Friday, 24 April 2026

Blog

E-పేపర్

ఉక్కు లో అమృతరావు కు ఘన నివాళులు

ఉక్కులో అమృతరావుకు ఘన నివాళి విశాఖపట్నం , పున్నమి ప్రతినిధి ( అక్టోబర్). విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 21రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి విశాఖ ఉక్కు కర్మాగారం వస్తే తెలుగు వారికి ఉద్యోగాలొస్తాయని ప్రాణాలకు సైతం లెక్కచేయలేని ఉక్కు సాధకులు, ఉక్కు సత్యాగ్రహి, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా సైన్యంలో పనిచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు , గుంటూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ తమనంపల్లి అమృతరావు 105వ జయంతి వేడుకను స్టీల్ ప్లాంట్ అమృతరావు పార్కులో ఘనంగా నిర్వహించారు. నిర్వహణ కమిటీ చైర్మన్ ఎ.వి.రమణారావు, వైస్ చైర్మన్ జెర్రిపోతుల మోహన్ కుమార్ నిర్వహణ లో జరిగిన ఈ జయంతి వేడుకలకు గాజువాక మాజీ ఎంఎల్ఎ చింతలపూడి వెంకటరామయ్య, వైఎంసిటీ చైర్మన్ వై వరలక్ష్మి ముఖ్య అతిథి గా విచ్చేసారు. ఈవేడుకలో చింతలపూడి వెంకటరామయ్య మరియు కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉక్కు పోరాటంలో చనిపోయిన 32మంది అమరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా చింతలపూడి వెంకటరమణ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండడం కోసం మేమంతా ఎంత దూరమైనా పోరాడుతామని తెలియజేస్తున్నానన్నారు. స్టీల్ ప్లాంట్ కి నిధులు కేటాయించామని చెబుతూనే ప్లాంట్ అవసరాలకు కేటాయించకుండా భారం మోపుతున్నారని, విఆర్ఎస్ పేరుతో ఉద్యోగులను సాగనంపుతు, మరో పక్క వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నారని ,ఇది చాలా అన్యాయమన్నారు. మన రాష్టంతో పాటు పక్కరాష్ట్రాలలో వున్న ఇతర ఉక్కు కర్మాగారాల ప్రైవేటీకరణ ఆపి ,వాటి అభివృద్ధికి నిధులు కేటాయించుకున్నారని, కానీ మన రాష్ట్రంలో ఎండిఏ ప్రభుత్వం అధికారంలో వున్నా సరే ఇప్పటికీ ప్రైవేటీకరణ ఆపేసామనే స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని, ఓవైపు వివిధ విభాగాల ప్రైవేటీకరణతో పూర్తి స్ధాయి ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచారని అన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు తెలుగు వారిగా ఉద్యమాలతో ఉక్కు పాదం మోపుతామని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ 9 లక్షల కోట్లు ఇతర ప్రైవేట్ బిజినెస్ మాన్ లకు రుణాలు రద్దు చేశారని, స్టీల్ ప్లాంట్ కున్న ఇరవై వేల కోట్లు అప్పుని రద్దు చేయకుండా గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఎందుకంత మొగ్గు చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితని,ఎనిమిది లక్షల కోట్లు విలువచేసే స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటీకరణ చేస్తున్నారా లేక ఇరవైవేల కోట్లు అప్పు ఉన్నాయని స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఉక్కు చరిత్రలో అమృతరావు ప్రతీ అణువునా వుంటారని, నేడు కర్మాగారంను బ్రతికించాలంటే 5సం ల పాటు అప్పును పెట్టుబడిగా చూపితే తనంతట తానే పుంజుకుంటుందని అన్నారు. అమృతరావు స్ఫూర్తితో కర్మాగారం కాపాడుకోవాలని, విశాఖ ఉక్కును సెయిల్ లో మెర్జ్ చేయాలని లేదా సొంత గనులు కేటాయించాలని కోరారు . గాంధీ మిషన్ కన్వీనర్ రమణరావు మాట్లాడుతూ ఆంధ్రులకోసం అమృతరావు ప్రాణాన్నే ఫణంగా పెట్టి విశాఖఉక్కును సాధించారని, కర్మాగారం ఏర్పడ్డాక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ లాభాలు ఆర్జించి మేలిమి ఉక్కును ఉత్పత్తి చేసిన ఈ కర్మాగారంకు కూటమి ప్రభుత్వం చేదోడును అందించి కాపాడుకునే ప్రయత్నాలు చిత్త శుద్ధితో చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో జె అయోధ్యరాం,పివి రమణ మూర్తి, జెర్రిపోతుల మోహన్ కుమార్,శకునాల చంద్రశేఖర్, యు రామస్వామి,విళ్లా రాంమోహన్ కుమార్, దేవులపల్లి సంపూర్ణం, కె పరందామయ్య, డివి రమణయ్య,పోలీస్ నాయుడు, అట్టా అప్పారావు,బూసి వెంకట్రావు, డివి రమణా రెడ్డి, డేవిడ్ రాజు,బొండా ఎల్లాజి, దాసరి సురేష్ బాబు, పులి రమణా రెడ్డి, పితాని బాస్కర్,వైకోటి, వంశీ, రవికుమార్,సూరిబాబు,రమణ తదితదులు పాల్గొన్నారు

అన్నమయ్య

చిట్వేల్‌లో పాఠశాలలకు సెలవు: హెడ్‌మాస్టర్ అత్యవసర ప్రకటన

-పడిపోయే దశలో ఉన్న ప్రహరీ గోడ: విద్యార్థులు, గ్రామస్తులకు ప్రధానోపాధ్యాయులు హెచ్చరిక! చిట్వేల్, అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేల్ మండలంలో గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బుధవారం పరిగణించబడింది పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. పై అధికారుల (కలెక్టర్/డీఈవో) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -భద్రతపై ప్రత్యేక దృష్టి సెలవు సందర్భంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరూ సురక్షితంగా తమ ఇళ్లలోనే ఉండాలని శ్రీ దుర్గరాజు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా, వర్షం తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని కోరారు. -పడిపోయే ప్రమాదంలో ప్రహరీ గోడ వర్షాల నేపథ్యంలో పాఠశాల ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ప్రధానోపాధ్యాయులు ఒక ముఖ్య హెచ్చరిక జారీ చేశారు. పాఠశాలకు సంబంధించిన ప్రహరీ గోడలో కొంత భాగం ఇదివరకే కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా మిగిలిన ప్రహరీ గోడ కూడా ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో, గ్రామస్తులు గాని, విద్యార్థులు గాని ఎవరూ కూడా ఆ ప్రహరీ గోడ చుట్టుపక్కల పరిసరాలకు, శిథిలమైన గోడకు దగ్గరగా వెళ్లకూడదని ఆయన **గట్టిగా హెచ్చరించారు**. అలాగే, వర్షం కారణంగా బలహీనపడే అవకాశం ఉన్న భారీ వృక్షాల కింద కూడా ఉండకూడదని సూచించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ, భద్రతా ప్రమాణాలకు సహకరించాలని కోరారు.

Blog

విషాదంలో జనసైనికుని కుటుంబం జన సైనికుని మాతృమూర్తి భౌతిక కాయానికి నివాళులర్పించిన రాచమడుగు సోదరులు

మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త, జనసైనికుడు మహేష్ స్వామి ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంగళవారం అకాల మరణం చెందారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ, జనసేన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే మహేష్‌ స్వామి తల్లి మృతి వార్త తెలుసుకున్న నంద్యాల జనసేన నాయకులు, ‘రాచమడుగు బ్రదర్స్‌’గా పేరుగాంచిన చందు, సుందర్‌ వెంటనే తిమ్మాపురం గ్రామానికి చేరుకున్నారు. *నివాళులర్పించిన ‘జనసేన బ్రదర్స్‌’* తిమ్మాపురం చేరుకున్న రాచమడుగు సోదరులు మహేష్‌ స్వామి తల్లి భౌతిక కాయానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అనంతరం, విషాదంలో మునిగిపోయిన మహేష్‌ స్వామిని, ఆయన కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. *”ఆత్మీయ సోదరుడు మహేష్‌ స్వామి”* ఈ సందర్భంగా రాచమడుగు చందు, సుందర్‌ మాట్లాడుతూ, మహేష్‌ స్వామితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “మహేష్‌ స్వామి అంటే మాకు కేవలం కార్యకర్త మాత్రమే కాదు, ఆత్మీయ సోదరుడు. మేము ఫోన్ చేసిన ప్రతిసారీ… ‘హలో’కు ముందు నమస్కారం చెప్పి, అభిమాన పూర్వకంగా ‘జై జనసేన’ అని పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అలాంటి ఆత్మీయ వ్యక్తికి ఈరోజు ఈ విషాదం ఎదురవడం మాకు ఎంతో బాధ కలిగించింది,” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్‌ కుటుంబానికి తమ వంతు అండగా నిలబడి, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థించారు. రాచమడుగు సోదరులు చూపిన ఈ మానవత్వపు స్పందన, జనసేన కుటుంబ బంధానికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు

తెలంగాణ

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణ

పున్నమి: అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రోజున ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు గౌడ్, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొని అమరుల ఆత్మలకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ ప్రజాసేవలో తాము మరింత కృషి చేయడానికి సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

తిరుపతి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – అంజూరు చక్రధర్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో,రాబోయే రెండు రోజులలో మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి..వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని,జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ విజ్ఞప్తి చేశారు.స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాల లో అధికారులు ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకొని రక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్

గిరిజన కాలనీలలో బొబ్బేపల్లి పర్యటన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముత్తుకూరు (పున్నమి,అక్టోబర్ 22)-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గిరిజన కాలనీల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ముత్తుకూరు మండలంలోని బలిజపాలెం గిరిజన కాలనీను సందర్శించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులను ఆరా తీసి, వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే తెలియజేయాలని వారికి సూచించారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, సర్వేపల్లి పరిధిలో కూడా జనసేన నేతలు ప్రజలతో మమేకమవుతూ సహాయక చర్యల్లో భాగమవుతున్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పనిచేస్తోంది. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సందూరి శ్రీహరి, బోలా అశోక్, కావలి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి… అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకి రాకండి… నియోజకవర్గం ప్రజల కి ఒక ప్రకటన ద్వారా తెలిపిన ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు

(నెల్లూరు జిల్లా) పున్నమి: దుత్తలూరు:21 నియోజకవర్గం ప్రజల కి ఒక ప్రకటన ద్వారా తెలిపిన ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాలలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల నియోజకవర్గం ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు తెలిపారు. అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు ఎవ్వరు బయటకి రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. విస్తారం గా కురుస్తున్న వర్షాలు తొ పాడి రైతులు, అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రజలందరు దృఢమైన భవనాలలో ఉండాలని పెచ్చులూడి న స్లాబ్ లు ఇతర గుడిసెలు లోతట్టు ప్రాంతం ప్రజలు సురక్షిత ప్రాన్తాలలో ఉండాలని ఈ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి గారు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అందుబాటులొ ఉండాలని ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని సందర్శించనున్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి పర్యటన

నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని సందర్శించనున్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి పర్యటన ఈనెల 22వ తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటిస్తారని I&PR కార్యాలయం సోమవారం తెలిపింది. ఉదయం 11:30 గంటలకు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ప్రజలతో సమావేశమవుతారు. ఆ తర్వాత దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని సందర్శించనున్నారు.

ఖమ్మం

ఇండస్ట్రీయల్ భూములు అన్యాక్రాంతం -అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం

ఖమ్మం పున్నమి ప్రతి nidhi ఖమ్మం నగర పరిధిలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో భూములపై అక్రమ నిర్మాణాలు పెరగడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన భూములు కొంతమంది వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్తుండటంపై వ్యాపార వర్గాలు మరియు స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలర్లు, పశువుల కోసం ఉద్దేశించిన భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఇండస్ట్రియల్‌ విభాగం పరిధిలో ఉన్న కొన్ని సర్వే నంబర్ల భూములు వ్యక్తిగతంగా వినియోగించబడుతున్నాయని స్థానికులు వెల్లడించారు. అక్కడ క్రమం తప్పకుండా కొత్త నిర్మాణాలు సాగుతుండగా, అధికారులు మాత్రం దీనిపై ఏ చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇండస్ట్రియల్‌ ఏరియాలో భూములు సక్రమంగా వినియోగించకపోవడం వల్ల పరిశ్రమలు ఏర్పడక, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. భూముల ఆక్రమణల వల్ల కొత్త పెట్టుబడిదారులు కూడా వెనుకడుగువేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, కొన్ని భూములపై కట్టడాలు నిర్మించబడుతూ ఉండగా, కొంత భాగం నివాస అవసరాలకు వాడుతున్నారు. ఈ అక్రమ చర్యలకు సంబంధించి అధికారులు సర్వే చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇండస్ట్రియల్‌ భూముల ఆక్రమణలు ఆగాలంటే, ప్రభుత్వం మరియు ఇండస్ట్రీస్‌ విభాగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు.

సినిమా

భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటాను: నటి రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో తీసుకోబోతున్న కీలక నిర్ణయం గురించి వెల్లడించారు. భవిష్యత్తులో సన్యాసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. జీవితంలో ప్రశాంతత, ఆధ్యాత్మికత కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని రేణూ తెలిపారు. నటన, రాజకీయాలు, సామాజిక సేవలన్నింటినీ అనుభవించిన తర్వాత మిగిలేది ఆత్మశాంతి మాత్రమేనని ఆమె అన్నారు. ఆధ్యాత్మికతపైన చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్నట్లు చెబుతూ, సమాజానికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు, టెలివిజన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, సరైన సమయం రాగానే అన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులు వేస్తానని రేణూ దేశాయ్ చెప్పారు. ఆమె ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె నిర్ణయానికి మద్దతు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.