Wednesday, 15 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

28 తేదీన ఉదయగిరి లో వైసీపీ ఆధ్యర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమం

మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్యర్యంలో ఈ నెల 28 నఉదయగిరి లో ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు 28 న ఉదయం వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు ఈ కార్యక్రమనికి నియోజక వర్గం లోనీ వైసీపీ శ్రేణులు అభిమానులు హాజరు కావాలని కోరారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ – వివరాలు చెక్ చేసుకునే అవకాశం, అక్టోబర్ 28 వరకు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ అయింది. ఇంటర్ విద్యా మండలి (BIEAP) విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం, కళాశాల వివరాలు మరియు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పరిశీలించుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక అవకాశం కల్పించింది. విద్యార్థులు మండలి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి టెన్త్ క్లాస్ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేస్తే తమ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వివరాలను పరిశీలించిన తర్వాత, ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు ఉన్నట్లయితే, విద్యార్థులు వెంటనే చర్యలు తీసుకోవాలని మండలి సూచించింది. తప్పులను సవరించుకోవడానికి కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా రిక్వెస్ట్ లెటర్ సమర్పించి, ఈ నెల అక్టోబర్ 28లోగా సంబంధిత RIO ఆఫీసులో అప్లై చేయాలి. ప్రత్యేకంగా, పేరు మార్పు (Name Correction) కోసం విద్యార్థులు బ్యాంకులో రూ.100 చలాన్ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థుల వివరాలు సరిగ్గా ఉండటం భవిష్యత్తులో మార్కుల మెమోలు, సర్టిఫికేట్లు, హాల్ టికెట్లు వంటి పత్రాల్లో తప్పులు రాకుండా ఉండటానికి అత్యంత అవసరం. విద్యా మండలి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కాలేజీ యాజమాన్యాలు ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అందువల్ల ప్రతి విద్యార్థి తక్షణమే వివరాలు చెక్ చేసి, అవసరమైన సవరణలు సమయానికి చేయాలి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డెంగ్యూ జ్వరం — కారణాలు, లక్షణాలు మరియు జాగ్రత్తలు

ఇవి ఎక్కువగా ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు కుడుతాయి. డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ వైరస్‌ వల్ల వచ్చే ఒక వైరల్ వ్యాధి. ఈ వైరస్ మనుషులకు ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమలు సాధారణంగా శుభ్రమైన నీటిలో పెరుగుతాయి — అంటే నీటి ట్యాంకులు, డబ్బాలు, కూలర్‌లు వంటి ప్రదేశాల్లో. ఇవి ఎక్కువగా ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు కుడుతాయి. సాధారణంగా ఇవి మోకాళ్ల కింద భాగం మరియు మోచేతి కింద భాగం వద్ద కుడతాయి. ఈ దోమ కుట్టిన వారం రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. మొదటగా 103° నుండి 106° వరకు జ్వరం వస్తుంది. శరీరమంతా తీవ్రమైన నొప్పులు, కనుగుడ్ల వెనుక భాగంలో నొప్పి, వాంతులు, బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలోని ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం కూడా ప్రధాన లక్షణం. సాధారణంగా 1 మిల్లీలీటర్ రక్తంలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ 50,000 వరకు తగ్గితే భయపడవలసిన అవసరం లేదు, కానీ దానికంటే తక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాలి, అవసరమైతే ప్లేట్‌లెట్ ఎక్కించుకోవాలి. 100 మంది డెంగ్యూ రోగులలో 90 మందికి పెద్ద చికిత్స అవసరం లేకుండానే నయం అవుతుంది. ఈ వ్యాధికి ప్రత్యేకమైన మందులు లేవు. కాబట్టి జ్వరాన్ని కంట్రోల్ చేయడం, సెలైన్ పెట్టడం, బీపీ నియంత్రణ, అవసరాన్ని బట్టి రక్త కణాలు ఎక్కించడం వంటి సహాయక చికిత్సలే ప్రధానమైనవి. జాగ్రత్తలు — దోమల నివారణే రక్షణ!

పల్నాడు

స్పా ముసుగులో వ్యభిచారం

*స్పా ముసుగులో వ్యభిచారం.. ఒకే లాడ్జిలో ఏడు ಜಂటಲು……. పల్నాడు జిల్లా………. **నరసరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న లాడ్జిలపై పోలీసులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లాడ్జిలో గత ఏడాది నుంచి ప్రతిరోజూ అసాంఘిక కార్యకలాపాలు (వ్యభిచారం) జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, జిల్లాలోని కొన్ని హోటళ్లను కేంద్రంగా చేసుకొని జూదరులు పేకాట ఆడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్

కార్మిక సంఘం ఎన్నికల్లో బీజేపీ పై బి ఆర్ ఎస్ విజయం

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్–బాలానగర్ ప్రాంతంలోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని సంఘం విజయం సాధించింది. భారత ట్రేడ్ యూనియన్ తరఫున పోటీ చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ పై బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు. ఈ విజయంతో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆనందం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శక్తి మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు.

కాకినాడ

పెద్దాపురం టిడ్కో గృహల నందు కార్దన్ అండ్ సెర్చ్

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10, కాకినాడ జిల్లా, S.P. శ్రీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు డిఎస్పి . శ్రీ.D.శ్రీహరి రాజు పర్యవేక్షణలో కార్డాన్ అండ్ సెర్చ్ లో భాగంగా పెద్దాపురం వాలుతిమ్మాపురం రోడ్డు మార్గంలో ఉన్న టిడ్కో గృహాలలో ఐదు బృందాలుగా పోలీసులు అధికారులు విస్తృత తనిఖీలు ఆదివారం తెల్లవారిజమున 4.గంటల నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ విజయ శంకర్ ,సామర్లకోట క్రైమ్ సి.ఐ అంకమరావు,పెద్దాపురం ఎస్ఐ మౌనిక,జగ్గంపేట ఎస్సై రఘురాం, గండేపల్లి ఎస్సై నాగబాబు, 50 మంది పోలీస్ సిబ్బంది 5 బృందాలు గా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.24 ద్విచక్ర వాహనాలను ,1 ఆటో ను రికార్డులు లేవని గుర్తించారు. పోలీస్ వారు డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించి, టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు పెద్దాపురం సిఐ విజయ శంకర్ కొన్ని సూచనలను ఇస్తూ ,అసాంఘిక కార్యక్రమాల కు ఎవరైనా పాల్పడితే తక్షణమే సమాచారం అందించేలా పోలీస్ అధికారుల మొబైల్ నెంబర్లను ఇచ్చారు. అలాగే బయట వ్యక్తులు ఎవరైనా ఆశ్రయం కోసం వచ్చిన తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారికి అవగాహన కల్పించారు.

విశాఖపట్నం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ:26-10-25 బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 550 కి.మీ, చెన్నైకి 850 కి.మీ, విశాఖపట్నంకి 880 కి.మీ,కాకినాడకి 880 కి.మీ, గోపాల్‌పూర్ కి 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కౌశలం సర్వే

గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కౌశలం సర్వే వెరిఫికేషన్ నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. పౌరుల పెండింగ్ ఈకేవైసీ నవీకరణకు గడువు నవంబర్ 15. అలాగే 5–7, 15–17 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు జరుగుతున్నాయి. కౌశలం వెరిఫికేషన్ (డెడ్‌లైన్: నవంబర్ 5) పెండింగ్ eKYC అప్డేట్ (డెడ్‌లైన్: నవంబర్ 15) బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్యాంపులు (5–7 & 15–17 ఏళ్ల పిల్లల కోసం)

Blog

సర్వీసు సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ పునరుజ్జీవనమే మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె నాగేంద్రప్ప

ఆత్మకూరు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను తక్షణం పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.“రండి…టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమం గురువారం ఆత్మకూర్ పట్టణంలోని మలేరియా కేంద్రం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో తాలూకా సంఘం అధ్యక్షుడు కల్లూరి మస్తానయ్య అధ్యక్షతన ఉద్యోగులు తమ సమస్యలను సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి 35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని గుర్తుచేశారు. ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే గృహ కల నెరవేరుతుందని సూచించారు. జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ట్రిబ్యునల్ పునరుద్దరణ అవసరమన్నారు. తాలూకా స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను రాష్ట్ర సంఘం ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తున్నామన్నారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ చర్చలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కాదు, సమస్యలకు సానుకూల పరిష్కారం కాంక్షించి చేపడుతున్నామని వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగేళ్లుగా పెన్షన్, ఇతర ప్రయోజనాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాలూకా అధ్యక్షులు కల్లూరి పెద్ద మస్తానయ్య, ముఖ్య కార్యదర్శి సి. చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పి. ప్రసాదరావు, ధనలక్ష్మి, రవణమ్మ, జాయింట్ సెక్రెటరీ ఎం. జనార్ధన్, ఎం. రసూల్, ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

నేడు ప్రధాని మాన్ కీ బాత్

పున్నమి ప్రతి నిధి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని మోడి గారి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం నేడు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఇది 127వ ఎపిసోడ్. దేశవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి, దూరదృష్టి ఉన్న సువిశాల డిజిటల్ వేదికల ద్వారా ప్రజలతో ప్రధాని మోడి మాట్లాడనున్నారు. ప్రధాని మోడి ప్రజలతో నేరుగా మాట్లాడి, సామాజిక, జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.