Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వాదన వేరు గా ఉంది:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్

*స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదు* బిహార్‌, రాజస్థాన్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే నిదర్శనం టీకాల కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు *వైద్య ఆరోగ్య సిబ్బందిని ఎన్నికలకు వినియోగించుకోం* రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషన్‌ వేసే హక్కులేదు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎస్‌ఈసీ *నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాదన* అమరావతి : ఏపీలో 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కరోనా అడ్డంకి కాజాలదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. బిహార్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలు ఈ మధ్య విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డంకిగా మారతాయని రాష్ట్ర ప్రభుత్వం (పిటిషనర్‌) పేర్కొంటోందని, నిజానికి వ్యాక్సిన్ల వినియోగానికి కేంద్రం అనుమతివ్వలేదని, ఇందుకు జాతీయ విధానం ఖరారు కాలేదని తెలిపారు. ఎన్నికల కోసం రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందిని వినియోగించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్‌14 కింద పిటిషన్‌ దాఖలు చేసే హక్కే లేదని, ఆ ఆర్టికల్‌ వ్యక్తులకు వర్తిస్తుంది తప్ప ప్రభుత్వాలకు కాదని పేర్కొన్నారు. పిటిషన్‌కు ఏ రకంగానూ విచారణార్హత లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రధానాధికారి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అందులోని వివరాలివీ… *కరోనా తగ్గడంతోనే* రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని పాఠశాలలు, సినిమాహాళ్లు, మాల్స్‌ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అత్యంత ఎక్కువ జనసాంద్రత ఉన్న హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకున్నాం. మరోవైపు రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బిహార్‌లో కొవిడ్‌ కారణంగా శాసనసభ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు అంగీకరించని విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. రక్షణ చర్యల మధ్య ఆ రాష్ట్ర ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు, తాజా పరిస్థితుల దృష్ట్యా ఏపీలో పరిస్థితులు త్వరలో మరింత కుదుటపడతాయని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ఎన్నికలు నిర్వహించాలనుకున్నాం. అక్టోబరు 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించగా… ఎన్నికల నిర్వహణకు ఉన్న అభ్యంతరాలను పేర్కొంటూ, గణాంకాలను జత చేస్తూ వారు లేఖ ఇచ్చారు. కరోనా రెండో వేవ్‌ వచ్చే అవకాశముందనే అభ్యంతరాన్ని నోటిమాటగానే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఎన్నికల షెడ్యూలు, నిర్వహణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. నిజానికి ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగంతో వీడియో సమావేశ ఏర్పాటుకు ప్రధాన కార్యదర్శి సహకరించలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో వివిధ అంశాలపై మాట్లాడాకే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. రాష్ట్రంలోని 19 రాజకీయ పార్టీలను సమావేశానికి రావాలని పిలిచాం. 11 పార్టీలు హాజరయ్యాయి. ఎన్నికలపై వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు తీసుకున్న చర్యల్ని వివరించాం. జాగ్రత్తలు చేపడుతూ ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీలు కోరాయి. ఈ సమావేశాన్ని అధికార వైకాపా బహిష్కరించింది. చర్చల ప్రక్రియను విమర్శిస్తూ రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘానికి ఉన్న గౌరవాన్ని, గుర్తింపునకు భంగం కలిగేలా వ్యవహరించింది. *పూర్తి విరుద్ధం* ఇప్పటికే ఆచరణలో ఉన్న న్యాయసూత్రాలకు పిటిషనర్‌ వాదన పూర్తి విరుద్ధం. పైగా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకునే హక్కులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మధ్యే కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కేరళ హైకోర్టులో కొందరు సవాల్‌ చేశారు. ఆ రిట్‌ పిటిషన్‌ను 2020 నవంబరు 5న కేరళ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. *ఎన్నికల ప్రధానాధికారిపై సీబీసీఐడీ విచారణ* రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహ ఫలితాన్ని చూశారు. ఎన్నికల నిర్వహణ మధ్యలో ఉండగానే ఎన్నికల ప్రధానాధికారిపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సహాయాధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ సామగ్రిని సీజ్‌ చేశారు. *ప్రభుత్వానికి హక్కులేదు* ఆర్టికల్‌ 14 కింద తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ప్రభుత్వం(స్టేట్‌, రాజ్యం) వాదించడానికి లేదు. ప్రభుత్వానికి ఏ హక్కు లేదో అది ఉల్లంఘించినట్లుగా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ఏ మాత్రమూ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి కాదు. రాజ్యాంగంలోని 14, 18, 20, 21, 22, 25, 27, 31… ఏ ఆర్టికల్‌ ప్రకారం చూసినా ప్రభుత్వాన్ని పౌరునితో పోల్చడం, వ్యక్తిగా చూడటం సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ ఏ రకంగానూ చెల్లదు. ప్రభుత్వానిదో మాట.. మంత్రులదో మాట స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరోనాను కారణంగా చూపుతోంది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనాను తగ్గించగలిగామని రాష్ట్ర మంత్రులు, అధికారులు అంటున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను పెద్దపీట వేస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ ధర్మాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. ఎన్నికల వల్ల కరోనా కేసులు పెరుగుతాయనే రాష్ట్ర ప్రభుత్వ వాదన అర్థరహితం. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, రాష్ట్ర యంత్రాంగం అంతా అదేపనిలో ఉంటుందన్న ప్రభుత్వ వాదనలోనూ పసలేదు. వ్యాక్సినేషన్‌కు క్లినికల్‌ అనుమతులు రావాల్సి ఉన్నాయి. జాతీయ విధానం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వ్యాక్సినేషన్‌కు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. వ్యాక్సినేషన్‌లో నిమగ్నమయ్యే వైద్య ఆరోగ్య సిబ్బంది సేవల్ని ఎన్నికల్లో వినియోగించుకోబోం.

Featured

పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మినీ వెహిల్ ద్వారా ఉచిత భోజనం. ఏసి నాయుడు .

ఈరోజు ఉదయం17.12.2o2o నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయ్య పాలెం ఎలుకలకు పాలెంలో అబే డింగ్ హోమ్ చర్చి హారిగరీ హెల్పర్స్ వారు పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏడు లక్షల రూపాయలతో ఒక మినీ వెహికల్ లో మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు తయారు చేసి గ్రామాల ప్రాంతాల్లో వచ్చేటువంటి పేదలకు రోడ్డు మార్గాన ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది అదే కాక కొండాయపాలెం ఎలుకుల పాలెం వారి చర్చి వద్ద సోమ బుధ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచిరాత్రి 9 గంటల వరకు పేదలకు భోజన సౌకర్యం కలదు ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పాస్టర్ నిర్మల కుమార్ గారూ కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసి నాయుడు గారు చేతుల మీదగా మొబైల్ భోజనం వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఏసు నాయుడు గారు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం శుభపరిణామం పాస్టర్ నిర్మల కుమార్ గారూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ ప్రభువు కృప నిండుగా వారి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతం వైసిపి నాయకులు మహేష్ తా లూరి సురేష్ బాబు ధర్మారావు రమణయ్య హరి కుమార్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

సమాజంలో మమ్మల్ని భాగస్వాములు చేయండి* ___ సెక్స్ వర్కర్స్ వేడికోలు*

*మాపై వివక్షత చూపకుండా సమాజంలో మమ్మల్ని భాగస్వాములు చేయండి* ___ *మీడియా సమావేశంలో సెక్స్ వర్కర్స్ వేడికోలు* అక్రమ రవాణా కు గురికాబడి ప్రత్యామ్న్యాయ ఉపాది అవకాశాలు లేక సమాజంలో అవహేళనలు, వేదింపులు, హింస, చిన్న చూపు తో పాటు అప్పులు ఉబిలో నుంచి బయటకు రాలేక తమ జీవనం కోసం తప్పనిసరి పరిస్తుల్లో “సెక్స్ వర్కర్స్” గా మారి తమ జీవితాలు వెళ్ళదీస్తున్న సెక్స్ వర్కర్స్ నేడు కోవిడ్ మహమ్మారి వల్ల మరింత దుర్భల పరిస్థితి లో కొట్టుమిట్టాడుతున్నారు .. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఆదుకొని వీరికి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు కల్పించాలని అక్రమ రవాణా భాధితుల రాష్ట్ర సమాక్య “విముక్తి” రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా కోరారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో “సెక్స్ వర్కర్స్ పై హింసను నిరోధించాలి అనే అంతర్జాతీయ దినోత్సవం” (International Day to End Violence Against Sex workers) పురష్కరించుకొని అక్రమ రవాణా భాధితుల సమాఖ్య – విముక్తి మరియు ఇండియా లీడర్స్ ఫోరం అగనేస్ట్ ట్రాఫికింగ్ (India Leaders forum against trafficking- ILFAT) రాష్ట్ర శాఖ సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో షుమారు రెండు లక్షల మంది మహిళలు వ్యభిచారం లో మగ్గుతున్నారని వీరిలో షుమారు ఒక లక్ష మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే “రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ” కార్యక్రమ్మాల్లో రిజిస్టర్ కాబడి ఉన్నారు. వీరు కాక అక్రమ రవాణా నుంచి విముక్తి పొందిన వారు మరో రెండు వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సెక్స్ వర్కర్స్ లో షుమారు 60% మంది తమ 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు లోపల అక్రమ రవాణా కు గురికాబడి అనంతరం సెక్స్ వర్కర్స్ గా తమ జీవితాలు వెళ్ళదీస్తూ ఉన్నారు. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో సెక్స్ వర్కర్స్ పై పలురకాల హింసలు పెరిగాయి అని అవి షుమారు 55% గా ఉంది అని అంటూ ఇటీవల్ ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే లో తెలిపింది. వీరిలో వ్యభిచార గృహాలలో ఉండేవారిలో 35% ఉండగా, హైవే, డాబాలు, వివిధ రహదారులు పక్కన వ్యభిచారం చేసేవారిలో 58% మంది ఉండగా, వీరిని ఉంచుకొన్న వాళ్ళు, బ్రోతల్ ఓనర్స్ మరియు కుటుంభ సబ్యులు వల్ల 45% పలు రకాల హింసలు కు గురి అవుతు ఉన్నారు. కోవిడ్19 మహమ్మారి ప్రభావం అట్టడుగున ఉన్నవారిపై అసమానంగా ప్రభావం చూపగా, సెక్స్ వర్కర్స్ పై దాని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మహమ్మారి సమయంలో పని కోల్పోవడం దేశం లోని వివిధ రెడ్ లైట్ ప్రాంతాలు మరయు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని వ్యభిచార ప్రాంతాల నుండి భారీగా 70% సెక్స్ వర్కర్స్ పైగా తమ స్వంత గ్రామాల్లోని తమ ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. వారు తమ గ్రామాలు, ఇళ్ళకు తిరిగి రావడం నిజమగ వారికి ఒక తప్పనిసరి పరిస్థితే. అందుకు కారణం అనేక మంది సెక్స్ వర్కర్లకు, వారి కుటుంబాలు మరియు సంఘాల నుండి తాము చేసే వ్యభిచారం చుట్టూ ఉన్న కళంకం మరియు బహిష్కరణ కారణంగా “ఇంటికి తిరిగి రావడం” ఒక ఎంపిక కాదు సత్వ అనే సంస్థ ఇటీవల ఇతర ప్రాంతాలు నుంచి వచ్చిన ఒక 1 4 5 మంది సెక్స్ వర్కర్స్ తో ఒక శాంపిల్ సర్వే చేయడం జరిగింది. • సెక్స్ వర్కర్స్ వారి సంపాదన 100% పూర్తిగా తగ్గిపోయింది అన్నారు • 74% మంది ఎక్కువ వద్దికి ప్రవేటు వ్యక్తులు నుంచి అప్పులు తీసుకొన్నట్లు తెలిపారు. • 88% మందికి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు లేవని, 61% మందికి అసలు ఎటువంటి జీవనోపాదులు లేవని తెలియజేశారు • 57% మంది ఇతర ఉపాది అవకాశలు ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాని ఈ కోవిడ్ వల్ల ఎటువంటి ఉపాది అవకాశాలు వారికి లభించలేదు. ఫలితంగా వారు వారి కుటుంభాలు చాలా ఇబ్బందులు ఎడుర్కొనవలిసిన పరిస్థితే ఏర్పడింది • కోవిడ్ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వీరిలో కొంత మందికి ఉపాది అవకాశాలు లభించాయి. అయితే వీరికి తగిన విద్య, పనిలో నైపుణ్యాలు లేనందువల్ల, వివిధ జీవనోపాదులు గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలీ చాలని అతి తక్కువ వేతనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు • ప్రత్యామ్నాయ జీవనోపాధిని వారికి అవాంఛనీయమైన లేదా అసాధ్యమైనదిగా చేసే ఇతర ముఖ్య కారణాలు: వారు ఇష్టపడే జీవనోపాదులు లభ్యం కాకపోవడం, బ్రోతల్ గృహాల వెలుపల వారు ఉండటానికి స్థలం లేకపోవడం, వేశ్యాగృహం లో ఉంటూ బయట ప్రత్యామ్న్యాయ ఉపాది, ఉద్యోగం తీసుకోవడంలో సిగ్గు, సమాజం తనను ఆదరిస్తారో లేదో అనే భయం మరియు పిల్లల సంరక్షణ కు తగిన మద్దతు లేకపోవడం / పిల్లలను ఒంటరిగా వేశ్యాగృహంలోనే విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోవడం లాంటి భయాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని సంస్థలు / వ్యక్తులు తప్పుడు వాగ్దానాలు చేయడం గురించి కూడా భయాందోళనలు. డిమాండ్స్: • ప్రభుత్వ ప్రణాలికలు మరియు సంక్షేమ ప్రయోజనాల నుడ్ని మమ్మల్ని మినహాహించవద్దు. మా పేదరికం, మా దుర్బలత్వం , అట్టడుగు స్తాయిలో ఉన్న మమ్ము సమాజంలో కలపండి • ఈ దేశంలోని మిగతా పౌరలందరికి లాగే మాకు సమాన హక్కులు ఇవ్వండి- రేషన్ కార్డులు అందుకునే హక్కు, బ్యాంకు ఖాతాలు తెరుచుకునే హక్కు, జనధాన్ యోజన ప్రోయోజనాలు పొందే హక్కు అధర్ కార్డులు, స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకునే ఆర్ధిక ప్రయోజనాలు పొందే హక్కు • మేము వేశ్యాగృహం నిర్వాహకులు, మేడంలు మరియు పింప్ లు వల్ల మాత్రమే కాకుండా కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు, ప్రైవేటుగా అధిక వడికి అప్పులు ఇచ్చే వారి ద్వారా కూడా మేము హింసకు, దోపిడీకి గురవుతున్నామని ప్రభుత్వాలు గుర్తించాలి, అలాగే మా సాధికారత, అన్ని రకాల దోపిడీ నుంచి మాకు రక్షణ కల్పిస్తూ మా సమస్యలు, మా హక్కులు వినడానికి వీలుగా ఒక పాలసీని రూపొందించండి • మమ్మల్ని నేరస్తులుగా చూడకండి, మా నిస్సహాయత ను ఆధారంగా చేసుకొని మమ్మ్మల్స్ని లైంగిక దోపిడీకి గురిచేసి మా నుండి లాభం పొందిన వారందరిని నేరస్తులుగా గుర్తించి వారికీ శిక్షలు వేయండి • సెక్స్ వర్కర్స్ 35 ఏళ్ళు దాటినా తర్వాత తమ జీవనం కోసం వ్యభిచార గృహాల యజమానులు, పింప్, మేడం మరియు త్రాఫ్ఫికెర్స్ గా మారకుండా వారిని నివారించటానికి వీలుగా సెక్స్ వర్కర్స్ కు రక్షణ, ఆర్ధిక పునరావాసం తో పాటు వారి సాధికారత కోసం రాష్ట మరియు జాతీయ స్తాయిలో ఒక పాలసీ ని రూపొందించండి • మమ్మల్ని రెస్క్యూ చేసిన వెంటనే పునరావాసం పేరున మమ్మల్ని ఆశ్రయ గృహాలలో నెలలు, ఏళ్ళు తరబడి ఉంచి మా (మానవ) హక్కులకు బంగం కలిగించవద్దు. అందుకు బదులుగా కమ్యూనిటీ ఆధారిత పునరావాస విధానాలను అనుసరించండి • అన్ని రకాల మానవ అక్రమరవాణా అడ్డుకునేందుకు వీలుగా ఒకే చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము • అక్రమరవాణాకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని చట్టాలు మరియు విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేందుకు రాష్ట ప్రభుత్వం పర్యవేక్షణ కమిటీ ని ఏర్పాటు చేయాలి. ఈ పర్యవేక్షణ కమిటీ లో సెక్స్ వర్కర్స్ మరియు అక్రమరవాణా నుండి విముక్తి పొందిన బాధితులు ను కూడా సబ్యులుగా నియమించాలి. • సెక్స్ వర్కర్స్ కు వివిధ ఉపాధి పధకాల్లో శిక్షణ ఇచ్చి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు వెంటనే ఏర్పాటు చేయాలి. • వారు ఉపాది శిక్షణలు పొందే సమయంలో వారి జీవనం కోసం ప్రతేక జీవన్ బ్రుతి కల్పించాలి. • సెక్స్ వర్కర్స్ కు GO Ms No: 1/2003 ప్రకారం సామజిక అవసరాలు (గృహాలు,ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు) తో పాటు తమ పిల్లల చదువు, రక్షణ భాద్యతలు ప్రభుత్వాలు చేపట్టాలి . • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్స్ వర్కర్స్ ను అప్పుల బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలి. అందుకు వీలుగా ఆర్థిక భద్రత (బ్యాంకు ఖాతాలను తెరవడం, కొత్త వెంచర్లను ప్రారంభించడానికి రుణాలు తీసుకోవడం మరియు భవిష్యత్తు కోసం పొదుపులు ప్రారంభించడం) అందించే ప్రత్యామ్నాయ జీవనోపాధి ప్రణాళికలను అందించడం ద్వారా రుణ బంధాల గొలుసును విచ్ఛిన్నం చేయాలి. • స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అందించి సేవలు పొందే సెక్స్ వర్కర్స్ మాత్రమే వారి వద్దః రిజిస్టర్డ్ అయి ఉన్నారు. కాబట్టి మిగిలిన సెక్స్ వర్కర్స్ కూడా రిజిస్టర్ అయ్యేవిధమగా ఒక విధానం రూపొందించాలి • చాలా మంది వ్యభిచారంలో ఉన్న మహిళలు బిసి, ఎస్సీ, ఎస్టీ వంటి గ్రూపులకు చెందినవారు, ఆయా సంబంధిత కార్పొరేషన్ సంస్థలు ద్వార వారికి G.O.Ms No.1 ప్రకారం రుణాలు ఇవ్వడంలో మద్దతు ఇవ్వాలి. అలాగే పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేలా సెక్స్ వర్కర్స్ సిబిఓల నుండి సిఫారసు రావాలి. మహిళలందరినీ వివిధ విభాగాలలోని అన్ని సంబంధిత పథకాలతో కవర్ చేయవచ్చ. • సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ పథకాల జాబితాను ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తూ మరియు వారికి ఆ పథకాల గురించి అవగాహనా కల్పించాలి • సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా బాధితులపై కళంకం మరియు వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: సెక్స్ వర్కర్స్ పట్ల వివక్షత తొలగించేలా చేయడానికి మరియు వారు తిరిగి సమాజంలో పునరేకీకరణను మరింత అంగీకరించేలా సమాజం యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి పౌర అవగాహన సదస్సులు ప్రారంభించబడాలి. • కోవిడ్ మహమ్మారి నేపద్యంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు సెక్స్ వర్కర్స్ అందరికి కనీసం ౩ నెలలు రేషన్ పంపిణి చసి వారికీ ఆర్ధిక సహకారం అందించాలి. ప్రభుత్వం నుండి

Featured ఆంధ్రప్రదేశ్

ఏలూరు ఘటన వ్యాధి కాదు… రియాక్షన్ మాత్రమే: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్

ఏలూరు ఘటన వ్యాధి కాదు… రియాక్షన్ మాత్రమే: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష సీఎంకు వివరాలు తెలిపిన కమిషనర్ భాస్కర్ తాగునీటిలో ఏమీలేదని వెల్లడి ఆహారంపై అనుమానాలు మిగిలున్నాయని వివరణ మరో నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యలు సీఎం జగన్ ఏలూరు ఘటనపై నిర్వహించిన సమీక్షలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పిలు నివేదికల ఆధారంగా సీఎంకు ఏలూరు ఘటనపై వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి కారణం వ్యాధి కాదని, రియాక్షన్ కారణంగానే ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారని భావిస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడానికి స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఏలూరు ఘటనలో బాధితుల రక్తంలో నికెల్, సీసం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. తాగునీటిలో ఏ సమస్యాలేదని నివేదికలు చెబుతున్నాయని, ఇక ఆహారంపై అనుమానాలు మిగిలున్నాయని తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారంలో సీసం, నికెల్ ఉండొచ్చని, ఏదైనా పురుగుమందుల అవశేషాలు కలిసినందువల్ల ఇలా జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గాల్లోనూ ఎలాంటి కాలుష్యం లేదని కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడిస్తోందని భాస్కర్ వివరించారు. కొన్ని హానికారకాల మూలంగా ప్రజలు రియాక్షన్ కు గురైనట్టు భావిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రజలు రియాక్షన్ కు గురికావడానికి దారితీసిన కారణాలు తెలిసేందుకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. బాబురావు

‘ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెను భారాలను మోపుతూ తిప్పలు పెడతున్నాయిని సీపీఎం నేత బాబురావు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం పనికిరాని సంక్షేమ పథకాలను పెట్టి ప్రజల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో దండుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన అన్నారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడతున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. మహిళలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు.

Featured తెలంగాణ

స్వర్ణకార కుటుంబం ఆర్థిక ఇబ్బందులు. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య

ఖమ్మం పట్టణంలో స్వర్ణకార కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక స్వర్ణకార కుటుంబంలో గోపాలపురం ప్రకాష్ గారి భార్య గోవిందమ్మ 48 సంవత్సరాలు,పెద్ద కుమార్తె రాధిక 31, రమ్య 30 సంవత్సరాలు ఈ ముగ్గురు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతాయో, లేదో అని ఆలోచిస్తూ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా మారడం, చాలీచాలని జీవితాన్ని నడపలేక మనోవేదనకు గురై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చాలా ఘోరమైన బాధాకరమైన విషయం. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం తరుపున ప్రగాఢ సంతాపాన్ని చేస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి ఆధునీకరణ చెందకపోవడం. గ్లోబలైజేషన్ పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల పెట్టుబడిదారుల వల, కార్పొరేట్ I జువెలరీ షాపు వల్ల స్థానిక స్వర్ణ కారులకు కుటుంబం గడిచే ఎటువంటి పరిస్థితి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఒకపక్క ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు మరొక పక్క కరోనా మహమ్మారి ప్రభావం వలన విశ్వకర్మ వృత్తిదారుల కుటుంబాలలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు ఈరోజుల్లో స్వర్ణకార కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కష్టంగా ఉండి అదేవిధంగా అనారోగ్యం తో పాటు పిల్లల చదువులు ఎదిగివచ్చిన ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతాయో జరగవు అని ఒక భయం ఏర్పడింది కాబట్టి ఇటువంటి సంక్షోభ కాలంలో ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకార కుటుంబాలకు అదేవిధంగా విశ్వకర్మ వృత్తులు అయినటువంటి కమ్మరి కంచరి శిల్పి వడ్రంగం వృత్తుల వారిని ఆదుకోవాలని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో కేటాయింపులు తగు విధంగా జరిపి వృత్తుల పరిరక్షణ కి తగు చర్యలు తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ సమాజం డిమాండ్ చేస్తుంది .

Featured తెలంగాణ

టీచర్ల పదోన్నతి ఎడతెగని కలేనా!**ఎం ఎన్ విజయ్ కుమార్

* *టీచర్ల పదోన్నతి ఎడతెగని కలేనా!* *రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు* *ఎం ఎన్ విజయ్ కుమార్* *RUPP STATE VICEPRESDENT*…. మిగతా అన్ని శాఖలలో పాత జిల్లాలు/ జోన్ల ప్రాతిపదికన ప్రమోషన్స్‌ కల్పిస్తూ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ పొందని, ఒకే క్యాడర్‌లో ఇరవై సంవత్సరాలకు పైగా సర్వీస్‌ చేసి అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్‌ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక ప్రధాన వర్గం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా వేతనాలు ఇస్తామని ఉద్యమ నేతగాను, ముఖ్యమంత్రిగాను కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించగానే పదోన్నతుల పండుగేనని ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ రూపకల్పనకు రెండు రోజులు చాలని ఆయన అన్నారు. పదవీ విరమణ నాడు ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని ఇంటి వద్ద దింపి అతనికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ అందే విధంగా ఉండాలనీ, వేరువేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులను ఒకే దగ్గరికు తీసుకురావాలని పాత సంప్రదాయాలకు భిన్నంగా పీఆర్సీ కమిటీలు నివేదిక సమర్పణకు సుదీర్ఘకాలం జాప్యం చేయకుండా 3 నెలల్లోనే నివేదిక అందించేలా చూస్తామని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి ఉద్యోగులలో ఆశలు రేకెత్తించారు. మొదట్లో ఆయన పేర్కొన్నట్లుగానే ఎంప్లాయీ ఫ్రెండ్లీ పాలనలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి తెలంగాణ ఇంక్రిమెంటు; 2015లో 43శాతం ఫిట్‌మెంటుతో పీఆర్‌సీ, రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రశంసిస్తూ ఒక నెల అదనపు వేతనం, మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్‌కేర్‌ లీవు, ‘సకల జనుల సమ్మె’ కాలానికి సెలవుల మంజూరు తదితర అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ చర్యలను రాష్ట్రప్రభుత్వం అమలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే 16న వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 18 అంశాల విషయంలో హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు హామీలుగానే ఉండిపోయాయి. సమస్యలను పరిష్కరించటం అటుంచి, వాటిని కనీసం ఆలకించటం లేదనే అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గంలో నెలకొన్నది. రెండున్నర సంవత్సరాలైనా పీఆర్‌సీ అమలులోకి రాకపోవటం, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు పదవీ విరమణ వయస్సు పెంపు జరగకపోవటం, సిపిఎస్‌ రద్దు అంశంలో ప్రగతి లేకపోవటం, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు లేకపోవటం, ప్రమోషన్ల విషయంలో తీవ్ర జాప్యం జరగడం మొదలైన అంశాలు ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తున్నవి. ప్రస్తుతం కరోనా విపత్తుతో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయవర్గంలో అసంతృప్తికి ప్రధాన కారణం 2015 జులై నుంచి అంటే దాదాపుగా ‘ఆరు సంవత్సరాల నుంచి’ పదోన్నతులు లేకపోవడం. వీటి విషయంలో మిగతా ఉద్యోగులతో పోల్చితే ఉపాధ్యాయవర్గం కాస్త ఆలస్యంగా ప్రయోజనం పొందడం ఆనవాయితీగా ఉంది. దీనికి తోడుగా అర్హతలు, అవకాశాలు ఉండి కూడా ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో వారిలో తీవ్ర నిరాశ, నిర్లిప్తతలు నెలకొన్నాయి. 2009 జనవరి 26 నాటి జీఓ. నెం. 15 ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 1 మొదలు తరువాతి సంవత్సరం ఆగస్టు 31 వరకు ఉన్న ఖాళీలకు సంబంధించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చే వీలు కల్పించింది. 2010 నవంబర్ 20 నాటి జీవో నెం. 67 ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు ఏ నెల ఖాళీలకు తదుపరి నెలలో పదోన్నతులు కల్పించే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జీవో నెం. 67 ను రద్దుచేస్తూ, జీవో నెం. 15 ప్రకారం ప్రతి సెప్టెంబర్‌ 1 నుంచి తరువాత సంవత్సరం ఆగస్తు 31 వరకు ఏర్పడిన ఖాళీలను, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 12న జీవో నెం. 32 జారీ చేసింది. అయినప్పటికీ గత ఆరు సంవత్సరాలుగా టీచర్ల ప్రమోషన్లు లేకపోవడంతో అటు టీచర్లకే కాక, విద్యావ్యవస్థకు కూడా తీవ్ర నష్టం జరుగుతోంది. కోర్టు కేసుల పేరుతో ప్రమోషన్లకు సంవత్సరాల తరబడి వాయిదా వేయడం శ్రేయస్కరం కాదు. రాష్ట్రంలోని మిగతా అన్ని శాఖలలో పాత జిల్లాలు, జోన్ల ప్రాతిపదికన ప్రమోషన్స్‌ కల్పిస్తూ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవడం భావ్యం కాదు. 30 సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ కూడా పొందకుండా పదవీవిరమణ చేస్తున్న టీచర్లు, ఒకే క్యాడర్‌లో 20 సంవత్సరాలకు పైగా సర్వీస్‌ చేసి అర్హతలు, ఖాళీలు ఉండి కూడా ప్రమోషన్స్‌ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వo కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ఈ ప్రక్రియ చేపట్టే వారికి పదోన్నతులతో పాటు అంతర్ జిల్లా మరియు సాధారణ బదిలీలు చేపట్టాలని పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఎన్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు

Featured

ఏదీ నిర్ధారణ కాలేదు* *వింతవ్యాధిపై సాగుతున్న పరిశోధనలు* ఆళ్ల

*సీసం, నికెల్‌పై అంచనాలు ప్రాథమికం* *నీళ్లలో ఈ-కోలిపైనా ఇప్పుడే చెప్పలేం: ఆళ్ల* విజయవాడ : ఏలూరులో వారంరోజులుగా కలకలం సృష్టిస్తున్న అంతుచిక్కని వింతవ్యాధికి కారణాలేమిటనేది ఇంతవరకు పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్‌, ఐసీటీసీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చిన నిపుణులతో కూడిన వైద్య బృందాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. గురువారం ఉదయం ఆళ్ల నాని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యసేవల గురించి, ఆహార పదార్థాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఏలూరులో వింతవ్యాధికి గురైన బాధితుల రక్తపరీక్షల రిపోర్టుల ఆధారంగా వారి శరీరాల్లో సీసం, నికెల్‌, ఆర్గానో క్లోరిన్‌ తదితర అవశేషాలు ఉన్నట్టు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు. ఏలూరు ప్రజలు తాగుతున్న నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా, ఇతర కారకాలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. జాతీయ వైద్య బృందాలు ఇంకా శాంపిల్స్‌ను సేకరిస్తూ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతీయ వైద్యబృందాల ప్రతినిధులతో మాట్లాడినపుడు, శుక్రవారం సాయంత్రానికి నివేదికలు సమర్పిస్తామని చెప్పారు. ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది’’ అని వివరించారు. బుధవారం ఇద్దరు బాఽధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరణించడంపై విలేకరులు ప్రశ్నించగా.. వారిద్దరూ ఏలూరులో వెలుగుచూసిన వ్యాధి లక్షణాలతో చనిపోలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. ఒకరు కరోనా వైర్‌సతోను, మరొకరు ఊపిరితిత్తుల సమస్యతోను మరణించినట్లు మంత్రి చెప్పారు. బాధితులకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తుండటంతో, ఇప్పటికే వందల మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని తెలిపారు

Featured

రాయపాటి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

రాయపాటి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మను బోలు (పున్నమి విలేకరి)6,డిసెంబర్: రాయపాటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం దివంగత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా హరిజనవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం రాయపాటి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరారు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు రాజ్యాంగ సృష్టికర్తకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. బుజుగేంద్ర బాస్కర్ శీనువాసులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Featured

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉపాధి హామీ సిబ్బందికి ఆర్థిక సహాయం అందజేసిన కిరణ్ కుమార్ రెడ్డి

ప్రమాదంలో గాయపడ్డ ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు. స్పందించిన అక్కంపేట మాజీ సర్పంచ్ : కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేత మనుబోలు( పున్నమి విలేఖరి) 6, డిసెంబర్ :మనుబోలు మండలం ఉపాధి హామీ లో సాంకేతిక సహాయకునిగా విధులు నిర్వహించే చింతా శ్రీనివాసులు కు గత మూడు రోజుల క్రితం జరగిన ప్రమాదం లో కాలు తొలగించడం జరిగింది విషయం తెలుసుకున్న మునుబోలు మండలం అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనేత కిరణ్ కుమార్ రెడ్డి చింతా శ్రీనివాసులు కుటుంభం ను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించారు మనుబోలు మండలం లో ఎవరు ఆపదలో ఉన్న సాయం చేసే కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి తమ సేవ భావమును చాటుకోవడం పట్ల మండల వ్యాప్తంగా పలువురు ఆయనను అభినందించారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.