Wednesday, 11 March 2026

Blog

ఖమ్మం

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు ఆచంటి కోటేశ్వరరావు.

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్డుపై ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ ఖమ్మం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకములు, అర్చనలు నిర్వహించగా, అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ గారికి క్లబ్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ ఖమ్మం వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీ ఆచంటి కోటేశ్వరరావు, కోశాధికారి శ్రీ తాటికొండ అరవింద్ కుమార్, గౌరవ సభ్యులు శ్రీ కొంకిమళ్ళ మృత్యుంజయ రావు, సభ్యులు నాగేశ్వరరావు, రాజేందర్ పాల్గొన్నారు. అలాగే వాసవి వనిత క్లబ్ సభ్యులు కూడా సహకరించి కార్యక్రమాన్ని మరింత ఘనంగా విజయవంతం చేశారు.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డిపేట సర్పంచ్ మరియు ఉప సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్నమి ప్రతినిధి /జనవరి 20 గంభరావుపేట్ మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మహేష్ యాదవ్ గారు, ఉప సర్పంచ్ బాబు గారు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజల ఆశయాలు, గ్రామ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శ్రమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. గొల్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం జనవరి తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మరణం లేని కారణ జన్ముడు అన్న ఎన్టీఆర్ గారు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ నేతల కర్మాగారం అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుని సేవలు మనకు ఆదర్శమన్నారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలు సాధిస్తామన్నారు. ప్రతిఒక్కరికీ ఎన్టీఆర్ గారు ఆదర్శనీయుడన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నగారి ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబ సభ్యులతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులకు గత 20 రోజులు నుంచి కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిన చెత్త చదరం ఎమ్మెల్యే రాకతో హడావిడిగా నిప్పు పెట్టి పొగ తో అధికారులుస్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో చెత్త బహిరంగంగా కాల్చడం నిషేధం అయినా అధికారులు అమలు చేయట్లేదని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు ఎస్ ఐ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన విజయ్

ఆత్మకూరు లోని ఎస్ ఐ జిలాని కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు రిపోర్టర్ పెర్నపాటి విజయ్ మాట్లాడుతూ మీరు అష్ట ఆరోగ్యాలతో,సుఖ సంతోషాలతో మీరు మరెన్నో వేడుకలు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలం రిపోర్టర్ బీమవరం తిరుపతి ఉన్నారు.

E-పేపర్

మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి ప్రతినిధి 9640204826 78 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎన్నికల్లో సందర్భంగా నియోజక ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా…18 కోట్ల రూపాయలతో HMDA ద్వారా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.పట్టణ ప్రధాన కూడలి లో 60 కోట్ల రూపాయలతో HRDCL ద్వారా చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధికి మారుపేరుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చెప్పిన విషయం విధితమే.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు సీఐ గంగాధర్ తో కలిసి ఆయన చేతులు మీదగా కార్డ్స్ పంపిణీ

నెల్లూరు జిల్లా రిపోర్టర్ పెర్నపాటి విజయ్ మరియు ఆత్మకూరు నియోజకవర్గం రిపోర్టర్ వారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సీఐ కలిసి ఐడి కార్డ్స్ పంపిణి చేయడం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు సీఐ గంగాధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రీపోటర్

ఆత్మకూరు లోని సీఐ గంగాధర్ కు స్టేషన్లో ఆయన జన్మదిన సందర్బంగా రిపోర్ట్ విజయ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి వేడుకలు మరొన్నో జరుపుకోవాలని, అష్ట ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేసారు అనంతరం రిపోర్ట్స్ కార్డు ఆయన చేతులు మీదగా అందజేశారు.

E-పేపర్

టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ లో చేరిక* పున్నమి న్యూస్ తెలంగాణ

*టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కాంగ్రెస్ లో చేరిక* పున్నమి న్యూస్ తెలంగాణ 19 జనవరి 2026 పున్నమి న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జెలమోని రవీందర్ తో పాటు మరో 150 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పార్టీలో చేరినట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, రాష్ట్రంలోని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, సర్వే ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి భూపతి గల్ల మహిపాల్, రాష్ట్ర నాయకులు ఈసీ చంద్రశేఖర్ గౌడ్, ముత్యాల రాజశేఖర్, ప్రశాంత్, మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జెర్కొని బాలరాజ్, భర్తకు జగన్, నీళ్ల భాను గౌడ్, ఈగల రాములు, ఇందిరాల రమేష్, బర్ల జగదీశ్వర్, ఆముదాల యాదగిరి, మైనార్టీ నాయకులు ఫిరోజ్, గౌస్, మునీర్, అశుభై, మహ్మద్ ఇమ్రాన్, అయ్యాన్ పటేల్,తోపాటు పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు జెలమోని మాధవి, ముఖేష్, జయమ్మ, క్రాంతి, ఎండి జుబేదా, ఎండి సుమేవ, శాయిదా, జరీనా, అనీఫా,, ఫిరోజా, అనీష్, షబానా, సమీనా, శంశీనా, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో రైతులకు భారీ ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది. ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు. కొత్త విధానం (Notification–13) రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది – తప్పకుండా షేర్ చేయండి. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.