“సీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం – కాకాణి”
పున్నమి ప్రతినిధి, SPSR నెల్లూరు | ఫిబ్రవరి 4, 2026: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల కేంద్రం, భోగసముద్రంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు యూరియా సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. కూటమి పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడాన్ని నిరసిస్తూ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పథకం తిరిగి ప్రారంభించే వరకు పోరాటం కొనసాగుతుందని కాకాణి స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల పక్షాన నిరంతరం నిలబడతామని తెలిపారు











