Saturday, 28 March 2026

Blog

Featured జాతీయ అంతర్జాతీయ

పట్టు తప్పుతోంది, సామాన్యుల నడ్డి విరగబోతుంది 

పున్నమి ప్రతినిధి. షేక్ రసూల్ అహమద్ : భారతదేశంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 21 నాటికి దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా, మే 20 నాటికి 1,06,750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతదేశం కరోనా సంక్రమణ దశలో అడుగుపెట్టి  కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారిపోయింది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు  3,500 కు పెరగగా, గత నాలుగు రోజుల్లో ( మే 17 నుంచి 20 వరకు ) రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక నిన్న ఒక్క  రోజే కొత్తగా 5,611 కేసులు నమోదయ్యాయి. ఇంతటి మహా సంక్షోభం నుంచి ఎలా బయటపడాలని గాని, కరోనాను ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ ప్రయత్నం రెండూ లేవు. గతంలో రోజూ సమీక్షలు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత 8 రోజులు నుంచి  వీటికి స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. భారమంతా రాష్ట్రాలపై వేసి చేతులు దులుపుకొంటుంది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. తర్వాత  మీడియాతో ఏ విధమైన కాంటాక్ట్ పెట్టుకోలేదు. దీనిపై అన్నివైపులా  విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్  మాట క్రమేపీ పాతబడిపోతోంది, బహుశా కరోనా వైరస్ తో  సహజీవనం చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచనలాగా కన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో సమన్వయము లేకుండా అంతర్జాతీయ మెప్పు కోసమంటూ విశ్లేషకులకు సైతం అర్ధంకాని ఉద్దీపన చర్యలు చేపట్టి ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలగించివేసింది. రైళ్లు, బస్సులు, విమాన రాకపోకలపై నిషేధం ఎత్తి వేస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెంది వివిధ సమస్యలు తలెత్తే పరిస్థితులను అందరూ ఎదుర్కోవలసి వస్తుంది. ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉండి హావ్స్, హావనాట్స్ అంతరం మరింతగా పెరిగి భవిష్యతులో తీవ్ర అంతర్యుద్దాలకు దారి తీస్తోందా అన్న అనుమానాలు బీజం పోసుకొంటున్నాయి. పోనీ ఏదోరకంగా కేంద్ర ఆదుకొంటుంది అనుకుంటే, భారీ ప్యాకేజి అంటూ ఊరించి చివరికి వలస కార్మికుల, సామాన్యుల చేతిలో చిప్పలు పెట్టారని ప్రజలు వాపోతున్నారు. ఇంతటి లాక్ డౌన్ లోనే కరోనా విజృంభిస్తూ వుంటే  ఇక ముందు ముందు ఎలావుంటుందో ఊహించడానికే భయమేస్తుంది. కాని ప్రభుత్వం మాత్రం దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెపుతూ  ఏ విధంగానైనా లాభాలు గడించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటిలాగే మరొక్కసారి సామాన్య ప్రజలే సమిధలవుతారని చరిత్ర చెప్పకనే చెపుతుంది.

Featured

మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ వారి నిరంతర సేవలు 

గూడూరు మే 21, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు వుండే 150 ముస్లిం కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 కిలోల బియ్యం, ఒక చీర చొప్పున మొహమ్మద్  ఫక్రుద్దీన్ చారిటబుల్  ట్రస్ట్ వారు పంపిణి చేశారు. గురువారం నాడు గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట, బనిగి సాహెబ్ పేట, సాధుపేట, చిన్న చేపల మార్కెట్ వీధి నందు, ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా ఇంటింటికీ వెళ్లి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రభుత్వ సూచనలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అందించడం జరిగిందని అన్నారు. అలాగే ట్రస్టుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. సంస్థ గౌరవ సలహాదారులు షేక్.గౌస్ బాషా మాట్లాడుతూ మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, రంజాన్ పండుగ సందర్భంగా  కరోనా మహమ్మారి దూరమై అందరూ సుభిక్షంగా ఉండాలని అల్లాను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ మగ్ధుమ్, సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్, గౌరవ అధ్యక్షురాలు సఫ్నాజ్, ఫరీనా, గౌరవ సలహాదారులు గౌస్ బాషా, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి యాసీన్, కోశాధికారి అమృద్దిన్, సభ్యులు అయాజ్, సమద్, అలీం తదితరులు పాల్గొన్నారు.

Featured

కరోన విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ విషయంలో ప్రజలను ఇబ్బందులు గురి చేయడం తగదు బిజెపి జిల్లా నేత బోలా

మనుబోలు 21-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ ) మనుబోలు మండలం కాగితలపూర్ హరిజన వాడ కు చెందిన జోగి అశోక్ ఇటివల ఆత్మహత్యాయత్నం కు పాల్పడిన విషయం లో ఆయనను పరామర్శించి అందుకు గల కారణాలను మనుబోలు మండల బిజెపి పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు.బ్యాంకు పొదుపు లోను విషయంలో బ్యాంక్ అధికారులు మరియు బాధితుడు జోగి అశోక్ కు మధ్య జరిగిన విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు కరోనా కష్టకాలంలో లోన్లు విషయంలో ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు లోన్లు విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు వేధించడం తగదన్నారు .ఈ సమస్య విషయంలో బిజెపి నాయకులు అందరం మాట్లాడుకొని అవసరమైతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయి అశోక్ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చేయాలని అందరం కలిసి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కలు

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కల ఏప్రిల్ 2020 నుండి ఏపీ ఈఆర్సీ పెంచిందని చెప్పబడుతున్న విద్యుత్ కాకి లెక్కలు మరోసారి వినియోగదారులపై ఎలా భారం వేసేందుకు కుట్ర జరిగిందో తేటతెల్లమవుతుంది. బిల్లులు సరి చూసుకోండి అన్న లింకు చూస్తే ఇంకా బొక్కలు కని పించాయి. ఉదాహరణకు నా సర్విసుకు సంబంధించిన బిల్లు వివరాలు ఏప్రిల్ 2020 లో 30 రోజులు మే 2020లో 30 రోజులు అని చూపి ఉంది. వాస్తవానికి గత మీటరు రీడింగు మార్చి2020 నెల 6వతేదీన తీసారు. మరలా మేనెల 14న తీసారు.(కోవిడ్ వలన అని ఎంత చెప్పినా రీడింగు ఆలశ్యంగా తీయడం రివాజు.ఒక సారి నాలుగురోజులు ఐదు రోజులు ఆలశ్యం సాధారణంగా జరిగేదే.నష్టం వినియోగదారునికే) అంటే 70 రోజుల వినియోగాన్ని 60 రోజులకు చూపి స్లాబులు తారీఫులు పెంచడం ఒక తప్పు. మార్చినెల 25 రోజులకు పాత తారీఫు వర్తించాలి. కానీ ఏప్రిల్ నెలలో 17 రోజులకు పాత తారీఫు చూపి మిగిలిన దంతా కొత్త తారీఫులో చూపడం మరో మోసం. 70 రోజుల వినియోగాన్ని విభజించి రోజు ఆవిధంగా 30 రోజులకు నిర్ణయించి స్లాబు ఫిక్స్ చేస్తే వినియోగదారునికి ఊరట. కానీ అది జరగలేదు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నరోజుల్లో సాఫ్ట్వేర్ మార్చి ప్రపోర్షనేట్ బిల్లింగ్ వేస్తే ఏమన్నా ఇబ్బందా. వినియోగదారులకు పారదర్శకత లేని బిల్లులు వేసి మొండిగా పెంచలేదని చెప్పటం మూర్ఖత్వం కాక మరోకటిలేదు. అసలే కష్టకాలంలో ఉన్న ప్రజలపై ఇటువంటి భారాలు వేయడం ప్రజాహితమా…అందునా మోసపూరితమైన బిల్లును వేసి మొండిగా వాదించడం సహేతుకం కాదు. జూన్ 30 దాకా సమయం ఉంది కట్టొచ్చు అని చెప్పటం మరో భూటకం.బిల్లుల్లో యధాతధంగా డిస్కనెక్షను తేదీని ఇచ్చారు. జూన్ బిల్లు కలిపి ఇంకో మోపు పెనాల్టీ లు వేసి ఇంకా ప్రజాగ్రహానికీ గురౌతారు. ఏదో ప్రతిపక్షాలు చేసే గలభాగా దీన్నిచూపడం అసమంజసం. ప్రతిపక్షాలు పూర్తిగా విశ్లేషించి తమ వాదనలూ వినిపించడంలేధనేది ఇపుడు టీవీ చర్చల్లో స్పష్టంగా తెలుస్తూంది. మరో విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం బిల్లును సిధ్ధం చేసింది. అది ఇంకా రాష్ట్రాలపాత్రను తగ్గించి రాజ్యాంగ మూలస్థంభమైన ఫెడరల్ విధానంకి భిన్నంగా ప్రత్యక్ష ధన మార్పిడి పేరుతో మరో భారాలకు సిద్ధమౌతుందీ. జీఎస్టీకి తలూపిన ఈ పార్టీలు ఇపుడు కేంద్రం ముందు భిక్షగాళ్ళుగా మారేట్లు చేసిందానికి ప్రజలు బాధలు భరిస్తున్నారు. రాష్ట్రాల ప్రజల పై భారాలువేసేవాటికి ముద్దుగా సంస్కరణలని పేరెట్టి ఉద్దీపన అనే ఓ కాకి లెక్కల ప్యాకేజి లో కేంద్ర ఆర్ధికమంత్రి గారు.సెలవిచ్చారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ వినియోగదారుల భారాలను తగ్గించాలి. వినియోగం పెరిగి బిల్లులు పెరిగాయనడం పచ్చి అబద్ధం. యూనిట్లు కొన్నిచోట్ల పెరిగి ఉండొచ్చు. మీ విద్యుత్ బిల్లులలో లోపించిన పారదర్శకత…ఆలశ్యంగా రీడింగు తీస్తే అవసరమైన సాఫ్ట్వేర్ మార్పు…కరోనా కష్టకాలంలో అసలే జీతాలు ఆదాయం మృగ్యమై యున్న వినియౌగదారులపై భారాలు మోసి లేదని మూర్ఖంగా వాదించడం…ఎంత వరకూ సమంజసం. మీకెవరైనా మిస్ లీడ్ చేస్తున్నారేమో ఆలోచించాలనీ రాష్ట్ర నేతకు విజ్ఞప్తి. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆలోచించకపోతే గత ప్రభుత్వాలకు లభించిన బహుమతి ప్రజలవద్దనుండి లభిస్తూంది. అందుకే పెంచిన బిల్లులు రివైజ్ చేయండి. ఆవరకూ పారదర్శకంగా బిల్లులు పెంచిన.తారీఫు ప్రక్కన పెట్టి ఆఖరి తేదీ లోపు ఎటువంటి పెనాల్టీలు లేకుండా ప్రజలవైపు కష్టాలలో అండగా నిలబడాలనీ అపుడే ప్రజలు హర్షిస్తారనీ..లేకపోతే కరెంటు షాకిచ్చిన ప్రభుత్వాలకు ఎటువంటి సమాధానాలు జనాలు ఇచ్చారో…విద్యుత్ బిల్లులు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం కు ఏవిధమైన మద్ధతు ఇచ్చారో నేతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. ఇట్లు ఓ వినియోగదారుడు జీవి నాగరాజ రావు బీ.యస్సీ ఎల్లెల్బీ

Featured

రెడ్ జోన్ పరిధి లోని ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ తహసీల్దార్ ఆనందరావు

మనుబోలు 20-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ )రెడ్ జోన్ పరిధిలోనిమనుబోలుగ్రామప్రజలకునిత్యావసరాలుకు సంభందించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు మనుబోలు తహశీల్దార్ ఆనందరావు గారు తేలియచేసినారు. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలోఎంపీడీవో వెంకటేశ్వర్లు ,ఎస్సై సూర్య ప్రకాశ్ రెడ్డి మనుబోలు పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ మరియు మనుబోలు గ్రామ నాయకులతో తహశీల్దార్ ఆనంద రావు గారి ఆధ్వర్యంలో జరగిన సమావేశంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారు .మనుబోలు గ్రామంలో బిసి కాలనీలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కాబడినది అందువల్ల మనుబోలు గ్రామ ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేధించడం జరిగిందని తెలిపారు .మనుబోలు గ్రామ ప్రజలకు నిత్యావసరాలకు సంబంధించి డోర్ డెలివరీ చేయుటకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చర్యలు చేపట్టినట్లు తహశీల్దార్ ఆనందరావు తెలియచేసినారు. కోవిడ్- 19 నిత్యావసర వస్తువుల హెల్ప్ డెస్క్ no 9154636573 మనుబోలు మండలం

Featured

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన గూడూరు రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి గారు

మనుబోలు 20-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ ) సీనియర్ జర్నలిస్ట్ బాబు మోహన్ దాస్ ఇటివల అనారోగ్యం కు గురికావడం జరిగింది ఆయనను గూడూరు రూరల్ సి ఐ రామకృష్ణ రెడ్డి గారు ,యస్ ఐ సూర్య ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ బాబు పరామర్శించారు.

Featured

మనుబోలు గ్రామ ప్రజలకు ఆందోళన వద్దు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రెడ్ జోన్ ప్రాంతాలు పరిశీలన

మనుబోలు20-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి. కాలనీలలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల పరిశీలన. ప్రజలకు మాస్కులు, శానిటైజర్ల పంపిణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి. ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి.ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై. యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,చే రెడ్డి రామి రెడ్డి ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి దాసరి మహేంద్రవర్మ అన్నమాల ప్రభాకర్ రెడ్డి ఎంపీడీవో వెంకటేశ్వర్లు తహసిల్దార్ ఆనందరావు గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి మనుబోలు ఎస్ ఐ సూర్య ప్రకారెడ్డి పాల్గొన్నారు.

Featured

రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి.ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాం అని తెలిపారు

Featured జాతీయ అంతర్జాతీయ

మరో చప్పట్ల హీరో

పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : అత్యంత పేద దేశమైన బురుండి తూర్పు ఆఫ్రికా ఖండంలో ఉంది. దీర్ఘకాలంగా అంతర్యుద్దాలలో మునిగిపోయిన బురిండి 1962 వ సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. అది మొదలు ఇప్పటిదాకా ఏకగ్రీవ లేదా పోటీ ఎన్నికలు జరగలేదు. మొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బురుండి ప్రజల భవిషత్తును నిర్ణయించబోతున్నాయి. 3సార్లు అధ్యక్షుడిగా నాకురింజిజా ఎన్నికై బురుండి దేశానికి దీర్ఘకాల అధ్యక్షుడిగా పని చేసి తన పాలనాకాలంలో రాజకీయ ప్రత్యర్థుల హత్యలు, అరెస్టులు చేసిన నాకురింజిజా అప్రతిష్ట కూడగొట్టున్నాడు. నేటి గ్లోబల్ మహమ్మారి సమయంలో కూడా స్టేడియాలలో భారీ ర్యాలీలు చేసి తమ పార్టీని గెలిపించమని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మాజీ తిరుగుబాటు నాయకుడు, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమయ్యాడనే ఆరోపణలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ ప్రయత్నాలను తప్పించుకొంటూ గత 15 సంవత్సరాలుగా శిక్షార్హత లేకుండా దేశాన్ని పాలించిన నాకురుంజిజాకు వారసుడిని, బురుండి దేశ పౌరులు బుధవారం నాడు ఎన్నుకుంటున్నారు. సుమారు 1,500 పోలింగ్ కేంద్రాలలో ఐదు మిలియన్లకు పైగా ప్రజలు ఓటు వేస్తున్నారని, 1993 లో ప్రారంభమై 2005 లో ముగిసిన అంతర్యుద్ధం తరువాత ఇది మొదటి పోటీ ఎన్నిక అని నిపుణులు చెపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి, దేశ సరిహద్దులు తెరచి ఉంచుతూ పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించడానికి అధికారులు అనుమతినిస్తూ కరోనా నుంచి దేవుడు కాపాడుతాడని ఉదహరిస్తున్న నేపథ్యంలో, కరోనా సంక్రమణకు దారితీస్తుందని who అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దేశంలో సానుకూల కేసులు పెద్దగా లేవని కేవలం ఒక మరణం మాత్రమే నమోదయిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు బురుండీలో లేవని, కరోనా వైరస్ వ్యాప్తి ఆసలే లేదని ఇది దేశాన్నిపెద్దగా ప్రభావితం చేయదని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. గోజిలోని ఒక సమావేశంలో బురుండి అధ్యక్షుడు ఒక అడుగు ముందు వేసి మనం రద్దీగా ఉన్నాము కదా మనకు ఏమైనా సమస్య ఉందా, ‘ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి చప్పట్లు కొడదాం’ అని ప్రజలను ఆదేశించాడు.

Featured

కండలేరు జలాశయం లో 26.224 టీఎంసీలు నీరు

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లోని కండలేరు జలాశయం లో మంగళవారం నాటికి 26.224 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి సత్యసాయి గంగకాలువకు 15 క్యూసెక్కులు పినేరు వాగుకు 15 క్యూసెక్కులు లోలెవెల్ స్లుయిస్ 10 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు కండలేరు వరద కాలువ ద్వారా 325 క్యూసెక్కులు జలాశయంలోకి చేరినట్లు తెలియజేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.