Saturday, 21 March 2026

Blog

వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు – ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన అధికారులు – ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ డిఎస్పీ నారాయణ రెడ్డి – 2021 – 2024లలో సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు..!

ఆంధ్రప్రదేశ్

ధాన్యం పట్టుబడి లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి మరీ తెలుసుకున్న MLA కాగితకృష్ణప్రసాద్

పెడన మండలం ఈదుమూడి గ్రామంలో ధాన్యం పట్టుబడి పడుతున్న రైతుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు అవసరమైన గోనె సంచులు అందజేత, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా పోటీలు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేత

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వీరజవాన్లను స్మరించుకుంటూ పట్టణంలోని కె.వీ.ఆర్ కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కె.వీ.ఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో కే.ఇందిరశ్వనీ, పి.ప్రేమ్‌కుమార్, ఎన్.మయూరి, జి.ప్రణీత, ఎం.వర్ష, బి.చంద్రిక విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గురువారం నాడు పోలీస్‌స్టేషన్‌ లో జరిగిన కార్యక్రమంలో సీఐ వై.వై.ఎల్.నాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి.మోహనరావు,కే.సూర్యవంశీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రామారెడ్డి, 13 నవంబర్ ,(పున్నమి ప్రతినిధి )    : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులతో కలిసి ఇస్సానపల్లి, రామారెడ్డి వీధుల్లో జరిగిన రథయాత్రలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అగ్ని గుండాల కార్యక్రమంలో పాల్గొ ని స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితు లు  ఆశీర్వదించారు.ఆయన భక్తులతో కలసి భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం భక్తు లతో మదన్ మోహన్ మాట్లాడుతూ, “రామారెడ్డి మండలంలో శ్రీ కాలభైరవస్వామి ఆలయం అత్యం త పవిత్రమైనది, ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ఈ ఆలయాన్ని ‘దక్షిణ కాశీ’గా అభివృద్ధి చేయడానికి త్వరలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నా రు. ఈ పవిత్రక్షేత్రానికి ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందేలా సదుపాయాలు కల్పిస్తాం” అని తెలిపారు.“ఎమ్మెల్యే రామారెడ్డి వాడినే. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కాలభైరవస్వామి ఆలయం తో ముడిపడి ఉన్నాయని చెప్పారు. చిన్నతనంలో నే స్వామివారి ఉత్సవాలను చూసి, ఆద్యాత్మికలో  పెరిగానని చెప్పారు.  ఆలయ అభివృద్ధి కోసం నా కృషి నిరంతరం కొనసాగుతుంది” అని ఎమ్మెల్యే అన్నారు.వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలను పొందారని అన్నా రు. కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

E-పేపర్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం శుభ్రం చేస్తున్న సర్పంచ్ ఎంపీటీసీ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం శుభ్రం చేస్తున్న సర్పంచ్ ఎంపీటీసీ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక అనంతరాజుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలు శుభ్రం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ సుబ్రమణ్యం , ఎంపీటీసీ బండారు మల్లికార్జున ప్రారంభం చేశారు . సువిశాలమైన స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు శుభ్రం చేయడానికి ట్రాక్టర్ డోజర్ ను రప్పించి పనులు పూర్తి చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లలిత కుమారి తెలుగు మాస్టర్ ,సుబ్రమణ్యం రెడ్డి, నాగేంద్ర, రత్నం ,శరత్ కుమార్ ,పిడి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాదు

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో ఇంద్రవెల్లి సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం కౌన్సిలర్ వెంకట్ గౌడ్, అశ్విన్ నిర్వహించారు. వినియోగ దారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, కేవైసీ చేసుకోవాలని తెలిపారు. ఇన్స్యూరెన్స్ పథకాలు ఆర్థిక భరోసాగా ఉంటాయని తెలిపారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాల గురించి వివరించారు. డిజిటల్ పేమెంట్స్ గురించి తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి మడావి నాందేవ్, గ్రామ పటేల్ మాణిక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న భోళాశంకర్ సేవా సమితి మందల నాగేంద్ర

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న భోళాశంకర్ సేవా సమితి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలో భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో నిరుపేదల ఆకలి తీర్చడానికి శివ పరమాత్మని ఆశీస్సులతో భోళా శంకర్ సేవాసమితి ద్వారా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే కోవలో గురువారం ఎన్నారై మందల పాలకొండ్రాయుడు దాతృత్వంతో భోళా శంకర్ సేవా సమితి ద్వారా పట్టణంలోని నిరుపేద కుటుంబీకురాలు, వృద్ధురాలు షేక్ ఫాతిమా మరియు రోడ్డు ప్రమాదంలో చేతులు కోల్పోయిన ఆమె కుమారుడు కి రోజు గడవడమే కష్టమవుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు, సభ్యులు కలిసి ఆ నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందల నాగేంద్ర మాట్లాడుతూ ఎన్ఆర్ఐ మండల పాలకొండ్రాయుడు దాతృత్వంతో మన సేవా సమితి ద్వారా ఆ నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేసి వారి కాస్తయినా కష్టాలను తీర్చినవారిగా మనస్తృప్తిగా ఉందని, అలాగే మేము చేసేటువంటి సహాయ కార్యక్రమాలకు దాతృత్వం చేస్తున్న దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని, ఇదేవిధంగా రైల్వే కోడూరు మండలంలో నిరుపేద కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పం ఎవరికైనా కలిగితే మీరు స్వయంగా అయినా చేయగలరు లేనిపక్షంలో మన సేవా సమితి ద్వారా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోలా శంకర్ సేవాసమితి సభ్యులు సిహెచ్ రమేష్, బైసాని కిరణ్ కుమార్ ,ఉత్తరాది శివకుమార్, వాసా బాబు, పోలశెట్టి రాజేశ్వరి, కొప్పాల శంకరయ్య, మల్లెల మణి, మహంకాళి సుబ్రమణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, యనమాల చైతన్య, శేఖర్, యనమల రత్తయ్య, కంభంపాటి వెంకటరమణ, టంగుటూరి వెంకటకృష్ణ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

జోగులాంబ గద్వాల

ఛలో ఢిల్లీ 17న దళితుల ఆత్మగౌరవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

*ఛలో ఢిల్లీ 17న దళితుల ఆత్మగౌరవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం* *సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన – న్యాయవాది రాకేష్ ను అరెస్టు చేసేదాకా ఉద్యమిద్దాం* *మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసిన – తెలంగాణ రాష్ట్ర మాదిగ హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామేలు గద్వాల నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి ) ఐజ మండలకేంద్రం లోని స్థానిక మేడికొండ చౌరస్తా నందు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామేలు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తలపెట్టిన చలో 17న ఢిల్లీ దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం విజయవంతం చేయుటకై కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడి జరిపిన న్యాయవాది రాకేష్ ను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని అన్నారు.మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన చలో ఢిల్లీ 17 న దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం విజయవంతం చేయుటకై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. జిల్లాలోని ప్రతి దళిత సోదరుడు ఢిల్లీలో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయిజ జానయ్య,సురేష్,బాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.