Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

జీతం కష్టార్జితం… వెంటనే చెల్లించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట స్టీల్ సీఐటీయూ ధర్నా

గాజువాక ఉక్కునగరం డిసెంబర్, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతం కష్టార్జితమని, కార్మికుల హక్కుగా ఉన్న పూర్తి వేతనాన్ని తక్షణమే చెల్లించాలని స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షులు ఎం. జగ్గు నాయుడు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామంటూ జారీ చేసిన సర్కులర్‌ను వెంటనే రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, ఉక్కునగరం కార్మికుల విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి జగ్గు నాయుడు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. రా మెటీరియల్ నాణ్యత లోపాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. ఉత్పత్తి ఆధారిత జీతాల సర్కులర్‌ను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్ మాట్లాడుతూ, యాజమాన్య నిర్ణయాల వల్లే నష్టాలు వచ్చాయని, దానికి కార్మికులను బాధ్యులుగా చేయడం అన్యాయమన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ, వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సీఐటీయూ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులు

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం దేశంలోని సుమారు 500 సంస్థానాల విలీనంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 52 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. యువత వీరి త్యాగాలు, సేవలను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, గుర్రం నూకరాజు, స్వర్ణపుడి రాంబాయి, తమిరె శివప్రసాదరావు, డివి సత్యరావు తదితర టిడిపి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రభుత్వ బడిలో చదివి, అంతర్జాతీయ కొలువులు: చిట్వేలి సోదరీమణుల సంచలనం

-రైతు కుటుంబంలో పుట్టి, ఇంగ్లీషులో దారాళంగా మాట్లాడుతున్న సరస్వతీ పుత్రికలు -కష్టేఫలి నిరూపణ: సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ప్రశంస చిట్వేలి, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అంతర్జాతీయ అవకాశాలు దక్కవనే అపోహలను పటాపంచలు చేస్తూ, చిట్వేలికి చెందిన ఇద్దరు యువతులు తమ ప్రతిభతో ఏకంగా అమెరికన్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ అమ్మాయిలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే, వారు ఏదో ఖరీదైన ప్రైవేట్ లేదా కార్పొరేట్ సంస్థల్లో చదివి ఉంటారని అనుకుంటే, అది పొరపాటే. వీరు చదివింది చిట్వేలి జెడ్.పి.హెచ్.ఎస్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రమే. -సామాన్య కుటుంబం… అసామాన్య లక్ష్యం: చిట్వేలి బ్రాహ్మణ వీధికి చెందిన చెంజి మనోహర (తండ్రి), విజయ (తల్లి) దంపతులకు ముగ్గురు సంతానం: నవీన, భార్గవి, బాలాజీ . రైతు కుటుంబంలో పుట్టిన ఈ ముగ్గురు పిల్లల ఉన్నత విద్యకు పునాది వేసింది ప్రభుత్వ పాఠశాలే. నవీన చిన్నప్పటినుండి చదువులలో దిట్టగా ఉండి, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఆమె తన సోదరి భార్గవికి, తమ్ముడు బాలాజీకి చదువు పట్ల నిరంతరం ప్రోత్సాహం అందించేది.నవీన విద్యార్థి దశలో కరోనా విపత్తు కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఆమె కొన్నాళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తూనే, కరస్పాండెంట్స్ ద్వారా విద్యను కొనసాగించి ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి తిరుపతిలోని ఒకే కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.ప్రస్తుతం నవీన, భార్గవి ఇద్దరూ అమెరికన్ కంపెనీలో సైబర్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే, ప్రైవేటుగా ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్నారు. వారి తమ్ముడు బాలాజీ మధురైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. -తండ్రి పట్టుదలే ప్రధానం: పిల్లల విజయం వెనుక తండ్రి చెంజి మనోహర కృషి ఎంతో ఉంది. చిన్ననాటి నుండి పిల్లలకు చదువుపై ఉన్న మక్కువను చూసి, ఎంత కష్టమైనా సరే ఉన్నత విద్యలు చదివించాలని ఆయన పట్టుబట్టారు. ఎప్పటికప్పుడు మిత్రులతో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని కచ్చితంగా పాటించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. -ప్రశంసల వెల్లువ: ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “కష్టేఫలి. కష్టాన్ని ఇష్టంగా చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని ఈ చిన్నారులు నిరూపించారు. నేటి సమాజంలో ఈ సరస్వతీ పుత్రికలు ఆదర్శంగా నిలిచారు” అని ప్రశంసించారు.వీరి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులకు చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ సేవా సంస్థ తరఫున మరియు చెంజి మనోహర మిత్రబృందం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులు వద్దకే యూరియా దుక్కిపిండి .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అగ్రికల్చర్ రైతులకు అవసరమైన యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మరియు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మాట్లాడుతూ, రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున మొత్తం మూడు విడతల్లో యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ వారి ప్లాంటేషన్ ప్రోగ్రాం …… శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. 15/12/2025….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 15.12.2025వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం వారు సెంట్రల్ బ్యాంక్ వారి సహకారంతో ప్లాంటేషన్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది. 115 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ వారు మన కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తద్వారా కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయవచ్చని పర్యావరణ సమతుల్యతకు మరియు మానవ మనుగడకు చాలా అవసరమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సతీష్ బాబు గారు,రీజినల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎం.ఫణి మాచిరాజు గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంజ్ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ,తిరుమల రావు గారు సీనియర్ మేనేజర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి టీ.నాగరాణి, బ్యాంక్ సిబ్బంది మరియు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అన్నమయ్య

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి నాయకుడు మల్లెం హేమంత్ కుమార్

చిట్వేల్, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన హేమంత్ కుమార్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందిస్తున్న భోజనం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు విద్యపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు! కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు! కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

కామారెడ్డి

గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మానం!

కామారెడ్డి, 15, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గౌడ సంఘం ఘాటుగా సన్మానం! భారీ ఓట్లతో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఎల్లమ్మ ఆలయం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ నాయకుల విజయాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్స వం మండలంలో హాయిగా జరిగింది. గౌడ సమా జం బలం పెరిగింది.సర్పంచ్‌లు మెంబర్లు సంఘం నాయకులతో కలిసి ఫోటోలు! గ్రామీణ అభివృద్ధికి కొత్త ఆశలు! పంచాయతీ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన వీరులకు ధన్యవాదాలు తెలిపారు.

E-పేపర్

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత రైల్వే కోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మరపల్లి) గ్రామ యువత ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం, అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.