Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అందుకే మద్యం ధరలు భారీగా పెంచం:జగన్

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీ:మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇవాళ కొలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమావేశమయ్యారు.మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పరిమితం చేశామని, మద్యపాన నియంత్రణలో భాగంగా త్వరలోనే మద్యం దుకాణాలను తగ్గిస్తామని తెలిపారు.ఇప్పటికే పర్మిట్ రూంలను రద్దు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కొత్తగా 67 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,717 కు చేరింది. ఇందులో 1094 యక్టీవ్ కేసులు ఉండగా..589 మంది డిశ్చార్జ్ అయ్యారు.అటు మరణాల సంఖ్య 34 కు చేరింది.తాజాగా అనంతపురం జిల్లాలో 2,గుంటూరు 13,కడప 2,కృష్ణా 8,కర్నూలు 25,నెల్లూరు 1, విశాఖ జిల్లాలో 1,వేరే రాష్ట్రాల నుండి వచ్చిన 14 మందికి కరోనా వచ్చింది .

జాతీయ అంతర్జాతీయ

46,433 కి చేరుకున్న కరోనా కేసులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 46,433 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 1,568 మంది మృతి చెందారు అని వెల్లడించింది.ఇప్పటివరకు 12,727 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా..32,138 యక్టీవ్ కేసులు ఉన్నాయంది.మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా…గుజరాత్ లో 5,804 కేసులు,ఢిల్లీలో 4,898 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మొత్తం 1,25,229 కరోనా టెస్టులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పరుగుతోంది.నిన్నటివరకు మొత్తం 1,25,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతీ 10 లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. రోజు వారీ సామర్ధ్యం 10 వేలకు పైగా పెరిగింది.గత 24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో సగటున ప్రతీ 76 టెస్టులకు గానూ ఒక పాజిటివ్ కేసు నమోదవుతోంది .అదే దేశ సగటు చూస్తే ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.

Featured

నాయీ బ్రాహ్మణులకు రూ.1000 నగదు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు:ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులలో నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ వెంకటేశ్వర్లు విజ్ఞాప్తి చేశారు.అభయహస్తం అధినేత డాక్టర్ చేరుకుపల్లి భాస్కర్ రెడ్డి,డాక్టర్ మధులత దాతృత్వంతో నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మీ నారాయణ,చేరుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Featured

క్యాన్సర్ ఆసుపత్రికి రూ.5 లక్షల విరాళం

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ క్యాన్సర్ ఆస్పత్రికి వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు టీవీ కృష్ణా రెడ్డి రూ.5 లక్షల విరాళ్ళని అందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పోర్దాలో ఉండటంతో సమీప బంధువు ద్వారా ఈ విరాళ్ళని అందచేశారు. మానవతా దృక్పథంతో క్యాన్సర్ రోగులకు అండగా నిలిచిన దాతకు ఆసుపత్రి కన్వీనర్ తుంగాశివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతతో తెలిపారు.

Featured

రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వనున్న నాబార్డ్

నెల్లూరు పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️ రైతులకు కరోనా కష్టాలు తీర్చేందుకు నాబార్డ్ సహకారంతో రైతాంగానికి రూ.100 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు సహకార బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.సంవత్సరం లోపు అయితే సున్నా వడ్డీ,ఆ పైన అయితే 25 పైసలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.రైతులందరూ జిల్లాలోని ఆయా బ్యాంక్ కేంద్రాల వద్ద రుణాలు కొరకు సంప్రదించాలన్నారు.బ్యాంక్ లావాదేవీలను మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించారు.

Featured

నెల్లూరులో సిఐడి ఎస్సై అనుమానస్పద మృతి – కేసు నమోదు చేసిన పోలీసులు

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️ నెల్లూరు సిఐడి విభాగంలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాలేపాటి బ్రహ్మానందం అనుమానస్పదంగా మృతి చెందారు. మంగళవారం ఉదయం యూనిఫాం ధరించి విగతజీవిగా ఇంట్లోని బెడ్ రూంలో మంచంపై పడి ఉండగా బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నెల్లూరు రూరల్ మండలం, 3వ మైలు వద్ద నివాసం ఉండే బ్రహ్మానందం ప్రస్తుతం లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు హైదరాబాద్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బ్రహ్మానందం మంగళవారం ఉదయం డ్యూటీ వెళ్లేందుకని యూనిఫాం ధరించిన తర్వాత అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. దీనిపై వారి కుటుంబసభ్యులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 

ఆంధ్రప్రదేశ్

నిజాలను నిర్భయంగా రాసే ‘పత్రికా స్వేచ్ఛ’ అవశ్యం : మంత్రి గౌతమ్ రెడ్డి

పున్నమి ప్రతినిథి  ✒️ నిత్య ప్రజా చైతన్యానికి, సమాజాన్ని సంఘటితం చేయడానికి పాటు పడే పత్రికలకు స్వేచ్ఛ అవశ్యమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి,  ప్రపంచానికి తెలియని వాస్తవాలు వెలికి తీసి ప్రజల ముందుంచడానికి, , విపత్కర పరిస్థితుల్లో జనాన్ని మేల్కొలపడానికి, అత్యవసర సమయాల్లో అందరినీ ఒకతాటిపై నిలిపేందుకు పత్రికా స్వేచ్ఛ అత్యంత అవసరమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను ప్రజలకు తెలుపుతున్న పత్రికలకు, విలేకరులకు మంత్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఎటువంటి సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం తపించే పత్రికా స్వేచ్ఛ ఎప్పుడూ వెలకట్టలేనిదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా, కరోనా సమయంలో అవాస్తవాలతో భయాందోళన చెందే ప్రజలకు నిజాలను నిర్భయంగా పత్రికలే గుండె ధైర్యమని మంత్రి వెల్లడించారు. ఇతర మాధ్యమాలకు పత్రికలు ఆదర్శమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడి త్యాగాలు చేసిన కలం యోధులను స్మరించుకోవడానికి  యునెస్కో  తీర్మానం మేరకు 1993 నుంచి ప్రతి ఏటా మే 3న జరుపుకునే పత్రికా స్వేచ్ఛ   ప్రపంచంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛ అని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

Featured

వలస కూలీల తరలింపుపై అధికారులతో చర్చ

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ జిల్లాలో ఉత్తర ప్రదేశ్,వెస్ట్ బెంగాల్,ఒరిస్సా,బీహార్ రాష్ట్రాలకు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలస కూలీలు ఉన్నారని,వారిని వారి స్వస్థలాలకు చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లాకలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పక్క జిల్లా అధికారులతో చర్చించి వారిని స్వస్థలాలకు పంపేటప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.