మహాదేవి (విభాగం-2)
ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి,మహాదేవుని గుడికి వెళ్లి మహాదేవునితో ఇలా చెప్పింది” ఓ మహాదేవ! ఎందుకు నా భర్తను నాకు దూరం చేశావు, నా కడుపులో ఉన్న నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా” అని మహేశ్వరి మహాదేవునితో చెప్పింది. అలా ఆరోజు అంతా గుడి దగ్గరే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ల కుటుంబ సభ్యులు గుడికి వచ్చి,తనను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులకు మహేశ్వరి ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో మహేశ్వరి తన ప్రాణాలను కోల్పోయింది. మహేశ్వరి కి పుట్టిన పాపను తన తల్లి ఈశ్వరమ్మ వద్ద ఉన్నది. ఆ పాపని ఈశ్వరమ్మ తన ఇంటికి తీసుకు వెళ్ళింది. కొన్ని రోజులకు ఆ పాపకి బారసాల చేసి నామకరణం చేశారు. ఆ పాపకు ‘మహాదేవి’ అనే పేరు పెట్టారు. మహేశ్వరి తన భర్త దేవా జ్ఞాపకంగా ఈ మహాదేవి జన్మించింది అని ఈశ్వరమ్మ భావిస్తుంది. మహాదేవికి అమ్మమ్మ అయ్యిన ఈశ్వరమ్మ మహాదేవికి ఎప్పుడు, ఎక్కడ ఏం కావాలన్నా కొని ఇచ్చేది. కానీ మహాదేవికి తల్లి, తండ్రి లేని లోటు మాత్రం తీర్చలేకపోయింది. కొన్ని రోజులకు మహాదేవి నిద్రలో “ఓం నమః శివాయ” అని తలుచుకుంటూ ఉండేది. ఇది తెలుసుకున్న వాళ్ళ అమ్మమ్మ, మహాదేవిని పూజారి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ పూజారి ఈశ్వరమ్మ తో ఇలా చెప్పాడు” అమ్మ! నీ మనవరాలు శివునికి చాలా ఇష్టమైన భక్తురాలు, ప్రతిరోజు నువ్వు తనను శివుని గుడికి తీసుకు వెళ్ళు, అలాగే తన చేత అభిషేకము నైవేద్యము చేయించు, ఈ పనులు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో, చాలా నిష్టగా చేయించు” అని ఆ పూజారి ఈశ్వరమ్మ తో చెప్పాడు. అప్పటినుంచి ఈశ్వరమ్మ తన మనవరాలు మహాదేవతో రోజు శివునికి అభిషేకం, పూజలు చేయించేది.తన చేత నైవేద్యం కూడా చేయించేది. ఇలా మహాదేవి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మమ్మ చెప్పినది చేస్తూ వచ్చింది. అప్పటికి మహాదేవికి పదేళ్లు వచ్చాయి. అప్పటినుంచి తనకు తాను ఎవ్వరి సహాయం లేకుండా, రోజు శివుడు గుడికి వెళ్లి శివునికి పూజలు చేసే నైవేద్యం వండి తీసుకువెళ్లేది. ప్రతి సోమవారం శివుని గుడిలో శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలు చేసే ముందు రోజు ఆదివారం శివుని గుడిని శుభ్రం చేసి, పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసేది. అలా కొన్ని సంవత్సరాలు తర్వాత మహాదేవి తన చదువును పూర్తి చేసుకొని పెళ్లీడుకి వచ్చింది.









