Saturday, 7 March 2026

Blog

తూర్పు గోదావరి

ప్రక్కిలంక సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ – వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం

తాళ్లపూడి( పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:ప్రక్కిలంక 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. నారాయణ అప్పారావు ప్రకటించినట్టు తాళ్లపూడి ఎలక్ట్రికల్ ఏఈ జి. శ్రీనివాసరావు తెలిపారు. అయితే రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 3 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ పనుల కారణంగా ప్రక్కిలంక సబ్ స్టేషన్ పరిధిలోని ప్రక్కిలంక, తాడిపూడి, కుకునూరు, వేగేశ్వరపురం, బల్లిపాడు, పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడెం, గజ్జరం, వీరభద్రపురం గ్రామాలకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. కావున మెయింటెనెన్స్ పనులకు రైతులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

బస్సు షెల్టర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు – తాళ్లపూడిలో అన్ని షెల్టర్ల శుభ్రతకు ఆర్టీసీ ప్రత్యేక డ్రైవ్

తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:తాళ్లపూడి మండలంలో బస్సు షెల్టర్ల దుర్వినియోగంపై వెలువడిన వార్తలకు స్పందించిన కొవ్వూరు ఆర్టీసీ డిపో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బుధవారం పంచాయతీ అధికారుల సహకారంతో మండలంలోని అన్ని బస్సు షెల్టర్లను సమగ్రంగా శుభ్రపరిచినట్లు డిపో మేనేజర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి బస్సు షెల్టర్ పరిశుభ్రంగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. షెల్టర్ల వద్ద ఆక్రమణలు లేదా దుర్వినియోగం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బస్సు షెల్టర్లు పూర్తిగా పంచాయతీ అధికారుల ఆధీనంలో ఉంటాయని స్పష్టం చేస్తూ, సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. తాళ్లపూడి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బస్టాండ్‌లో పల్లె వెలుగు నుంచి సూపర్ లగ్జరీ వరకు అన్ని రకాల బస్సులు ఆగే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రయాణికుల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని డిపో మేనేజర్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ చదలవాడ శేఖర్, పంచాయతీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతిలో భక్తిశ్రద్ధలతో త్రిలోకేశ్వర్ మహాదేవ్, వీర్ తేజాజీ ఆలయ పూజలు– పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి 18 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి తిరుపతిలో సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆలయ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర భారత సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జాట్ సమాజ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను దివాకర్ రెడ్డి అభినందించారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో భిన్న ప్రాంతాల భక్తులకు సేవలందించడం సతోషదాయకమని తెలిపారు. దైవ చింతన మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మరియు హోమంలో పాల్గొన్నారు కార్యక్రమ అనంతరం సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ప్రతినిధులు డాలర్స్ దివాకర్ రెడ్డి సాంప్రదాయ పద్ధతిలో శాలువాతో సత్కరించి, మెమెంటో బహుకరించారు ఈ కార్యక్రమంలో జాట్ సమాజ్ ట్రస్టు సభ్యులు,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు

అడిగొప్పల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం

తిరునాళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి..! ఎమ్మెల్యే జూలకంటి.. దుర్గి: మండల పరిధిలోని అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా వేలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తిరునాళ్లకు సంబంధించిన గోడ ప్రతులను, ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.., పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి, తాగునీరు వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆదిశేషు నాయుడు, ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్య సన్నిధిలో వైభవంగా కొండచుట్టు-భక్తులు పార్టీ శ్రేణులు తరలిరావాలని బియ్యపు పిలుపు

శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశిష్టమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ సందర్భంగా ఉభయదారులుగా శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ సబ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. నేడు ఉదయం 6:30 గంటలకు ఆలయ గాలిగోపురం వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఈ పవిత్ర కార్యక్రమంలో శివ భక్తులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ కార్యాలయం ద్వారా మాజీ ఎమ్మెల్యే కోరారు.

తిరుపతి

బాలికలపై జరుగుతున్నఅత్యాచార దాడులు నశించాలి- కోలా వెంకటేశ్వరరావు

శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో సమస్త సభ్యులు మహిళలు పాల్గొని మానవహారం నిర్వహించి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టి మహిళలను గౌరవించే సమాజం నెలకొనాలని మహిళలకు పూర్తిగా రక్షణ ఉండాలని పలువురు మహిళలు ఈ సందర్భంగా నినాదాలు చస్తూ బాలిక తల్లికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. మదనపల్లిలో జరిగిన ఏడేళ్ల చిన్నారి పై గంజాయి సేవించిన మృగాడు ఎదురింటిలో నివాసముండే బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి వాడి ఇంటిలోకి తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేసి నీటి డ్రామ్ములో ముంచి కిరాతకముగా హత్య చేసిన మానవ రూపంలో ఉన్న మృగం అటువంటి మృగాలు పట్ల ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని తల్లి,దండ్రులు తమ పిల్లలను పెంచేటప్పుడు ముఖ్యంగా మగ పిల్లలకు మహిళలను గౌరవించాలని పరాయి మహిళలకు తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించే సంస్కారము నేర్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ కుమార్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు ఎంజి బాలాజీ, సంస్థ సభ్యులు కోలా సంగీతారావు, అనిల్ కుమార్, ముని చంద్ర నాయుడు, చంద్రారెడ్డి, వరలక్ష్మి, చైతన్య మల్లికార్జున్ యాదవ్, నందిని, సుభద్ర, పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం- శివయ్య కృపకు పాత్రులవ్వాలని బొజ్జల పిలుపు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఎంతో వేడుకగా భావించే కైలాసగిరి ప్రదక్షిణ (కొండచుట్టు) కార్యక్రమం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం 7 గంటలకు ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణంలో శివనామ స్మరణతో గిరివీధులన్నీ పులకించనున్నాయి. అశేష భక్తజన సంద్రం మధ్య ఆధ్యాత్మిక మహోత్సవంగా సాగే ఈ అద్భుత వేడుకకు అశేష భక్తకోటి అందరం కలిసి ఈ పవిత్ర యాత్రలో పాల్గొని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు భక్తులను కోరారు.

తిరుపతి

బలరామయ్య మరణం మండలంలో పార్టీకి తీరని లోటు-గాలి మురళి నాయుడు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, కొణతనేరి గ్రామ పంచాయితీ, గుర్రప్ప నాయుడు కండ్రిగ హరిజనవాడకు చెందిన బలరామయ్య మూత్రపిండవ్యాధితో సమస్యతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోగినేని భాస్కర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ సింగమాల భాస్కరయ్య, కస్తూరయ్య, బూత్ ఇంచార్జ్ లెక్కల మురళి నాయుడు తదితర నాయకులు బలరామయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బలరామయ్య కుటుంబ సబ్యులను పరామర్శించి తమ ప్రఘాడసానుభుతిని తిలిపారు. ఈ సందర్బ్గంగా గాలి మురళి నాయుడు మాట్లాడుతూ…బలరామయ్య పార్టీకి ఎంతో సేవ చేశారని, వారి కుమారులు కూడా పార్టీకి సేవ చేస్తారని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

తిరుపతి

వర్లి ఆర్ట్ తో విద్యా బోధన సులభతరం -తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీతలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 18:శ్రీకాళహస్తి నివాసులైన గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ వరలక్ష్మి, కుమారి సాయి దీపికలకు వర్లి చిత్రకళ ద్వారా రామాయణాన్ని వినూత్న పద్ధతుల్లో చిత్రీకరించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కడంపై బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సంవేశంలో వారు మాట్లాదుతూ.. గిరిజన తెగలో అరుదుగా కనిపించే వర్లి ఆర్ట్ ద్వారా అతి సులువుగా విద్యా బోధన చేయొచ్చని 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు వారి పాఠ్యాంశాల్లోని సంపూర్ణ రామాయణాన్ని మొత్తం 20 నిమిషాల్లో రివిజన్ చేసే విధంగా వర్లీ చిత్రకళ దోహదపడుతుందన్నారు. అతి సులువైన త్రిభుజాలు వృత్తాలు, గీతలు ద్వారా పురాణ ఇతిహాసాలను పరిచయం చేస్తూ విలువలతో కూడిన విద్యను వినూత్న రీతిలో విద్యార్థులకు అందించే విధంగా తాము త్వరలో వంద పాఠశాలలో కార్యాచరణ చేపట్టనున్నామని ఈ వర్లి చిత్రలేఖనం ద్వారా 20 నిమిషాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో ఆసక్తితో పాటు రామాయణంలోని నీతిని, విలువలును తెలుసుకునే విధంగా అవగాహనా సదస్సులు నిర్వహించనున్నామని తొట్ట తొలిగా తాము తీసుకొచ్చిన పరిశోధనాత్మక వర్లీ ఆర్ట్ ను నూతన జాతీయ విద్యా విధానంలో సైతం ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నయని వృత్తి నైపుణ్య విద్యగా కూడా వర్లి ఆర్ట్ దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన 220 మంది రోవర్లు, రేంజర్లు, స్కౌట్స్, గైడ్స్ సేవలందించారు. శివరాత్రి రోజున ఆలయంలోని క్యూ లైన్లలో భక్తులకు తగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించి, రద్దీని క్రమబద్ధీకరించేందుకు సహకరించారు. అలాగే స్వామి, అమ్మవార్ల రధోత్సవం, తెప్పోత్సవం, కళ్యానోత్సవాలలో కూడా తమ వంతు సేవలందించారు.ఈ సందర్భంగా కళ్యానోత్సవంలో పాల్గొన్న రేంజర్లు, రోవర్లు, స్కౌట్స్, గైడ్లను శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కలసి మాట్లాడారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు విశేషమైన సేవలు అందించారని వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు పర్యవేక్షణలో ఇంచార్జి కార్యదర్శి విజయకుమార్, స్కౌట్ మాస్టర్లు మహేంద్ర, అజారుద్దీన్, విద్యాసాగర్, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, గైడ్ కెప్టెన్లు, జ్యోతిర్మయి, సరిత, నిర్మల, రేంజర్, రోవర్ లీడర్లు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.