బడుల తనిఖీ కి ఉపాధ్యాయులా?టిఎస్ యటిఎఫ్ జనగామ జిల్లా శాఖ అధ్యక్షుడు చంద్ర శేఖర్ రావు
బడుల తనిఖీ కి ఉపాధ్యాయులా? ఉత్తర్వుల నిలుపుదలకై TSUTF డిమాండ్ ————————————————– జనగామ, అక్టోబర్14,పున్నమి న్యూస్: పాఠశాలల నిరంతరం తనిఖీల కోసం ప్రభుత్వం పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులచే కమిటీ ఏర్పాటు కొరకు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ,తనిఖీ ల కోసం మండలానికి ఇద్దరు MEO లను నియమించడం సరైన పరిష్కారమని TSUTF జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు తెలిపారు జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని 270 ప్రాథమిక పాఠశాలలకు ప్రతి టీం లో 3 సభ్యుల చొప్పున 3 టీం లను 64 ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రతి టీంలో 3 సభ్యుల చొప్పున ఒక్క టీం 103 ఉన్నత పాఠశాలల తనిఖీ కొరకు ప్రతి టీం లో 9 మంది సభ్యులతో 2 టీం లను ఏర్పాటు చేయుటకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అనగా జిల్లాలో మొత్తం తనిఖీ ల పేరు మీద 30 మంది ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరం మొత్తం వారు పనిచేస్తున్న పాఠశాలలకు దూరం కానున్నారు వీరి స్తానం లో అదనంగా ఉన్న పాఠశాలల నుండి సర్దుబాటు చేయమని ఉత్తర్వులలో పేర్కొన్నారు . కానీ వాస్తవం ఏమంటే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటినుండి ఏవో కారణాలతో విద్యా కార్యక్రమాలు కుంటుపడుతూనే ఉన్నాయి ఒక వైపు వృత్తి పరమైన ట్రైనింగ్స్ ,స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ట్రైనింగ్స్ ,ప్రమోషన్స్ పేరుతో కొన్ని రోజులు ఇలా పాఠశాలలు విద్యా బోధన జరగకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాయి ,ప్రమోషన్స్ కారణంగా ఏర్పడిన ఖాళీలను ఇప్పటి వరకు సర్దుబాటు ద్వారా కూడా భర్తీ చెయ్యలేదు చాలా ప్రాథమిక ,కొన్ని హై స్కూల్స్ లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది ,ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఉపాధ్యాయులతో టీం లు ఏర్పాటు చేయడమంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఉందని ,పాఠశాలల తనిఖీ చేపట్టడం తప్పు కాదు కాని దానికి ఎంచుకున్న విధానం సరికాదని ,తాత్కాలిక ఏర్పాట్ల కన్నా శాశ్వత ఏర్పాట్లు చేయాలని దానికి గాను ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి మండల విద్యాశాఖాధికారి పోస్టులు భర్తీచేయాలని ,ప్రతి మండలానికి ఇద్దరు MEO లను ఒకరిని విద్యాకార్యక్రమాలకు ,మరొకరిని పరిపాలనా పరమైన కార్యక్రమాల అమలు కొరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఉపాధ్యాయులచే పాఠాశాలల తనిఖీ ఎంత మాత్రం సరికాదని ,వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు











