Wednesday, 6 May 2026

Blog

Blog

అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్‌పై సీబీఐ కేసు రూ.228 కోట్ల బ్యాంకింగ్ మోసానికి సంబంధించిన వ్యవహారం యూనియన్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జై అన్మోల్ అంబానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు సంబంధించిన బ్యాంకింగ్ మోసం కేసులో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో జై అన్మోల్‌తో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, కంపెనీ మాజీ సీఈఓ రవీంద్ర సుధాల్కర్‌లను కూడా నిందితులుగా చేర్చారు. చీటింగ్, నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం ద్వారా బ్యాంకుకు రూ.228.06 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సీబీఐకి అందిన ఫిర్యాదు ప్రకారం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వ్యాపార అవసరాల కోసం బ్యాంకు నుంచి రూ.450 కోట్ల వరకు రుణ సదుపాయం పొందింది. అయితే, కంపెనీ సకాలంలో వాయిదాలు చెల్లించడంలో విఫలమవడంతో 2019 సెప్టెంబర్ 30న ఈ ఖాతాను నిరర్థక ఆస్తిగా (NPA) వర్గీకరించారు. అనంతరం గ్రాంట్ థార్న్‌టన్ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో కంపెనీ రుణాలుగా పొందిన నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు తేలింది. ప్రమోటర్లు, డైరెక్టర్ల హోదాలో ఉన్న నిందితులు ఖాతాలను తారుమారు చేసి, నిధులను పక్కదారి పట్టించి బ్యాంకును మోసం చేశారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసులో భాగంగా సీబీఐ అధికారులు కంపెనీకి సంబంధించిన పత్రాలు, లోన్ అకౌంట్లను పరిశీలించనున్నారు.

అమరావతి

స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్*

*స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్* *ప్రభుత్వ చర్యలతో 48 శాతం తగ్గిన అంటువ్యాధులు* *డెంగ్యూ 56 శాతం, మలేరియా 11 శాతం, చికున్ గున్యా 46 శాతం తగ్గుదల* *సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలి* *అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి* *వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు* *అమరావతి డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్‌పై పరిశీలన జరిపామని… స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని…వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని… ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిస్సాలలో 7 వేలు చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ…..స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. *48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు* రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు డెంగ్యూ కేసులు 56 శాతం తగ్గాయని తెలిపారు. గత ఏడాది 7,871 మంది మలేరియా బారినపడగా…..ఈ ఏడాది 7,010కి మలేరియా సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించదని వివరించారు. చికున్ గున్యా గత ఏడాది 266 కేసులు రాగా…ఈ ఏడాది 142 వచ్చాయని, చికున్ గున్యా కేసులు 46.5 శాతం తగ్గినట్లు అధికారులు వివరించారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, సీజనల్ వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, ముందు జాగ్రత్తలు కారణంగా సీజనల్ వ్యాధులు 48 శాతం మేరకు తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. *అపరిశుభ్రతే అసలు జబ్బు….ప్రజల్లో చైతన్యం పెంచాలి* అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సీఎం తెలిపారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని….దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో దినేష్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ గిరీశా పాల్గొన్నారు.

విశాఖపట్నం

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్*

*ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి మ‌ధురువాడ ఐటీ హిల్స్ పై సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను గ‌మ‌నించారు. కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో, వీఈఆర్(వైజాగ్ ఎకనామిక్ రీజియన్) స‌మావేశం జ‌ర‌గ‌నున్న ప్రాంతాల్లో అధికారుల‌తో మాట్లాడారు. ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. స‌మ‌యం త‌క్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం హిల్ నెం.3 వ‌ద్దకు నేరుగా ముఖ్య‌మంత్రి చేరుకోకున్న క్ర‌మంలో అక్క‌డ‌ హెలిప్యాడ్ ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్ ప్ర‌తినిధులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు.

విశాఖపట్నం

జోన్ – 4 లో ఉన్న విజన్ యూనిట్ యాక్షన్ ప్లాన్

*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* *జోన్ – 4 లో ఉన్న విజన్ యూనిట్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వివిధ వార్డుల వార్డుల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తెలియపరిచి వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. వెంటనే పరిష్కారం కానీ సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు*…

విశాఖపట్నం

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్. *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- * ప్రజా ఆరోగ్యపు అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి నరేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్, తో సమీక్ష నిర్వహించగా జూమ్ యాప్ ద్వారా పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం వార్డు శానిటేషన్ ,ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యంలో ఎటువంటి అలసత్వం వహించరాదని, ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ క్లాప్ వాహనాల ద్వారా చేపట్టాలని, అధికారులు సిబ్బంది నిర్ణీత సమయానికే విధుల్లో ఉండి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అధికారులు ముందుగా సిబ్బంది హాజరును పరిశీలించి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డుపై పశు సంచారం లేకుండా చూడాలని, పందులు, కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని వెటర్నరి అధికారులను ఆదేశించారు. నగరంలో దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే పాటించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పౌర సేవలు పొందేందుకు పురమిత్ర యాప్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పలు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సలు వసూలు చేయాలని, కొత్తగా ఏర్పాటుచేసిన దుకాణాలను గుర్తించి వాటికి ట్రేడ్ లైసెన్స్ లను విధించి వాటిని వసూలు చేయాలని ఆదేశించారు.

విశాఖపట్నం

బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్ల ప్రాజెక్టు పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.*

**బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్ల ప్రాజెక్టు పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.* **కొత్త టవర్స్ ఏర్పాట్లలకు స్థల స్థల పరిశీలన పరిశీలన చేయాలి.* – *జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్* అల్లూరి డిసెంబర్ 10 విశాఖ పున్నమి ప్రతినిధి:- ఏ ఎస్ ఆర్ జిల్లా (పాడేరు ) డిసెంబర్ : 09 అల్లూరి జిల్లా ఏజెన్సీ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశిచారు. మంగళవారం కలెక్టరేట్ విసీ హాల్ నుండి నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్, మండల తాసిల్దార్లు, అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయిన ప్రాంతాల్లో టవర్స్ ఏర్పాటు చేసి 4జి సిగ్నల్స్ అందించాలని ఆదేశించారు. జిల్లా లో పాడేరు డివిజన్ కు సంబంధించిన bsnl టవర్స్ 561 సెంక్షన్ కాగ 457 పూర్తి కాగ 104 టవర్స్ వివిధ దశలలో ఉన్నదని, రంపచోడవరం డివిజన్ లో బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ 364 సెంక్షన్ అయిందని అందులో 355 పూర్తి చేసామని మిగిలిన 9 టవర్స్ వివిధ దశలలో ఉన్నదని త్వరలో పూర్తి చేస్తామని బి ఎస్ ఎన్ ఎల్ ఏ జి ఏం తెలియజేశారు. జిల్లాలో అదనంగా 101 బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని అందుకు సంబంధించి స్థల పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ మండల తాసిల్దార్ కు ఆదేశించారు. జిల్లాలో జియో టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి 509అనుమతులు పొందగ అందులో 445 టవర్స్ పూర్తి చేసామని, 64 వివిధ దశలలో ఉన్నదని జియో ఏజిఏంతెలియజేశారు. జిల్లాలో ఎయిర్ టెల్ టవర్స్139 అనుమతులు పొందగా అన్ని పనులు పూర్తి చేసామని ఎయిర్ టెల్ అధికారులు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయు టవర్స్ కు ఆర్ ఓ ఎఫ్ ఆర్ క్లియరెన్స్ అనుమాతలు, పర్మిషన్లు పూర్తి చేసుకుని సిగ్నల్ టవర్స్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రహదారి సదుపాయము లేని (కనెక్టివిటీ) ప్రాంతాలకు టవర్స్ ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రిని తరలించుటకు అంతరాయం లేకుండా ప్రత్య న్యాయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ వార్చ్ వాల్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమనికి బిఎస్ఎన్ఎల్ ఏజీఎం శ్రీకాంత్, జిఓ ఏజీఎం సత్యప్రసాద్ ఎయిర్ టెల్ అధికారులు, మండల తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం.

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం. • జీవీఎంసీ లో అవినీతిరహిత విధానం దిశగా చర్యలు. విశాఖపట్నం డిసెంబర్మ 10 పున్నమి ప్రతినిధి :-మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో అవినీతి నిర్మూలనకు తావు లేకుండా , అవినీతి రహిత విధానం అమలు దిశగా కఠిన చర్యలు చేపట్టడం జరుగుచున్నదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. జీవీఎంసీ లో అవినీతి నిర్మూలన దిశగా కఠినమైన విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని, జీవీఎంసీలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే కఠిన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగునని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే పలు ఆరోపణలపై ఒక ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ సేవలను సరెండర్ చేశామని, ఒక సహాయక ఇంజనీర్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేసామని, ఒక టీపీవో (Town Planning Officer) సేవలను కూడా సరెండర్ చేయడం జరిగిందని తెలిపారు. పౌర సేవల్లో పారదర్శకత, నిష్పాక్షికత కోసం జీవీఎంసీ ఎటువంటి అవినీతి చర్యలను ఉపేక్షించదని కమిషనర్ స్పష్టం చేశారు. అవినీతిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హితవు పలికారు. జీవీఎంసీ అధికారులు ,ఇంజనీర్లు ,ఉద్యోగులు ,సిబ్బంది అవినీతి రహితంగా, విశాఖ నగర అభివృద్ధి దిశగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడమైనదని కమిషనర్ తెలిపారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజాతీర్పుకు కుటమిప్రభుత్వం తలవంచాలి :

మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజాతీర్పుకు కుటమిప్రభుత్వం తలవంచాలి : *మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయ ప్రసాద్* విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి:- * మింది లో గల పశ్చిమ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో *మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ మాజీ శాసనసభ్యులు పార్టీ పరిశీలికలు *చింతలపూడి వెంకటరమణయ్య సమక్షంలో పశ్చిమ నియోజకవర్గం 14 వార్డులలో ప్రజల వద్ద నుంచి స్వీకరించిన కోటిసంతకాల పత్రాల box లను ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో పబ్లికేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ చేయొద్దంటూ పశ్చిమ నియోజకవర్గ 14 వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటూ ప్రజల నుండి సేకరించిన పత్రాలను రేపు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు కేకే రాజు గార్కి అందించడం జరుగుతుందని అక్కడ నుంచి త్వరలోనే అధిష్టానానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు,వార్డ్ పార్టీ పరిశీలకులు,రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు,జిల్లా అనుబంధం భాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధం భాగాల అధ్యక్షులు, వార్డ్ అనుబంధం భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.