Monday, 4 May 2026

Blog

విశాఖపట్నం

కూటమి పాలనలో అభివృద్ధి–సంక్షేమం వేగం: ఎమ్మెల్యే పల్లా

గాజువాక: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ విశాఖను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. జీవీఎంసీ 70వ వార్డు శ్రీనివాస నగర్‌లో సుమారు రూ.6.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి చందు తో కలిసి ఎమ్మెల్యే, నగర మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇందుకు ఇటీవల నగరానికి వరుసగా వస్తున్న ప్రముఖ సంస్థలే కారణమని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు నాయకులు కొయిలాడ శంకరరావు, ఆడారి రామకృష్ణ, కృష్ణంరాజు, జెడ్సి శేషాద్రి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల చౌరస్తాలో గంజాయి పట్టివేత

కందుకూరు చౌరస్తాలో గంజాయి పట్టివేత యువతను వ్యసనాల పాలు చేస్తున్న గంజాయి ముఠా గుట్టును ఎస్ఓటీ, స్థానిక పోలీసులు రట్టు చేశారు. బీహార్ నుంచి గంజాయి తరలించి కందుకూరు ఎక్స్ రోడ్డు సమీపంలో విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపడమే తన లక్ష్యమని సర్పంచ్ సరికొండ పాండు పేర్కొన్నారు.

తెలంగాణ

పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్న: కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ ఎల్ బి సి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు.

విశాఖపట్నం

87వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 18.80 లక్షల జీఎంసీ నిధులతో కొత్త వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటు

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం పరిధిలోని 87వ వార్డు తిరుమలనగర్‌లో తాగునీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడింది. తిరుమలనగర్‌లో కొత్తగా వాటర్ పైప్‌లైన్లు వేయుటకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలనగర్‌లో పాత వాటర్ పైప్‌లైన్ల లీకేజీల కారణంగా జీవీఎంసీ నీరు వృథాగా పోవడంతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రోడ్ క్రాసింగ్ ప్రాంతాల్లో కొత్తగా ఎమ్‌ఎస్ పైప్‌లైన్లు ఏర్పాటు చేయడానికి జీవీఎంసీ నిధుల నుంచి 18 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయించి, పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే తాగునీటి సరఫరాలో మెరుగుదలతో పాటు నీటి వృథా కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, కణితి ఈశ్వరరావు, మల్లా రాము, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, దాలయ్య, ఏటియన్ మూర్తి, కళ్యాణ్ చెక్రవర్తి, విశ్వేశ్వరరావు, పరమానందం, సన్యాసిరావు, తిరుమలనగర్ అసోసియేషన్ సభ్యులు, జీవీఎంసీ వాటర్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు

పోతుగల్ గ్రామ సర్పంచ్ గారైన పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గారు ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి సమస్యలు మౌలిక వసతుల అవసరాలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ తాగునీటి సౌకర్యాలు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ని కోరారు దీనిపైన స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

పెన్షన్ ల కోసం దేశం లోనే అత్యధికం గా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ :మంత్రి కొల్లు రవీంద్ర

బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో సిసి రోడ్లు, రైతు సేవా కేంద్రం, సచివాలయం ఓపెనింగ్ వంటి పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర గనులు, భూగర్భవనరులు,మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం సూపర్ సిక్స్ వంటి పథకాలతో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ, మరోపక్క ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళుతుందని ఆయన అన్నారు. పెన్షన్లకే సుమారు 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడి పథకాన్ని వర్తింప చేస్తుందని, సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని మండలాలు, పంచాయితీలు ప్రభుత్వానికి గెలిపించి ఇస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని, మచిలీపట్నం పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని దానివల్ల అనుబంధ సంస్థలు వచ్చి ఈ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, దానికి అనుగుణంగానే NH216 రహదారిని ఆరువరుసుల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో బాల్య వివాహాలపై అవగాహన..!

డిసెంబర్ 27న అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి: ఏటికొప్పాక గ్రామ హైస్కూల్‌లో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా న్యాయవాది నూకరాజు పాల్గొని బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అవి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించారు. సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, వైస్ సర్పంచ్ సింహాచలం, పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు.

రంగారెడ్డి

* సమస్యలతో సర్పంచ్ లకు స్వాగతం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 27 : గ్రామాలలో సర్పంచ్ పాలకమండలి పరిపాలన లేకపోవడంతో గ్రామాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాలలో గ్రామ సర్పంచులు పాలకమండలి సభ్యులు గ్రామాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. గత సర్పంచులు పాలకమండలి సభ్యులు పదవీకాలం ముగిసిన దగ్గర నుండి గ్రామాలలో సరి అయిన పరిపాలన లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు, అభివృద్ధి పథకాలకు ఇచ్చే నిధులు ఆగిపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుబడింది. గ్రామపంచాయతీలకు కొత్త సర్పంచులు రావడంతో వారికి గ్రామాలలో అనేక సమస్యలు తో పాటు అభివృద్ధి పనులు, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అమలుపరచడంలో కీలకం కానున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం కూడా సర్పంచులు పాలక మండలి సభ్యులే గ్రామాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కానున్నారు. సర్పంచ్ పాలకమండలి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధిలో రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లు పాలకమండలి సభ్యులకు గ్రామాలు స్వాగతం పలుకుతూనే, వివిధ సమస్యలు కూడా స్వాగతం పలుకుతున్నాయి. గ్రామపంచాయతీలలో గత సర్పంచులు పాలక మండలి సభ్యులు పదవీకాలం ముగిసిన తర్వాత, దీర్ఘకాలికంగా గ్రామాలలో పరిపాలన లేక అంతర్గత రోడ్లు, డ్రైనేజీ కాలువలు తీయించడం పరిశుద్ధం పనులను చేయించడం విద్యుదీకరణ పనులు స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం గ్రామాలలో ప్రజలందరికీ కల్పించడం రైతులకు పంటలు పండించేందుకు సాగునీరు అందించడం, యువతకు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలను అందించడం, కొన్ని గ్రామాలలో సరియైన రోడ్లు వసతి లేకపోవడం, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడం, బస్ షెల్టర్ నిర్మించడం, విద్య, వైద్యం, వసతి పేదలందరికీ అందుబాటులోకి గృహం. తీసుకురావడం, కొన్ని గ్రామాలలో కోతుల బెడద వంటి సమస్యలు సర్పంచులకు దర్శనమిస్తున్నాయి. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచులు పాలక మండల సభ్యులు స్థానిక రాజకీయాలతో సంబంధం తీయించడం పారిశుధ్య పనులను చేయించడం విద్యుదీకరణ పనులు, స్వచ్ఛమైన త్రాగు నీటి సౌకర్యం గ్రామాలలో ప్రజలందరికీ కల్పించడం, రైతులకు లేకుండా గ్రామ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ గ్రామాల ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ పదవీకాలంలో గ్రామాలు రూపురేఖలు మార్చాలని గ్రామ ప్రజలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని వారిని మనస్ఫూర్తిగా అభినందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిద్దాం… ( సంగిశెట్టి ధనుంజయ్ 8074058200 )

జనగాం

వృద్ధులకి దుప్పట్లు పంపిణీ చేసిన తెరోజు అమ్మ

గౌరవనీయులు శ్రీమతి తేరోజ్ అమ్మ wife of late శౌ రెడ్డి గారి( సతీష్ కళామందిర్)ఆధ్వర్యంలో మన ఇప్పగూడెం గ్రామపంచాయతీ సిబ్బంది మరియు వృద్ధులకి సుమారు 50 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్ మరియు ఉప సర్పంచ్ లింగన్న బోయిన రాజు గారు మాజీ సర్పంచ్ కత్తుల కట్టయ్య గారు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగన్న బోయిన శ్రీనివాస్ గారు ఆరుట్ల సందీప్ గారు కృష్ణమూర్తిగారు కారోబార్ శ్రీనివాస్ గారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండు కోట్లు రేషన్ నొక్కేసిన దొంగలు

ఉదయగిరి గోడౌన్ అక్కడి ఉద్యోగులే రేషన్ సరుకులు నొక్కేసినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు ఉన్నతాధికారులు ఫిర్యాదు మేరకు అక్కడి కాంట్రాక్టు ఉద్యోగి టెక్నికల్ అసిస్టెంట్ మునాఫ్, డేటా ఇంటర్ ఆపరేటర్ షహీద్, సెక్యూరిటీ రఫీ అరెస్ట్ చేశారు 1.5 రూ కోట్లు విలువైన బియ్యం పంచదార నూనె కందిపప్పు నిందితులు నొక్కేసినట్లు తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో విటి విలువ సుమారు 2.10 కోట్లు ఉంటుందని తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.