Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా…

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా… పున్నమి న్యూస్ ప్రతినిధి 20 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ఓఆర్ సర్వీస్ రోడ్ పక్కన గల ది లాస్ట్ రేట్ యాజమాన్యం గురువారం సాయంత్రం భారీ ఎత్తున ప్లాస్టిక్ నిలువలు కాల్చినట్లు సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు శుక్రవారం ఉదయం హాల్ ప్రాంతానికి చేరుకొని ది లష్ రిట్రీట్ యాజమాన్యానికి 5000 జరిమానా వేధించారు. బై సంఘంగా చెత్త కాల్చడం నిషేధం లో ఉన్నట్లు దీన్ని ఎవరు ఉల్లంఘించిన ఉపేక్షించేది లేదని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత అన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ప్రజలు సహకరించాలని చట్టాల్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు ఘన సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు తెలిపిన : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​

పున్నమి న్యూస్ ప్రతినిధి 20 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​ ‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరు పొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్​ ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీఎస్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​ మహేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ ప్రశంసించారు.

రాజన్న సిరిసిల్ల

ఆటో డ్రైవర్లకు రామన్న ఆత్మీయ భరోసా

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో “రామ్మన్న ఆత్మీయ భరోసా” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో 93 మందికి పైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. సిరిసిల్ల–ముస్తాబాద్ రూట్ ఆటో యూనియన్ అధ్యక్షులు కోటగిరి కనకయ్య మాట్లాడుతూ, వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో KTR అండగా నిలిచారని తెలిపారు. అనంతరం ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించి భరోసా కలిగించారని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉచిత చికిత్స అందించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించిన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మణపల్లె, తుర్కపల్లె, ఆవునూర్ గ్రామాల సర్పంచులు, భారత రాష్ట్ర సమితి BRS గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, యువత సభ్యులు, కార్యకర్తలు మరియు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ డివిజన్ 20 ఫిబ్రవరి 2026 Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ ఇంజాపూర్ ప్రధాన రోడ్ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన Madras Filter Coffee ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువ పారిశ్రామిక వేత్తలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. హయత్ నగర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభమవడం అభినందనీయమని, వ్యాపారం మరింత అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. దుకాణ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు కూడా స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని కోరారు,ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. హయత్ నగర్ డివిజన్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ వహీద్దుద్దీన్ రహమాన్ ఎన్నిక

విజయవాడ, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కార్యవర్గంలో నెల్లూరు జిల్లా డివిజనల్ సబ్ ట్రెజరీలో సహాయ ఖజానా అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీ సయ్యద్ వహీద్దుద్దీన్ రహమాన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై సహచర అధికారులు, సిబ్బంది, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని రహమాన్ గారు తెలిపారు. సభ్యుల సంక్షేమం, సేవా నాణ్యత పెంపు దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

సాహితీ

“ప్రకృతి సంగీత శ్వాస – మాతృభాష” – డాక్టర్ బద్రి పీర్ కుమార్

బంగ్లా భాషా ఉద్యమం మరియు మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది యునెస్కో. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతామని యునెస్కో భావించి ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించడం వలన 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మాతృ భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. రాష్ట్రం ఏదైనా దేశం ఏదైనా తల్లి నుండి బిడ్డకు సంక్రమించే అమృతభాష మాతృభాష. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ కవిత *అం* అంతరంగ భావతరంగఘని *త* తరగని సుసంపన్న ధ్వని *ర్జా* జాతి చరిత్రరీతి ప్రకాశిని *తీ* తీరు మారని అనుబంధ ఆమని *య* యవ్వనానంద సరాగిణి *మా* మానవత్వ మధుర భామిని *తృ* తృణముకాని త్రికాలమణి *భా* భావవ్యక్తీకరణ సంస్కరిణి *షా* షాన్మయం జనలోకాభినయం *ది* దివ్యమైన ప్రకృతిలో శ్వాసగ *నో* నోటిబాటలో విహరిస్తున్న హృదయమాధురి *త్స* ఉత్సవశోభతో కదలాడే కమనీయ భావసిరి *వం* వందనం అభినందనం భాషామతల్లికి సదా నీరాజనం ఆత్మీయ అర్థాంశాల సూచకం పరవశించు జీవుల మనో నేత్రదాయకం స్పందించు మానవ హృదయ జ్ఞాపకం సాక్షాత్ ప్రకృతి సంగీత సరస్వతి రూపకం – మాతృభాష

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 22న వనభోజన మహోత్సవం

మూలపేట వీరశైవ కళ్యాణమండపంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జంగమ సేవా సంఘం జిల్లా నేతలు మాట్లాడుతూ, ఫిబ్రవరి 22న తోటపల్లి గూడూరు మండలం వరిగొండలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోపూజ, అభిషేకం, మెడికల్ క్యాంప్, కళ్యాణ మహోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనం, వివాహ పరిచయ వేదిక, చిన్నపిల్లలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, జిల్లాలోని జంగమ కులస్తులు భారీగా పాల్గొనాలని కోరారు.

ఖమ్మం

పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ సునీల్ దత్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రికజిల్లా ఇంచార్జి) ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రజా పరీక్షల సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో బి ఎన్ ఎస్ లోని సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగించేందుకు ఈ నిర్ణయం3 తీసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలబడటాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

ఉద్యోగ విరమణ బకాయిలు రాక ఆర్థిక ఇబ్బందులు… రిటైర్డ్ ఎస్సై మృతి

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కూమర్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జ్ ) ఉద్యోగ విరమణ చేసి ఏడాది గడిచినా బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్సైగా సేవలందించిన కె. మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. అయితే ఆయనకు రావాల్సిన సుమారు రూ.50–60 లక్షల ఉద్యోగ విరమణ బకాయిలు ఇప్పటికీ అందకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మైసయ్యతో పాటు ఆయన భార్య భాగ్యమ్మ కూడా అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి వీరిద్దరినీ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భాగ్యమ్మ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మైసయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆయన మృతి చెందారు. ఆసుపత్రి బిల్లుల చెల్లింపులో కుటుంబం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం కొంతమేర బిల్లును చెల్లించి, మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తరలించే ఏర్పాట్లు చేసింది. ఉద్యోగ విరమణ బకాయిలు సమయానికి చెల్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కుటుంబ సభ్యులు, సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం

జైలు నుంచి విడుదలైన పగడాల నాగరాజుకు ఘన స్వాగతం

ఖమ్మం ఫిబ్రవరి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ జిల్లా ఇంచార్జి) ఖమ్మం: గత నెలలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుపై సిట్ అధికారులు చేపట్టిన విచారణను నిరసిస్తూ ఖమ్మం నగరంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైరా నుంచి ఖమ్మంకు వస్తున్న నాగరాజును పోలీసులు అడ్డుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సుమారు 22 రోజులుగా ఖమ్మం జిల్లా జైలులో ఉన్న నాగరాజుకు గురువారం బెయిల్ మంజూరవగా, శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన నాగరాజుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కత్తి శ్రీను, నాగేశ్వరరావు, రాజేష్, తిరుమల రావు పూలపొంగు వెంకట్, ఉపేందర్, రమేష్ సహా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకి పూల మాలలు వేసి ఘనం స్వాగతం పలికారు . నాగరాజు విడుదలతో ఆయన అనుచరుల్లో ఆనందం నెలకొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.