Saturday, 2 May 2026

Blog

అనకాపల్లి

ఉరలోవ కోండ భూ సమస్య పై.కూటమి నాయుకులకు అవగాహన లేదు,సిపిఎం

వి.మాడుగుల–ఉరలోవ కోండ భూ సమస్యల పై కూటమి నాయుకులకు పూర్తిగా,అవగాహన.లేకుండా జిల్లా కలెక్టర్ ఇచ్చిన అదేశాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ద్వారా జిల్లా కలెక్టర్ కు చేప్పించి అడ్డు కుంటున్నారని దీనికి తగిన మూల్యం చేల్లించక తప్పదని వారు స్పష్టం చేసారు శనివారం వీలేకర్లు సమాశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి,వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్వవసా యకార్మికసంఘం జిల్లా ఉపాద్యాక్షులు కె భవాని తదితరులు మాట్లాడారు వమ్మలి,జగన్నాదపురం క్రీష్ణాపురం,మరియు,రావికమతం మండలం కొమిరి గ్రామాల్లో 6 వ విడత భూ పంపిణీలో ఉరలోవ కొండకు చుట్టు 450 మందికి పట్టాలు ఇచ్చిన భూములకు సర్వే నెంబర్లు సరి చేయడం కోసం గ్రామ సభలు జరిపి వెంటనే వెబ్ లెండ్ లో నమోదు చేయాలని గత నెల 27 వ తేదిన జిల్లా కలెక్టర్ స్పష్ట మైన అదేశాలు ఇచ్చిన దాని పై మరల ఉరలోవ కోండ భూ సమస్యపై కూటమి ప్రభుత్వ బాధ్యత తీసు కోని పేదలకు న్యాయం చేస్తామని చేప్పడం లో అర్థం లెదన్నారు ఇప్పటికే సిసిఎల్ఏ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ సర్వే నెంబర్లు సరి చేసి,పట్టాలు ఇవ్వని వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని అదేశాలు ఇచ్చిన దానిని ఆడ్డు కోని పేదలకు అన్యాయం చేస్తుంది చాలక ప్రజలను తప్పుదోవ పట్టిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇది సరియైనది కాదని తెలిపారు 2016 – 2017లో 6 వ విడత భూ పంపిణీలో ఉరవ కొండ చుట్టు వందలాది మంది పేదలకు గిరిజనులకు ధళితులకు నాటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు గల ఏ భూములు వెబ్ ల్యాండ్ లో నమోదు అవ్వ లేదన్నారు, పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు కు పేదల సాగులో ఉన్న సర్వే నెంబర్లు గల భూములకు సంభంధం లెదని తెలిపారు దీని వలన పట్టాదార్లు అందరు తీవ్ర ఆందోళన చేందు తున్నారని తెలిపారు,రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు వలన పేదలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమపథకాలు,స్కీములు అమలు కావడం లేదన్నారు. 2016 వ సంవత్సరం నుండి అనేక పర్యాయాలు వి మాడుగులం తహశీల్దార్ కు జిల్లా కలెక్టర్ కు గ్రామాల్లో జరిగిన రైవెన్యూ సదస్సుల లోను అనేక సార్లు ధరఖాస్తులు పెట్టుకు న్నారని తెలిపారు, దీంతో జిల్లా కలెక్టర్ అమరావతి సిసిఎల్ కు.సమస్య పరిష్కారం కోసం వ్రాయడం జరిందన్నారు ఆగస్టు 11 న సిపిఎం నాయకులు తో పాటు ఈ గ్రామాలకు చేందిన పేదలు విజయవాడలో సి సి ఎల్ ఎ కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించడం తో పాటు 26 తేదీన వమ్మలి లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరి తాళ్ళుతో నిర్సన తెలపడం జరిగిందన్నారు దీంతో కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామసభ జరిపి లబ్ధిదారులను గుర్తించి పట్టాలు లెని వారికి పట్టాలుతో పాటు గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ వెబ్ లెండ్ లో సరి చేయాలని అదేశాలు ఇచ్చారని తెలిపారు అయి నప్పటికీ కూటమి నాయకులు రాజకీయ వత్తిళ్ళుకు తలవగ్గి నర్సీపట్నం ఆర్ డి ఓ స్తానిక తహశీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను చేత్త బుట్టలో వేసారని అగ్రహారం వ్యక్తం చేశారు ఇది చాలదన్నట్లు కూటమి నాయకులు ఎమ్మెల్యే కలెక్టర్ తో మాట్లాడారని ఉరవ కొండ బాదితులకు న్యాయం చేస్తామని గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఇది ప్రజలు గ్రహి స్తున్నారని తెలిపారు గత పదహేను సంవ త్సరాలుగా ఈ సమస్యపై సిపిఎం ప్రజాసంఘాలు అందోన చేస్తున్నాయని గుర్తు చేసారు ఇప్పుడు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ పేదలకు న్యాయం చేయడం కోసం ఇచ్చిన ఆదేశాలను కూటమి నాయకులు అడ్డు కోవడం మంచి పద్దతి కాదని కూటమి నాయుకులకు అవగాహన రాహిత్యం వలన చేస్తున్న పోరపాటు పనులు పేదలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు వెంటనే జిల్లా కలెక్టర్ అదేశాలను అమలు చేయాలని ఉరవ కొండ భూ సమస్య పరిష్కారం చేసి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు,

చిత్తూరు

మున్సిపల్ సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే*

పలమనేరు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్చత అవార్డు రావడం పై హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణ రెడ్డితో పాటు సిబ్బందిని అభినందించి సన్మానించిన పలమనేరు శాసన సభ్యులు శ్రీ. ఎన్. అమరనాథ రెడ్డి గారు…. ఈ సందర్భంగా ప్రజలు అధికారుల పరస్పర భాగస్వామ్యంతోనే ఈ అవార్డు దక్కిందని దీంతో మనందరిపై మరింత బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో జాతీయస్థాయిలో అవార్డును దక్కించుకునేలా అందరూ కలిసికట్టుగా పనిచేసి పారిశుధ్యంలో పలమనేరుకు మంచి పేరును తీసుకొద్దామని ఆయన కోరారు. మున్సిపల్ పరిధిలో సమస్యలు ఏదైనా ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి చెత్త సేకరణ విషయంలో సహకరించి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారుల తో పాటు సిబ్బంది ఉన్నారు..

E-పేపర్

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకలు

రైల్వేకోడూరు ఇంద్ర బస్ షెల్టర్ దగ్గర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మార్కెట్ చైర్మన్ పగడాల వరలక్ష్మి, పగడాల చంద్రశేఖర్ . జోగినేనీ మనీ . పగడాల వెంకటేష్ , కారుముంచి సంయుక్త . ఆలం రమేష్ , ఏనుగులు జగన్మోహన్ రాయులు , గుబ్బూరు హరి , కనకరాజు , పాడాల శివ , వేదం బీదం నవీన్ కుమార్ కొండేటి రమణ , సాదు కిషోర్ , పసుపులేటి వెంకటరమణ , చెన్న కిట్టయ్య , కటికం నాగేంద్ర , రాగిపాటి విజయ్ ,మరియు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

చిత్తూరు

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక !)ఆదరించిన స్థలాన్ని మరువం !!)రిటైర్డ్ చిత్తూరు డీవైఈఓ వాసు వృత్తిపరంగా పనిచేసినా ఆదరించిన స్థలాన్ని తాము ఎప్పటికీ మరువమని చిత్తూరు రిటైర్డు డివైఈఓ వాసుదేవ నాయుడు అన్నారు.స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ నందు 1990 – 2000 దశకములో పనిచేసిన ఉపాధ్యాయులు,ఉపన్యాసకులు ఆఫీస్ సిబ్బంది కలసి శనివారం ఆత్మీయ సమావేశం ఆ పాఠశాలలో నిర్వహించు కొన్నారు.అందరం కలసి ఒకరికొకరు యోగక్షేమాలు తెలిసికొని ఆ నాటి తీపిగుర్తులు నెమరు వేసుకొన్నారు.ఇందులో భాగంగా అప్పటి సహచరులు చాలా మంది మరణించగా వారినందరినీ ఒకసారి గుర్తు చేసుకొని వారికి నివాళులర్పిoచారు. రిటైర్మెంట్ పొందిన వారు రిటైర్డ్ మెంట్ ముందు,తరువాత జరిగిన విషయాలను అందరితో పంచుకొని సరదాగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డు చిత్తూరు డివైఈఓ వాసుదేవ నాయుడు మాట్లాడుతూ…..మనం పనిచేసినపుడు వున్న భవనాలు, స్థలo కూడా లేదని ఈ స్థలంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడడo తో ఎందరో విద్యార్థులు ఇక్కడే చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదిగారన్నారు. ఈ పాఠశాలలో పనిచేసిన బదిలీ అయిన వారు రిటైర్డ్ అయినవారు ఈ కాంపౌండ్ లోకి కూడా రాక నేడు ఆత్మీయ సమావేశంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకసారి మనల్ని ఆదరించిన ఇక్కడి స్థలాన్ని సందర్శిoచడంతో జన్మసార్ధక మయ్యిందన్నారు. మరో సారి ఇక్కడ కలసి మంచి కార్యక్రమo నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.చివర సన్మానాలు జరుపుకొని భోజన కార్యక్రమముతో ముగించారు. ఇందులో గంగవరం యాదమరి మండల విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి, రుక్మిణమ్మ,సీనియర్ రిటైర్డ్ ఉపాద్యాయులు రంగారెడ్డి, రిటైర్డు ఉపాన్యాసకులు సుధాకర పిళ్ళై,ఈశ్వర్ రెడ్డప్ప,గుణశేఖర్,రిటైర్డ్ ఎంఈఓ వెంకటరమణ,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆదెమ్మ, వసుoధర,రామేశం,కేశవ పిళ్ళై,దుర్గాంబలతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులు నారాయణ బాబు,హరిప్రసాద్,వెంకట్రామయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐💐 బి. ఎన్ కండ్రిగ మండల అధ్యక్షుడు కె. మణి నాయుడు గారి శారద్యం లో ముఖ్య అధిదులుగా సత్యవేడు ఇంచార్జ్ నూకతోట రాజేష్ గారు మరియు వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భేరేంద్ర రాజు గారు భాను రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని బి ఎన్ కండ్రిగ మండలంలో వైఎస్‌ఆర్సీపి నేతల ప్రజాప్రతినిధులు, యువత, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా కేక్ కట్ చేసి, బాణాసంచా నడుమ వేడుకలను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సమిష్టిగా జరిపిన ఈ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొని . పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర sc సెల్ ప్రధాన కార్యదర్శి ఉగ్గుముడి గురునాధం,రాష్ట్ర గ్రీవిన్స్ కార్యదర్శి సాయి నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కో కాన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి జిల్లా క్రియశీలక అనుబంధ విభాగల నాయకులు వైస్ ఎంపీపీ బాబు రెడ్డి, అజయ్ రెడ్డి జయ చంద్ర నాయుడు వెంకటేశ్వర్లు , నాగూర్,మాజీ, సర్పంచ్ గురవయ్య, ఎక్స ఎంపీపీ నియోజగవర్గం మహిళా అధ్యక్షురాలు మాణిక్యాల వెంకటమ్మ ,ప్రెసిడెంట్ వెట్టి ప్రసాద్, అమరలింగయ్య,ఉప అధ్యక్షుడు ప్రసాద్ పాల్ ,ప్రసాద్ ,అశోక్, సురేష్, బాలయ్య, రమేష్ నాయుడు, పెంచలయ్య, చెచ్చమ్మ,యాకోబు, చంద్రారెడ్డి సుధీర్,సర్పంచ్ కిష్టయ్య, పైపురు వెంకటకృష్టయ్య కత్తి సురేష్, చంద్ర, ధర్మయ్య, లక్ష్మీపతిరెడ్డి,బట్ట వెంకటేష్, కేశవులు,యాదవ్,శివయ్య,పరంధామయ్య,చీకోలు అశోక్, ధనంజయాలు,మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్,కారణి వెంకటేష్ ,కత్తి శివ, మురళి నడిపయ్య, T వెంకటేష్ మంగయ్య, మోహన్, సిద్దెశ్వర్,వెంకటమ్మ,మురళి,కిక్ వెంకి శేఖర్,జగన్ , కార్యకర్తలు పాల్గొన్నారు

తిరుపతి

లైసెన్స్ లు లేకుండా టపాసులు అమ్మడం నేరం:టూ టౌన్ సిఐ

శ్రీకాళహస్తి లో శనివారం టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రానున్న దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను పరిశీలించి దుకాణదారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అక్రమంగా టపాసులు అమ్మకూడదని,లైసెన్సు లేకుండా అక్రమంగా బాణాసంచా నిలువ ఉంచిన,రవాణా చేసిన,అమ్మిన కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు.ప్రజలందరూ దీపావళి సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోక్కును చెల్లించిన ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్

ఏన్కూరు మండలం పరిధిలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శనివారం వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాచారం గ్రామానికి చెందిన బొబ్బిలి అనే కాంగ్రెస్ కార్యకర్త మోక్కును చెల్లించడానికి వచ్చినట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో వైరా అసెంబ్లీ స్థానం నుండి మాలోత్ రాందాస్ నాయక్ విజయం సాధించాలని కార్యకర్త బొబ్బిలి ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. అతని కోరిక మేరకు మోక్కును చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీని త్వరలో ఎన్నుకొని, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవాలయం నుండి ఏన్కూర్ ప్రధాన సెంటర్ వరకు సుప్రభాతం వినేందుకు మైకులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, ఈవో శేషయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ నరేందర్, ఏఎంసీ చైర్మన్ లచ్చిరాం నాయక్, ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్, మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, హిమామ్ నగర్ మాజీ సర్పంచ్ మాలోతు నరసింహారావు, వక్కంతుల నాగార్జున, వక్కంతుల గుత్తా వెంకటేశ్వర్లు సాగర్, అజ్మీర సురేష్ నాయక్, దళపతి భువనేశ్వర్ రాజు, పంతగాని నరేష్,సాయి రోహిత్, నాచారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఇంటి వద్దకే ముఖ్యమంత్రి సహాయనిధి

శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామనికి చెందిన ఆదిలక్ష్మి అనారోగ్య కారణంతో హాస్పిటల్ నందు చికిత్స పొందగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,03,653 రూపాయల ఆర్థిక సాయం మంజూరవడంతో,ఆ చెక్కును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మునిరజా నాయుడు,జయచంద్ర నాయుడు,కమల్ కుమార్,మల్లీశ్వరి,వెంకట్ రెడ్డి,ముని చంద్ర,బాలాజీ తదితరులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ ప్రారంభం

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా అక్టోబర్ 11 నాగర్ కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రధానమంత్రి దన్ ధాన్య యోజన మరియు పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశు సంపద మత్స్య సంపద ఆహార పదార్థాలకు విలువ జోడింపు వంటి రంగాలలో 1100 కు పైగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు పంట దిగుబడుల పెంపు, పంట వైవిధ్యానికి ప్రోత్సాహకం, గ్రామస్థాయిలో నిల్వ గోదాముల ఏర్పాటు, నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి, రైతులకు తక్షణ దీర్ఘకాలిక రుణాల లభ్యత, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతు తెలుపుతుందని తెలిపారు. మరియు ఈ పథకం ప్రధాన లక్ష్యం జిల్లాస్థాయి యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి గ్రామ రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వ్యవసాయానికి లాభదాయకంగా మలచడం. మన నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా రైతులందరూ ఈ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.