Friday, 24 April 2026

Blog

హైదరాబాద్

*🌿🌼 కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందాం 🌼🌿*

దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ | నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః|| 🕉️అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. 🕉️కార్తీక శుద్ధ పాడ్యమి : తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. 🕉️విదియ : సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు. 🕉️తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. 🕉️చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. 🕉️పంచమి : దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. 🕉️షష్ఠి : ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి.

హైదరాబాద్

మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి

*స్కంద పురాణంలో* ఒక చక్కని *శ్లోకం* ఉంది. *అశ్వత్థమేకం పిచుమందమేకం* *న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|* *కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ* *పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||.* *అశ్వత్థ* = *రావి* (100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) – 1 *పిచుమందా* = *నిమ్మ* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)- 1 *న్యగ్రోధ* = *మర్రి చెట్టు* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) – 1 *తింత్రిణి* = *చింత* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) – 10 *కపిత్థ* = *వెలగ* (80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది) – 3 *బిల్వ* = *మారేడు* (85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది) – 3 *అమలకా* = *ఉసిరి* (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది) – 3 *ఆమ్రాహ్* = *మామిడి* (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) – 5 *వాపి* – *నుయ్యి* *అర్థం* ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం) ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం ఇంకా ఏమీ తప్పులేదు, మన తప్పును మనం సరిదిద్దుకోవచ్చు. *గుల్మోహర్*, *నీలగిరి* లాంటి చెట్లు మన దేశ పర్యావరణానికి ప్రాణాంతకం. పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం. రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది. ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి. అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా *గుల్మోహర్*, *యూకలిప్టస్* *(నీలగిరి)* చెట్లను నాటడం లోప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది. *గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు* అని పిలుస్తారు. *మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|* *పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||* *భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు*. రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక రావి, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది. *తులసి* మొక్కలను *ప్రతి ఇంటిలో* నాటాలి. మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన *భారతదేశాన్ని* ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము. భవిష్యత్తులో మనకు *సహజ ప్రాణవాయువు* సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. *రావి*, *మఱ్ఱి*, *మారేడు*, *వేప*, *ఉసిరి* మరియు *మామిడి* * మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి *ఆరోగ్యకరమైన* మరియు *ప్రకాశవంతమైన* *పర్యావరణాన్ని* అందించడానికి ప్రయత్నిద్దాం. 🌳🌳🌳🌳 🙏

హైదరాబాద్

కార్తీక మాసం 30 రోజులు – పూజించవలసిన దైవం – చేయవలసిన మంత్రం – దానం – నైవేద్యం

*1వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. దానములు:- నెయ్యి, బంగారం పూజించాల్సిన దైవము:-స్వథా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా *2వ రోజు:* నిషిద్ధములు:-తరగబడిన వస్తువులు దానములు:-కలువపూలు, నూనె, ఉప్పు పూజించాల్సిన దైవము:-బ్రహ్మ జపించాల్సిన మంత్రము:- ఓం గీష్పతయే – విరించియే స్వాహా *3వ రోజు:* నిషిద్ధములు:- ఉప్పు కలిసినవి, ఉసిరి దానములు:- ఉప్పు పూజించాల్సిన దైవము:- పార్వతి జపించాల్సిన మంత్రము:- ఓం పార్వత్యై – పరమేశ్వర్యై స్వాహా *4వ రోజు:* నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి దానములు:- నూనె, పెసరపప్పు పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా *5వ రోజు:* నిషిద్ధములు:- పులుపుతో కూడినవి దానములు:- స్వయంపాకం, విసనకర్ర పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు జపించాల్సిన మంత్రము:- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి) *6వ రోజు:* నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి దానములు:- చిమ్మిలి పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు జపించాల్సిన మంత్రము:- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా *7వ రోజు:* నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం పూజించాల్సిన దైవము:- సూర్యుడు జపించాల్సిన మంత్రము:- ఓం. భాం. భానవే స్వాహా *8 వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం దానములు:- తోచినవి – యథాశక్తి పూజించాల్సిన దైవము:- దుర్గ జపించాల్సిన మంత్రము:- ఓం – చాముండాయై విచ్చే – స్వాహా *9వ రోజు:* నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు పూజించాల్సిన దైవము:- అష్టవసువులు – పితృ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా – పితృదేవతాభ్యో నమః *10వ రోజు:* నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు జపించాల్సిన మంత్రము:- ఓం మహామదేభాయ స్వాహా *11వ రోజు:* నిషిద్ధములు:- పులుపు, ఉసిరి దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ పూజించాల్సిన దైవము:- శివుడు జపించాల్సిన మంత్రము:- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ *12వ రోజు:* నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము:- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా *13వ రోజు:* నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం పూజించాల్సిన దైవము:- మన్మధుడు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా *14వ రోజు:* నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె పూజించాల్సిన దైవము:- యముడు జపించాల్సిన మంత్రము:- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా *15వ రోజు:* నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు జపించవలసిన మంత్రం:- ‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’ *16వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః *17వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు దానములు:- ఔషధాలు, ధనం పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా *18వ రోజు:* నిషిద్ధములు:- ఉసిరి దానములు:- పులిహార, అట్లు, బెల్లం పూజించాల్సిన దైవము:- గౌరి జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా *19వ రోజు:* నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి దానములు:- నువ్వులు, కుడుములు పూజించాల్సిన దైవము:- వినాయకుడు జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా *20వ రోజు:* నిషిద్ధములు:- పాలు తప్ప – తక్కినవి దానములు:- గో, భూ, సువర్ణ దానాలు పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం *21వ రోజు:* నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం దానములు:- యథాశక్తి సమస్త దానాలూ పూజించాల్సిన దైవము:- కుమారస్వామి జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా *22వ రోజు:* నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు పూజించాల్సిన దైవము:- సూర్యుడు జపించాల్సిన మంత్రము:- ఓం సూం – సౌరయే స్వాహా, ఓం భాం – భాస్కరాయ స్వాహా *23వ రోజు:* నిషిద్ధములు:- ఉసిరి, తులసి దానములు:- మంగళ ద్రవ్యాలు పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా *24వ రోజు:*నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరిదానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులుపూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గజపించాల్సిన మంత్రము:- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా *25వ రోజు:*నిషిద్ధములు:- పులుపు, చారు – వగయిరా ద్రవపదార్ధాలుదానములు:- యథాశక్తిపూజించాల్సిన దైవము:- దిక్వాలకులుజపించాల్సిన మంత్రము:- ఓం ఈశావాస్యాయ స్వాహా *26వ రోజు:*నిషిద్ధములు:- సమస్త పదార్ధాలుదానములు:- నిలవవుండే సరుకులుపూజించాల్సిన దైవము:- కుబేరుడుజపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా *27వ రోజు:*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయదానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలుపూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడుజపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా *28వ రోజు:*నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయదానములు:- నువ్వులు, ఉసిరిపూజించాల్సిన దైవము:- ధర్ముడుజపించాల్సిన మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా *29వ రోజు:*నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరిదానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారంపూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్ *30వ రోజు:*నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరిదానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరిపూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలుజపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం లో భాగంగా, విశాఖ నగరంలోని 49వ వార్డు బూత్ నెం.37 పరిధిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రతి గడపకు స్వయంగా వెళ్లి ప్రజల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఇది ప్రజల ఆరోగ్య హక్కును హరిస్తుంది. ప్రైవేటీకరణ వల్ల వైద్యం ఖరీదై, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వ కాలేజీల్లో తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం మధ్యతరగతి విద్యార్థులు కోల్పోతారు” అని అన్నారు ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచడం, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా ప్రజా చైతన్యం కల్పించడం అత్యవసరమని, “కోటి సంతకాల సేకరణ కార్యక్రమం” ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పల్లా చైతన్య, వార్డు జనరల్ సెక్రటరీ జి. వెంకటరావు, సెక్రటరీ అచ్చుత వేణి, బూత్ కమిటీ అధ్యక్షుడు సత్యాడ నాగేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, ఆర్‌టిఐ వింగ్ అధ్యక్షుడు ఎ. నరసింహులు, యూత్ అధ్యక్షుడు ఇగలపాట్టి రాజేష్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గెళ్ల రాంబాబు, పబ్లిసిటీ విభాగం అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, మహిళా నాయకులు పద్మ, లీల, గౌతమి, శైలు, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

“లెమనూనీటరు ఆరోగ్యం కోసం: ఆరు కేసుల­తర్వాతి ఆసక్తికర నిజాలు”

ఈ ఆర్టికల్‌లో ఎయిమ్స్, హార్వార్డ్ & స్టాన్‌ఫోర్డ్ శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటెറాలజిస్ట్ డాక్టర్ Saurabh Sethi ఒక క్యారొసెల్ పోస్టుల్లో “లెమన్ వాటర్” (లెమన్ రసం కలిపిన నీరు) గురించి ఎనిమిది అరుదైన, కానీ ఉపయోగకరమైన నిజాలు వెల్లడించారు. కింద వాటిని తెలుగులో సంక్షిప్తంగా చూపిస్తున్నాను: 1. హైడ్రేషన్ (పానీయత)కు సహాయము చాలా మంది ( సుమారు 75 %) పెద్దవారిలో నిర్దిష్టంగా తగినంత నీరు తాగే పరిస్థితిలో లేరు. లెమన్ కలిపిన నీరు తాగడం నీరు తాగే ఆసక్తిని పెంచుతుంది, తద్వారా జీర్ణక్రియ, శక్తి, ఫోకస్ మెరుగవుతాయని చెప్పారు. అలాగే, లెమన్‌లో ఉండే విటమిన్ C మరియు సహజ ఎలక్ట్రోలైట్స్ వాడిన తర్వాత హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తాయని చెప్పారు. 2. విటమిన్ C యొక్క మంచి మూలం ఒక లెమన్ సుమారుగా 35 మిల్లిగ్రామ్ విటమిన్ C అందిస్తుంది, ఇది రోజువారీ అవసరానికి సుమారుగా 40 % సమానం. విటమిన్ C ఇమ్యూనిటీ (రిసిస్ట్‌ను), కొలాజెన్ తయారీని, చర్మం, రక్తప్రవాహం, ఎముకలు మెరుగుదలకి సహకరిస్తుంది. అలాగే మొక్క ఆధారిత ఆహారాల్లోని ఐరన్ శోషణను మెరుగుపరిచే అవకాశం ఉందని చెప్పారు. 3. జీర్ణక్రియకు మద్దతు లెమన్ వాటర్ జీర్ణ క్రియ (డైజెషన్)కు సహయం చేస్తుంది. అతని ప్రకారం, తక్కువ معد అమ్లం ఉన్న పరిస్థితుల్లో ఉంటుంది వారిలో లెమన్ వాటర్ ఉదయం సమయంలో తీసుకోవడం ప్రయోజనకరం. ఇది గ్యాస్టిక్ రసాలు (అమ్లాలు) మరియు పిత్త ప్రవాహాన్ని ప్రేరేపించవచ్చు, బ్లోటింగ్ (భరితత్వం) తగ్గించవచ్చు. 4. ఉష్ణ లెమన్ వాటర్ సాంత్వనకరం ఉదయం ఉష్ణమైన నీటిలో లెమన్ కలిపి తినడం సాంత్వనంతో ఉంటుంది. కానీ సూచన: 70 ° ఛే లెమెన్‌లోని విటమిన్ C క్రమంగా దెబ్బ తింటుంది, కాబట్టి చాలా తన్నగా నీటిలో లెమన్ వేసే ముందు దృష్టి వహించాలి. 5. రిఫ్లక్స్ సమస్యలపై జాగ్రత్త సిట్రస్ పదార్థాలు (లెమన్ వంటి) మందికి గ్యాస్‌ ర ఫ్లక్స్ (GERD) వంటి పరిస్థితుల్లో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. డాక్టర్ సెథి తెలిపినట్లుగా, GERD ఉన్న వారిలో సుమారుగా 20 % మంది సిట్రస్ వాడితే ఇబ్బంది పెరుగుతుందని ఉండొచ్చు. కనుక, ఖాళీ కడుపులో లెమన్ వాటర్ తాగడం నివారించాలి, బర్నింగ్ లేదా ఫుల్ భ‌రితం గమనిస్తే వాడకాన్ని ఆపాలి. 6. పళ్ళు పైన ముఖ్యమైన జాగ్రత్తలు లెమన్ రసం చాలా తక్కువ pH ఉంటుంది (సుమారుగా 2) → ఇది అమ్లత ఎక్కువగా ఉంటుందని అంటే పళ్ళు మీద దెబ్బ తీసే అవకాశం ఉంది. ఆహారంగా తాగిన తర్వాత తక్షణం బ్రష్ చేయడం మర్చిపోవాలి, ఎందుకంటే అస్కిడ్ కారణంగా ఎనామెల్ సాఫ్టెనెడ్‌గా ఉంటుంది. అలాగే, స్ట్రా వాడడం ద్వారా లెమన్ నీరు ప్రత్యక్షంగా పళ్ళ మీద అడ్చరని సూచించారు. 7. “డీటాక్స్” ఉన్నట్టేమని నా మోసం కాదు చాలామంది “లెమన్ వాటర్ డీటాక్స్”లా భావిస్తారు కానీ వాస్తవానికి స్ఫూర్తినిచ్చే విధంగా పనిచేస్తుంది. శరీరంలో అసలు డీటాక్స్ చేసే ముఖ్య భాగాలు Liver & Kidneys. వాటర్ తాగడం, హైడ్రేషన్ నిలుపుకోవడం ద్వారా సహాయం అవుతుంది; కానీ లెమన్ వాటర్ ఆహార మలినాలను “తణిసే” ముఖ్య మార్గం కావు. 8. ముఖ్యాంశం – తీసుకోవాల్సిన సూచనలు లెమన్ వాటర్‌ను ప్రతిరోజూ ఉదయం లేదా throughout the day తాగడం ద్వారా గట్-స్నేహపూర్వక అలవాటు ఏర్పడవచ్చు. అయితే, ప్రతి వ్యక్తి శరీర పరిస్థితి వేరు: రిఫ్లక్స్, పలు ఛర్మ/దంత సంబంధ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వాడే ముందు తరుగుతున్న నీరు, వడిగా తణువుగా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా కొత్త డైట్ అలవాటు ప్రారంభించేముందు మీ వైద్యుడితో సంప్రదించడం మంచిది అని డిస్క్లెయిమర్‌లో పేర్కొన్నారు. తొలుత “మూలం: The Times of India” శరత్ చంద్ర (జర్నలిస్ట్)

విశాఖపట్నం

ఇసుక కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ

విశాఖపట్నం, అక్టోబర్ 22: ఇసుక కొండపై భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజా కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పద్మజ దంపతులు పాల్గొన్నారు. భక్తులందరితో కలిసి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు, భక్తజనాల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తూర్పు గోదావరి

రాబోయే రబీ సీజన్లో యూరియా నిల్వలు అండ్ పంటను మోదుపై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష

రాజమహేంద్రవరం, తేదీ:21.10.2025 రాబోయే రబీ సీజన్‌లో యూరియా నిల్వలు & పంట నమోదు పై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష రాబోయే రబీ సీజన్‌లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్ నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడా యూరియా నిల్వలు కల్పించామని తెలిపారు. గత మూడు సంవత్సరాల రబీ సీజన్లలో వినియోగించిన ఎరువుల సగటును పరిగణనలోకి తీసుకుని, ఈ సీజన్‌కు తగినంత యూరియా అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 3,214 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందని, రాబోయే రబీ సీజన్‌కు 55,000 మెట్రిక్ టన్నుల అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. అవసరమైన యూరియాను సమయానికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో వరిలో ఇ పంట నమోదు 100 శాతం పూర్తయిందని, ఇతర పంటలను కలుపుకుని మొత్తం 62 శాతం ఇ పంట నమోదు పూర్తయ్యిందని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి పంటల నమోదును 100 శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా అందుతున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్లను క్లోజ్ చేసేటప్పుడు ఎండోర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 212 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, మిల్లర్ల నుండి బ్యాంకు గ్యారంటీలు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం తరలించే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్వమిత్వ సర్వే కార్యక్రమం కింద ఫేజ్-1 లో 64 గ్రామాలు, ఫేజ్-2 లో 102 గ్రామాలలో సర్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 99 శాతం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయ్యింది అన్నారు. ఈ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను సమర్థవంతంగా వసూలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత, భోజనం నాణ్యత, వార్డెన్ల అందుబాటుతో పాటు విద్యార్థుల సంక్షేమంపై సమగ్రంగా పరిశీలించి నివేదికను సమర్పించాలి అని సూచించారు. గృహ నిర్మాణ పనుల్లో దశల వారీ కన్వర్షన్ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని గృహాలను పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, డి ఆర్ వో టి సీతారామ మూర్తి, డి ఏ ఓ ఎస్ మాధవ రావు, డీపీ ఓ శాంతమణి, డి డి ఓ వీణా దేవి, ఏడి సర్వే బి లక్ష్మీనారాయణ, సీపీఓ అప్పాలకొండ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప! ఆధ్యాత్మిక ఆహ్వానం

ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అయ్యప్ప దీక్ష స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈసారి కూడా భవ్యంగా ప్రారంభం కానుంది. ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన యజ్ఞం ఆంధ్రజ్యోతి ప్రెస్ ప్రక్కన, పోర్టు హాస్పిటల్ ఎదురుగా. తేది 22-10-2025 బుధవారం నుండి 05-12-2025 శుక్రవారం వరకు (మొత్తం 45 రోజులు) నిర్వహించబడుతుంది. భక్తులు, సేవాభావులు అందరూ విచ్చేసి పాల్గొని స్వాములకు సేవ చేయాలని, ఈ పవిత్ర కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా తెలియజేయాలని ట్రస్ట్ సభ్యులు కోరారు.

తిరుపతి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బి ఎన్ కండ్రిగ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి తిమ్మయ్య

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తొట్టంబేడు బి ఎన్ కండ్రిగ మండలాల ప్రజలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగాఉండాలని,అవసరం అయితే తప్ప బయటకు రావద్దని,రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి,భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు,వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని,బి ఎన్ కండ్రిగ సర్కిల్ సీఐ టి.తిమ్మయ్య తెలిపారు.భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు,చెరువులు వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న చోట వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు.వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున,పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు .పిల్లలు,యువకులు,చెరువులు,కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు.పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దన్నారు.

ఆంధ్రప్రదేశ్

వర్షాలకు గిరిజన కాలనీల పై దృష్టి -బొబ్బేపల్లి

గిరిజన కాలనీలలో పర్యటించిన బొబ్బేపల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గిరిజన కాలనీల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ముత్తుకూరు మండలంలోని బలిజపాలెం గిరిజన కాలనీను సందర్శించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులను ఆరా తీసి, వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే తెలియజేయాలని వారికి సూచించారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, సర్వేపల్లి పరిధిలో కూడా జనసేన నేతలు ప్రజలతో మమేకమవుతూ సహాయక చర్యల్లో భాగమవుతున్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పనిచేస్తోంది. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, బోలా అశోక్, కావలి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.