Thursday, 12 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థులు

ఉదయగిరి SMGR వ్యవసాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్ధులు ప్రకృతీ పరంగా తయారు చేసిన ఉత్పత్తులను శుక్రవారం పంచాయతీ బస్టాండ్లో స్టాల్ ఏర్పాటు చేశారు అధ్యాపకురాలు డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఎక్పీరియాన్ లర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఆరు నెలలు పాటు విద్యార్థులుకు ఈ శిక్షణ ఉంటుందన్నారు హార్టికల్చర్ విభాగంలో కూరగాయలు పండ్లతో తయారుచేసిన వాల్యూయోటెడ్ ఉత్పతులైన జ్యూస్ కూరగాయలు విక్రయిస్తున్నారు.

కామారెడ్డి

పెన్షన్ పంపిణీలో ఇబ్బందులు….సర్పంచ్ స్వయం ప్రయత్నాలు

కామారెడ్డి 02 జనవరి,( పునమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ త్వరగా పరిష్కరించారు.లబ్ధిదారుల ఇంటి ఆవరణలకు వెళ్లి పెన్షన్ పంపిణీలో జాప్యా లు, ఇతర ఇబ్బందులను తెలుసుకున్నారు. సం బంధిత అధికారులతో మాట్లాడి జాప్యాలు జరగ కుండా చూసినారు.గ్రామంలో ఇటీవల ఆర్థిక సహా యాలు,కార్యక్రమాల్లో బండి ప్రవీణ్ ముందుం డటం ప్రత్యే కంగా గమనార్హం. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్య ల పరిష్కారంలో ఆయన చురు కుగా ఉంటూ గ్రామీణ ప్రజలకు ఆదర్శంగా నిలు స్తున్నారు.ప్రజల సంక్షేమానికి ముందుండే నాయ కుడు అని గ్రామస్తులు కొనియాడారు టెంట్, త్రాగునీరు.. పూర్తి సౌకర్యాలు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, త్రాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హన్మయో ల్ల నవీన్, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సేవలో సదా కట్టుబడి పనిచేస్తున్నారని బండి ప్రవీణ్ పేర్కొన్నారు.

E-పేపర్

అధ్వాన్నంగా మారిన చింతపల్లి గూడా పార్క్. అధికారుల నిర్లక్ష్యంతో చింతపల్లిగూడ పార్క్ పూర్తిగా అస్తవ్యస్తం

పున్నమి ప్రతినిధి: అధ్వాన్నంగా మారిన చింతపల్లి గూడా పార్క్. అధికారుల నిర్లక్ష్యంతో చింతపల్లిగూడ పార్క్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఉక్కుల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ జోనల్, ఆదిబట్ల సర్కిల్, కొంగరకలాన్ డివిజన్ పరిధిలోని చింతపల్లిగూడ పార్క్‌ను ఆయన ఈ రోజు సందర్శించారు. అనంతరం మాట్లాడిన డాక్టర్ ఉక్కుల అశోక్, గ్రామానికి సమీపంలో ఉన్న ఈ పార్క్ ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో పాటు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మరమ్మతులు, నిర్వహణ పనులు చేయకపోవడంతో పార్క్ దయనీయ స్థితికి చేరిందని తెలిపారు. వెంటనే సంబంధిత శాఖలు స్పందించి పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్క్ పరిస్థితిపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు మహేందర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో టూరిజం హోటల్ ప్రారంభిసున్నా మాజీ ఎమ్మెల్యే

ఉదయగిరి ఆనకట్ట సమీపంలో ఏపీ టూరిజం హోటల్ అధునకరించారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు దీటుగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి లో టూరిజం శాఖ హోటలను ఏర్పాటు చేయడం శుభపరిమనన్నారు న్యాయవాదులు రామారావు , షరీఫ్ నిర్వాహకులు తులసి రామ్ , వెంగళ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ

వైజ్ఞానిక పరిశీలన తో సమస్యలకు పరిష్కారం సాధ్యమే: కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) పరిశీలన ద్వారా విషయాన్నీ అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ ను ప్రారంభించారు. శాస్ర సాంకేతిక విజ్ఞానం వల్ల గొప్ప ఆవిష్కరణలు సాధ్యమయ్యాయని, విద్యార్థులు చిన్ననాటి నుంచే పరిశీలన అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 284 ప్రదర్శనలో జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుడితి రాజశేఖర్‌కు మరో ఏడాది సర్వీస్ పొడిగింపు

(అమరావతి పున్నమి ప్రతినిధి) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు సర్వీసును పొడిగించింది. వ్యవసాయ శాఖకు ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయనకు అప్పట్లోనూ సేవల పొడిగింపు లభించింది. తాజా నిర్ణయంతో ఆయన వ్యవసాయం, పట్టు పరిశ్రమ, సహకారం & మార్కెటింగ్ శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నెలకు రూ.3.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించనున్నారు.

తెలంగాణ

మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితా పున పరిశీలనకు ఆదేశాలు ఇచ్చిన : కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) మునిసిపాలిటీలో వార్డుల వారీగా ప్రచురించిన ముసయిదా ఓటర్ జాబితాను నూటికి నూరు శాతం పారదర్శకంగా పునః పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. తప్పులు లేకుండా ఇంటి నెంబర్ల వారీగా వివరాలు పరిశీలించాలని, అభ్యంతరాలను ఈనెల 5 వరకు స్వీకరించాలని సూచించారు. ఓటర్ జాబితా పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

కామారెడ్డి

గొల్లపల్లి సర్పంచ్‌కు ఎంపీడీఓ, ఏపీఓల నుంచి గొప్ప గౌరవం

కామారెడ్డి, 02 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నాగేశ్వర్ రెడ్డి , సహాయక పరిశోధక అధికారి (ఏపీఓ) తిరు పతిరెడ్డి లను గొల్లపల్లి సర్పంచ్ అతికెల కిషన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి (హార్దిక స్వాగతం) తెలిపారు. ఈ ఘటన మండల అధికా రులు, గ్రామ నాయకుల మధ్య ఉత్తమ సహకారా న్ని, మర్యాదాబద్ధమైన సంబంధాలను ప్రతి బింబిస్తోంది.ఈ కార్యక్రమం మండలంలో, గ్రామం లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్ కిషన్ యాదవ్ అంకిత భావా నికి గుర్తింపుగా నిలిచింది. స్థానిక ప్రజలు సంతోషి స్తూ, మండలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్ సేవలు గ్రామ ప్రగతికి ముఖ్యమైనవి. మా సంప్రదింపులు ఇకపై మరింత బలపడతాయి” అని తెలిపారు.

నిర్మల్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బైంసా ఆధ్వర్యంలో చారిత్రక క్షేత్ర పర్యటన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా ఆధ్వర్యంలో చారిత్రక క్షేత్ర పర్యటన మహిషాసుర పాదాలు – మహిషా గుట్ట – గట్టు మైసమ్మ ఆలయాల సందర్శన భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చారిత్రక అవగాహన, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం పెంపొందించాలనే మహత్తర లక్ష్యంతో ఈరోజు ఒక విశిష్టమైన చారిత్రక క్షేత్ర పర్యటనను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిషాసుర పాదాలు, మహిషా గుట్ట మరియు ప్రసిద్ధ గట్టు మైసమ్మ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మహిషాసుర పాదాలకు సంబంధించిన పురాణ, చారిత్రక నేపథ్యం, సంబంధించిన ప్రాచీన కథనాలు, ఈ పాదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మహిషాసురుడు ఎవరి చేత వధించబడ్డాడు వంటి అంశాలను చరిత్ర అధ్యాపకులు డాక్టర్ పి. గంగారెడ్డి గారు విద్యార్థులకు సవివరంగా, ఆసక్తికరంగా వివరించారు. చరిత్రను కేవలం పాఠ్యపుస్తకాల పరిమితిలో కాకుండా ప్రత్యక్షంగా ప్రదేశాలను సందర్శిస్తూ తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానపరమైన అవగాహన మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు మహిషా గుట్టపై ఉన్న ప్రసిద్ధ గట్టు మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత, భక్తుల అచంచల విశ్వాసం, ఈ ప్రాంత ప్రజల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి అధ్యాపకులు వివరించారు. మహిషాసుర పాదాలను స్థానిక ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తూ, తరతరాలుగా అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తూ రావడం విశేషమని తెలిపారు. ఇది ప్రజల ధార్మిక నిబద్ధతకు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే భావనకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని గాఢమైన విశ్వాసంతో ప్రార్థనలు చేస్తారని, అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరచుగా ఇక్కడికి వస్తుంటారని అధ్యాపకులు వివరించారు. చారిత్రక ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఈ ప్రాంతం విద్యార్థులకు ఒక జీవంత అధ్యయన కేంద్రంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మహిషాసురుడి పేరుతోనే మహిషా, మాయిస, మైష్య అనే పదాలు ఉద్భవించి, కాలక్రమంలో భైంసా అనే పేరుగా ఈ ప్రాంతం ఏర్పడినట్లు చరిత్ర చెబుతోందని విద్యార్థులకు వివరించారు. ఇది భైంసా పట్టణానికి ఉన్న పురాతన చారిత్రక నేపథ్యాన్ని మరింతగా తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థుల్లో చరిత్ర, పురాణాలు, స్థానిక సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన మరింతగా పెరిగిందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ళ బుచ్చయ్య అనుమతితో ఇంచార్ ప్రిన్సిపల్ కె.రఘునాథ్ డా. భీమారావు డాక్టర్ పవన్ కుమార్ పాండే, డాక్టర్ యం. శంకర్, ఎ.రాజు, డాక్టర్ జాదవ్ ఓం ప్రకాష్, డాక్టర్ సంతోష్ కుమార్,డాక్టర్ నహీదా, డాక్టర్ కల్పన, రామ్మోహన్, రాజయ్య, సురేందర్, కిషన్, శ్రావణ్య, అర్షియా సుల్తానా, ఉజ్మా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సినిమా

తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘అసుర సంహారం’ మూవీ టీజర్ విడుదల

లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సుమారు 750కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తనికెళ్ల భరణి, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ‘విలేజ్ క్రైమ్ డ్రామా’గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తనికెళ్ల భరణితో పాటు మిధున ప్రియ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక విలేజ్ లో డిటెక్టివ్ పాత్ర పోషింసించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్ పార్టులో NRI శబరిష్, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు.” అని చెప్పారు. దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ.. “తనికెళ్ల భరణి గారు ఇందులో ‘విలేజ్ డిటెక్టివ్‌’గా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా గారి సహాకారం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. నటీ, excutive ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా మాట్లాడుతూ… కొన్ని సినిమాల్లో చేసాను. ఇది నాకు పెద్ద సినిమా. నెల్లూరు చుట్టూ షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.” అని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.