Friday, 24 April 2026

Blog

తిరుపతి

సేవానిరతికి దక్కిన గౌరవం-గుడిమల్లం ఈవోకు ముందస్తు వీడ్కోలు.

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) రామచంద్ర రెడ్డి పదవీ విరమణను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందస్తు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా వీడ్కోలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గ మఠం ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ (AC) డి. వెంకటేశ్వర్లు, రామచంద్ర రెడ్డిని దుశ్శాలువతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి సేవలో ఆయన చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు. సన్మాన గ్రహీత రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. తన సేవా కాలంలో గుడిమల్లం దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో కనులపండువగా సీతారాముల కల్యాణం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ వేద పండితులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ వేడుక సాగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అలాగే, ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) వెంకటేశ్వర్లు దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ – విశాలాక్షి దంపతులు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, డీఈఓ కృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. భక్తులందరికీ కల్యాణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ పరిసరాలన్నీ ‘జై శ్రీరామ్’ స్మరణతో మారుమోగాయి.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ లింగంపల్లి గ్రామంలో పేకాటరాయుల్ల అరెస్ట్

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 27 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా, మంచల్ మండలం, లింగంపల్లి గ్రామంలోని జి.ఆర్. ఫామ్ హౌస్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయులు కేసు వివరాలు ఏమనగా, 27.03.2026న రాత్రి 7:30 గంటలకు మంచల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ వి. నాగేశ్వరరావు నుండి ఒక నివేదిక అందింది. ఆ నివేదికలో ఆయన, 27.03.2026న సుమారు 4:00 గంటలకు రంగారెడ్డి జిల్లా, మంచల్ మండలం, లింగంపల్లి గ్రామంలోని జి.ఆర్. ఫామ్ హౌస్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ సమాచారం వెంటనే నాకు తెలియజేయబడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారికి తెలియజేసి, ఆ జూదం కార్యకలాపంపై దాడి చేయడానికి ముందస్తు అనుమతి పొందడం జరిగింది. ఆ వెంటనే, ఇద్దరు మధ్యవర్తులను ఏర్పాటు చేసి, సుమారు 17:00 గంటలకు, ఆయన కె. రాజు పిసి 7716, కె. సాయి రామ్ పిసి 7761, బి. నవీన్ కుమార్ పిసి 12983 సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి బయలుదేరారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, డబ్బు పందెం కాస్తూ “త్రీ కార్డ్స్” ఆడుతున్న 18 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో, వారు ఈ క్రింది విధంగా వారి గుర్తింపులను వెల్లడించారు: గురజాల ప్రవీణ్ కుమార్ s/o నర్సింహగౌడ్, వయస్సు: 31 సంవత్సరాలు, 2) కొండపాక ప్రదీప్ కుమార్ s/o దయానంద్ చారి, వయస్సు: 44 సంవత్సరాలు, 3) మణికొండ మల్లికార్మున్ s/o లేట్ శివాజీ, 36 ఏళ్ల శివాజీ, వయస్సు: లేట్ కిషన్, వయస్సు: 35 సంవత్సరాలు, 5) ఉప్పు కిషోర్ s/o లక్ష్మయ్య, వయస్సు: 31 సం.లు, 6) అంతటి లింగ స్వామి s/o పొన్నయ్య, వయస్సు: 39 సంవత్సరాలు, 7) ఉప్పు పవన్ s/o వీరయ్య, వయస్సు: 32 yrs, 8) బండారి బాలయ్య/మల్లేష్రాజు @) 32 ఏళ్లు 9) చెరుకు శివుడు s/o లేట్ సత్తయ్య, వయస్సు: 36 సంవత్సరాలు, 10) మోతుకు సిద్ధార్థ s/o లేట్ కమలాకర్, వయస్సు: 45 సంవత్సరాలు, 11) జువ్వగాని శ్రీహరి s/o మల్లయ్య, వయస్సు: 37 సంవత్సరాలు, 12) బద్దూరి సాయి కృష్ణ, 3 సం.3) అశోక్ 3) అశోక్ కుమార్ 3) s/o కృష్ణ, వయస్సు: 43 సంవత్సరాలు, 14) తండా బాల కృష్ణ గౌడ్ s/o లేట్ సత్యనారాయణ, వయస్సు: 44 సంవత్సరాలు, 15) పత్ర కిశోరా చారి s/o వెంకటేశ్వర్లు లేట్, వయస్సు: 36 సంవత్సరాలు, 16) సపావత్ ఈశ్వర్ నాయక్ S/o తావు నాయక్, వయస్సు; 36 సం., 17) లకనకునిబి రాజేశ్వర్ (తండ్రి యాదగిరి, వయస్సు: 45 సం.), 18) మదుగోని మధు @ మధుసూదన్ (తండ్రి భిక్షపతి, వయస్సు: 34 సం.), నిందితులు స్వచ్ఛందంగా తమ నేరాన్ని అంగీకరించారు. మధ్యవర్తుల సమక్షంలో వారి నేర అంగీకార-స్వాధీన పంచనామాను నమోదు చేశారు. విచారణ పూర్తి చేసిన అనంతరం, నేరం జరిగిన ప్రదేశంలో వారి వద్ద నుండి పంచనామా కింద, పంచ్ సంతకాలు చేసి కింది ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు: స్వాధీనం చేసుకున్న వస్తువులు 04 పేకాట సెట్లు (17), మొబైల్ ఫోన్లు, వాకీ టోకీ సెట్లు-02 మరియు 3), రూ. 2,28,000/- నికర నగదు. నిందితులను, స్వాధీనం చేసుకున్న ఆస్తులతో పాటు, తదుపరి చర్యల కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

కడప

ప్రొద్దుటూరు ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష

ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో MLA వరదరాజుల రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ASP విభుకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయులు, రాజగోపాల్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్

ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం*

*ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం* ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – పరిధిలో తేదీ: 27 మార్చి 2026. పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ : మాడ్గుల్ మండలం ఔరుపల్లి గ్రామం సమీపంలోని ఎండిపోయిన కాలువలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మాడ్గుల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వేణుగోపాల్ తెలిపారు.

E-పేపర్

ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం*

*ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం* ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – పరిధిలో తేదీ: 27 మార్చి 2026. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : మాడ్గుల్ మండలం ఔరుపల్లి గ్రామం సమీపంలోని ఎండిపోయిన కాలువలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మాడ్గుల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వేణుగోపాల్ తెలిపారు.

తిరుపతి

శ్రీకోదండరామునికి చెవిరెడ్డి సారె సమర్పణ – ఆలయంకు వెళ్లిన చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి – సాదర స్వాగతం పలికిన నెన్నూరు గ్రామస్తులు

పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీ మహాగణపతి ఆలయాల కుంభాభిషేక మహోత్సవంకు చెవిరెడ్డి కుటుంబీకులు హాజరయ్యారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శుక్రవారం చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి కుటుంబీకులకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తన తల్లి చెవిరెడ్డి లక్ష్మీతో కలసి ఆలయంలో నూతనంగా ప్రతిష్టచేసియున్న శ్రీసీతాసమేత కోదండ రాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఆలయ వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోదండ రామస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 27 మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కోదండ రామాపురం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి క్షీర పంచామృత అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక ఆర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దువ్వూరు శ్రీనివాసుల రెడ్డి, యోగనాధ్ రెడ్డి, లక్ష్మీ సౌమ్య దంపతులు ఉభయ దాతలుగా సేవలందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

యాచారం మండలం నాజిక్ సింగారం లో మద్యం పట్టివేత

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 27 మార్చి 2026 యాచారం పోలీస్ స్టేషన్ ఏరియాలో గల నాజిక్ సింగారం గ్రామం లో జపాల రాజీవన్ S/o పర్వతాలు, వయస్సు: 51 సంవత్సరాలు, వృత్తి: కిరాణా వ్యాపారం, కులం: BC- కుమ్మరి, R/o ఇంటి నెంబర్: 3-52, నాజిక్ సింగారం గ్రామం, యాచారం మండలం, R.R జిల్లా అను వ్యక్తి తన కిరాణా షాపు నందు అక్రమంగా మధ్యం అమ్ముతున్నట్లు సమాచారం రావటం తో అక్కడ వెళ్ళి సోదా చేసి, అతడు అక్రమంగా అమ్ముతున్న 55 బాటిల్ ల మధ్యo ను స్వాదీన పర్చుకుని, అతడిని విచారించగా! అతడు గత కొన్ని రోజుల నుండి యాచారం లోని స్వాగత్ వైన్స్ నుండి అధికమొత్తంలో మధ్యం ను కొని, వాటిని తాను నిర్వహించే కిరాణా షాపులో అమ్ముతున్నట్లు తెలిపినాడు. అందువలన అక్రమంగా మధ్యం అమ్ముతున్న జపాల రాజీవన్ మరియు అధికమొత్తంలో మధ్యం అమ్మిన స్వాగత్ వైన్స్, యాచారం పైన తగు చర్య నిమిత్తం యాచారం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయటం జరిగినది. ప్రజల ప్రాణాలపై వ్యాపారం చేసిన మద్యం మాఫియాకు యాచారం మండలంలో గట్టి దెబ్బ – ఇక కఠిన చర్యలు తప్పవు!” “అక్రమ మద్యం దందా పై – యాచారం మండలంలో అధికారుల మెరుపు చర్యలు

Others

జైపూర్‌లో విదేశీ మహిళకు అసహజ అనుభవం

భారత్‌లో పర్యటనకు వచ్చిన ఓ విదేశీ మహిళకు రాజస్థాన్‌లో అనుకోని, అసౌకర్యకర పరిస్థితి ఎదురైంది. జైపూర్‌లోని జల్ మహల్ సందర్శనకు వెళ్లిన ఆమెను కొంతమంది స్థానిక యువకులు చుట్టుముట్టి సెల్ఫీల కోసం అతిగా ప్రవర్తించారు. మొదట సాధారణంగా కనిపించిన ఈ సంఘటన, కొంతమంది యువకులు ఆమె భుజాలపై చేతులు వేయడం, అనుచితంగా తాకడం వంటి చర్యలతో అసభ్యకరంగా మారింది. దీనితో ఆ మహిళ తీవ్ర అసౌకర్యానికి గురై అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఆమెను వదలకుండా మరింతగా ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దివ్య గండోత్ర ఠండన్ సోషల్ మీడియా వేదికలో పంచుకోగా, అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి ప్రవర్తన వల్ల దేశ ప్రతిష్టకు నష్టం కలుగుతుందని, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అభిప్రాయపడ్డారు. 👉 విదేశీ పర్యాటకుల పట్ల గౌరవం, రక్షణ కల్పించడం అత్యవసరం అని పలువురు పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.