Sunday, 8 March 2026

Blog

హైదరాబాద్

ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం

అఫ్జల్ గంజ్ , హైదరాబాద్ : (పున్నమి ప్రతినిధి): ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో జేసీఐ ఇండియా సంస్థ నుండి జేసీఐ సికింద్రాబాద్ వాళ్ల ఆధ్వర్యంలో ఎన్‌పవర్ యూత్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ హైదరాబాద్ చాంపియన్స్ సెక్రటరీ ప్రేమ్ చంద్ పులిగిల్ల గారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, లీడర్షిప్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు కూడా అలవర్చుకుంటే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని తెలిపారు. మంగళవారం ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాలలో నిర్వహించిన ‘ఎంపవర్ యూత్ శిక్షణ – 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికితీసి, ఉపాధి అవకాశాలకు దారి చూపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం జేసీఐ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ జెసి రవళి సోమా గారు ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీఐ హైదరాబాద్ నవ అధ్యక్షుడు జెసి శ్రీధరస్వామి , కో ట్రైనర్స్ జెసి మహేష్ కుమార్ గారు, జెసి రాజు గౌడ్ గారు, కోఆర్డినేటర్ జెసి ప్రతీక్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం ,తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం – ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రత

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమని పేర్కొంటూ ప్రతి అర్హత గల ఓటరు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం – ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రత

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమని పేర్కొంటూ ప్రతి అర్హత గల ఓటరు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 🗳️

కడప

మోసం మరియు బెదిరింపు కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను అరెస్ట్ చేసిన పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు.

ప్రొద్దుటూరు 2 టౌన్ U/G PS CR No. 07/2025 U/s 318(4),308(5),rlw3(5), భారతీయ న్యాయ సంహిత – BNS) ➡️ పొద్దుటూరు 2 టౌన్ పోలీసులు రూ. 33 లక్షల మోసం మరియు ప్రాణ హానితో బెదిరించి డబ్బులు తాకున్న కేసులో పాల్గొన్న అంతర్రాష్ట్ర ముకాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా డబ్బు రెట్టింపు పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆధారాలతో బెదిరించి నగదు లాక్కునే విధంగా నేరాలు చేస్తోంది. ఈ కేసులో పోలీసులు రూ. 8,50,000 నగదు, ఒక బ్రీఫ్ కేస్ మరియు నేరానికి ఉపయోగించిన ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ➡️ నిందితుల వివరాలు: 1. కొమ్మడి గంగులయ్య, వయస్సు: 39 సంవత్సరాలు, తండ్రి: లేట్ వెంకటేష్, కులం: రజక, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 1 /16 పెద్ద రంగాపురం గ్రామం, పులివెందుల మండలం, వైయస్సార్ కడప జిల్లా -(A 2) 2. పటాన్ సత్తార్ , బాషా, వినోద్, వయస్సు: 38 సంవత్సరాలు, తండ్రి: హుస్సేన్ పీరా, కులం: ముస్లిం, వృత్తి: రాపిడో డ్రైవర్ నివాసం: డోర్ నెంబర్ 176, భారతీయ నగర్, హుసన మరహల్లి, బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రం-(A3) 3. అంకం నాగేష్ గుప్త, వయసు: 42 సంవత్సరాలు, తండ్రి: లేట్ చిన్న రావు, కులం: దేవాంగ, వృత్తి: డ్రైవర్, నివాసం: డోర్ నెంబర్ 13/131, పుచ్చల వీధి, రాజాం గ్రామం & మండలం, శ్రీకాకుళం జిల్లా-(A4) 4. మల్రెడ్డి గోపాల్ రెడ్డి,:28 సంవత్సరాలు, తండ్రి: వెంకటరెడ్డి, కులం: రెడ్డి,వృత్తి: లిఫ్ట్ మెకానిక్, శాశ్వత నివాసం: డోర్ నెంబర్. C -12-124/1, రెడ్డి బజార్, వెంకట్రాంపురం గ్రామం, మెల్ల చెరువు మండలం, సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం నివాసం: SBI బ్యాంక్ లైన్, శాలివాసన నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం-(A5) 5. తిరుపతి పెంచలయ్య పెంచల నరసింహ, వయస్సు: 45 సంవత్సరాలు, తండ్రి: పెద్ద పెంచలయ్య, కులం: ఎస్సీ-మాదిగ, వృత్తి: మేస్త్రీ, నివాసం: డోర్ నెంబర్: 15/100, గాంధీ కాలనీ, అల్లూరు గ్రామం & మండలం, నెల్లూరు జిల్లా.

తిరుపతి

ముక్కంటీశునికి శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు మంగళవాయిద్యాలు వేద మంత్రాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోసుకుంటూ ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపి రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శ్రీశైల దేవస్తాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ….శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒక ప్రముఖ శైవ క్షేత్రం నుండి మరో క్షేత్రానికి పట్టువస్త్రాలు సమర్పించడం పురాతన ఆచారమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్తానం వారు సమర్పించిన ఈ పట్టువస్త్రాలను స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు మరియు కళ్యాణోత్సవం సమయంలో అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుపతి

కల్లిపూడిగ్రామస్తుల కష్టానికి తెరదించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తొట్టంబేడు మండలం, తాటిపర్తి పంచాయతీ పరిధిలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలో ఉన్న తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువపై స్మశానానికి వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జి పూర్తికావడంతో గ్రామస్తుల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామంలో ఇప్పటివరకు ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలువ దాటాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. కాలు జారితే కాలువలో పడే ప్రమాదం ఉండేదని గ్రామస్తులు వాపోయారు. గతంలో ఇదే కాలువ వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు. గత వైసీపీ పాలనలో పట్టించుకోని ప్రజల గోడు గ్రామస్తులు ఈ సమస్యను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదంటూ అవహేళన చేసిన సందర్భాలున్నాయని దశాబ్దాలుగా ప్రజలు పోరాడినా, వారి గోడు పాలకులకు వినిపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో ఇచ్చిన మాట – అధికారంలోకి రాగానే కార్యరూపం దాల్చరన్నారు. గత ఎన్నికల సమయంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా కల్లిపూడి గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తాము గెలిచిన వెంటనే ఈ బ్రిడ్జిని మొదటి పనిగా పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారని ఆ మాటను ఈరోజు నిలబెట్టుకుంటూ, ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు. వర్షాలు, కాలువ ప్రవాహం… అయినా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి భారీ వర్షాలు, నిండుగా ప్రవహించే తెలుగు గంగ సెవెంత్ బ్రాంచ్ కాలువ కారణంగా పనుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి మోటార్ల సహాయంతో నీటిని తొలగిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను కొనసాగించారని వర్షకాలంలో పనులు చేయడం చాలా కష్టంగా మారిందని కాంట్రాక్టర్ వెల్లడించారు. బ్రిడ్జి బాధ్యత మొత్తం భుజాన వేసుకున్న బొజ్జల రిషితా రెడ్డి బ్రిడ్జి నిర్మాణంలో ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి కీలక పాత్ర పోషించారు. కల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని, గ్రామస్తుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపి పనులను పర్యవేక్షించారు.రూ. 22.50 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి, నేడు ప్రజలకు అంకితం చేశారు.

తిరుపతి

పాత్రికేయుల సౌకర్యార్థం మీడియా పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫిబ్రవరి 10 – 23, 2026) అత్యంత వైభవంగా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల కవరేజీ కోసం వచ్చే పాత్రికేయుల సౌకర్యార్థం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మంగళవారం నాడు ఘనంగా ప్రారంభించారు. మీడియా పాయింట్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల విశేషాలను, స్వామివారి సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సూచనలు, ఆలయ నిబంధనలను ప్రచారం చేయాలని పాత్రికేయులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపి రెడ్డి, పాలక మండలి సబ్యులు, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాలు వేణుగోపాల్, పీఆర్వో ఈశ్వర్, పాత్రికేయులు పాల్గొన్నారు. మీడియావారికి దేవస్థానం వారు కల్పించిన సౌకర్యాలు: విలేకరులు వార్తలు పంపుకోవడానికి వీలుగా ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్, వాహన సేవల వివరాలను అధికారికంగా మీడియా పాయింట్ ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు.

తిరుపతి

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం భక్తకన్నప్ప ధ్వజారోహణతో ప్రారంభం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బముగా మొదటి రోజు శ్రీ భక్తకన్నప్ప స్వామి వారి ద్వజారోహణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు ఆలయ వేదం పండితులు శాశ్రోక్తంగ నిర్వహించారు. మానవులు కాదు మాటలుగాని జీవుల సైతం మోక్షమోసిగిన క్షేత్రంగా పేరుగాంచినది శ్రీలాకపాస్తి క్షేత్రం మూగజీవాలైన శ్రీ సాలీడు, కాళ పాము, హస్తి ఎనుగు, అనునిత్యంలు ఆదేవవదే వుడను పూజిస్తు మోక్షపాప్తిని పొందినవి అక్షరం రాని బోయవాడయిన కణ్ణడుని భక్తకన్నప్పగా మార్చినది ఈ క్షేతంలో మణిమంతుడనే యుకుడు విచక్షణ లేకుండా మృగాలను వంపుంతు, అనందిస్తుండేవాడు. అది చూసిన సందకేశ్వరుడు ఏపాపం ఎరుగని మృగాలను నిర్దాక్షణ్యంగా చంపుతున్న మణిమంతుడిని మాసం తింటూ కిరాతుకినిగా అడవిలో తిరుగుత జీవించమని దేవలోకంలో స్థానంలేదని శపింస్తారు. ఆ శాపానికి భయపడిన మణిమంతుడు, తన శాపానికి విమోచనం తెలుపమనగా నందికేశ్వరుడిని వేడుకోనగా అందుకు భూలోకంలో దక్షణ కాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్ష త్రంలో వివాహమాడి తద్వారా మీకు తిన్నడనే పుశ్రుడు జన్మిస్తాడు అతడు పరమకిననికి అత్యంత ప్రీతికరమైన భక్తుడుగా పేరుపొందుతాడు అప్పుడు నీ శాపవిమోచన కలుగుతుందిని తెలుపుతాడు. భక్తుడైన మణిమంతుడు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది తీరాన ఒక యోజన దూరంలో నిసిస్తూ అక్కడ ఒక బోయ యువతిని పెండ్లాడిన ఐదు సంవత్సరాల తరువాత వారికి ఒక మగబిడ్డ సంతానప్రాప్తి కలుగుతుంది. అతడికి తిన్నడు అని పేరు పెట్టడం జరుగుతుంది. అతడు కైలాస శిఖరం పరిసర ప్రాతంలోని అడువులయందు తిరుగుతు, అడవిలోని వాయులింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తు, కందమూలను, మాంసం వంటివి నైవేధ్యంగా పెడుతూ ఉండేవాడు. అతని మూడభక్తికి మునులు అత అడ్డు చెప్పలేక వురుకునేవారు. ఒకనాడు శివార్చనకు మునీంద్రులు వాయి లింగం వద్దరాగా, మునులు, దేవతలు చూస్తుండగా కిరాతకుడైన కడు భక్తిని వారికి తెలయజేప్పేందుకు పరమేశ్వరుడు, ఒక కంటియందు నీరు కారేవిధంగా చేశాడు. ఈ విషయం తెలియని తిన్నడు తన నోటిలోని జలంతో శివలింగాన్ని అదిషేకించి. నైవేద్యం సమర్పించిన తరువాత పరమేశ్వరుని వంటనీరు కారుతున్న దృశ్యాన్ని గమనిస్తాడు తన తప్పిదంచేతన స్వామికి ఇటువంటి ఇబ్బంది కలిగిందని భావించి కన్నుకు కన్నే సమాధనం అని తన వద్దవున్ని బాణంతో తన కన్నుని తీసి శివలింగానికి అమర్చుతాడు. అప్పుడు లింగం కంట నీరు కారడం నిలుస్తుంది. వెంటనే మరో కంటిలోనుంచి నీరుజారడం జరుగుతుంది. కుడు వెనువెంటనే రెండవ కంటిని కూడా పెకళించడానికి ప్రయత్నిస్తుండాగా అదేవదేవుడు ప్రత్యక్షమై తడిని అవుతాడు, తిన్నడి భక్తికి మెచ్చి నీ చరిత్ర విన్నవారికి రచించిన వారికి పాపపరిహరం అవుతుందని వరం ప్రసాదింస్తాడు. ఇది గమనిస్తున్న మునీంద్రులు తిన్నది భక్తికి సంతోషించి ఆశీర్వదిస్తారు. తనకున్న రెండుకన్నులపైతం భగవంశనికి అర్పిందానికి వెనుకాడని భక్తుడు అయినందున అతనికి భక్తకన్నప్ప అని పిలువసాగారు. పరమ శివునికి ఆపరభక్తితో తనక కన్నుని సమర్పించిన కనప్పటికి శ్రీస్వామివారికన్న ముందుగా పూజ చేయడం శ్రీకాళహస్తిలో అదివాయితగా వస్తున్న. ఆచారం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ఫిబ్రవరి 10 నుండి 23 వరకు అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకలను నిర్వహిస్తారు. భకన్నప్ప ద్వాజారోహణంతో ప్రారంభించిన తరువాతే స్వామివారి ధ్వజారోహణం నిర్వహించబడుతుంది. ఈ భక్తకన్న ధ్వజారోహణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు, పోలీసు శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆయాలనికి 40 టన్నుల కూరగాయల విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: ముక్కంటి క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల ఆకలి తీర్చేందుకు నంద్యాలకు చెందిన దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ రామన్న అండ్ సన్స్ సంస్థ ప్రతినిధి ప్రసాద్ మంగళవారం నాడు సుమారు 40 టన్నుల వివిధ రకాల తాజా కూరగాయలను దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ సమక్షంలో ఆలయాధికారులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా దాత ప్రసాద్ మాట్లాడతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామివారి ప్రసాదం (అన్నదానం) లో ఎటువంటి లోటు రాకూడదనే ఉద్దేశంతో ఈ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం దేవస్థానం వారు దాతలను ఘనంగా సత్కరించి, శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకోసం నంద్యాల నివాసులు చేస్తున్న ఈ సేవను ఆలయ పాలక మండలి సభ్యులు కొనియాడారు.

తిరుపతి

శివాలయానికి రూ..96,000 విలువ చేసే బిస్లరీ బాటిల్స్ వితరణ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆలయ అధికారుల పిలుపుమేరకు శ్రీకాళహస్తి టెక్సటైల్స్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్, శ్రీకాళహస్తి జైన్ అసోసియేషన్, జూలుగంటి సుబ్బారావు, తెర్ల లక్ష్మీ నరసింహ ప్రకాష్, జూలుగంటి జగదీష్ లు సంయుక్తంగా 96, 000 రూపాయలు విలువ చేసే 300 ml 20,000 బిస్లరీ బాటిల్స్, ఈరోజు బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారికి వాకచర్ల గురప్ప శెట్టి చేతులమీదుగా వితరణ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.