Saturday, 2 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ సేవ పురస్కార గ్రహీత మర్రిపాడు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్

గణతంత్ర దినోత్సవం సందర్బంగా నెల్లూరు నగరం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అధికారి మర్రిపాడు ఈ కార్యక్రమం లో మర్రిపాడు మండలం తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్కు ఉత్తమ సేవ పురస్కారo లభించింది మర్రిపాడు మండలం ప్రజలకు గర్వకారణంగా ఉంది నిలిచింది జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు చేతుల మీదగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను అందుకున్నారు పరిపాలన సేవల్లో నిబద్దత ప్రజలు సమస్యలు పై స్పందించే తత్త్వం పార దర్శకమైన పాలన ముఖ్యంగా సామాన్య ప్రజలు పట్ల చూపుతున్న మనవీయా దృ క్ప దానికి ఈ అవార్డు కు ఎంపికైనట్లు అధికారులు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల

మున్సిపల్ ఎన్నికల ముందు సిరిసిల్ల బి ఆర్ ఎస్ పార్టీకి బిగ్ షాక్

రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్నమి ప్రతినిధి జనవరి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు *కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్, దూస వినయ్ ,గౌడరాజు పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్,నాయకులు మండలసత్యం,గోవిందు రవి, ఆడెపు భాస్కర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గార్లు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి పార్టీలో చేరడం జరిగింది అన్నారు.. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు..

రాజన్న సిరిసిల్ల

మున్సిపల్ ఎన్నికల ముందు సిరిసిల్ల బి ఆర్ ఎస్ పార్టీకి బిగ్ షాక్

రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్నమి ప్రతినిధి జనవరి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు *కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్, దూస వినయ్ ,గౌడరాజు పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్,నాయకులు మండలసత్యం,గోవిందు రవి, ఆడెపు భాస్కర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గార్లు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి పార్టీలో చేరడం జరిగింది అన్నారు.. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు..

విశాఖపట్నం

విశాఖ ఉత్సవ్‌లో జనవరి 30న ముగ్గుల పోటీలు

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 30వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరగనున్నాయి. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయం సూచించింది. ఉత్తమ ముగ్గులు వేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

విశాఖపట్నం

జీవవైవిధ్య పరిరక్షణకు పర్యావరణ విద్య అవసరం – జెవి రత్నం

విశాఖపట్నం, (జనవరి పున్నమి ప్రతినిధి) జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ విద్యను అలవర్చుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. మంగళవారం మద్దిలపాలెంలోని శ్రీ భావన విద్యా నికేతన్, అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవం, అంతర్జాతీయ స్వచ్ఛ విద్యుత్తు దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన విధానం అవలంబించాల్సిన అవసరం ఉందని, క్లీన్ ఎనర్జీ వినియోగంతో వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో గ్రీన్ సోల్జర్స్‌ను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రీన్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా..

తెలంగాణ జనవరి 27 (పున్నమి ప్రతినిధి) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ.. ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ.116మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరపనున్న ఈసీ. ఫిబ్రవరి 12రీ పోలింగ్, దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది

ఆంధ్రప్రదేశ్

” రాచపాళి రత్నావళి ” ఆడియో విడుదల

పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు లోని మినీ టౌనహాలు నందు ‘ రాచపాళి రత్నావళి ‘ పద్యాలు ఆడియో విడుదల మరియు బహుజన మహనీయుల చిత్రపటాల ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేరాయువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ నేటి యువతరానికి మహనీయుల చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది. బహుజనుల చిత్ర పటాలను చూపించడం చాలా సంతోషమని తెలిపారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎ. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు మురళీమోహన్ రాజు, రాచపాలెం ఎంతో అభినందనీయులని వివరించారు. ఈసందర్భంగా సంగీత దర్శకులు దారా సురేష్, గాయకులు ఆకుతోట రమణయ్య లను సత్కరించారు. ఈకార్యక్రమంలో షేక్ రియాజ్ బాషా, అందె శ్రీనివాసులు, పాల జోష్న, అరవ రాయప్ప, మిరియాల రమణయ్య, దయాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కళాకారులు, పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

తెలంగాణ లో మోగిన 116మున్సిపల్, 7 కార్పొరేషన్ ఎన్నికల నగారా

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్) నేటి నుంచి జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 12న ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

E-పేపర్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెల 11న పోలింగ్.. 13న కౌంటింగ్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ నేటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

విశాఖపట్నం

ఆర్‌ఐసీఎస్ విద్యుత్ శాఖ ఉద్యోగి బాలుకి ఘనసన్మానం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సందర్భంగా సత్కారం

విశాఖపట్నం గాజువాక దువ్వాడ : జనవరి పున్నమి ప్రతినిధి ఆర్‌ఐసీఎస్ విద్యుత్ శాఖలో పనిచేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న బాలును జె.ఎన్.ఎం.యు.ఆర్.ఎం కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసుల అవసరాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పగలు–రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరా సమస్యలు, అంతరాయాలపై వెంటనే స్పందిస్తూ సేవలందిస్తున్న బాలును ప్రజలు అభినందించారు. తన విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నందుకే ఆయనకు ఈ అవార్డు దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు ముమ్మిడివరపు రాము, ఈశ్వరరావు, శ్యాము, సంతోష్, వెంకటరమణ, సోమేశ్వరరావు, రాంబాబు, అప్పారావు, శివ తదితరులు పాల్గొని బాలును శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ప్రజలకు నిరంతరం సేవలందించే ప్రతి ఉద్యోగికి బాలూ ఆదర్శంగా నిలుస్తారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.