Tuesday, 5 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు

అనపర్తి — పున్నమి ప్రతినిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంధన పొదుపుతో భావితరాలకు వెలుగు నింపవచ్చని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ ఏఈ వీరభద్రరావు విద్యుత్ ఆదా అవసరాన్ని వివరించారు. పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మల్లిడి పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సినిమా హాల్లలో దోపిడీ…….

సినిమా పేరు తో దోపిడీ చేస్తున్న హాల్ మేనేజ్మెంట్, కోల్డ్రింగ్స్ మార్ప్ ధరలకు కాకుండా వారి ఇష్టానుసారం అమ్ముతున్నారు సినిమా చూస్డం అని వెళ్లిన మధ్య తరగతి జనాల పరిస్థితి ఏంటి?, కోల్డ్రింగ్ 250 ఎంఎల్ బైట 20 రూ కానీ సినిమా హాల్ లో 300 ఎంఎల్ 50 రూ అలాగే ఎన్నో పాప్కార్న్ అని స్వీట్ కార్న్ అని వాటర్ బాటిల్ 20 రూ ఐతే 30 రూ వసూలు చేసి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు వీటో పై కఠిన చర్యలు తీసుకోవాలి లేకుంటే సామాన్య మానవుడు చినిమ చూడాలి అంటే భయపడే రోజులు వస్తాయి, సరదాగా కుటుంబం తో సినిమా చూడాలి అని 500 రూ టికెట్లకు ఖర్చు చేస్తే అదనగా 1000 రూ తినుబండారాలకు మరియు కూల్డ్రింక్స్ కి పెట్టవలసి వస్తుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో 17 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు

నెల్లూరు , డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మందికి జూనియర్ సహాయకులు మరియు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి లభించింది పై పదోన్నతి ఉత్తర్వులు జడ్పీ చైర్ పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ గారు జెడ్పీ సీఈవో గౌరవనీయులు శ్రీ ఎల్ శ్రీధర్ రెడ్డి గారు జడ్పీ డిప్యూటీ సీఈవో గౌరవనీయులు శ్రీ జే మోహన్ రావు గారు చేతుల మీదగా పదోన్నతి ఉత్తర్వులు అందజేసినారు పై పదోన్నతి ఉత్తర్వులు సహకరించిన జడ్పీ చైర్మన్ గారికి సీఈఓ గారికి డిప్యూటీ సీఈఓ గారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన శ్రీ లక్కాకుల పెంచలయ్య శ్రీ వి దేవ ప్రసన్నకుమార్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు

ఆంధ్రప్రదేశ్

రేపే పల్స్ పోలియో::తల్లితండ్రులు మర్చిపోవద్దు

*తల్లితండ్రులు మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు.. *ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను* తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు.. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ ఇన్‌చార్జ్‌గా రూపుకుమార్ యాదవ్‌కు జంగమ నాయకుల అభినందనలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి నెల్లూరు నగర మేయర్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించిన రూపుకుమార్ యాదవ్‌కు బేడ బుడగ జంగమ నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత నగర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథరామయ్య, కల్పం రమేష్, ఉద్దండి అమరలింగం, కందుకూరి అంకలింగం, చేజర్ల సుధాకర్, ఉద్దండి కోటేష్, పంచాక్షరి మల్లయ్య, ముత్యాల పిచ్చయ్య, కల్పం శ్రీనివాసులు, గంధవల్ల ఉమాశంకర్ పాల్గొన్నారు.

హైదరాబాద్

టెట్ విషయంలో ఉపాధ్యాయులకు సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి వేసవి సెలవుల్లోనే శాస్త్రీయంగా ఉంటుంది

*టెట్ విషయంలో ఉపాధ్యాయుల ప్రయోజనం పరిగణలోకి తీసుకోవాలి* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జాయింట్ సెక్రెటరీ ప్రభుత్వానికి డిమాండ్* *పున్నమి ప్రతినిధి 20 /12/ 2025* *🍥రాష్ట్రంలో జనవరి 3 నుంచి 20 నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని అలాగే పేపర్ 3 హిందీ తెలుగు భాషలకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా నిర్వహిస్తే వారికి శాస్త్రీయంగా ఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట జాయింట్ సెక్రెటరీ ఎండి అమీర్ పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఇరవై రోజులుగా రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, సహాయక ప్రిసైడింగ్ అధికారులుగా బాధ్యతను నిర్వర్తించారని,దాని వల్ల టెట్ పరీక్షకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం వారికి లభించలేదని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు సిద్ధమవ్వడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని, అందుకే జనవరి నెలలో జరగనున్న ఈ పరీక్షను వాయిదా వేయాలని వేసవి సెలవుల్లో నిర్వహిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా, సానుకూలంగా ఉంటుందని కోరారు.*

యాదాద్రి భువనగిరి

* సంస్థాన్ సర్పంచిని సన్మానించిన పద్మశాలి కుల నాయకులు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : సంస్థాన్ నారాయణపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోరులో సిపిఐ పార్టీ, బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా విజయం సాధించిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి దంపతుల ని పద్మశాలి కుల నాయకులు అంతా కలిసి షాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్గా గెలిచిన సురపల్లి వెంకటేశం, సింగం కృష్ణ,విడం సాయి కిషోర్ , గర్దాస్ రాఘవేంద్ర, కర్నాటి నవీన్ కుమార్,ఏలే సతీష్,గంజి అంజయ్య, తదితరులు, పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడా ?

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : అల్లందేవిచెరువు గ్రామంలో, అధికార పార్టీ కాకుండా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపించడంలో, చల్లమల్ల క్రిష్ణరెడ్డి హస్తం ఉందా? అవును ఉంది అనే ఆరోపణ వినిపిస్తున్నాయి. రేపే ఎన్నికలు అనే రోజు వరకు ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో తిరిగిన కొంతమంది రెడ్డి నాయకులు ఎన్నికల రోజు కనపడకుండా ఉండటం పలు విమర్శలకు తావిస్తుంది. అదే రోజు చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సత్కారం చేయించుకోవడం వారితో కలిసి ఉన్న ఫోటో పై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. చలమల్ల తీరుపై కాంగ్రెస్ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారు .బీజేపీ పార్టీ సర్పంచ్ గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల క్రిష్ణరెడ్డి సన్మానం చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ? బీజేపీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి కి ఏం సంబంధం ఏమిటని ప్రశ్నార్థకంగా మిగిలింది. చల్లమల్ల బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి నాయకులతో కలిసి ఉండటం నిజమే అయి ఉండవచ్చునని, గెలిచిన బీజేపీ పార్టీ సర్పంచ్ ర్యాలీలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి శాలువాతో సత్కారం చేయించుకోవడంపై రెడ్డి రాజకీయం నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నాగవారిగూడెం , గొల్లగూడెం గ్రామాలకు చలమల్ల సరైన సహకారం అందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మల్లారెడ్డిగూడెం లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సొంతం గ్రామం లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోవడం స్వతంత్ర అభ్యర్థి గెలిపించడంలో చలమల్ల పాత్ర ఉందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. నారాయణపురం మండలంలో ఒక వర్గం ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు తన వర్గం కాకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ అభ్యర్థి నైనా ఓడించడానికి సాయ శక్తులు ప్రయత్నం చేయడం జరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అల్లందేవిచెరువు,లింగ వారి గూడెం, మల్లారెడ్డిగూడెం, చిమిర్యాల, మహమ్మదాబాద్ , కంకణాలగూడెం, ఇలా చెప్పుకుంటూ వెళితే సుమారు 10 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలువనీయకుండా చేసినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటది అనేది వేచి ఉండాలని అంటున్నారు. వివిధ రాజకీయ నాయకులు. సొంత పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఓడించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

E-పేపర్

సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ఆ పదవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ..

పున్నమి ప్రతినిధి: సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ఆ పదవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ.._* _తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) చైర్మన్లు, డైరెక్టర్లతో కూడిన పాలకవర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది._ దీంతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) పాలకవర్గాలను కూడా తొలగిస్తూ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సహకార రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. *_పదవీకాలం ముగింపు.._* _రాష్ట్రంలోని సహకార సంఘాలకు గత ప్రభుత్వం హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి._ _నిబంధనల ప్రకారం ఐదేళ్ల_ _పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. అయితే,_ _పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీరి_ _పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే_ _పూర్తి కావడంతో, ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది._ _రైతు సంక్షేమంలో సహకార సంఘాల పాత్ర.._ _గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక వంటివి. రైతులకు అవసరమైన తక్షణ సాయాన్ని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సాగు అవసరాల కోసం రైతులకు స్వల్పకాలిక , మధ్యకాలిక రుణాలను అందజేయడం చేస్తుంటాయి. వీటితో పాటు.. సొసైటీల ద్వారా సబ్సిడీపై నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతులకు సరఫరా చేస్తాయి. ప్రభుత్వం మద్దతు ధరతో చేపట్టే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో పీఏసీఎస్ కీలక బాధ్యత వహిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వ్యవసాయ అనుబంధ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కూడా దీని బాధ్యత._ *_పర్సన్ ఇన్ చార్జ్ (PIC) పాలన దిశగా.._* _పాలకవర్గాల రద్దు నేపథ్యంలో.. పీఏసీఎస్, డీసీసీబీల నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్ చార్జ్ (Person In Charge) కమిటీలకు లేదా ప్రభుత్వ అధికారులకు అప్పగించనున్నారు. ముఖ్యంగా తొమ్మిది జిల్లాల డీసీసీబీలకు జిల్లా కలెక్టర్లను బాధ్యులుగా నియమించడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో సహకార ఎన్నికలకు మార్గం సుగమం కానుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ సంఘాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది._

తిరుపతి

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 19. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 21 తారీకున జరుగు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు యస్.ఆర్. కాలనిలోని రోటరీ క్లబ్ సభ్యులు, విద్యా జ్యోతి స్కూల్ విద్యార్థులటో కలసి పట్టణంలోని నాలుగు మాడ వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పసుపులేటి పార్థసారథి, సెకరెటరీ పి.సుధాకర్ రోటరీ క్లబ్ సభ్యులు వేణుగోపాల్, డాక్టర్ వెంకటరమణ, కండ్రిగ ఉమా, చంద్రప్ప , వెంకట ముని, గురపచెట్టి, సిద్దులయ్య, ప్రమీల, సదానందం, జనార్ధన్, చెంగరెడ్డి, కృష్ణ కుమార్ ,విజయ్ కుమార్, మేఘదీప్, శ్యామ్, ఇతర సభ్యులు విద్యా జ్యోతి కరస్పాండెంట్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది కృష్ణ, షబ్బీర్, పల్స్ పోలియో అవగాహన ర్యాలీ దిగ్విజయం చేయడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.