Friday, 24 April 2026

Blog

కడప

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే జైలుకే.. ASP విభుకృష్ణ

క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ తదితర జూదాలు, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే, వాటి జోలికి వెళ్తే వ్యవస్థీకృత నేరాల చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని, జైలుకు వెళ్తారని ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ గురువారం మీడియా సమావేశంలో హెచ్చరించారు.

News

ఎసిబికి చిక్కిన ఎస్సై తీగల అశోక్ – నిర్మల్ జిల్లా “మామడ పోలీస్ స్టేషన్” లో లంచంతో పట్టుబడ్డ ఎస్సై

ఎసిబికి చిక్కిన ఎస్సై తీగల అశోక్ – నిర్మల్ జిల్లా “మామడ పోలీస్ స్టేషన్” లో లంచంతో పట్టుబడ్డ ఎస్సై – కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.40,000 లంచం డిమాండ్ – చివరకు రూ.20,000 లంచానికి కుదిరిన ఒప్పందం – లంచాల అధికారి కరీంనగర్ ఎసిబి కోర్టుకు తరలింపు – ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, సెల్ నం: 9948133539 ) గతంలో జగిత్యాల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లతో పాటు “బుగ్గారం ఎస్సై” గా పని చేసి అనేక ఆరోపణలతో బదిలీ పై వెళ్ళిన తీగల అశోక్ నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ లో గురువారం రూ.20,000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గతంలోనే జగిత్యాల జిల్లాలో ఎస్సై “తీగల అశోక్ పై” అనేక ఆరోపణలతో పిర్యాదులు వస్తే…. అప్పటి ఉన్నతాధికారులు ఆయన నుండి అవినీతికి పాల్పడి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అప్పుడే జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులు “ఎస్సై తీగల అశోక్” పై తగు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంతటి అవినీతికి పాల్పడే వాడు కాదని జగిత్యాల జిల్లా ప్రజలు గుసగుసలు ఆడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఎసిబి అధికారులు “ఎస్సై తీగల అశోక్ పై” వచ్చిన అప్పటి పిర్యాదులన్నీ కూడా లేవనెత్తుతే…. అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల యొక్క “అవినీతి – అక్రమాల బాగోతం”, విధి నిర్వహణలో ఉన్నతాధికారుల యొక్క “అధికార దుర్వినియోగం” అంతా కూడా బయటపడే అవకాశం ఉందని జగిత్యాల జిల్లా ప్రజానీకం కోరుతోంది. ఎసిబి ఉన్నతాధికారులు ట్విట్టర్ వేదికగా గురువారం ( 26-03-2026 న ) జారీ చేసిన ప్రకటన ఆధారంగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తీగల అశోక్ ఫిర్యాదుదారుడిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారిక లబ్ధి చేకూర్చే నిమిత్తం రూ. 40,000/- #లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.20,000 కు ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఎస్ఐ క్వార్టర్స్‌లో లంచంను తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా గురువారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి అధికారులు మాట్లాడుతూ…. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును అని తెలంగాణ రాష్ట్ర ఎసిబి అధికారులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. Telangana ACB OFFICIAL’S Contact Numbers: తెలంగాణ రాష్ట్ర ఎసిబి అధికారుల సెల్ నంబర్లూ… WhatsApp: 9440446106 Toll Free: 1064 Head Quarters: 040-23251501 Hyderabad Range-I: 9440446109 Hyderabad Range-II: 9440446134 Ranga Reddy: 9440446140 Mahabub Nagar: 9491305609 Nalgonda: 7382625525 Warangal: 9440446146 Karimnagar: 9440446166 Nizamabad: 9440446149 Medak: 9440446149 Adilabad: 9440446166 Khammam: 9440446146 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఈ నంబర్లకు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చునని ఎసిబి అధికారులు తెలిపారు.

కడప

ప్రొద్దుటూరు: పిల్లలకు విషమిచ్చి తల్లి సహా ఆత్మహత్యకు యత్నం

ప్రొద్దుటూరులోని స్థానిక ఈశ్వరరెడ్డినగర్కు చెందిన వివాహిత భర్తతో గొడవపడి గురువారం తనతో పాటు ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్కు తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలతో ఈ ఘాతుకానికి వివాహిత పాల్పడింది.

ఖమ్మం

ఫర్టిలైజర్ డీలర్లపై భారీ భారం.. డిపాజిట్ పెంపుపై తీవ్ర ఆందోళన

ఫర్టిలైజర్ డీలర్లపై భారీ భారం.. డిపాజిట్ పెంపుపై తీవ్ర ఆందోళన ఖమ్మం మార్చి25/2026 పున్నమి (ప్రతినిధి) హైదరాబాద్: ఫర్టిలైజర్ డీలర్లపై నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర ఆందోళనకు దారితీసింది. కంపెనీ డీలర్ల నుండి తీసుకునే డిపాజిట్ మొత్తాన్ని రూ.1 లక్ష నుండి ఒక్కసారిగా రూ.10 లక్షలకు పెంచడం గమనార్హం. ఈ నిర్ణయం డీలర్ల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అత్యవసరంగా స్పందించారు. అధ్యక్షులు శ్రీ నాగుర్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శ్రీ రామడుగు మనోహర్ రావు, కోశాధికారి శ్రీ సిద్ది నాగరాజు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలిసి నేడు హైదరాబాద్‌లోని NFL కార్యాలయంలో తెలంగాణ స్టేట్ మేనేజర్ రాకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డీలర్ల ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి సమయంలో డిపాజిట్‌ను పది లక్షలకు పెంచడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న మరియు మధ్య తరహా డీలర్లు ఈ నిర్ణయం వల్ల వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. అందువల్ల డిపాజిట్ మొత్తాన్ని మళ్లీ రూ.1 లక్షగానే కొనసాగించాలని, అదనంగా ఎలాంటి లింకులు లేదా పరిమితులు లేకుండా ఫర్టిలైజర్ సరఫరా చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. Ok

తిరుపతి

శ్రీకాళహస్తికి విద్యుత్ డివిజన్ దిశగా వేగం…సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు

శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన ఏపీ ఎస్పీడీసీఎల్ డివిజన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతిలోని ‘విద్యుత్ సౌధ’లో సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటితో ఎమ్మెల్యే భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. గతంలోనే నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో లోపాలు, సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, తాజాగా వాటి పరిష్కారంపై దృష్టి సారించారు. శ్రీకాళహస్తిని ప్రధాన కేంద్రంగా తీసుకుని వెంకటగిరిని కలుపుతూ ప్రత్యేక విద్యుత్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎండీకి ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనివల్ల విద్యుత్ సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ జరగకపోవడంతో లో వోల్టేజ్ సమస్యలు, తరచూ విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా పడినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఇక్కడ విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రత్యేక డివిజన్ ఏర్పాటుతో మరమ్మతులు వేగంగా జరిగి, నిర్ణయాలు త్వరగా తీసుకునే వీలుంటుందని వివరించారు. వెంకటగిరితో సమన్వయం చేస్తూ శ్రీకాళహస్తిని భవిష్యత్తులో విద్యుత్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

తిరుపతి

ఇంటికే వెళ్లి రూ. 54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తనదైన శైలిలో ముందుంటున్నారు. తొట్టంబేడు మండలం ఇలగనూరు గ్రామానికి చెందిన పెద్ద సుబ్రమణ్యం అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బాధితుడికి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. గురువారం నాడు నేరుగా లబ్ధిదారుడి ఇంటికే వెళ్లిన ఎమ్మెల్యే, రూ. 54,258 విలువైన చెక్కును సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి సహాయం అందించడంపై బాధితుడు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ-అభివృద్ధి పనులపై చర్చ

శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరాలని కోరారు. ఎమ్మెల్యే విన్నపంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ ప్రయోజనాల కోసం, అభివృద్ధి పనుల వేగవంతానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ భేటీ నియోజకవర్గ అభివృద్ధికి కీలక ముందడుగని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి

బస్సు ప్రమాదమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి-దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మార్కాపురం జిల్లా, రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, నాయకులు మునికృష్ణయ్య, మహేష్, భరణి, జోసెఫ్, నాగరాజు, భరణి, కృష్ణసాయి తదితరులు పాల్గొని మృతులకు నివాళులర్పించారు.

తిరుపతి

టిడిపి నేత ఈశ్వర్ రెడ్డికి పరామర్శ-ఆరోగ్యంపై ఆరా తీసిన బొజ్జల సుధీర్, కోలా ఆనంద్

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కీలక నేత ఎంపేడు ఈశ్వర్ రెడ్డిని స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురువారం నాడు పరామర్శించారు. ఇటీవల మోకాలి సంబంధిత సమస్యతో తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో చేరిన ఈశ్వర్ రెడ్డికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో విశ్రాంతి పొందుతున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకులు కోలా ఆనంద్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈశ్వర్ రెడ్డి పార్టీకి అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనే ఈశ్వర్ రెడ్డి అతి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు.

తిరుపతి

నీలకంఠేశ్వర స్వామివారి ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండల పరిధిలోని ఊరందూరు గ్రామంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన ఇక్కడకు స్వామి, అమ్మవార్లు విచ్చేసిన పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషిత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయం వెలుపల స్వామివారికి ఎదురు సేవగా వెళ్లిన ఎమ్మెల్యే దంపతులు, స్వామి-అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగిన శాంతి అభిషేకం, అన్నదాన కార్యక్రమాల్లో వారు పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.