తూర్పుగోదావరి ఎట్టకేలకు పులి బంధనం – గ్రామస్తులకు ఊరట
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో పాడైపోయిన ఇంట్లో దాక్కున్న పులిని ఫారెస్ట్ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా పులి సంచారం కారణంగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పులిని బంధించారు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. END Uploaded Video:










