Friday, 1 May 2026

Blog

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రజాసంకల్ప వేదిక తూర్పు గోదావరి జిల్లా రివ్యూ మీటింగ్

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రజాసంకల్ప వేదిక తూర్పు గోదావరి జిల్లా రివ్యూ మీటింగ్ జిల్లా ఇంఛార్జి ఎస్ ఎమ్ భాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ మీటింగులో ఆర్టీఐ కార్యకర్తలు నిర్వహించవలసిన విషయాల గురించి మరియు సంస్థ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి చెయ్యవలసిన కర్తవ్యాలు గురించి చర్చించడం జరిగింది, మరియు స్థానికులకు ఆర్టీఐ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ రాబర్ట్ రవిచంద్ర గారిని గెస్ట్ గా పిలవడం జరిగింది, ఆయన సమావేశాన్ని ఉద్దేశించి అనేక విషయాలు వివరిoచారు. ఈ కార్యక్రమానికి psv ఆర్టీఐ కమిటీ తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు కోదాటి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ యాకూబ్ గారు, వైస్ ప్రెసిడెంట్2 ముల్లా శేఖర్ గారు, మరియు జిల్లా కమిటీ అడ్వైజరు వడ్డి నరేష్ గారూ, అడ్వైజరు కార్యక్రమం నిర్వాహక కార్యదర్శి రెడ్డి సత్య సుబ్రహ్మణ్య శర్మ గారు, మరియు సంస్థ సభ్యులు, సుమారు ఇరవై అయిదు మంది సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు, కార్యక్రమం లో కొంతమందికి ఐడి కార్డు లు అపాయింట్ మెంట్ లెటర్స్, స్టిక్కర్లు ప్రదానం చెయ్యడం జరిగింది

తిరుపతి

ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు పార్టీలకు అతీయుతంగా సహాయం చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి రూరల్ లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక సాయం కొరకు అభ్యర్థించిన వారి అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందిన 14 మంది కి గాను 9,04,857 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధికంగా సహాయం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారన్నారు.

జోగులాంబ గద్వాల

ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజని కలిసి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు

*ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారిని నేడు మర్యాదపూర్వకంగా కలిసి* *రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో* *పార్టీ బలోపేతానికి కృషి చేసిన యువజన కాంగ్రెస్ నాయకులను గుర్తించి సీట్లను కేటాయించాలని కోరిన* *తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు…*

తిరుపతి

ఉన్నం వారి మంగళ స్నానం వేడుక లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మల కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి పంచకట్టు వేడుక సందర్భంగా మంగళ స్నానాలు మరియు నలుగు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి,శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై,ఉన్నం చెంచు చరణ్ సాయి ఆశీర్వదించారు.ఈ వేడుకలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు.

తిరుపతి

ఘనంగా గురుదాస్ కామత్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి గురుదాస్ కామత్ జి జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఘనముగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా,ఆల్ ఇండియా సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్ర రాష్ట్ర చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అర్జున గురుమూర్తి,కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సెక్రెటరీ భాస్కరరావు యాదవ్, తిరుపతి జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ నిత్యానందం ,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమాశంకర్ విచ్చేశారు. అనంతరం గురుదాస్ కామత్ జీ చిత్రపటానికి పూల మాలలు,వేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అంతా నేను చూసుకుంటాను అధికారులకు చైర్మన్ చిట్టిబాబు హామీ

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 05 (పున్నమి న్యూస్) తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట అన్న చందంగా మారింది కొండపల్లి మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతికి పాల్పడుతున్న అధికారుల తీరు. అంతా నేను చూసుకుంటాను మీకేం భయం లేదు అంటూ మున్సిపాలిటీ చైర్మన్ హామీ ఇవ్వడంతోనే మున్సిపాలిటీ కమీషనర్ , మున్సిపాలిటీలోని రెవెన్యూ అధికారి కలిసి మున్సిపాలిటీ పరిదిలోని ఓ భహుళ అంతస్తుల భవనానికి రాకుండా తూ తూ మంత్రంగా పన్నులు వేసి, సదరు యజమానికి ఆర్ధీక లబ్ది చేకూర్చినందుకు సదరు యజమానికి చెందిన విజయవాడలోని ఓ నగల దుఖాణం నుంచి నజరానాగా బంగారు కానుకలు అందుకున్నారంటూ మనం దిన పత్రికలో వచ్చిన కథనానికి మున్సిపాలిటీలోని ఓ అధికారిణి స్పందించారు. ఆ ఘటనలో తన పాత్ర ఏమీ లేదని చెప్పారు. అయితే చైర్మన్ అంతా నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడంతోనే మున్సిపాలిటీ కమీషనర్, పన్నులు విధించే రెవెన్యూ అధికారి కలిసి ఆ పని చేశారంటూ చెప్పుకొచ్చారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లు నగల దుఖాణం పేరును కూడా సదరు అధికారిణి మాటల మద్యలో స్పష్టం చేసి మళ్లీ నాలుక కరుచుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉండగా ఇంటి పన్నుల వ్యవహారంలో తనకు ఎటువంటి సంభందం లేదని చెప్పిన అధికారిణి గురించి వాకబు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ టెండర్ లకు సంభందించిన డిజిటల్ కీ తన దగ్గర పెట్టుకొని, కాంట్రాక్టర్ లను తానే డిసైడ్ చేస్తూ భారీ అవినీతికి తెర తీశారని సమాచారం. ఆన్ లైన్ టెండర్ ద్వారా తనకు నచ్చిన గుత్తే దారుకి టెండర్ కనిపించే విధంగా, నచ్చని వారికి టెండర్ కనిపించకుండా చేస్తూ… టెండర్ దక్కించుకున్న వారి వద్ద నుండి నజరానాగా లక్షలాది రూపాయలను కమీషన్ల రూపంలో దోచుకోవడంతో పాటు తన కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని జగ్గయ్యపేట నుండి కొండపల్లికి గుత్తే దారుడిగా తీసుకువచ్చి, అతనికి టెండర్ పనులను దోచిపెడుతూ, టెండర్ కు సంభందించిన సమాచారం దాచి పెట్టే విదంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ చైర్మన్, అధికారులు కలిసి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ టెండర్ డిజిటల్ కీ ని మేనేజ్ చేస్తూ, అన్నీ పనులను ఆ ఐదుగురు కాంట్రాక్టర్ లకే వచ్చేలాగా చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంకు చెందిన మరో తోక వీరున్ని కాంట్రాక్టర్ గా ప్రోత్సహిస్తూ రోజు వారీ కొనుగోళ్లను అతడి ద్వారా కొనుగోలు చేయిస్తూ, అతడితో చేతులు కలిపి అతడు రాసిందే రేటు, అతడు వేసిందే బిల్లు అనే విధంగా ఎప్పటి డబ్బులు అప్పుడు దోచుకుంటున్నారనే వాధనలు లేకపోలేదు. మరో కీలకమైన అధికారిణి రెవెన్యూ అధికారితో కలిసి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, ప్రభుత్వం, ప్రయివేటుకు చెందిన బహుళ అంతస్థుల భవనాలకి గతేడాది కోట్లాది రూపాయల పన్నులను ఖజానాకు రాకుండా తూ తూ మంత్రంగా పన్నులు విధించి, సదరు యజమానికి ఆర్ధీక లబ్ది చేకూర్చినందుకు గాను వద్ద నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు నజరానాగా అందుకున్నారని మున్సిపాలిటీలోని ప్రజలు గుసగుస లాడుకుంటున్నారు. తూ తూ మంత్రంగా వేసిన పన్నులతో వచ్చిన కొద్ది మొత్తం నిధులను కూడా తోక వీరుడు లాంటి గుత్తేదారులతో చేతులు కలిపి ప్రజాధనాన్ని కాజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్ అండదండలతోనే అధికారిణులు అక్రమాలకు పాల్పడ్డారని అధికారులే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కొసమెరుపు. అయితే ఆ విధంగా వచ్చిన అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని తమకు అనుకూలంగా వార్తలు రాసే వారికి నెలా వారి మామూళ్లుగా ఇస్తూ కొంతమంది అసత్య కథనాలు రాసే వారితో తప్పుడు కథనాలను వండి వారుస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తూ వికటాట్టహాసం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటువంటి అక్రమాలను ప్రశ్నిస్తున్న మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ పైన అవమానకరంగా, వ్యక్తి గత హననం చేస్తూ వార్తలు రాయించడం ఎ ఇ కి వెన్నతో పెట్టిన విద్య అని స్థానికులు చెప్పుకుంటున్నారు. దీని పైన మున్సిపాలిటీ శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు విచారణ చేస్తే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడడంతో పాటు, ప్రజలకు మంచి చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. *మూడు పార్టీలలో కర్చీపు వేసుకున్న చైర్మన్ చిట్టిబాబు* కొండపల్లి అడవి క్వారీకి సమీపంలో సర్వే నెంబర్ 143, 26/2 లలో మైనింగ్ శాఖ కళ్లు గప్పి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తాను చైర్మన్ ను అని ఏమైనా నేను చూసుకుంటాలే అని అధికారులను మభ్య పెడుతూ విజయవాడలోని ఇళ్ల ప్లాటులకు ప్రతీ రోజు వంద నుండి 150 లారీల మట్టిని తరలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పటాపంచలతో కలిసి భూధేవికి ఓట్లేయాలంటూ వసంతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారంటూ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పైన సొంత పార్టీ నేతలే విమర్శలు సందిస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ వసంతకు చేరడంతో పటాపంచలను వసంత దూరం పెట్టారని సమాచారం. అయితే రామచంద్ర యాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో వసంతకు వ్యతిరేకంగా టిడిపి ఓట్లు చీల్చడం ద్వారా తన సామాజిక వర్గానికి చెందిన వైసిపి అభ్యర్ధి సర్నాల తిరుపతిరావును గెలిపించేందుకు శతావిధాల శక్తి వంచన లేకుండా చిట్టి చిట్టి ప్రయత్నాలు చేశారని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అందులో బాగంగానే వైసిపి అనుకూల మీడియాతో అంటకాగుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. బివై పార్టీ కార్యాలయం ఆవిష్కరణ సభకు మనుషులను తరలించేందుకు గాను తన సొంత నిధులతో బస్సులను కూడా ఏర్పాటు చేసి అందరినీ విశ్మయానికి గురి చేశారని చెప్పుకుంటున్నారు. తాను టిడిపిలో ఉంటూ, తన అన్న కుమారుడిని వైసిపిలో ఉంచుతూ మరో భూదేవిని బివై పార్టీలోకి పంపి మూడు పార్టీలలో తన హవా నడిపిస్తున్నరని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చైర్మన్ చిట్టిబాబు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ఊహా గానాలు వినిపిస్తున్నాయి.

అన్నమయ్య

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నందు పాల్గొన్న Wisdom School విద్యార్థులు

అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 5( పున్నమి ప్రతినిధి అవినాష్ రెడ్డి) వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్, చెన్నై వారి ఆహ్వానం మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో నందలూరు మండలంలోfcని విస్డం స్కూల్ కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది , చెన్నైలోని SIVET College, సెంబాకం నందు జరిగినది, ఈ కార్యక్రమం నాకు దేశం నలుమూలల నుంచి 1500 మంది కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది, విస్డం స్కూల్ నుండి వి. మనోజ్ఞ సాయి, బి. నివేదిత, ఎస్. మోక్షిత్,వి. నిర్వాన్ నందన్, ఎస్. సమీనా, ఎస్. తసీఫా, ఎస్. సాదిక్, ఎస్. మౌలా, నిత్యశ్రీ మరియు గోపీచంద్ పాల్గొన్నారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తరుపున Mr రిషి నాథ్ Adjudicator వారి ముందు కరాటే విద్యను ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత రిషి నాథ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నందు ఈవెంట్ ని నమోదు చేసి వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందజేయడం జరిగింది మరియు పాల్గొన్న విద్యార్థులకు పథకాలని మరియు సర్టిఫికెట్స్ ని అందజేయడం జరిగింది, మండలంలోని కరాటే మాస్టర్ సుధాకర్ ఈ కార్యక్రమానికి విద్యార్థిని తీసుకొని వెళ్లడం జరిగింది వారి అద్భుత ప్రదర్శన ద్వారా వారు ఈ అచీవ్మెంట్ ని సాధించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు మరియు విస్డం స్కూల్ కరస్పాండెంట్ వలిమి రాధ పిల్లల్ని అభినందించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఫోటో రైట్ అప్ : మాస్టర్ వలిమి సుధాకర్. నందలూరు

తూర్పు గోదావరి

ద్విచక్ర వాహన మెకానికర్ల సంక్షేమానికి కృషి – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

350 మంది మెకానిక్ లకు ప్రమాద బీమా బాండ్లు అందచేత రాజమహేంద్రవరం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది. స్థానిక ఆర్టీసి కంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో, టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాట ఇచ్చాం… నెరవేర్చమన్నారు. తమ కూటమి ప్రభుత్వం అవసరాలు తెలుసుకుని సంక్షేమ పధకాలు అమలు చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ లోని దాదాపు అన్నీ పధకాలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 15000 ఇస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ఆటో కార్మికులకు రూ. 10000 వేలు ఇస్తే తాము రూ. 15000 ఇచ్చామాన్నారు. రూ. 1400 కోట్లతో రోడ్లు బాగుచేసినట్టు తెలిపారు. షరతులతో కూడిన పధకాలు వారివి… హద్దుల్లేని సంక్షేమం మాది అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహకారంతో దాతలు కూడా ముందుకు వచ్చి పేదలను ఆడుకోవాలని పిలుపునిచ్చారు. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులు, క్రీడాకారులకు సహకారం అందించడం, అలాగే నిరుపేదలకు వైద్యం కోసం ఆర్ధికం సహకారం అందిస్తున్నామని తెలిపారు. మెకానిక్ల సంక్షేమం కోసం ప్రమాద బీమా చేయించినట్టు తెలిపారు. అందరి సంక్షేమాన్నే తాము, తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ మెకానిక్ డే రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు… ఇప్పుడు నెరవేర్చారు. భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేకం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతిపక్షంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటి అధికార పార్టీ వైకాపా ప్రజా ప్రతినిధి ఇబ్బందులు పెట్టాడు, ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెస్ట్ లేకుండా పని చేసే ప్రజా నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. నేనున్నానంటూ తోడుండే నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఆయన అని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా మాట్లాడుతూ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏకైనా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చర్చ్ లు, మసీదులు, దేవాలయాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం అందరి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేసింది. మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శంగా మన రాజమండ్రిని నిలిపేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ద్విచక్ర మెకానికర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

గ్రూప్ 2 ఫలితాల్లో మండల పరిషత్ ఆఫీసర్ గా ఎన్నికైన :వల్లాల గ్రామ మహిళ

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూపు 2 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వల్లాల గ్రామానికి చెందిన జాల భిక్షం,భద్రమ్మ గార్ల కూతురు అయిన జాల రజిత మండల పరిషత్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడంతో వల్లాల గ్రామ ప్రజలు, ఉద్యోగ మిత్రులు, విద్యావంతులు, ఎక్కువగా హాజరై ఆమె ను, వారి తల్లిదండ్రులను, భర్త సైదులును సన్మానించడం జరిగింది.

కామారెడ్డి

గాంధారిలో సందడి రెడ్డి మల్లేష్ ఘనంగా జన్మదిన వేడుకలు

కామారెడ్డి,05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : హరీష్ రావు సభానంతరం.. మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమక్షంలో వేడుకలు నిర్వహిం చారని రెడ్డి మల్లేష్ తెలిపారుమాజీ మంత్రి హరీష్ రావు సభతో కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం లో నెలకొన్న రాజకీయ సందడి కొనసాగింది. ఈ సభానంతరం, బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన పలువు రు కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో రామారెడ్డి మండలం గొల్లపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రెడ్డి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనం గా జరుపుకున్నామన్నారు.వేముల ప్రశాంత్ రెడ్డి గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మె ల్యే గంప గోవర్ధన్, మాజీ జుక్కల్ ఎమ్మెల్యే హను మంత్ షిండే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు, జిల్లా అధ్యక్షులు మొజిబుద్దీన్, పడి గెల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, తనజీ, శివాజీ రావు, సాయి గౌడ్, లింబాద్రి తదితరులు హాజరయ్యారు.ఉద్యమ నాయకులైన పెద్ద మల్లేష్ యాదవ్, కందుర్రి నరేష్, ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు సుమన్, సీని యర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, ఉద్యమ నాయకులు పులి, జంగం లింగం వంటి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రెడ్డి మల్లేష్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకు న్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, రెడ్డి మల్లేష్ సేవలను అభినందించారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత, కార్యకర్తలను సమన్వయం చేసు కునే తీరును ప్రశంసించారు. జన్మదినం సందర్భం గా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాం క్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.