E-పేపర్
నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న భోళాశంకర్ సేవా సమితి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలో భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో నిరుపేదల ఆకలి తీర్చడానికి శివ పరమాత్మని ఆశీస్సులతో భోళా శంకర్ సేవాసమితి ద్వారా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే కోవలో గురువారం ఎన్నారై మందల పాలకొండ్రాయుడు దాతృత్వంతో భోళా శంకర్ సేవా సమితి ద్వారా పట్టణంలోని నిరుపేద కుటుంబీకురాలు, వృద్ధురాలు షేక్ ఫాతిమా మరియు రోడ్డు ప్రమాదంలో చేతులు కోల్పోయిన ఆమె కుమారుడు కి రోజు గడవడమే కష్టమవుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు, సభ్యులు కలిసి ఆ నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందల నాగేంద్ర మాట్లాడుతూ ఎన్ఆర్ఐ మండల పాలకొండ్రాయుడు దాతృత్వంతో మన సేవా సమితి ద్వారా ఆ నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేసి వారి కాస్తయినా కష్టాలను తీర్చినవారిగా మనస్తృప్తిగా ఉందని, అలాగే మేము చేసేటువంటి సహాయ కార్యక్రమాలకు దాతృత్వం చేస్తున్న దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని, ఇదేవిధంగా రైల్వే కోడూరు మండలంలో నిరుపేద కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పం ఎవరికైనా కలిగితే మీరు స్వయంగా అయినా చేయగలరు లేనిపక్షంలో మన సేవా సమితి ద్వారా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోలా శంకర్ సేవాసమితి సభ్యులు సిహెచ్ రమేష్, బైసాని కిరణ్ కుమార్ ,ఉత్తరాది శివకుమార్, వాసా బాబు, పోలశెట్టి రాజేశ్వరి, కొప్పాల శంకరయ్య, మల్లెల మణి, మహంకాళి సుబ్రమణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, యనమాల చైతన్య, శేఖర్, యనమల రత్తయ్య, కంభంపాటి వెంకటరమణ, టంగుటూరి వెంకటకృష్ణ పాల్గొన్నారు.