హైదరాబాద్
*💥పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ చేసి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను TET ఉత్తీర్ణత నుండి మినహాయించండి -* *శానమోనినర్సిములు RUPP-TS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 5/02/2026* ప్రభుత్వ సర్వీసులో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు TET పరీక్ష నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ – తెలంగాణ రాష్ట్రం (RUPP-TS) కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకువచ్చింది. *ముఖ్య అంశాలు* 🔹 కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి: గౌరవ కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, మరియు ఎంపీలు శ్రీమతి డి.కె. అరుణ గారు, శ్రీ మల్లు రవి గారికి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. *🔹 చట్ట సవరణ అవసరం:* RTE అమలుకు ముందు నియామకమైన వారికి TET మినహాయింపునిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. *🔹 NCTE నిర్లక్ష్యం:* జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (NCTE) నిర్లక్ష్యం వల్లే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని, కేంద్రం వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని RUPP-TS విమర్శించింది. *🔹 ఢిల్లీ యాత్ర – ఫిబ్రవరి 16:* భావసారూప్యం గల సంఘాలతో కలిసి ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రులు మరియు ఉన్నతాధికారులను కలసి ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడమైనది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శానమోని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి శ్రీ శశికుమార్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీ ఎం.ఎన్. విజయ్ కుమార్, గౌరవ సలహాదారులు శ్రీ కే. గోపాల్ జీ, నాన్-TET ఫోరం కన్వీనర్ శ్రీ అమీర్ పాషా, మరియు రాష్ట్ర ముఖ్య నేతలు, జిల్లా బాధ్యులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. *”ఉపాధ్యాయుల భవితవ్యం కోసం – రాజీలేని పోరాటం!”*