శతాబ్ద కాల చరిత్ర కలిగిన శైవక్షేత్రం
ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం పొనుగుపాడులోని గంగా, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని దేశానికి స్వాతంత్ర్యం రాకముందే భక్తులు నిర్మించారు. 1913లో ఆలయానికి శంకుస్థాపన చేయగా, 1917 ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం మొదటిసారిగా స్వామివారి కల్యాణం జరిపారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 2016లో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న 50 అడుగుల గాలి గోపురం, రాయి ధ్వజస్తంభం భక్తులను ఆకట్టుకుంటున్నాయి.





