Friday, 24 April 2026

Blog

తిరుపతి

రేపు తుమ్మలగుంటలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్ ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం *ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం* *భక్తాదులు అందరికీ చక్కటి విందు భోజనం* తిరుపతి నగర శివార్లలోని తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈనెల 27 న అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. శుక్ర వారం ఉదయం 8 గంటలకు ముత్యాల తలంబ్రాలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకంను కన్నుల పండువుగా నిర్వహిస్తారు. *చక్కటి విందు భోజనం* ఆలయం వద్ద జరిగే శ్రీరామ నవమి మహోత్సవాల్లో పాల్గొనే భక్తాదులు అందరికీ చక్కటి విందు భోజనం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేశారు. కావున భక్తులు అందరూ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, పట్టాభిషేకంలో పాల్గొనాలని విజ్ఞప్తి.

హైదరాబాద్

ప్రకృతి నిద్ర శక్తి

సహజ నిద్ర శరీర పునరుద్ధరణకు అవసరం. సరైన నిద్ర హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. మెదడు విశ్రాంతి పొంది శక్తిని పునరుద్ధరిస్తుంది. రాత్రి చీకటి వాతావరణంలో నిద్రపోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

హైదరాబాద్

హెర్బల్ చికిత్స

ఔషధ గుణాలు కలిగిన మొక్కలు సహజ చికిత్సలో కీలకం. అల్లం, తులసి, పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. హెర్బల్ పద్ధతులు శరీరాన్ని మృదువుగా నయం చేస్తాయి. సక్రమ వినియోగం ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది.

ఖమ్మం

ప్రారంభమైన ఎస్. బి.ఐ. టి ఆరోహన్ 2026 వేడుకలు.

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) స్థానిక ఎస్. బి.ఐ. టి కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఆరోహన్ 2026 గోడ పత్రిక ఆవిష్కరణతో ప్రారంభమైనట్లు కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గురువారం విద్యార్థులు అధ్యాపకుల ఆటపాటలతో లాంఛనంగా వేడుకలు ఆరంభించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము నిర్వహించే అనవాయితీకి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా ప్రాజెక్ట్ ఎక్స్ పో, టెక్నికల్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించబోతున్నట్లు కృష్ణ తెలిపారు. టెక్నికల్ ఫెస్ట్స్ విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు మరియు భవిష్యత్తును మెరుగుపరచే ఒక మంచి వేదిక అని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డా||జి. ధాత్రి తెలిపారు.విద్యార్థులలోని శారీరిక మానసిక వికాసానికి, సృజనాత్మకతను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు సైతం ఉత్సాహంగా ఆట పాటలలో పాల్గొని కార్యక్రమానికి శోభను చేకూర్చినట్లు కళాశాల వైస్ చైర్మన్ కే.శ్రీచైతన్య తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డా|| జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 3,4 తారీఖులలో ఆరోహాన్ 2026 నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 3వ తారీఖున ప్రాజెక్ట్ ఎక్స్ పో తో పాటు టెక్నికల్ ఈవెంట్స్ నివరహించి 4వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి విభాగం నుండి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాస్ రావు, డా|| ఏ. వి. వి.శివ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ప్రకృతి నడక ప్రయోజనాలు

ప్రకృతి మధ్య నడక శరీరానికి, మనస్సుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. స్వచ్ఛ గాలి ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి ఉల్లాసం పెరుగుతుంది. ప్రకృతి నడక సహజ ఆరోగ్య సంరక్షణలో సులభ మార్గం.

Blog

గన్నవరంలో KDCC బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.25 కోట్ల రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ, KDCC బ్యాంక్ చైర్మెన్ నెట్టెం రఘురాం

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC) ఆధ్వర్యంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు మరియు హౌసింగ్ లోన్లకు సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా హాజరై KDCC బ్యాంక్‌కు చెందిన ఆరు బ్రాంచ్‌లైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, తేలప్రోలు, ఉంగుటూరు, రామవరప్పాడు మరియు సత్యనారాయణపురం బ్రాంచ్ ల ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఈ ఏడాది కేడీసీసీ బ్యాంకు ద్వారా సుమారు 8,700 కోట్ల రూపాయల రుణాలను అందించామని తెలిపారు. వ్యవసాయ రుణ పరపతి పెంచడంలో తమ బ్యాంకు రాష్ట్రంలోనే ముందుందని, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను రైతులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కేడిసిసి చైర్మన్ రఘురాం చేతుల మీదుగా నియోజకవర్గానికి 25 కోట్ల రుణాలు అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామాని అన్నారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులో విపరీతమైన విద్వంసం, అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు. చల్లపల్లి వంటి పల్లెటూరులో లక్ష రూపాయల సెంట్ విలువ ఉన్న భూమిని ఐదు లక్షలకు కొని స్థానిక నాయకులు, అప్పటి చైర్మన్ కలిసి దోచుకున్నారని ఆరోపించారు. మహానుభావులు పాలించిన ఈ బ్యాంకులో జగన్ హయాంలో జరిగినంత అవినీతి ఎప్పుడూ జరగలేదని, దీనిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాబోయే కాలంలో నియోజకవర్గానికి సీడీఎఫ్ కూడా కేటాయించాలని కోరారు. అమరావతిని మారుద్దామనుకున్న జగన్ తన హయాంలో అక్కడ ఒక్క ఇటుక కూడా కదపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎల్లుండి శాసనసభలో అమరావతిపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జగన్ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని, ఆ యాత్రను అమరావతి నుంచే ప్రారంభించాలని, అప్పుడు అక్కడ జరుగుతున్న 59 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చూస్తే ఆయనకే జ్ఞానోదయం అవుతుందని సవాల్ విసిరారు. జగన్ కేవలం మీడియా అట్రాక్షన్ కోసం సినిమాలు చూపిస్తానని మాట్లాడుతున్నారని, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వల్లే వైసీపీకి ప్రతిపక్ష హోదా పోయిందని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్న జగన్, కనీసం పార్లమెంటరీ సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండానే రిటైర్ అయిపోతామని బాధపడుతున్నారని, కనీసం అమరావతి బిల్లు చర్చకైనా జగన్ సభకు రావాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్.ఎస్.పి వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, తెలుగురైతు నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ ఉపాధక్షురాలు కంభంపాటి లక్ష్మీ నరసమ్మ, పిఏసిఎస్ చైర్ పర్సన్లు ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, ఈడ్పుగంటి కృష్ణమూర్తి, మేడేపల్లి రమ, నెక్కంటి శ్రీదేవి, అవిర్నేని భవాని శంకర్, కానూరు యుగంధర్, మల్లారెడ్డి కిషోర్, ముద్రబోయిన శ్రీనివాసరావు, మాదాల శ్రీనివాసరావు, షేక్ చాన్ భాష, వడ్డీ నాగేశ్వరరావు, వడ్డీ అశోక్, దన్నే దుర్గారావు, కాసర్నేని పద్మప్రియ, బేతా సుజాత, ఆళ్ల చిరంజీవి మల్లికార్జునరావు, బోయపాటి మురళీకృష్ణ, జొన్నలగడ్డ దేవరయ్య, అరికట్ల రవికుమార్, చెరుకుమిల్లి వేణు, గొట్టిపూళ్ళ వీరబాబు, కొల్లి వెంకట లక్ష్మీనారాయణ, సబ్బినేని తనూజ, కలతోటి శ్రీనివాసరెడ్డి, వేమూరి రవి, కనకవల్లి శేషగిరిరావు, చింతల వెంకట అప్పారావు మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపిన బీజేపీ నేతలు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆనందంతో ఉండాలని, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాల‌ని అభిలషించారు.

ఖమ్మం

నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, మధిర అసెంబ్లీ బీజేపీ నాయకులు నాగేశ్వరరావ్, డీకొండ శ్యాం, ఖమ్మం రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ధ్యానం మరియు ఆరోగ్యం

ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచే సహజ చికిత్స. ఇది ఒత్తిడిని తగ్గించి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం మానసిక శక్తిని పెంచి శారీరక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది.

హైదరాబాద్

నీటి చికిత్స

నీరు శరీర శుద్ధికి ముఖ్యమైన సహజ సాధనం. తగినంత నీరు త్రాగడం డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. హైడ్రోథెరపీ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీటి స్నానం కండరాల నొప్పి తగ్గిస్తుంది. నీటి వినియోగం సహజ ఆరోగ్య సంరక్షణలో కీలకం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.