Thursday, 12 March 2026

Blog

విశాఖపట్నం

జాతీయ రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా 04-01-2026న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడింది. రహదారి మరియు భవనముల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, జీ.వి.ఎం.సి (GVMC), నేషనల్ హైవే విభాగం, ఏపీ ఎస్‌ఆర్‌టీసీ, రవాణా శాఖ, డీఎం & హెచ్‌వో అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నేషనల్ హైవేలు మరియు ప్రధాన రహదారులపై రోడ్ ఇంజనీరింగ్ డిజైన్ మార్పులు, అవసరమైన ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, స్పష్టమైన రోడ్ మార్కింగ్స్, పాదాచారుల భద్రతకు హెచ్చరిక సూచికలు, వేగ పరిమితి బోర్డులు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే రవాణా శాఖ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు నేషనల్ హైవేల్లో ప్రయాణించే ఆటో రిక్షా డ్రైవర్లు, లెర్నింగ్ లైసెన్స్ దారులు మరియు ప్రజలకు రహదారి నియమాలు, వేగ నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై PPT ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.

యాదాద్రి భువనగిరి

శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో ముందుకు –ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం,* –ఎక్కడ అవసరం ఉంటే అక్కడే సర్పంచ్ పాలన –* –ఇదే ప్రజలకు కావాల్సిన నిజమైన నాయకత్వం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03: సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం.శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

యాదాద్రి భువనగిరి

శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో ముందుకు –ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం,* –ఎక్కడ అవసరం ఉంటే అక్కడే సర్పంచ్ పాలన –* –ఇదే ప్రజలకు కావాల్సిన నిజమైన నాయకత్వం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03 :సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం. శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

రాజన్న సిరిసిల్ల

మహిళ విద్యకు బాటలు వేసి సమాజ సేవకు అంకితమైన మహానీయురాలు సావిత్రిబాయి పూలే

ఈరోజు ముస్తాబాద్ మండలంలో నామాపురం గ్రామం చౌరస్తా ప్రాంగణం లో ముదిరాజు సంక్షేమ సంఘం ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె సేవను కొని ఆడారు రాజన్న సిరిసిల్ల జిల్లా బి సి డబ్ల్యూ అధ్యక్షులు దిశ బిక్షపతి మాట్లాడుతూ దేశంలో మహిళా విద్యకు బాటలు వేసిన భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలని మరియు సామాజిక సంఘసంస్కర్త అని భారతదేశంలో ఉన్న కుల వివక్షత లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి దేశంలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన మహానీయురాలను ఆమెను కొనియాడారు బాలికల విద్య సమాజ అభివృద్ధికి ముఖ్యమని నమ్మి ఎన్నో ఆటంకాలు అవమానాలు ఎదుర్కొని పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు వెలుగు అందించిన పుణ్యమూర్తి మహిళ సావిత్రిబాయి పూలే గారు మాట్లాడుతూ విద్య ద్వారా మాత్రమే సమానత్వం స్వేచ్ఛ ఆత్మగౌరవం సాధ్యమని ఆమె చూపిన మార్గమే నేటి తరానికి స్ఫూర్తి దాయకం ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మన అందరి బాధ్యత అంటూ వారి సేవల్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిమ్మల చంద్రం రాజుగారు దేవయ్య శ్రీనివాసు నామాపూర్ ఉప సర్పంచ్ తాడేపు కొమురయ్య ముదిరాజ్ సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులు పిట్ల విట్టలు గారు అధ్యక్షులు రాంగోపాల్ గారు పుల్లూరి రవి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకు

మహాదేవి (విభాగం-2)

ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి,మహాదేవుని గుడికి వెళ్లి మహాదేవునితో ఇలా చెప్పింది” ఓ మహాదేవ! ఎందుకు నా భర్తను నాకు దూరం చేశావు, నా కడుపులో ఉన్న నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా” అని మహేశ్వరి మహాదేవునితో చెప్పింది. అలా ఆరోజు అంతా గుడి దగ్గరే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ల కుటుంబ సభ్యులు గుడికి వచ్చి,తనను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులకు మహేశ్వరి ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో మహేశ్వరి తన ప్రాణాలను కోల్పోయింది. మహేశ్వరి కి పుట్టిన పాపను తన తల్లి ఈశ్వరమ్మ వద్ద ఉన్నది. ఆ పాపని ఈశ్వరమ్మ తన ఇంటికి తీసుకు వెళ్ళింది. కొన్ని రోజులకు ఆ పాపకి బారసాల చేసి నామకరణం చేశారు. ఆ పాపకు ‘మహాదేవి’ అనే పేరు పెట్టారు. మహేశ్వరి తన భర్త దేవా జ్ఞాపకంగా ఈ మహాదేవి జన్మించింది అని ఈశ్వరమ్మ భావిస్తుంది. మహాదేవికి అమ్మమ్మ అయ్యిన ఈశ్వరమ్మ మహాదేవికి ఎప్పుడు, ఎక్కడ ఏం కావాలన్నా కొని ఇచ్చేది. కానీ మహాదేవికి తల్లి, తండ్రి లేని లోటు మాత్రం తీర్చలేకపోయింది. కొన్ని రోజులకు మహాదేవి నిద్రలో “ఓం నమః శివాయ” అని తలుచుకుంటూ ఉండేది. ఇది తెలుసుకున్న వాళ్ళ అమ్మమ్మ, మహాదేవిని పూజారి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ పూజారి ఈశ్వరమ్మ తో ఇలా చెప్పాడు” అమ్మ! నీ మనవరాలు శివునికి చాలా ఇష్టమైన భక్తురాలు, ప్రతిరోజు నువ్వు తనను శివుని గుడికి తీసుకు వెళ్ళు, అలాగే తన చేత అభిషేకము నైవేద్యము చేయించు, ఈ పనులు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో, చాలా నిష్టగా చేయించు” అని ఆ పూజారి ఈశ్వరమ్మ తో చెప్పాడు. అప్పటినుంచి ఈశ్వరమ్మ తన మనవరాలు మహాదేవతో రోజు శివునికి అభిషేకం, పూజలు చేయించేది.తన చేత నైవేద్యం కూడా చేయించేది. ఇలా మహాదేవి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మమ్మ చెప్పినది చేస్తూ వచ్చింది. అప్పటికి మహాదేవికి పదేళ్లు వచ్చాయి. అప్పటినుంచి తనకు తాను ఎవ్వరి సహాయం లేకుండా, రోజు శివుడు గుడికి వెళ్లి శివునికి పూజలు చేసే నైవేద్యం వండి తీసుకువెళ్లేది. ప్రతి సోమవారం శివుని గుడిలో శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలు చేసే ముందు రోజు ఆదివారం శివుని గుడిని శుభ్రం చేసి, పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసేది. అలా కొన్ని సంవత్సరాలు తర్వాత మహాదేవి తన చదువును పూర్తి చేసుకొని పెళ్లీడుకి వచ్చింది.

యాదాద్రి భువనగిరి

*ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం,* –ఎక్కడ అవసరం ఉంటే అక్కడే సర్పంచ్ గారి పాలన –* –ఇదే ప్రజలకు కావాల్సిన నిజమైన నాయకత్వం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03 :సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం. శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

రాంబిల్లి మండలం సెజ్ లో ఎస్విఎస్ కెమికల్స్ లో పేలుడు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సెజ్ లో ఎస్విఎస్ కెమికల్స్ లో పేలుడు పేలుతున్న నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ పీపాలు వరుసగా ఆయిల్ డ్రమ్ముల పేర్లు తొండడంతో కమ్మేసిన పొగ ఎగసిపడుతున్న మంటలు భారీగా విస్తరించిన పొగ Uploaded Video:

విశాఖపట్నం

దువ్వాడ ప్లాట్ఫారం నెంబర్ వన్ దగ్గర వ్యక్తి ఆత్మహత్య

విశాఖ… గాజువాక… దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం -1 ట్రాక్ పై పెదగంట్యాడ ప్రాంతంకి చెందిన నీలాపు వెంకట రెడ్డి @సైనికుడు అనే వ్యక్తి ఆత్మహత్య… కదిలే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న మృతుడు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు… Uploaded Video:

తెలంగాణ

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్

పున్నమి జనవరి 03: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం,96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు,తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలసి ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి,శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి,స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్,ఈవో టి.శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి.ఆనందసాయి,తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే,జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి,ఆర్ కె సాగర్ తదితరులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

సిద్ధిపేట

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది

*సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది 👉*అనంతరం సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* మాట్లాడారు సావిత్రిబాయి ఫూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, కవయిత్రి, ఆమె భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి బాలికల విద్య మరియు అణగారిన వర్గాల విద్యావ్యాప్తి కోసం పోరాడారు, 1848లో పూణేలో మొదటి బాలికల పాఠశాల స్థాపించి, కుల, లింగ అసమానతలను వ్యతిరేకించి మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. ఆమె సామాజిక అసమానతలపై కవితలు రాసి, సత్యశోధక్ సమాజ్‌లో కీలక పాత్ర పోషించారు, కరువు, ప్లేగు వంటి విపత్తులలో పేదలకు సేవ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు , రాగుల కృష్ణ, చంద్రమౌళి, అరే శీను, మాల మహానాడు అధ్యక్షుడు దాసరి రమేష్, బడే రాజయ్య , ఉల్లి మల్లయ్య, పులి రవి, దేవులపల్లి కనకయ్య, దాసరి పెంటయ్య, మల్లేశం, సాయి శ్యామ్, రాకేష్, అఖిల్, నర్సింలు, పవన్ , చందు ,రఘువరన్, సంతోష్, దాసరి మహేష్,పాల్గొనడం జరిగింది. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.