుంచి ఒక డి.ఏ. (3.640) ను విడుదల చేయడం, 👉60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందు కు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, 👉 ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజులలో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల AGTUPSS నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 👉దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం,ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వక మైన, గౌరవప్రదమైన,హుందాతన చర్చలు — దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం చాలా సంతోష దాయకమని అన్నారు. 👉చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహిళా ఉద్యోగులలో ఆనందాన్ని నింపిందని అన్నారు. 👉హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹ 50,000 నుండి ₹ 1,00,000 కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹ 2.00 లక్షల నుండి ₹ 5.00 లక్షల పైబడేలా పెంచడం,అలాగే ఆరోగ్యశ్రీ (EHS) విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడo,ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించాయన్నారు. 👉పి.ఆర్సి కమిటీ ఏర్పాటు విషయంలోనూ, 👉57వ మెమో ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులను ఓపిఎస్ (OPS) పద్ధతిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడాన్ని కూడా AGTUPSS హర్షించింది. మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడమైనది. 👉ఉద్యోగుల సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయాల నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి 60 నుంచి 62 పెంచడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయడం, మిగతా అన్ని అంశాల పరిష్కారం కోసం విద్యాసాగర్, రమణల నాయకత్వంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని తెలపడమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, చీఫ్ సెక్రటరీ విజయానంద్,ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పక్షాన ధన్యవాదాలు తెలిపింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు కాకర్ల సురేష్, జిల్లా డిసిసిబి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి సీతారామపురం మండల ప్రజలకు, అధికారులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలను సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్ (రాజా) ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను బాణ సంచాలు కాలుస్తూ జరపకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతి ఇంటి నందు నూనె దీపాలను వెలిగించి పండుగను జరుపుకోవాలన్నారు. ప్రజలు దీపావలి వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కోరుకూరి వీరబాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులైన కోరుకూరి వీరబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆత్మీయ మిత్రుడు కోరుకూరి వీరబాబు గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులైనందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. పార్టీ అభివృద్ధికి మీరు చేసిన కృషి ఫలితంగా వచ్చిన ఈ నియామకం మీ ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం మరిన్ని పదవులు, మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ భక్తుడైన, చేట్ల రామారావు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ వింగ్ సెక్రటరీ

తిరుపతి

శ్రీకాళహస్తి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..తిరుజిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప

దీపావళి పర్వదినాన్ని దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని,ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆకాంక్షించారు.సోమవారం దీపావళి పండగను పురస్కరించుకొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.దుష్టశక్తులపై ధైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుతామని,అలాగే దీపావళి రోజున లక్ష్మీ,సరస్వతీ పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో వుండాలి అన్నారు.బాణసంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు.అదేవిధంగా ప్రతి భారతీయుడు స్వదేశీ టపాసులను వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ సాంప్రదాయ ప్రకారం నూనె దీపాలను వెలిగించి కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని తెలిపారు.

విశాఖపట్నం

30 కోట్ల వ్యయంతో వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ నిర్మాణం.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే చారిత్రాత్మకమైన శ్రీ వల్లభాయ్ పటేల్ పారలల్ బ్రిడ్జ్ (Dockyard Bridge) పునర్నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. పాత బ్రిడ్జ్ బలహీనమవడంతో దానిని ఆధునిక సాంకేతికతతో మళ్లీ నిర్మించడానికి పోర్ట్ యాజమాన్యం సుమారుగా ₹30 కోట్ల రూపాయల వ్యయంతో నూతన వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని, నవంబర్ మొదటి వారంలో ఈ బ్రిడ్జ్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడానికి పోర్ట్ యాజమాన్యం అహర్నిశలు కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ వంతెన పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతం మరియు సిటీ ప్రాంతాన్ని కలిపే ఏకైక రహదారి మార్గం కావడంతో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. సుమారు 1½ సంవత్సరాలుగా రాకపోకలు నిలిచిపోయినందున, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలో తొలగబోతున్నాయని సమాచారం. ఈరోజు శ్రీ వల్లభాయ్ పటేల్ పారలల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ప్రత్యక్షంగా సందర్శించి, సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై యాజమాన్యానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గణబాబు మాట్లాడుతూ — “విశాఖలో రాబోయే *అంతర్జాతీయ సదస్సు (International Submit)*కు వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు, అలాగే ఫిబ్రవరిలో జరగబోయే IFSC సమావేశానికి ప్రముఖులు రాబోతున్నారు. వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం” అని తెలిపారు., “ప్రజల సౌకర్యం దృష్ట్యా, ఈ బ్రిడ్జ్‌ను నవంబర్ మొదటి వారంలో పూర్తిగా ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. ఈ దిశగా అన్ని పనులు దాదాపు పూర్తి అయ్యాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ అంగ ప్రశాంతి, T.N.T.U.C. జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు లక్ష్మణరావు, నాగార్జునరావు, ENC TNTUC ప్రధాన కార్యదర్శి శ్రీను, వర్స్ కమిటీ మెంబర్ నాయుడు, NCE యూనియన్ అధ్యక్షుడు శేఖర్, యూనియన్ ప్రతినిధులు పరమేష్, శివ, రాజారావు, వివిధ కంపెనీల కార్మికులు పాల్గొన్నారు. వంతెన పునర్నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన గౌ. గణబాబు గారికి పారిశ్రామిక ప్రాంత సీనియర్ టీడీపీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోర్ట్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విశాఖపట్నం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణా ఇద్దరు అరెస్ట్ – 10 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీల్లో భాగంగా అక్రమ గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. విశాఖపట్నం జి.ఆర్.పి. ఇన్‌స్పెక్టర్ శ్రీ సి.హెచ్. ధనంజయనాయుడు ఆధ్వర్యంలో జి.ఆర్.పి. మరియు ఆర్.పి.ఎఫ్. సంయుక్త బృందం సబ్‌ ఇన్‌స్పెక్టర్లు కేటీఆర్. లక్ష్మి, కెళ్ళి అనంతరావు, అలాగే ASI/RPF సిబ్బంది తో కలిసి రైల్వే ప్లాట్‌ఫారాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో కేరళ రాష్ట్రం, పాఠనామిత్త జిల్లాకు చెందిన A.1 లైజు, A.2 సాహుల్ జమాల్ అనే ఇద్దరు వ్యక్తులు కేరళ రాష్ట్రానికి గంజాయి రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డారు. వారి వద్ద నుండి దాదాపు 10 కిలోల గంజాయి (విలువ సుమారు రూ.50,000) స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్ కేటీఆర్. లక్ష్మి స‌మ‌క్షంలో వారిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు. ఇక మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను గుర్తించేందుకు విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీస్ మరియు ఆర్‌పిఎఫ్ ఫోర్స్‌లు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి. విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం రైల్వే స్టేషన్ల పరిధిలో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ధనంజయనాయుడు తెలిపారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభం

గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): గాజువాక నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం 67వ వార్డు గౌరీ పరమేశ్వరుల గుడి దగ్గర ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ తైనాలా విజయకుమార్ హాజరై, సంతకాల సేకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ ఇబ్రాన్, గుడివాడ లతీష్, పల్లా చిన్నతల్లి, కొయ్య భారతి, పూర్ణ, పల్లా సురేష్ కుమార్, మంత్రి శంకర్ నారాయణ, ధర్మాల శ్రీను, బొడ్డ గోవింద్, మద్దాల అప్పారావు, సంద్రనా నూకరాజు, శ్రీనివాసరావు, మార్థుపూడి పరదేశి, రాజన వెంకటరావు, గొందేశీ మహేష్ రెడ్డి, ఎం.డి. గౌష్, అచ్చయ్య నాయుడు, చిత్రాడ రమణ, ఎన్నేటి రమణ, రోజా రాణి, కల్పనా, రామలక్ష్మి, ఈశ్వరి, మునిషా భేగాం, సత్యవతి, ఉమా, అన్నపూర్ణ, సూర్య, లక్ష్మి, కుమార్, హుసేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతంగా సాగి, ప్రజల్లో మంచి స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నిర్మల్

వాటోలి గ్రామానికి గర్వకారణం – జాదవ్ అక్షర విజయోత్సవం

నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన జాదవ్ అక్షర S/o హనుమంత్ రావు గారు BDS కోర్సులో సీటు సాధించడం గ్రామానికి ఆనందాన్ని కలిగించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని AMEWA (Are Marata Employee Association) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో AMEWA మెంబెర్స్, స్థానిక ప్రజలు, స్నేహితులు, బంధువులు పాల్గొని అక్షర ప్రతిభను ప్రశంసించారు. చిన్న వయస్సులోనే ఉన్నత విద్యలో అడుగుపెట్టిన అక్షర, భవిష్యత్తులో వైద్య రంగంలో మంచి సేవలు అందిస్తుందని అందరూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ – “గ్రామంలోని యువతకు అక్షర విజయమే ప్రేరణ” అని అభినందించారు. “ఇలాంటి ప్రతిభావంతుల ద్వారా గ్రామానికి పేరుప్రతిష్ఠలు వస్తాయి” అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. అమేవ ప్రతినిధులు మాట్లాడుతూ – “అక్షర మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా ఆకాంక్ష. విద్యారంగంలో నిలదొక్కుకొని, సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. కార్యక్రమం అనంతరం అక్షరను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

జనగాం

సదర్ సమ్మేళనం లో పాల్గొన్న అఖిలభారత యాదవ జనగామ,వరంగల్ జిల్లా నాయకులు

హైదరాబాద్_లో_సదర్_సమ్మేళనంలో_పాల్గొన్న_జనగామ_యాదవ_సంఘం_నాయకులు ———————————————- జనగామ, అక్టోబర్19,పున్నమి న్యూస్: ఈరోజు హైదరాబాద్ లో శ్రీ_కృష్ణ_సదర్_సమ్మేళనం*ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరై సదర్ సమ్మేళనం గురించి క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులను (మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , ఈశ్వరమ్మ ,రాజ్య సభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ముఖ్య నేత)లను మర్యాదపూర్వకంగా కలిసి పాల్గొన్న సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు జనగామ జిల్లా యాదవ సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు….. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు *బనుక_సిద్ధిరాజ్_యాదవ్*,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కాజీపేట 62వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల_రవీందర్_యాదవ్ నాయకులు దడిగే రవి కుమార్ యాదవ్, బనుక ప్రభాకర్, దండెబోయిన కుమార్ యాదవ్,గాజుల రాజు యాదవ్, ఇమ్రాన్, సాదం సంపత్,కనుకరాజ్, నవీన్, గణేష్, సుధీర్, చింటూ, వినోద్ తదితరులు పాల్గొన్నారు…..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.