Thursday, 5 March 2026

Blog

ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ కూల్చివేత బాధితులపై ముమ్మర సామాజిక–ఆర్థిక సర్వే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు – కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఫిబ్రవరి 24న చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన బాధితులపై సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో: ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు – 182 మంది ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు – 340 మంది ➡️ మొత్తం ఖమ్మం జిల్లాకు చెందిన వారు – 522 మంది ఇతర వివరాలు ఇలా ఉన్నాయి: రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు – 107 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు – 3 మంది సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి అయిన అనంతరం అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివాస స్థల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. సర్వే సక్రమంగా పూర్తయ్యేందుకు సంబంధిత వ్యక్తులు తమ తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి

* విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ మరియు బాలాపూర్ డివిజన్‌లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో 2024–2025 విద్యాసంవత్సరానికి గాను పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధమ స్థానం సాధించిన విద్యార్థులకు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ సహకారంతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం అత్యంత అవసరమని విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమైనవి అని….ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావుల మల్లేష్ బిజెపి సీనియర్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, రేసు నరసింహారెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, బిజెపి ఉపాధ్యక్షులు సైదులు, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, బిజెపి నాయకులు మల్లేష్, ఆంజనేయులు యాదవ్, బీజేవైఎం నాయకులు సతీష్ నందా, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలసిన కోలన్ శంకర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 28 : తెలంగాణ మొదటి మేయర్ ను గెలిపించి అలాగే కరీంనగర్ పార్ల మెంట్ లో భారీ సంఖ్యలో కౌన్సిలర్స్ ను గెలిపించి తెలంగాణ ప్రజలలో బిజెపి పై విశ్వాసం నింపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని బిజెపి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి శాలువా కప్పి పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోవు కాలములో తెలంగాణ లోని గ్రేటర్ హైదరాబాద్ , అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిచే ధ్యేయంగా ప్రతి కార్యకర్త, నాయకులు సైనికులుగా సమన్వయం తో కృషి చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమములో బిజెపి నాయకులు మాదన్న, నర్సింగ రావ్, జయసూర్య, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ‎

ఖమ్మం

నేడు ఖమ్మం రానున్న ముప్పు వరపు వెంకయ్య నాయుడు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పాయ్ యొక్క శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో లో పాల్గొనేందుకు భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు ఖమ్మం రానున్నారు. స్థానిక వైరా రోడ్డు లోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరుగు కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ఖమ్మం

వెలుగుమట్ల కూల్చివేతలపై ఈటెల రాజేందర్ ఆగ్రహం – పేదలపై అన్యాయం చేశారంటూ ప్రభుత్వంపై మండిపాటు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లను కోల్పోయిన బాధితులను పరామర్శించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చలగాటం ఆడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. జిల్లాలో కీలక పదవులు కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్నప్పటికీ, ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశలు మూడు సంవత్సరాలకే చెదిరిపోయాయని అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ పేరుతో ఒకచోట కూల్చివేతలు చేస్తూ, వెలుగుమట్లలో భూదాన్ భూములు, అక్రమ గుడిసెలు అంటూ పేదల నివాసాలను నేలమట్టం చేశారని మండిపడ్డారు. భూదాన్ అంటే దానం చేసిన భూమి అని గుర్తు చేసిన ఆయన, సామాజిక సంస్కర్త వినోబా భావే వేల ఎకరాలు దానం చేసిన నేపథ్యంలో వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాలు భూదాన్ భూమి ఉన్నాయని తెలిపారు. గతంలో ఈ భూములపై ఎవరూ ఆసక్తి చూపకపోయినా, ఇప్పుడు భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం దృష్టి పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం భూములు పంచడం కాదు, లాక్కోవడమే చేస్తోందని విమర్శించారు. 2019లో కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పినా, అప్పటి ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఇవ్వకపోగా, ఉన్న నివాసాలనే కూల్చివేసిందని అన్నారు. పేదలపై 4000 మంది పోలీసులను మోహరించడం అవసరమా అని ప్రశ్నించిన ఆయన, 62 ఎకరాల్లో 30 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్లిందో కలెక్టర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదాన్, ఇనామ్ భూముల వివరాలను బయటపెట్టాలని, పెద్దల వద్ద ఉన్న అక్రమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. బాధితులకు అదే స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని, తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జరిగిన తప్పుకు ముఖ్యమంత్రి నిర్బంధంగా క్షమాపణ చెప్పాలని కోరారు. పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిపైనే అన్యాయం చేస్తోందని విమర్శించిన ఈటెల రాజేందర్, వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గూడూరు

ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

గూడూరు @ 28 ఫిబ్రవరి స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీధర్ శర్మ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎక్సైజ్ ఎస్సై పి. మహేష్, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతదేశపు ఘనమైన శాస్త్రీయ వారసత్వాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలిపిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ సి.వి. రామన్ అని, ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రామన్ జీవిత విశేషాలను కొనియాడారు. 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన రామన్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటికీ, అన్వేషణే శ్వాసగా పరిశోధనల పట్ల తపన తో కలకత్తాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ లో రాత్రింబవళ్లు శ్రమించి అద్భుత ప్రయోగాలు చేశారని, సముద్రపు నీరు నీలిరంగులో ఎందుకు కనిపిస్తుందనే జిజ్ఞాసతో ప్రారంభమైన ఆయన అన్వేషణ ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు దారితీసిందని, కాంతి కిరణాలు పారదర్శకమైన ఘన, ద్రవ, వాయు మాధ్యమాల గుండా ప్రసరించినప్పుడు వాటి స్వభావంలో వచ్చే మార్పును ఆయన నిరూపించారని, ఈ ఆవిష్కరణ రసాయన శాస్త్రం, స్పెక్ట్రోస్కోపీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా రామన్ రికార్డ్ సృష్టించాడని, దేశ అత్యున్నత పురస్కా రమైన భారతరత్నతో పాటు లెనిన్ శాంతి బహుమతినీ పొందారని, బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ స్థాపించి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేశారని, విజ్ఞాన శాస్త్రం నిత్యజీవితంలో భాగమని, రామన్ వంటి మహనీయుల స్ఫూర్తితో నేటి విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ప్రయత్నం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులుతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు వారి ఆధ్వర్యంలో ‘మత్తుపదార్థాలు – అవగాహన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పి. మహేష్ నేటి యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని జీవిత విలువలు గురించి విద్యార్థినీ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

సూర్యాపేట

సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్ సీజ్

సూర్యాపేట: సూర్యాపేటలో ఆపిల్ డయాగ్నోస్టిక్ అండ్ స్కాన్ సెంటర్ లో నిబందనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్ పై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ విచారణ జరిపారు. ఆ నివేదిక ఆధారంగా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు శనివారం స్కాన్ సెంటర్ ను సీజ్ చేశారు. జిల్లాలో అక్రమ స్కాన్ కేంద్రాల పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

తిరుపతి

ఐటీ శాఖ మంత్రికి విశాఖలో వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకుని, విశాఖపట్నం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణమవుతున్న యువనేత, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి విశాఖ విమానాశ్రయంలో వీడ్కోలు పలకడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే మంత్రి లోకేష్ తో గడిపిన ఈ కొద్దిపాటి సమయం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ముఖ్యంగా గత మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల గురించి ఇద్దరం ఎంతో సరదాగా చర్చించుకోవడం జరిగిందని మైదానంలో బ్యాట్ పట్టినప్పటి విశేషాలు, అక్కడ చోటుచేసుకున్న సరదా సన్నివేశాల గురించి మాట్లాడుకుంటుంటే సమయమే తెలియలేదన్నారు. రాజకీయాల్లో ఎంతటి ఒత్తిడి ఉన్నా, అప్పుడప్పుడు ఇలాంటి ఆత్మీయ పలకరింపులు, సరదా ముచ్చట్లు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో లోకేష్ చూపిస్తున్న అంకితభావం తనకు ఎప్పుడూ ఒక గొప్ప స్ఫూర్తిగావుంటుందని ప్రజల కోసం నిరంతరం పరితపించే మా మధ్య సాగిన ఈ భేటీ ఎంతో సందడిగా, ఆత్మీయంగా ముగిసిందని ఎమ్మెల్యే ఎంతో ఆనందంతో పేర్కొన్నారు.

తిరుపతి

మర్రిమందలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి రిషితా రెడ్డి

ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: ఏర్పేడు మండలం మర్రిమంద పంచాయతీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ముఖ్య అతిథిగా విచెసారు. ఆమెకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు బ్యాండ్ సెట్ వాయిద్యాలు, టపాకాయలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా రిషితా రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం సెలవు కారణంగా లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందుగానే శనివారం నాడు పెన్షన్ల పంపిణీ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు తమకు అనుకూల సమయంలో రేషన్ పొందే వెసులుబాటు కల్పించామని ప్రభుత్వం బియ్యం, జొన్నలు, చక్కెర అందిస్తున్నట్లు ఆమె వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయగా, ఏర్పేడు మండలంలోనే దాదాపు కోటి రూపాయల సాయం అందిందని గుర్తు చేశారు. అనంతరం మల్లాడి డ్రగ్స్ కంపెనీ సహకారంతో మర్రిమంద ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేష్‌కు మూడు చక్రాల ఎలక్ట్రిక్ సైకిల్‌ను అందజేశాసి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను తిలకించి అభినందించారు. మండల అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు మాట్లాడుతూ…..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలంతా నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని మండలంలో జాతీయ రహదారుల నుంచి పంచాయతీ రోడ్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

తిరుపతి

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయలో పనిచేయుచున్న లోకనాథం మాతృమూర్తి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి శనివారం నాడు లోకనాథం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి లోకనాథం మాతృమూర్తి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు, తిరుపతి శ్రీకాళహస్తి పార్లమెంట్ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పసల కృష్ణయ్య,డాక్టర్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, బుల్లెట్ జై శ్యామ్ రాయల్, కంఠా ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, జూమ్లేష,మెహబూబ్ భాష, ఆరిఫ్, జిలాని, అస్లాం,సర్పంచ్ ముద్దుమూడి రవి, గుణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.