Sunday, 8 March 2026

Blog

భక్తి

ధన శివలింగాన్ని తయారుచేసిన భక్తుడు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలొ చిలక సాయి తేజ అనె భక్తునికి కలలో వచ్చిన సంగీతాలు ఆధారంగా ఒక రూపాయి రెండు రూపాయలు బిళ్ళలతో లక్షా పొతిక వేలు రూపాయలతొ శివలింగాన్ని బంధువులు మిత్రులు గ్రామ ప్రజల సహకారంతో నేను లింగొన్ని తయారుచేశాడు. శబరిమలై దాన్ని పట్టిసీమలో 14వ తారీకు బహుకరించడం మరియు రోజు అభిషేకాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇంకా పదివేల రూపాయలు పని జరుగుతోందని పరమశివ భక్తుడు చిలక సాయి తేజ తెలియ పరిచారు. END

ఖమ్మం

ప్రభుత్వ ఉద్యోగుల రాజకీయ పాత్రపై జిల్లా కలెక్టర్ కి బీజేపీ నేతలు పిర్యాదు:

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు కార్యకర్తలుగా మారి ఎన్నికల్లో పనిచేస్తామని హామీలు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులపై వెంటనే సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి పి. శ్రీజను కలిసి బీజేపీ బృందం వినతి పత్రం అందజేసింది. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, శ్రీమతి దొడ్డ అరుణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, పాలేరు శాసన సభ బీజేపీ అభ్యర్థి నున్న రవికుమార్, బీజేపీ ఏద్యుకేషన్ సెల్ జిల్లా కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు, వి. రామకృష్ణ, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేకేసి సంపూర్ణ మద్దతు

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ, దేశంలో కార్మికులు ఎన్నో సంవత్సరాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. లేబర్ కోడ్స్ అమలుతో కార్మికులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, కనీస వేతనాల హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యక్తి చాకిరి విధానం అమలయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ గారి సలహా సూచనలతో ఈరోజు జరుగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేకేసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, జిల్లా నాయకులు విజయవర్మ, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బి. సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, వెంకటేశ్వర్లు, కత్తుల సంగయ్య, శ్రీను, భద్రం, పుల్లారావు, విజయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇవాళ దేశవ్యాప్తంగా బంద్

ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ పున్నమి న్యూస్ ప్రతినిధి 11 ఫిబ్రవరి 2026 కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో బ్యాంకింగ్ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగే అవకాశం ఉంది. స్కూళ్లు యథావిధిగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి

యం.ఈ.ఓ ని సన్మానించిన ఉపాధ్యాయులు బాలు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: తొట్టంబేడు మండలంలో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ కి మండల విద్యాశాఖ అధికారి-2 భాస్కర్ బుధవారం సందర్శించారు.నో బ్యాగ్ డే, ఎఫ్.ఎల్.ఎన్., మధ్యాహ్నభోజన పథకం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు లక్ష్యం తో చదివి ఉన్నతంగా ఎదగాలని తగు సూచనలు ఇచ్చి విద్యార్థులందరికీ స్వీట్లు పంచారు.మండలంలో విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని అభినందించారు. ఈ సందర్భంగా ఈ నెల పదవీ విరమణ అవుతున్న యం.ఈ.ఓ ని పాఠశాల తరపున బాలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. పి. ప్రసాద్ పాల్గొన్నారు.

తిరుపతి

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి నివాళులర్పించిన బిజెపి నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తి పట్టణంలో బేరివారి మండపం వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అద్వర్యంలో బుదవారం నాడు మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి సందర్భంగా – సమర్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా కోలా ఆనంద్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా భాజపా నాయకులు మాట్లాడుతూ…. దేశసేవ, త్యాగం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ సిద్ధాంతంతో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలనే ఆశయంతో జీవితాంతం ప్రజల కోసం కృషి చేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, చాగణం శైలజ, పట్టణ అధ్యక్షులు హరీష్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కూనాటి నాగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, రూరల్ మండలం అధ్యక్షులు భగీర్తి వెంకటేష్, అమర్నాథ్, ఉమా సింగ్, పుణ్యం ఢిల్లీ కుమార్, రాజనాల, తిరుపాల్ నాయుడు, కందాటి సుధాకర్, చందు రాయల్, రవి రాయల్, కృష్ణా రెడ్డి, శివా యాదవ్, శ్రీకర్ నాయుడు, రాజా, హుకుం సింగ్, రాజా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

నిత్యాన్నదాన పథకానికి రూ.50,000 విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దేవస్థానముచే నిర్వహించబడుచున్న నిత్యాన్నదాన పథకానికి వైజాగ్ వాస్తవ్యులు శ్రీకాంత్ బూడిరాజు రూ.50,000/- ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయాధికారులు శ్రీ స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటుచేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేయడమైనది.

తిరుపతి

వేదమంత్రాల నడుమ అత్యంత వైభవంగా ముక్కంటి ధ్వజారోహణం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమం బుదవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ పండితులు సంప్రదాయ పద్ధతుల్లో ధ్వజారోహణం నిర్వహించగా, భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహన సేవలు నిర్వహించనున్నట్లు, ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భద్రతా చర్యలు పటిష్టం చేయడంతో పాటు తాగునీరు, ప్రసాద వితరణ, దర్శన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగినది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తుండటంతో ఆలయం భక్తి వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే కాకుండా శ్రీకాళహస్తి ప్రాంతానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

శ్రీపాద సేవకులకు రూ..2,లక్షల దుస్తులు విరాళం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో శ్రీపాద సేవకులకు ఎస్బిఐ బ్యాంక్ వారు సుమారు రూ.. 2,00,000 విలువగల 200 పంచలు, టీషర్టులను శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి చేతుల మీదుగా శ్రీవారి సేవకులకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ వో బాపిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణ రెడ్డి, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, ఏజీఎం శ్రీనివాసులు రెడ్డి, ఎస్బీఐ మైన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఫణి కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా మిన్నల్ రవి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్,వన్నెకుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి జన్మదినాన్ని పురస్కరించుకొని బుడవారం నాడు తెలుగు తమ్ముళ్ళు కేక్ కట్ చేసి రవిని దుశ్శాలువాతో సత్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ .. మిన్నల్ రవి గత వైసిపి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, బిసి వర్గాల ఆత్మీయ సోదరుడు మిన్నల్ రవికి తెలుగు తమ్ముళ్ళు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతీ ఒక్క కార్యకర్తను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి,అందరిలో ఒకడిగా ఉంటూ, అందరి కోసం తాను అన్నట్లు నిరంతరం పాటు పడే వ్యక్తి అని వారు పేర్కొన్నరు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి.నారాయణ,వజ్రం కిషోర్,చిల్లకూరు మణి,కోట చంద్రశేఖర్,హరి,ముని రెడ్డి,షేక్ మహబూబ్ బాషా,సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్,పూల శేఖర్,షేక్ ఖాదర్, చందు,గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, సయ్యద్ ఆదిల్,ప్రభాకర్,సులేమాన్, పోలూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.