Wednesday, 15 April 2026

Blog

విశాఖపట్నం

తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు

తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు . విశాఖపట్నం -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి : తుఫాను దృష్ట్యా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, అన్ని జోనల్ కార్యాలయాల్లో అక్టోబర్ 27వ తేదీన అనగా సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS ) కార్యక్రమమును రద్దు చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కావున విశాఖ నగర ప్రజలు పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని గమనించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా కమిషనర్ ప్రజలకు తెలిపారు.

ఖమ్మం

పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి కామెంట్స్….

ఖమ్మం….. పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అధికార పార్టీ వాళ్లే గొడవలు చేస్తారు మళ్ళీ తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కి తూట్లు పొడుస్తున్నారు రాజకీయ దురుద్దేశం తో టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజా సమస్యలకోసం సేవే లక్ష్యం గా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగం కి విలువ ఇవ్వండి రంగుల రాట్నం సినిమా చూపిస్తూ ప్రజల చెవిలో పూలు పేడుతున్నారు ఇచ్చిన హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు వీళ్ళ పాలనలో 10 నెలల క్రితం చేసిన పనుల బిల్లులు రావు 10 రోజుల క్రితం చేసిన పనుల బిల్లులు వస్తాయి అప్పుల పాలు అయినం అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ది బీజేపీ ప్రభుత్వం వైపు చూసే ప్రజలకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక స్కీమ్ లు ఇస్తున్నాం ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఆధ్వన్నాం,పశువుల అక్రమ రవాణా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇసుక తోలుకోవడం ఎవరు మంత్రి నో ఎవరు కాంట్రాకర్ నో అర్ధం కానీ పరిస్థితి ఉందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోతే అభివృద్ధి చేసే దిక్కు లేదు ఈ ప్రభుత్వం కి ఈ ప్రభుత్వం స్వేత పత్రం ప్రకటించాలి ఇచ్చిన హామీలు ఎటు పోయాయో ఎవడికి ఓటు చోరీ ఎక్కడ ఓటు చోరు అనాడు మీరు ఓటు చోరీ చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళకి కర్రు కాల్చి ఒత పెట్టేలాగా మీరు బీజేపీ ప్రభుత్వం నీ గెలిపించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు

విశాఖపట్నం

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగ లేఖను ఈ రోజు జగదాంబ వద్ద గల సీఐటీయూ జిల్లా కార్యాలయం లో మీడియాకు విడుదల చేసారు. ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు తో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. కె. ఎస్. వి కుమార్, బి జగన్, వి కృష్ణా రావు లు పాల్గొన్నారు… విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి. *విషయం: గూగుల్పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి.* అయ్యా! అమెరికా తరువాత అతిపెద్ద డేటా సెంటర్ రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల (లక్షా 25 వేల కోట్లు) పెట్టుబడితో విశాఖపట్నంలో నెలకొల్పనున్నట్లు ఢిల్లీలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశం తరువాత మీరు ప్రకటించారు. దానితో పాటు ఏఐ హబ్్న కూడా నెలకొల్పబోతున్నట్లు చెప్పారుసహజంగానే ఇది ప్రజల్లో ముఖ్యంగా విద్యావంతులైన యువతరంలో అనేక ఆశలు రేకెత్తించింది. దీనికోసం 500 ఎకరాలు కేటాయించారు. గూగుల్ అదానీ కనెక్స్, ఏయిర్టెల్ కమ్యూనికేషన్స్ కూడా భాగస్వాములవుతున్నాయి. లక్షా 80 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖా మాత్యులు నారా లోకేష్ ప్రకటించారు. ఈ విజయాన్ని చూసి ఇరుగు, పొరుగు రాష్ట్రాల వారు అసూయపడుతున్నట్లుగా, ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలే అన్ని ఉద్యోగాలు రావని, పర్యావరణానికి నష్టం ఉంటుందని చెప్పక తప్పలేదు. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా 5-6 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని పరోక్షంగా ఇంకో 30 వేల మందికి ఉపాధి దొరకొచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రచారం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చెబుతున్నదే వాస్తవం అయితే ప్రతిపక్షాల దృష్ప్రచారం నిలబడదు. దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇటీవల మీడియాలో వస్తున్న విభిన్న కథనాలు, వివిధ దేశాల అనుభవాలు పరిశీలిస్తే దీనిపై వాస్తవాలతో నిమిత్తం లేకుండా అతిశయోక్తులతో ప్రచారం జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది సమస్యలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నాను. (1) అమెరికా తరువాత అతి పెద్ద డేటా సెంటర్ (1 గిగావాట్) కోసం విశాఖపట్నంలో గూగుల్ అత్యధిక పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ద్వారా సముద్ర గర్భం నుండి కేబుల్ కనెక్షన్ల ద్వారా 12 దేశాల అనుసంధానించిన గేట్వేగా ఉ ండబోతున్నది. తద్వారా గూగుల్ వ్యాపారం ప్రపంచమంతటా విస్తరించడానికి విశాఖపట్నం డేటా సెంటర్ దోహదం చేస్తుంది. దీనివల్ల గూగుల్కు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ల్కో ఏ విధంగా లాభం చేకూరుస్తుంది? (2) గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, అనకాపల్లి జిల్లాలోనూ 480 ఎకరాలు కేటాయించారు. ఇందులో పంటలు పండే భూములున్నాయి, దళితుల అసైన్డ్ భూములున్నాయి. వాటిని తీసుకోవడం ద్వారా రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారు. ఉదా:- తరువాడ గ్రామంలో దళితులు జీవన భృతిని కోల్పోతామంటూ ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సింహాచలం దేవస్థానం క్రింద పంచ గ్రామాల ప్రజలు ఇళ్ళపట్టాలకోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కానీ అదే ప్రాంతంలో అడవివరంలో గూగుల్ కోసం భూములు కేటాయించారు. ఇదేమి న్యాయం? 2019లో మీ ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నది. దీని ప్రకారం 70 వేల కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వం 2023లో అదానీ కనెక్స్ట్ మరలా ఒప్పందం చేసుకొని డేటా సెంటర్ కోసం 400 ఎకరాలు కేటాయించింది. అందులో 130 ఎకరాలు (రుషికొండ -3 చుట్టూ) కోటి రూపాయల చొప్పున రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఆ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. అదానీ డేటా సెంటర్ పెట్టలేదు. ఉపాధీ కల్పించలేదు. ఇప్పుడు గూగుల్ జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఈ స్థితిలో అదానీకి కేటాయించిన భూముల్ని గూగుల్ డేటా, ఎఐ హబ్బుకోసం కేటాయించాలి. ఆ భూములు ఖాళీగా పెట్టి మరోచోట తిరిగి రైతుల భూములు సేకరించడం సమంజసం కాదు. పైగా అభివృద్ధి పేరుతో ప్రజల మనోభావాలను ముందుకు తెచ్చి నష్టపోతున్న రైతుల నోళ్ళు నొక్కడం సరైంది కాదు. (1) రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటివరకు వైజాగ్ ఐటి పార్కు పేరుతో పనోరమ హిల్స్పై 10 కంపెనీలకు పైగా స్థలాలు. కేటాయించారు. ఒక్క కంపెనీ కూడా ప్రారంభంకాలేదు. (3) ఇలాంటి డేటా సెంటర్ ద్వారా 5-6 వేలకు మించి ప్రత్యక్ష ఉద్యోగాలు రావని నిపుణులు చెప్తున్నారు. విశాఖలో ఒక పెద్ద డేటా సెంటర్ను మానిటరింగ్ చేయడానికి, దానికి అనుబంధంగా విద్యుత్, నీళ్ళు వగైరాల సరఫరాకు ఎంతమంది ఉద్యోగులు: అవసరం అవుతారో గూగుల్తో జరిగిన ఒప్పందంలో నిర్దిష్టంగా హామీ ఇచ్చారా? వారు తీసుకునే సిబ్బందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత మందిని తీసుకుంటారు? గత అనుభవాలను బట్టి వివిధ పరిశ్రమల్లో స్థానికులకు చాలా తక్కువ ఉద్యోగాలే లభించాయన్నది వాస్తవం ప్రపంచం అంతటా ఐటి ఉద్యోగాల్లో కోత పడుతోందన్న వాస్తవం మీకు తెలుసు, ఇందులో మన రాష్ట్రం వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. ఉదా:- అత్యంత ప్రతిష్టాత్మకమైన బిసిఎస్ గత మూడు మాసాల్లో 20 వేల మంది మధ్యంతర సిబ్బందిని తొలగించింది. కొత్తగా 10 వేల మందిని తీసుకుంటామని ప్రకటించింది. ఎఐ ప్రభావంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వగైరా ప్రఖ్యాత కంపెనీలు కూడా సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఈ స్థితిలో ఎఐ హబ్బులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం ఖచ్చితమైన అంచనా వేసిందా? ఉద్యోగ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరుతున్నాను. వాస్తవాలతో నిమిత్తం లేని లెక్కలు భవిష్యత్తులో యువతరాన్ని మరింత అసంతృప్తికి గురిచేయవా? (4) రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే గూగుల్ లాంటి కంపెనీలు అనేకం వాటంతట అవే వచ్చి ఉండేవి. ఈ పాటికి విశాఖ. సహా రాష్ట్రం మరో అడుగు ముందుకేసి ఉండేది. ఇప్పుడు 22 వేల కోట్లు ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం పోరాడండి. (5) జి.వో.40లో పేర్కొన్న విధంగా గూగుల్ డేటా సెంటర్కు వివిధ రూపాల్లో 22 వేల కోట్లు రాయితీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఏ కంపెనీకి ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయితీల ద్వారా రాష్ట్రానికి వస్తున్న లాభం ఎంత? భూములు త్యాగం చేసిన రైతులకు జరుగుతున్న లాభం ఏమిటీ? కనీసం ఈ మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా ఎందుకు తీసుకోలేదు? (6) విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ పెడితే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పర్యావరణ మార్పులతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో డేటా సెంటర్ ద్వారా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం లేదా? డేటా సెంటర్కు అవసరమైన 2 వేల మెగా వాట్ల విద్యుత్, రోజుకి 80 ఎంజిడి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? దీని ప్రభావం విశాఖ, అనకాపల్లి జిల్లాలపై ఎలా ఉంటుండో పరిశీలించి నిర్ధారణ చేశారా? (7) భారతదేశంలోని 140కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ సర్వీసులు దీనితో అనుసంధానించబడతాయి. తద్వారా పడిపోతున్న ఐటి కంపెనీల లాభాలు తిరిగి పుంజుకోవచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత, అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ సమాచారానికి భద్రత ఏమిటి? ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలు దీనిని దుర్వినియోగం చేయకుండా ఒప్పందంలో ఏమైనా షరతులు ఉన్నాయా? 2023లో పార్లమెంటు ముందుంచిన వ్యక్తిగత డేటా ప్రైవసీ బిల్లు ఇంత వరకు చట్టరూపం తీసుకోలేదు. బడా బటి కంపెనీల ఒత్తిడితోనే దానిని ఆపి ఉ ంచారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రజలడేటా ప్రైవేటు కంపెనీ చేతుల్లోకి పోతున్నది. గూగుల్ డేటా సెంటర్ల ద్వారా పౌరుల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం రాదా? అనేక దేశాల్లో ప్రభుత్వ డేటా ప్రభుత్వంరంగ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు. మనదేశంలోనూ సి-డాక్, ఎన్ఐసి వంటి సంస్థలున్నాయి. ఇప్పుడు ప్రయివేటు ఐటి కంపెనీలు లాభాపేక్షతో వాటిని ఆక్రమిస్తున్నాయి. ప్రభుత్వమే అవసరమైన డేటా సెంటర్లు పెడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల, ప్రభుత్వ డేటాకు భద్రతా ఉంటుంది. పై అంశాలను సమగ్రంగా పరిశీలించి నిష్ణాతుల అభిప్రాయాలు, అంతర్జాతీయ అనుభవాలు తీసుకొని ప్రజలకు నష్టంకాని రీతిలో గూగుల్ డేటా సెంటర్పై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉద్యోగభద్రతకు కంపెనీల నుండి గ్యారెంటీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఖమ్మం

నేలకొండపల్లి మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ డిమాండ్

పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి నేల కొండపల్లి మండలం నేలకొండపల్లి మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. కొత్తకోత్తూరు గ్రామ రైతు మాలోతు హనుమా పొలాన్ని సందర్శించిన ఆయన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ లభిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయ స్థిరీకరణ, మెరుగైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా నాయకులు కళ్యాణం నాగేశ్వరరావు, సయ్యద్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఇప్పగూడెంవాసులకు తప్పని ఇక్కట్లు

• బురదమయంగా కాలనీలు.. పట్టింపులేని పాలకులు.. • గృహ సముదాయాల మధ్య నిలిచిన మురుగునీళ్లు ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు ఇప్పుగూడెం రెండో వార్డులో గృహ సముదాయాల మధ్య నిలిచిన మురుగునీళ్లు స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 26 (తెలుగు గళం): మండలంలోని ఇప్పగూడెం గ్రామం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గ్రామమైన ప్పటికే అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉంది. అందుకు నిదర్శనం గ్రామంలోని పలు వీధుల్లోని రోడ్ల దుస్థితే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని 1, 2, 3వ వార్డుల్లోని పలు రోడ్లు పూర్తిగా బురదకూపంగా మారి అటుగా వెళ్లే వారు కాలు తీసి కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామంలోని పాత నుంచి రంగరాయ గూడెం గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. గుంతల్లో నీరుచేరడంతో రోడ్డు మీదుగా నడిచే వాళ్లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2వ వార్డులోని గృహ సముదాయాల మధ్య నెలకొన్న బురదకూపం కుంటను తలపిస్తోంది. చుట్టు పక్కల గృహాల వారు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. అనేక రోజులుగా నీళ్లు నిల్వగా మారి ఉండడంతో దుర్గందం వస్తుందని సమీప గృహాలకు చెందిన వారు వాపోతున్నారు. గ్రామంలోని కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లే రోడ్డు పైన మోకాలు లోతు బురద ఏర్పడడంతో వాహనదారులు రోడ్డుమీదుగా వెళ్లేందుకు నరకయాతన పడుతు న్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని రోడ్ల అభివృద్ధి పైన, గృహ సముదాయాల మధ్య నిలిచిన నీళ్లు తొలగించే చర్యలు చేపట్టేలా దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అనకాపల్లి

తీవ్ర వాయుగుండంగా మొoధా తుపాన్

అనకాపల్లి జిల్లా అక్టోబర్ 26 పున్నమి న్యూస్ ప్రతినిధి: అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు 27.10.2025 నుండి 29.10.2025 వరకు అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను హెచ్చరిక కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇట్లు జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి

ఖమ్మం

ఖమ్మంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత కనమర్లపూడి ఉపేందర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి ఇంట్లోనే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని జిల్లా నాయకులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవి కుమార్, నంబూరి రామలింగేశ్వరావ్, ఈవి రమేష్, విజయ్ రాజు, అల్లిక అంజయ్య, గుత్త వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు

26-10-2025 పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9133469506 *ఫార్మా రైతులు ఎలక్షన్ లో పాల్గొన కూడదని కుట్ర పూరితంగా నామినేషన్లని రిజెక్టు చేశారు* కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ లో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలని తుంగలో తొక్కి ఫార్మా సిటీ ని రద్దు చేయకుండా, రైతుల భూములని ఆన్లైన్ లో ఎక్కించి అన్ని హక్కులు కల్పిస్తామని అప్పుడు మాట ఇచ్చి, గెలిచిన తర్వాత మోసం చేసి, పోలీసులని పెట్టించి భూములు గుంజుకుటుందన్న వాస్తవాలు మొత్తం తెలంగాణ ప్రజలకి తెలియచేయ్యాలని, ఫార్మా రైతులు జూబిలీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో నామినేషన్ వేశారు. నామినేషన్ వెయ్యకుండా కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అనేక అడ్డంకులు సృష్టించారు. అసలు సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్ ఇయ్యటానికి ఇబ్రహీంపట్నం RDO ఆఫీస్ చుట్టు 4 రోజులు తిప్పించుకున్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, సర్టిఫికెట్ ఇచ్చేశానని వారికి అబద్దం చెప్పారు. ఆఖరికి మీరు ఇచ్చేదాక మీ ఆఫీస్ నుంచి కదిలేదు లేదని రైతులు తేల్చి చెప్పాడంతో చేసేది లేక ఇచ్చారు. రైతుల గురించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తూ భయ పెట్టేందుకు ప్రయత్నించారు. అన్ని ఎదురుకుని 21-10-2025 తేదిన రైతులు నామినేషన్ వేశారు. నామినేషన్ రోజునే ఫార్మా రైతులు బంజారా హిల్స్ తాసిల్దార్ ఆఫీస్ వద్ద చేసిన ర్యాలీ, రైతుల ఇంటర్వ్యూలు మొత్తం రాష్ట్ర మీడియా లో హల్చల్ చేసింది. ఫార్మా రైతులు పోటీలో ఉంటే ప్రభుత్వానికి నెగటివ్ ప్రచారం జరుగుతుంది అని, మొత్తం ఫార్మా రైతుల నామినేషన్స్ ని రిజెక్ట్ చేశారు. రిజెక్షన్ కి కారణాలు అడిగితే ఎలక్షన్ నిర్వహణ అధికారులు మీరు ఇచ్చిన అఫిడవిట్ లో “బ్లాంక్స్” అంటే ఖాళీలు ఉన్నాయి అన్నారు. అఫిడవిట్ లో నాలుగు కాలమ్స్ ఉంటే ఒక కాలమ్ లో రాసిన మేటర్ ఎక్కువగా ఉండి పక్క పేజీలో ఆ కాలమ్ లో మేటర్ ఉండి, మిగతా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇది కంటిన్యూ అయినదే తప్ప ఖాళీలు కావు. ఇదే విధమైన ఖాళీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇచ్చిన 4 అఫిడవిట్స్ లో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఫిడవిట్స్ అన్నిటీలో కూడా ఇలా ఖాళీలు ఉన్నాయి. అయన వన్నీ కూడా accept చేశారు. దీపక్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ఒక దాంట్లో అయితే ఆయన ఫోటో కూడా లేదు. అది కూడా accept చేశారు. కానీ బ్లాంక్స్ ఉన్నాయని ఫార్మా రైతుల నామినేషన్ రిజెక్టు చేశారు. ఇదే కారణం చెప్పి RRR రైతుల నామినేషన్స్ అన్ని రిజెక్టు చేశారు. ఇది ఖచ్చితంగా కుట్ర పూరితంగా జరిగింది. ఈ విషయం గురించి మేము జనరల్ అబ్సర్వర్ , అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమీషనర్, న్యూ ఢిల్లీ ఫిర్యాదు చేసాము. ఒక పక్క రాహుల్ గాంధీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ప్రజా స్వామ్యాన్ని రక్షిస్తాను అని అంటారు. మరీ వాళ్ళ ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇట్లు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ

ఖమ్మం

భూక్యా విజయ్‌ను పరామర్శించిన బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్‌పై 18వ తేదీన జరిగిన దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆదివారం నాడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రక్ష హాస్పిటల్‌లో ఆయనను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పిన ఆయన, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నంబూరి రామాలింగేశ్వరరావ్, గుత్త వెంకటేశ్వర్లు, ఈవి రమేష్ రుద్ర ప్రదీప్, విజయ్ రాజు బీజేపీ నాయకులు ఆయనతో కలిసి ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లక్ష దీపోత్సవానికి విపీఆర్ దంపతుల అంకురార్పణ

విపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 6, 7, 8 తేదీలలో నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జరగబోయే లక్ష దీపోత్సవ మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు హాజరై గుంజ ప్రతిష్ట చేసి అంకురార్పణ నిర్వహించారు. లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాన్ని లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు కంచర్ల భాస్కర్ శర్మ, ఆమంచర్ల ప్రభాకర్, విజయసారధి, సునీల్ మరియు వారి మిత్ర బృందం నేతృత్వంలో విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో భక్తి దీపం వెలిగేలా, సమాజంలో శాంతి, ఐక్యత, ఆధ్యాత్మికత ప్రసరించేందుకు ఈ దీపోత్సవం ఒక ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.