Wednesday, 18 March 2026

Blog

తిరుపతి

ఎమ్మెల్యే దంపతుల చెతులమీదుఅగ నూతన హోటల్ ప్రారంభం

శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి పట్టణంలోని జయరామరావు వీధిలో నూతనంగా నిర్మించిన హోటల్ శ్రీ విద్దాత్ ను రిబ్బన్ కట్ చేసి శుభారంభం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మొదటగ హోటల్ యాజమాన్య నిరవహుకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పట్టణానికి తరలివస్తున్న నేపధ్యంలో అటు భక్తులకు, ఇటు స్థానికులకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనం అందించే విధంగా ‘శ్రీ విద్దాత్’ హోటల్ స్థాపన అభినందనీయంఅని శ్రీకాళహస్తి అభివృద్ధి పథంలో ఎలా ముందుకు సాగుతుందో, మీ హోటల్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని, మంచి పేరుతో ముందుకు వెళ్లాలని ఆఅ శ్రీకాళహస్తి స్వామి కరుణ కటాక్షం ఎల్లప్పుడూ మీ పై ఉండాలని ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, హోటల్ యజమానులు, నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రజల్లోకి ‘జనవాణి’: సమస్యల పరిష్కారానికి కొత్త వేదిక

-చిట్వేల్‌లో శుక్రవారం జనసేన కార్యక్రమం ప్రారంభం – ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధ్యక్షతన జరుగనున్న తొలి భేటీ చిట్వేల్, నవంబర్ 27: పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించే లక్ష్యంతో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. చిట్వేల్ మండలంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. -ప్రజా సమస్యలకు నేరుగా పరిష్కారం పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం చిట్వేలిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధ్యక్షతన జరుగనుంది. ప్రజలకు ఎదురవుతున్న చిన్నా పెద్దా సమస్యలకు ప్రభుత్వ స్థాయిలో జాప్యం లేకుండా, నేరుగా ప్రజా ప్రతినిధి వద్దే వినతి పత్రాలు అందజేసి పరిష్కారం పొందే వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ జనవాణి’ ముఖ్య ఉద్దేశమని జనసేన నాయకులు స్పష్టం చేశారు.గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వీధి వెలుతురు సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్, రైతు సంబంధిత ఇబ్బందులు వంటి ప్రజా సమస్యలను వెంటనే నమోదు చేసి, వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది. -ప్రతినెలా జనవాణి ‘జనవాణి’ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే శ్రీధర్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటారనే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక్కరోజుకే పరిమితం చేయకుండా, ఇకముందు ప్రతి నెలా నియమితంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య దూరాన్ని తగ్గించి, పాలనలో పారదర్శకతను పెంచేందుకు జనసేన పార్టీ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్

శిక్షకులకు శక్తివంతం చేసే కార్యక్రమం

రాధాకృష్ణ, గోపికృష్ణ మరియు శరత్ చంద్ర నిర్వహించే ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్‌షాప్వివరాలు: ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్‌షాప్‌లో ముగ్గురు ప్రతిభావంతులైన శిక్షకులు — రాధాకృష్ణ, గోపికృష్ణ మరియు శరత్ చంద్ర — పాల్గొనే వారికి సమర్థవంతమైన బోధన మరియు కమ్యూనికేషన్ కళను నేర్పించనున్నారు. ఈ ప్రాయోగిక కార్యక్రమం బోధనలో నైపుణ్యం, శ్రోతలతో అనుసంధానం మరియు ఫలితాలపై దృష్టి గల శిక్షణా నైపుణ్యాలను పెంపొందించేందుకు రూపొందించబడింది.ఇంటరాక్టివ్ సెషన్లు, నిజ జీవిత ఉదాహరణలు మరియు సమూహ వ్యాయామాల ద్వారా పాల్గొనే వారు నేర్చుకునే విషయాలు:ప్రభావవంతమైన మరియు నేర్చుకునే వారికి అనుకూలమైన శిక్షణా మాడ్యూల్స్ రూపకల్పనస్పష్టతతో మరియు నమ్మకంగా కమ్యూనికేట్ చేయడంవయోజన అభ్యాస సూత్రాలను అమలు చేసి జ్ఞాపకశక్తిని పెంచడంభిన్నమైన అభ్యాస శైలులు మరియు గుంపు డైనమిక్స్ నిర్వహణక్రమం తప్పని అభివృద్ధికి శ్రోతలను ప్రేరేపించడం మరియు ఉత్తేజపరచడంమీ బోధనా పద్ధతిని రూపాంతరం చేయడానికి మరియు మీ సంస్థలో అభివృద్ధికి కారకుడిగా మారడానికి ఈ విశేషమైన శిక్షణా అవకాశాన్ని అందిపుచ్చుకోండి రాధాకృష్ణను సంప్రదించేందుకు 9985501354 నెంబర్‌కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో మెసేజ్ పంపండి.

విశాఖపట్నం

17వ వార్డు ఆదర్శనగర్ లో పలు సీసీ డ్రైన్లు లు మరమ్మతులు

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* 17వ వార్డు ఆదర్శనగర్ లో పలు సీసీ డ్రైన్లు లు మరమ్మతులకు విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కూటమి పరిపాలన లో ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురి కాకూడదు అనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం అని తెలిపారు , వీటికి వ్యయం సుమారు 50 లక్షలు రూపాయిలు అని తెలియజేసారు, ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గేదల లావణ్య నాగరాజు , వార్డు టీడీపీ అధ్యక్షుడు నెక్కంటి సత్తిబాబు, కాళ్ళ శంకర్, జీవీఎంసీ అధికారులు అప్పలనాయుడు , శ్రీ హిత , నాయకులు రాములమ్మ, రామిరెడ్డి , లక్ష్మి, మహేష్, రాము ,కృష్ణ , నరసింగరావు , పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ (CARA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం-ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన‌ జాతీయ దత్తత అవగాహన సదస్సు-2025ను ప్రారంభించిన ఆ శాఖ (MWCD) కార్యదర్శి అనిల్ మాలిక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు ఎ. సూర్య కుమారి, అనితా రామ‌చంద్ర‌న్, CARA సభ్య కార్యదర్శి & CEO భావన సక్సేనా, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్, జువైన‌ల్ వెల్పేర్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు*

విశాఖపట్నం

ఘనంగా కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ◆ అరుణాచలం లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

ఘనంగా కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ◆ అరుణాచలం లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ◆ ఆలయానికి వెండి శఠగోపం, పంచ పాత్ర,ఉద్దరిణి, పళ్లెం బహుకరణ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కుమారుడు కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల అరుణాచల లింగేశ్వర శివాలయంలో బద్రీనాథ్, సుప్రియ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయానికి శఠగోపం,, ఉద్దరిణి, పళ్లెం బహూకరించారు. ఈ సందర్భంగా పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు, కందుల కేదార్నాథ్, స్వాతి దంపతులు, కుటుంబ సభ్యులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కూటమి ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బీసీలకు వెన్నుపోటు పొడిచారూ*

*కూటమి ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బీసీలకు వెన్నుపోటు పొడిచారూ* డాక్టర్ తుళ్ళి చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి *విశాఖపట్నంపున్నమి ప్రతినిధి* చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డంగా మోసం చేసి బీసీలను ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు, బీసీలకు ఎలక్షన్ కి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తుళ్ళి చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభా లో బీసీలు 50 శాతం కంటే ఎక్కువ కాబట్టి బీసీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా బీసీలు అనేక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు ఈ వెనుకపాటు కు కారణం ఏమిటంటే బీసీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక విధానాలు రూపొందించకపోవడం ఒక కారణం. ముఖ్యంగా రాజకీయ పార్టీలు బీసీలు కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. కానీ y s జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బీసీలు కు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చారు. కానీ కూటం ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. అలాగే బీసీలకు తగిన గౌరవం ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. గత ప్రభుత్వంలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను ఓటు బ్యాంకు గా కాకుండా బ్యాక్ బోన్ క్లాసులుగా ఆత్మగౌరవంతో తల పైకెత్తుకునే లాగా చేశారు. గత ప్రభుత్వం2014 నుండి 2019 చంద్రబాబు ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న అవినీతికి వివక్షకు పరాకాష్ట అయిన జన్మభూమి కమిటీల్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు బీసీలు పై ప్రత్యేక శ్రద్ధతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి బీసీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా అవినీతికి అవకాశం లేకుండా చేశారు మన జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో బీసీ కుటుంబాలకు జగనన్న 1. 98 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంత వరకు పదో వంతు కూడా చేయలేదు.లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు మీటింగ్లలో పవన్ కళ్యాణ్ మీటింగ్లలో వాళ్లు చెప్పింది ఏంటి అంటే మా ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిందానికంటే ఎక్కువగా చేస్తావని హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలను నెరవేర్చలేదు. బీసీ రక్షణ చట్టం తెస్తాను అని చెప్పి ఇప్పటికి బీసీ రక్షణ చట్టం మాటే లేదు. బీసీలను ఆర్థికంగా ఆదుకుంటాం అని అన్నారు కానీ వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నారు. బీసీ విద్యార్థిలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మోసం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 50 శాతం పైన బీసీలు ఉన్నారు. మొన్న తుఫాన్ కి ఎక్కువగా నష్టపోయిన బీసీ రైతులను ఆదుకుంటానని చెప్పి ఇప్పటివరకు వాళ్లని ఆదుకున్న దాఖలాలు లేవు. బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలు రుణాల కోసం ఎదురుచూస్తున్న ఆ రైతుల గోడు పట్టదా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రైతు బీమా కూటమీ ప్రభుత్వం కట్టక నష్టపోయిన రైతులకు నష్టపరహారం చెల్లించ కా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు దాదాపు 300 మంది బలవన్ మరణానికి పాలయ్యారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రైతులకు అన్నదాత పథకం కింద వేట 20000 ఇస్తానని చెప్పి రెండేళ్లకు గాను 40 వేలు ఇవ్వాల్సింది పోయి 10000 రూపాయలు ఇచ్చి 30000 ఎగ్గొట్టారు . బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రైతులకు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డు మీద పడేశారు. బీసీ హాస్టల్ లో పరిస్థితి చూస్తే మరీ అద్వానంగా దయనీయమైన పరిస్థితులు లో బీసీ విద్యార్థులు విద్యార్థినిలు బతుకుతున్నారు. అదే జగన్ గారి ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద స్కూళ్ళు హాస్టల్కు పెద్దపీట వేసి నాణ్యమైన విద్యను హాస్టల్ సౌకర్యాలను కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన చూసినట్టయితే బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం కి విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైన సంఘటనలు ఎన్నో చూసాం. ఇదా కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు చూసుకునే పద్ధతి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిల్లలు తినే ఆహారాన్ని గోరుముద్దు కింద స్వయంగా సీఎం జగనన్నే ఎంపిక చేస్తున్న రాష్ట్రం మంది. చదువులే జీవితాలకు వెలుగులని నమ్మాడు కాబట్టే సొంత మేనమామ లాగా బీసీ బిడ్డల కోసం ఎంతో ఖర్చుకైనా వెనకాడ లేదు. అమ్మ ఒడి లబ్ధిదారులు లో 20 లక్షల మంది బీసీ తల్లులు తమ సోదరుడు ఏటా ఇస్తున్న 15 వేల తో ధీమాగా బిడ్డల్ని చదివించారు. ఈ కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి వందనం పథకానికి తూట్లు పొడిచి బీసీ తల్లుల్ని మోసం చేస్తున్నారు. హాస్యాస్పదం ఏంటంటే అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి అది నారా లోకేష్ పథకం లా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాన్ని హాస్యాస్పదంగా తీసుకొని నవ్వుకున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన గణాంకాలు చూస్తే ఒకప్పుడు జగనన్న హయాంలో స్కూళ్లు నో వేకెన్సీ అని గవర్నమెంట్ బడులు గేటుకు పెట్టారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవన తో బీసీ బిడ్డలు కోరిన విధంగా చదువుకున్నారు. పోటీ పరీక్షలకు జగనన్న విద్యున్నతి, విదేశీ చదువులు కు జగనన్న విదేశీ విద్య నిధి అమలు చేశారు. ఇదొక విద్యా విప్లవం బీసీలు బతుకుల్లో విప్లవాత్మక మార్పు కు ఈ పథకాలే నాంది. … జగనన్న తన అక్క చెల్లెమ్మల కోసం వైయస్సార్ చేయూత వైయస్సార్ సున్నా వడ్డీ పథకాలు ఇచ్చి చేయూత ద్వారా 16 లక్షలు మంది కి సున్నా వడ్డీ రుణాలతో, 57 లక్షల మంది బీసీ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యారు. వైయస్సార్ కళ్యాణమస్తు ద్వారా పదో తరగతి చదివిన ఆడపిల్లల పెళ్ళికి 50,000 సాయం, కులాంతర వివాహం చేసుకుంటే 75000 సాయం అందించారు. ఈ కూటమి ప్రభుత్వం అక్కాచెల్లెమ్మలకు బీసీ ఆడబిడ్డలకు ఇస్తానన్న హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఆఖరికి బిసి ఆడ బిడ్డలను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు కూటమి ప్రభుత్వంకు దక్కుతుంది. కోవిడ్ మహమ్మారి వల్ల జీవనోపాధి దెబ్బతిన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైర్లలకు ఏట 10000 రూపాయలు చొప్పున జగనన్న చేదోడుగాచేతికి ఇచ్చారు. 70000 మంది చేనేత కార్మికులకు ఏటా24 వేల రూపాయలు నేతన్న నేస్తంగా అందించారు. మత్స్యకార భరోసా, కల్లుగీత కార్మికులకు బీమా, గొర్రెల పెంపకదారులకు ప్రత్యేక రుణాలు అందిస్తూ కులవృత్తులని ఆత్మగౌరవంతో కొనసాగించేలా అమలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలలో 50% బీసీలకు ఇవ్వడం ఇది ఒక కొత్త అధ్యాయం. ఒక్కసారిగా ఇన్ని లక్షల మంది బిసి యువతి యువకుల్ని గౌరవనీయ స్థానంలో కూర్చోబెట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సాధ్యమైన ఘనత అది ఒక జగనన్నకే సాధ్యం. … బీసీలు చేతికి పాలనా పగ్గాలు అందించింది కూడా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను ఓటర్లుగా కాకుండా పాలకులుగా బలహీన వర్గాల వారు ఉండాలని జగనన్న ఆకాంక్ష. అందుకే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గత రాజకీయ సాంప్రదాయాలకు భిన్నంగా ఎక్కువ మంది బీసీల చేతికి అధికారాన్ని ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో బీసీలకు బీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు చిప్ప చేతికి ఇస్తున్నారు. అధికారంలోకి రాకముందు బీసీల సమస్యలు అధ్యయనానికి ఓ కమిటీ వేసి వారి సూచనలని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చాక బీసీ సమస్యల పరిష్కారానికి శాశ్వత కమిషన్ మరియు 56 బీసీ కార్పొరేషన్లు జగనన్న ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఏం చేశారు. … జగనన్న ప్రభుత్వంలో 15 మంది మంత్రులు 6 గురు లోక్ సభ ఎంపీలు నాలుగురు రాజ్యసభ ఎంపీలు 22 మంది ఎమ్మెల్సీలు బీసీలే అదనంగా సుమారు 90000 మంది బీసీలకు వివిధ ప్రభుత్వ పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్ దేశంలో బీసీల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేసింది ఎవరూ లేరు. వైయస్సార్సీపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లారు. కేంద్రం కులగణన విడుదల చేయాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంతో పోరాడారు 38 బిసి ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రంపై వైఎస్ఆర్సిపి ఒత్తిడి తెచ్చింది రాష్ట్రం లో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదిగిన రిజర్వేషన్లను అమలు చేయాలని చట్టసభల్లో వైఎస్ఆర్సిపి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోరాడారు. కేంద్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీల సంక్షేమానికి లక్ష కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు వైఎస్ఆర్సిపి ఎంపీలు పోరాడారు . ఈ కూటమి ప్రభుత్వం కి ఇవన్నీ ఏం మాత్రం పట్టింపు లేదు ఎంతసేపటికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని దోచుకోవడం పంచుకోవడం ఏ తప్ప బీసీల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ఏ దాఖలాలు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలంతా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు బీసీలంతా కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. కూటమి ప్రభుత్వం

కడప

ప్రకాష్ నగర్ స్మశానం కు సిసి రోడ్డు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ వాసులు గత 50 సంవత్సరాల నుండి స్మశాన వాటికకు కనీసం రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయం విధితమే. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు నాయకుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈసమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి అలాగే కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దృష్టికి స్థానిక ప్రకాష్ నగర్ వాసులు తమ సమస్యను తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి ప్రకాష్ నగర్ స్మశాన వాటికకు రోడ్డును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపినందున, స్థానిక ప్రకాష్ నగర్ టిడిపి నాయకులు సింహం దేవదాసు, తుపాకుల మధు, స్థానిక యువత, ప్రకాష్ నగర్ ప్రజలు కలిసి స్మశాన వాటిక రోడ్డుకు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువనాయకుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విశాఖపట్నం

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్.

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్. – సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం వేయడం జరిగిందని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా సిటీ వెటర్నరీ అధికారి మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోగల 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బంది కి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ టీకాను జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యుల తో కలిసి వేయించడం జరిగిందని తెలిపారు. జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు, శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని సిబ్బందికి ఆదేశించడమైనదని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వీధి కుక్కలకు ఆహారం పెట్టే సమయంలో ఆయా ప్రాంతాలలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించాలని జంతు సంరక్షణ సేవా సంఘ ప్రతినిధులకు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారి డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్, జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యులైన శారద, ప్రమోద్, కుసుమ, శ్రీదేవి, రవి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

భవిష్యత్ వైసీపీ దే* — *వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

*భవిష్యత్ వైసీపీ దే* — *వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* భవిష్యత్ వైసిపి దేనని దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.*రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు*.ఇప్పటికిప్పుడు పోటీ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పార్టీ సంచలనం సృష్టిస్తుందని వెల్లడించారు.*27వ వార్డు అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులను వార్డు, బూత్ కమిటీలో చేర్చినందుకు వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు*. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి *ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపించారు.ఇచ్చిన హామీలను పక్కనపెట్టి తమ సొంత ఎజెండాతో ముందుకు వెళుతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిందని చేశారు. పార్టీ ప్రతిష్టకు పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.