Saturday, 7 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

స్కూటర్ ప్రమాదంలో గాయపడ్డ అరవ ఉషకు ఏపీ హంస పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

18.02.2026 నెల్లూరు, స్కూటర్పై నుండి పడి తీవ్రస్థాయిలో ప్రమాదం జరిగి, మినీ బైపాస్, యెనెల్ హాస్పిటల్ నందు అత్యవసర వైద్యం తీసుకుంటున్న 104 సేవల ఉద్యోగుల మాజీ జిల్లా అధ్యక్షురాలు, డీఈవో అర్బన్ హెల్త్ సెంటర్ పడారుపల్లి అరవ ఉషా గారిని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు పరామర్శించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీనియర్ డిఈఓ గా వ్యవహరించి అన్ని విభాగాల్లో సేవలు అందించి ఉన్నతాధికారులు మన్ననలు పొందిన ఉష గారు వారి సోదరుడు బైక్ పై వస్తూ బీపీ లెవెల్స్ పెరిగి తీవ్ర యాక్సిడెంట్ కాబడి కోలుకుంటున్న ఉషా గారిని ఏపీ హంస నాయకత్వం పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, అత్యవసర వైద్యం కోసం జిల్లా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల తరపున తర 25000/- రూ.లు జిల్లా అధ్యక్షులు సాయి తేజ అందించిన సందర్భంగా కష్టకాలంలో ఆదుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు, యాక్సిడెంట్ కారణంగా పలు సర్జరీలు చేసినందున ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఉష గారికి మరి కొంతమంది సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పడారుపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చక్రవర్తి ఏపీ హంస గౌరవ సలహాదారులు పరిమళ, జిల్లా పబ్లిసిటీ సెక్రెటరీ మజాహర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు యస్. సాయి తేజ, జిల్లా మాజీ ఫ్లోరోసిస్ అధికారి డాక్టర్ శ్రీనాథ్, సి ఓ వెంకటయ్య, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

రామచంద్రపురం మండలంలో జరిగే తిరుపతి జిల్లా బిజెపి పార్టీ కార్యశాల సమావేశం జరగనున్నట్లు మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు తెలిపారు.

బుధవారం మండలంలోని బిజెపి నాయకులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యశాల సమావేశం ఏర్పాట్లు చర్చించారు. రామచంద్రపురం 18 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం రాయల రాయల కట్ట దిగువన రాయల మండపంలో మండల బిజెపి పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం మండలంలోని సి రామాపురంలో తిరుపతి జిల్లా కార్యశాల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల బిజెపి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు ప్రముఖులు వస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిగే సమావేశం మండలంలోని బిజెపి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసే జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. Uploaded Video:

తిరుపతి

వేడుకగా విజయ గణపతి అభిషేక పూజలు*

స్వయంగా నిర్వహించిన ట్రస్టు చైర్మన్ MRR తిరుపతి రూరల్, పిబ్రవరి 18 పున్నమి ప్రతినిధి తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. నేడు పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.

తిరుపతి

వేడుకగా విజయ గణపతి అభిషేక పూజలు*

స్వయంగా నిర్వహించిన ట్రస్టు చైర్మన్ MRR తిరుపతి రూరల్, పిబ్రవరి 18 పున్నమి ప్రతినిధి తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. నేడు పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.

News

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల…..అర్థశాస్త్ర విభాగం వారి KCP షుగర్ కంపెనీ సందర్శన….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అర్థశాస్త్ర విభాగం వారు కేసీపీ షుగర్ కంపెనీని సందర్శించారు….. బీ ఏ(ఎకనామిక్స్) ప్రధమ సంవత్సరం మరియు బీ ఏ(పొలిటికల్ )రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్ధశాస్త్ర విభాగా ధిపతి డి. అరుణ, డా. M సునీత పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డా. వి. వి. యస్ కుమార్ సార్ విద్యార్థులను అభినందించారు

తిరుపతి

నిరుపేద నూతన వధూవరులకు జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా గత 20 ఏళ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కొనసాగించారు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద నూతన వధూవరులకు ఆర్థిక చేయూతను అందించారు. ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా స్వామివారి కళ్యాణం సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు కాబోయే 48 మంది నూతన వధూవరులకు ఉచితంగా బంగారు తాళిబొట్లు, నూతన వస్త్రాలను ముఖ్యఅతిథిగా ఎంపీ మద్దెల గురుమూర్తి పాల్గొని నూతన వధూవరులకు బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. గత రెండు దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాల్లో పెళ్లి వేడుకలకు అండగా నిలవడం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,,ఉన్నం వాసుదేవ నాయుడు (ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి), శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్,మున్నా రాయల్,బుల్లెట్ జయ శ్యామ్ రాయల్, కొల్లూరు హరి నాయుడు,ఫజల్,రామచంద్ర రెడ్డి,లీల,జూమ్లేష,పెరుమాళ్ చౌదరి, కంచి గురవయ్య, అడ్వకేట్ శేఖర్,లక్ష్మీపతి, కాణిపాకం సురేష్, కుమారు, జిలాని, లక్కమనేని కృష్ణ, ప్రెస్ శేఖర్, బాలిశెట్టి శేఖర్, యోగ యాదవ్, ఆర్ట్ మని, పాలమంగళము రవి, జీవీకే రెడ్డి, జై కృష్ణ, మనీ, మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యకు శ్రీనివాసుని పట్టువస్త్రాలు సమర్పణ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి విచ్చేసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలసి శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి వేళ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కూడిన ఈ పట్టువస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చిందని ఆ ఆదిదంపతుల కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి చైర్మన్, సభ్యులు, కూటమి నాయకులు పాల్గొని స్వామివార్లను సేవించుకున్నారు.

తిరుపతి

ప్రకృతి వ్యవసాయంతో ఆహారా విషతుల్యతను అరికడదాం.. మాజీ ఏమ్మెల్యే యస్.స్సీ.వి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తిలో భూ అమృత్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారి ఏపీఎస్ సిడిఎల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శివశంకర్, రాష్ట్ర అటవీ శాఖ సలహాదారు అంకారావు, మాజీ శాసనసభ్యులు ఎస్ సీ వి నాయుడు హాజరయ్యారు. గ్రామీణ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్ నాయుడు, హరిబాబు నాయుడు బృందం ఆధ్వర్యంలో భూ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల పై అవగాహన సమావేశం జరిపారు. ఈ సందర్బంగా ఎస్ సి వి నాయుడు మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రకృతి సంపద ఏ ఒక్కరి సొంతం కాదనేది పరమేశ్వరుడు తెలియజేశారని వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో విషతుల్యం కానీ ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవాలని బావి తరాలకు ప్రకృతి సంపదలు అందించాలన్నారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ సలహాదారు అంకారావు మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో చేపట్టిన గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిలో వివిధ రకాల మొక్కల ఆవశ్యకత, వాటిలో ఉన్న ఔషధ గుణాలను వివరించారు. ప్రతి ఇంటిలో లోపల తులసి వెలుపల వేపచెట్టు ఉండాలని, ఊరిలో రావి చెట్టు, ఊరి వెలుపల మరి చెట్టు ఉండాలన్నారు. పంచభూతాలను కలుషితం చేస్తే సమాజం నష్టపోతుందని, ప్రకృతిని కాపాడుకుంటూ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. కలుపు మొక్క వయ్యారి బొమ్మ ఎలా నివారించాలో వివరించారు. గ్రామీణ పరిశోధకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఐఏఎస్ అధికారి తిరుపతి ఏపీఎస్ డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి అంటే ప్రకృతి సంపద భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని సంపదంటే ఆరోగ్యమేని ఆ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కలుషితం లేని ఆహారం కావాలంటే భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతుల లో మార్పు కోసం ప్రయత్నించాలన్నారు. గ్రామీణ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేయాలని అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను గ్రామీణ శాస్త్రవేత్తల బృందం, ఎస్ సి వి దిలీప్, స్థానిక రైతు నాయకులు ఘనంగా సత్కరించారు.

తిరుపతి

ముక్కంటికి కాణిపాకం వినాయకుని ‘పట్టు’ కానుక

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నాడు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం, స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కాణిపాకం దేవస్థానం తరఫున శ్రీకాళహస్తీశ్వరునికి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం నాడు కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. పెంచల కిషోర్, ఆలయ అర్చకులతో కలసి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. వారికి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈ పట్టు వస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో కాణిపాకం నుండి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు విశేష వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య వేడుకను వీక్షించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం ముగిసినా, బ్రహ్మోత్సవాల సంబరాలు శ్రీకాళహస్తి మాడ వీధుల్లో ఇంకా మిన్నంటుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్పవనాలుగా మారిన ఆలయ ప్రాంగణాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి.

తిరుపతి

జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ రోజున సన్నిధి వీధి శివయ్య గోపురం దగ్గర గల రామ మందిర ప్రాంగణం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగమ కుల కమిటీ సభ్యులు మరియు జంగమ కులస్తులు గత 10 సంవత్సరములుగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నదని వారు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.