చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం ఆలయం మూసివేత – రాత్రి 8:30కి దర్శనాలు పునఃప్రారంభం
ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు ఈ రోజు ఉదయం 8:30 గంటలకు మూసివేయబడినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు సాయంత్రం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యిన అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ దర్శనాలకు అనుగుణంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు.









