కామారెడ్డి
కామారెడ్డి, 07ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) : – లోకేటి చందర్ జీవిత గాథ! కామారెడ్డి, 8 ఫిబ్రవరి, ( ఫున్నమి ప్రతినిధి ) : మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, పశ్చిమ సబ్జోనల్ బ్యూరో ఇంచార్జ్ ప్రభాకర్ అలియాస్ స్వామి, అలియాస్ లోకేటి చందర్ (61) సహా ఏడుగురు మావోయిస్టులు అమరుల య్యారు. ఆదివారం ఆయన మృతదేహం స్వగ్రా మం ఇస్రోజివాడి చేరుకుని కుటుంబం, గ్రామస్థుల ను విషాదానికి లోను చేసింది. పూర్తి కుటుంబాన్ని అడవుల్లోకి ఆకర్షించి ముగింపు ఆయన జీవితం.. పేదల పోరాటం నుంచి దశాబ్దాల గెరిల్లా యుద్ధం వరకు తనే రాసుకున్న ఆత్మకథలోనే ఆయన గాథ మెరుస్తోంది!పేదల కుమారుడు నుంచి విప్లవ యోధుడుఇస్రోజివాడి గ్రామంలో 1969లో ఆరే కుల పేద కుటుంబంలో లోకేటి వీరన్న, కిష్టాబాయి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించాడు చందర్. వ్యవసాయ కార్మికులైన తల్లిదండ్రులకు అక్క గంగాబాయి, అన్నలు రాజేశ్వర్ రావు, మానిక్ రావు. ఆరేళ్ల చదువు మాత్రమే.. కానీ భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా 1986లో RYLలో చేరి గ్రామ అధ్యక్షుడయ్యాడు. భూపంపిణీ, కూలీల జీతాలు, విద్యుత్ పోరాటాలు చేపట్టి ప్రజల్లో మార్కు చేసుకున్నాడు. 1989లో భూస్వాములు (రాజేశ్వర్ రావు మాలీ పటేల్, చిన్న రాజిరెడ్డి, నారాయణ్ రావు పోలీస్ పటేల్) పోలీసులతో కలిసి గ్రామాన్ని చుట్టి 100 మంది అరెస్టు చేశారు. ప్రజల ఒత్తిడికి మీటింగ్లో భూ స్వాముల మెడలు వంచి అరెస్టులు రద్దు చేయిం చాడు!కుటుంబ బంధాలు కోల్పోయి అడవుల్లో కి1984లో సంగోజివాడి సులోచనతో పెళ్లి. ఇద్దరు కూతుళ్లు రజిత (1987, వికల, 1999 మరణం), లావన్య (1989); కుమారుడు రమేష్ (1991). తండ్రి 1996, తల్లి 2022 చనిపోయినా 1995లో చివరిసారి కలిశాడు. భార్య సులోచన 8 ఏళ్ల క్రితం దండకారణ్యంలో అనారోగ్యంతో మరణించింది. కూతురు లావణ్య (అలియాస్ శాంతి) ఛత్తీస్గఢ్ జైలులో, కుమారుడు రమేష్ ఇటీవల సరెండర్. మొత్తం కుటుంబం విప్లవ బాటలోనే!33 ఏళ్ల గెరిల్లా ప్రయాణం1991 ఏప్రిల్ పూర్తి సమయ విప్లవకారుడిగా చేరాడు. కామారెడ్డి, సిర్నాపల్లి, సిరిసిల్లా, నిజామాబాద్లో Dvcmగా పని. 2003లో డీకేలోకి.. దక్షిణ్ సబ్జోన్, 2011 నుంచి పశ్చిమ సబ్జోన్ ప్రభారి. కంపెనీ-2,10,4 సచివ్గా ఆయుధ పోరాటాలు చేపట్టాడు.25-30 ఎన్కౌంట ర్లు ఎదుర్కొన్నాడు. 1993 పడ్కల్ సెల్టర్లో 26 గంటల చుట్టుముట్టాన్ని తప్పించుకున్నాడు. 2021 మర్సుల్, 2024 కాకూర్ పెద్ద దాడుల్లో బయటపడ్డాడు.పార్టీ సమావేశాలు & త్యాగాలు2 రాష్ట్ర మహాసభలు, 5 ప్లీనాలు, డివిజన్ క్లాసుల్లో పాల్గొన్నాడు. ఎకనామిక్స్, ఫిలాసఫీ, MLM శిక్షణ పొందాడు. ఆపరేషన్ కగార్లో రూ.4-8 లక్షల రివార్డ్తో అత్యంత కాంటెస్ నేతగా మారాడు .స్వగ్రామంలో విషాద యాత్రఆదివారం మృతదే హం చేరుకుని గ్రామం కన్నీరు మునిగింది. పౌరహ క్కు నేతలు “బూటక ఎన్కౌంటర్.. ఆపరేషన్ కగార్ ఆపాలని నినదించారు. పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. చందర్ ఆత్మకథలోని ప్రతి పేజీ పేదల ఆకాంక్షలు, రక్తపు త్యాగాలు చెప్పుతోంది. దండకారణ్య గుహల్లో ముగిసిన ఈ తెలంగాణ వీరుడి గాథ గ్రామపంచాల్లో మునిగిపోతోంది!