Friday, 20 March 2026

Blog

రంగారెడ్డి

* మోదీ చిత్రపటం తొలగింపు బడంగ్‌పేట్‌లో అలజడి! –కమిషనర్ వ్యవహారం పూర్తిగా వివక్షపూరితం – బీజేపీ నాయకుల గగ్గోలు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని కమిషనర్ తొలగించడం, అలాగే ఆయన జన్మదిన శుభాకాంక్షల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటలు పూర్తికాకముందే తొలగించడంస్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి దారితీసింది బీజేపీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు కలిసి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసిన మోదీ చిత్రపటాన్ని అకస్మాత్తుగా తొలగించడం పూర్తిస్థాయి రాజకీయ వివాదానికి కారణమైందికమిషనర్ వ్యవహారశైలికి వివక్షాత్మక వైఖరికి తీవ్ర నిరసనగా, స్థానిక ప్రజలు మరియు బీజేపీ నాయకులు కలిసి బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మోదీ చిత్రపటాన్ని మళ్లీ ఏర్పాటు చేశారు.దేశ ప్రధానమంత్రిపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం సహనం చెరిపేసే చర్య అని అన్నారు కాంగ్రెస్స్ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్న కమిషనర్ బీజేపీ ఆరోపణ మోదీ ఫ్లెక్సీలు 24 గంటలు పూర్తికాకముందే తొలగించగా, ఇతర నాయకుల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలాగే ఉంచడం పరిపాలనలో పాక్షికతకు బహిరంగ నిదర్శనం అని బీజేపీ మండిపడింది.బీజేపీ బడంగ్‌పేట్ అధ్యక్షులు రాళ్ళగూడం రామకృష్ణారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంయుక్తంగా పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ నిష్పాక్షిక అధికారిలా కాకుండా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడులకు లోనై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ చిత్రపటం తొలగించడం, ఫ్లెక్సీలను వేగంగా తొలగించడం దేశ ప్రధానమంత్రికి చేసిన అవమానం. ఇలాంటి చర్యలను ప్రజలు సహించరు అని పేర్కొన్నారు.ఎవరి ఆదేశాలపై మోదీ చిత్రపటం తొలగించబడింది? ఫ్లెక్సీలపై సమాన నిబంధనలు ఎందుకు అమలు చేయలేదు? కమిషనర్ నిష్పాక్షికత ఎక్కడ? పరిపాలనలో నిష్పాక్షికత తప్పనిసరి బీజేపీ హెచ్చరిచింది దేశ ప్రధానమంత్రిపై ప్రజల గౌరవానికి భంగం కలిగించే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ తీవ్రంగా పేర్కొంది.భవిష్యత్తులో ఇలాంటి వివక్షాత్మక చర్యలు పునరావృతం కాకుండా అధికారులు నిష్పక్షికంగా పనిచేయాలని బీజేపీ స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్,ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, ముళ్లిధర్ రెడ్డి,సీనియర్ నాయకులు రేసు నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు క్యారాగారి అరవింద్,అగ్రిసెట్టి సైదులు ఏ. యాది రెడ్డి,రామాచారి, మురళీధర్ రెడ్డి, సతీష్ నంద, కిరణ్ రాజ్ మధుతేజ అఖిల్, కృష్ణ యాదవ్, మల్లేష్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* పేద వారి కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇల్లు..చిగిరింత పారిజాత *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని కుర్మలగూడ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు లబ్ది పొంది నూతనంగా నిర్మించిన కుర్మల్ గూడ కి చెందిన లబ్ధిదారుడు గిరి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద వారి కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. పేదల ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఎన్నడు పేదలను పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, గిరి ముదిరాజ్, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సహకార సంస్థలు సహకారం –పోచంపల్లి కో- ఆపరేటివ్ బ్యాంకు లో 72వ సహకార వారోత్సవాలు –చైర్మన్ తడక రమేష్ సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సహకార సంస్థలు సహకారం అందిస్తున్నాయని చైర్మన్ తడక రమేష్ సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ అన్నారు పోచంపల్లి కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కేంద్ర కార్యాలయం నందు 72వ సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సహకార వారోత్సవ జెండాను బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. తదనంతరం సహకార గీతాన్ని ఆలపించడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సహకార సంస్థలు విశేష తోడ్పాటు నందిస్తున్నాయని సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తడక రమేష్, వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం ఏలె హరిశంకర్, సూరిపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కాన కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, మేనేజర్ రచన, శ్రీనివాస్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

రంగారెడ్డి

* మహేశ్వరం నియోజకవర్గంలో కె ఎల్ ఆర్ విస్తృత పర్యటన —జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ విజయంపై ఆనందోత్సవాలు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. తొలుత ఉదయమే కార్యాలయానికి చేరుకున్న కిచ్చెన్న… ప్రజాసమస్యలు, పార్టీ సంస్థగత ఎన్నికలు, జూబ్లీహిల్స్ విజయంపై హస్తం నేతలతో చర్చించారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన నాయకులను అభినందించారు.అనంతరం మహేశ్వరం మండలం ఎన్ డి తండాలో గ్రామపంచాయతీ బిల్డింగ్ కు భూమి పూజ చేశారు.అమీర్ పేటలో కొలువై ఉన్న విశిష్ట దేవాలయం శ్రీ వేంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవదేవుడికి పూజలు చేశారు.ఇమామ్ గూడ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ కార్యకర్త వివాహానికి హాజరయ్యారు.సాగర్ హైవే రాగన్నగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎ వి ఎస్ హాస్పటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.గుర్రంగూడలో కాంగ్రెస్ సీనియర్ నేత గుర్రం లక్ష్మారెడ్డి గుండెపోటుతో మరణించటంతో నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తర్వాత తుక్కుగూడ కార్యాలయానికి చేరుకుని త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలపై నేతలతో సుధీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ

జనగామ జిల్లా కేంద్రం లో ఐక్యత ర్యాలీ

బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారి సూచన మేరకు దేశ తొలి హోమ్ శాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లో కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఐక్యత ర్యాలీ లో బిజెపి నాయకుల కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది పాటుగా పాల్గొనడం జరిగింది

రంగారెడ్డి

* ప్రజలందరిపై గోవిందుడి అనుగ్రహం ఉండాలి: కేఎల్ ఆర్ –శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న లక్ష్మారెడ్డి* –అమీర్ పేట గ్రామస్తులు కేఎల్ఆర్ కి ఘన స్వాగతం పలికారు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్ పేట గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్తీకమాస శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకోవటం అదృష్టమన్నారు. స్వామివారి అనుగ్రహం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సహా కాంగ్రెస్ నాయకులు కెఎల్ఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య సత్తినేని వెంకట్ రామ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కందుకూరు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగా రెడ్డి మహేశ్వరం మార్కెట్ కమిటీ సభ్యులు,కందుకూరు మండలం,మహేశ్వరం గ్రామీణ పట్టణ అధ్యక్షులు లాజర్, మహేశ్వరం నియోజకవర్గం లో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్‌పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్‌పెట్ గ్రామ శాఖ అధ్యక్షులు హైతాబాద్ రాజేందర్ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఆవుల రఘుపతి ఇందిరమ్మ కమిటీ సభ్యులు కడల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

ఆర్యవైశ్యుల అభివృద్ధి నా ధ్యేయం పెండ్యాల విజయ్ కుమార్

ఆర్యవైశ్యుల అభివృద్ధి నా ధ్యేయం పెండ్యాల విజయ్ కుమార్ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం అభివృద్దే తన ప్రధాన లక్ష్యమని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పెండ్యాల విజయ్ కుమార్ రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఆర్యవైశ్యులలో తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. ప్రధానంగా అధ్యక్ష ఎన్నికల్లో పెండ్యాల మల్లికార్జున కుమారుడు పెండ్యాల విజయ్ కుమార్, మరొక అభ్యర్థి కామిశెట్టి సత్యనారాయణ ఇరువురు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికలలో పెండ్యాల విజయ్ కుమార్ తప్పక విజయం సాధిస్తాడని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘంలోని నిరుపేదలకు దాతల సహకారంతో ఎంతో సహాయ సహకారాలు అందించాడని అలాంటి వ్యక్తి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఎంతో అవసరం అని అధిక శాతం ఆర్యవైశ్యులు భావిస్తున్నారు. ఆదివారం ఎన్నికలు ముమ్మరంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పెండ్యాల విజయ్ కుమార్ వర్గం కలువ మురళి, భవనాసి మల్లి,గేర్ర సత్యం, జి సుమన్, ఎం శివ, వై హేమంత్, పొన్నూరు నిరంజన్, సి అశోక్, కామిశెట్టి గోపి,జి నర్సయ్య, సాయి, వి మల్లికార్జున, వి సత్య, సోమశేఖర్,కుమార్, పి దశరథ టి సత్య, సి ద్వారక, సి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సతీష్ కుమార్ మృతికి కొవ్వొత్తులతో నిరసన తెలిపిన శాలివాహన సభ్యులు

సతీష్ కుమార్ మృతికి కొవ్వొత్తులతో నిరసన తెలిపిన శాలివాహన సభ్యులు రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరులో నిన్న ట్రైన్ లో ప్రయాణిస్తున్న సతీష్ కుమార్ ను తాడిపత్రి దగ్గర జరిగిన హత్యకు ఎవరు పాల్పడినారు వారిని కఠినంగా శిక్షించాలని నిరసనగా రైల్వే కోడూరు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో టోల్ గేట్ అల్లూరి సీతా సీతారామరాజు విగ్రహం వద్ద మరియు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలియజేసిన రైల్వే కోడూరు శాలివాహన సభ్యులు.

Others

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం.

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం. రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత కళాశాల మైదానంలో ఎస్.జి.ఎఫ్. ఏపీ సెక్రటరీ భానుమూర్తి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని 13 జిల్లాల అండర్-19 బాలబాలికల బేస్బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ NS 25 జట్టులో ఆడే అవకాశం దక్కుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యశోదర, తాసిల్దార్ అమర్నాథ్, సీఐ హేమ సుందర్ రావు, ఎంఈఓ సుందర్ బాబు, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, హెడ్మాస్టర్ ఉమా శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

E-పేపర్

చలో ఢిల్లీ మాల మహానాడు రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ హక్కులు కోసం…

*రాజ్యాంగ హక్కుల సాధన, రాజ్యాంగ రక్షణకై ఛలో ఢిల్లీ* * బుట్టి సత్యనారాయణ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* దూలిమిట్ట : జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యఅతిథిగా *జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ*… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతకైనా పోరాటం చేయాలని, రాజ్యాంగ హక్కులను సాధించడానికే జాతీయ మాలమహానాడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. *డిమాండ్లు:👇🏻* *👉 పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.* *👉 జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.* *👉 శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలి. (నవంబర్ 25న ఢిల్లీలో నిరసన)* *👉 ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలి.* *👉 ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15% నుండి 20% శాతానికి పెంచాలి.* *👉 దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.* *👉 న్యాయస్థానాల్లో రాజ్య సభలో రిజర్వేషన్లు అమలు చేయాలి.* *👉 భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో నాన్- డీటైయిల్డ్ గా విద్యార్థులకు అందించాలి.* *👉 కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేడ్కర్ గారి ఫోటోను ముద్రించాలి.* *👉 బ్యాగరి, కాటికాపరులకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందించాలి.* *👉 ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి.* *👉 రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేల చేయాలి.* లాంటి డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. *నవంబర్ 26న జరిగే ఛలో ఢిల్లీని విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలిని పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో:- సుద్దాల నర్సింలు, పులి కనకయ్య, మన్నె రాజేందర్ , సుద్దాల కర్ణాకర్, బడే రాజు,సుద్దాల బాబు, సుద్దాల చింటూ, సుద్దాల వినయ్ , సుద్దాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.