Tuesday, 5 May 2026

Blog

అన్నమయ్య

ఆడపూరులో మినీ గోకులం ప్రారంభం:-ఘన స్వాగతం పలికిన శౌర్య సేన

ఆడపూరు పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై మినీ గోకులం శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దిశానిర్దేశంలో, పశుసంవర్ధక–పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడు ప్రోత్సాహంతో గ్రామీణాభివృద్ధి, పశుసంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు ఈ మినీ గోకులం ప్రతీకగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. ఈ మినీ గోకులం ఏర్పాటు మేడా విజయ శేఖర్ రెడ్డి చొరవ, కృషి వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యంగా పశుసంపద సంరక్షణ, రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండూరు దిలీప్‌తో పాటు గ్రామ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. మినీ గోకులం ఏర్పాటుతో గ్రామంలోని గోవులకు సురక్షిత ఆశ్రయం లభించడమే కాకుండా, రైతులకు సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయని, దీని ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, కొండూరు దిలీప్ రాజు, కొండూరు వెంకటేష్ రాజు, కొండూరు రమేష్ రాజు, కొండూరు సుదర్శన్ రాజు, కొండూరు రవిచంద్ర రాజు, కొండూరు రాజశేఖర్ రాజు, కొండూరు కార్తీక్ వర్మ, కొండూరు భరత్ రాజు, కొండూరు అచ్యుత్ వర్మ, చుక్క వెంకటేష్, టిడిపి నాయకుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఆడపూరు స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి, ముస్లిం మైనారిటీ యువ నాయకుడు పఠాన్ మెహర్ ఖాన్, ఎల్లమరాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవంతం రెయిన్బో వీక్ వేడుకలు 2025 …ఎస్ డి ఎం ఎస్ ఎం కళాశాల….

రెయిన్‌బో వీక్ వేడుకలు–2025 విజయవంతంగా నిర్వహణ విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెయిన్‌బో వీక్ వేడుకలు–2025లో భాగంగా 13 డిసెంబర్ 2025న నేషనల్ సెమినార్“మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని, పరిశ్రమలలో అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు 8 డిసెంబర్ నుండి 13 డిసెంబర్ వరకు విద్యార్దునులకు అనేక రకాల వినూత్న కాంపిటీషన్లు నిర్వహించబడాయి.పోస్టర్ ప్రెజెంటేషన్, కెమిస్ట్రీ గ్రూప్ క్విజ్, మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ, థంషల్ ఆర్ట్స్, డాన్సింగ్ ఎలిమెంట్స్, కెమికల్ తాంబూలా వంటి సృజనాత్మక మరియు విజ్ఞానాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థునుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎం. సుభాషిని, రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు కళాశాల విద్యార్థునులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

E-పేపర్

విజయవంతం రెయిన్బో వీక్ వేడుకలు..2025… శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల. విజయవాడ.

రెయిన్‌బో వీక్ వేడుకలు–2025 విజయవంతంగా నిర్వహణ.. ( పున్నమి విజయవాడ డాక్టర్ మంజుల గుదిమెళ్ళ.) విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెయిన్‌బో వీక్ వేడుకలు–2025లో భాగంగా 13 డిసెంబర్ 2025న నేషనల్ సెమినార్“మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని, పరిశ్రమలలో అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు 8 డిసెంబర్ నుండి 13 డిసెంబర్ వరకు విద్యార్దునులకు అనేక రకాల వినూత్న కాంపిటీషన్లు నిర్వహించబడాయి.పోస్టర్ ప్రెజెంటేషన్, కెమిస్ట్రీ గ్రూప్ క్విజ్, మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ, థంషల్ ఆర్ట్స్, డాన్సింగ్ ఎలిమెంట్స్, కెమికల్ తాంబూలా వంటి సృజనాత్మక మరియు విజ్ఞానాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థునుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎం. సుభాషిని, రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు కళాశాల విద్యార్థునులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

E-పేపర్

ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు

ఓటు వేసేందుకు స్వగ్రామానికి బైక్‌పై వెళ్తూ, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి హైదరాబాద్ లో ఉంటూ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి బైక్‌పై బయలుదేరిన బుర్ర కళ్యాణ్(27), నవీన్(27) అనే స్నేహితులు ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై వీరి బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి

ఎన్ టి ఆర్ జిల్లా

హిందూ సమ్మేళనానికి ఆహ్వానం మూలాలకు తిరిగి రావాలంటూ పిలుపు – శాంతి, సేవే హిందూ ధర్మ లక్షణాలు

హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీవన విధానమని, అది హింసపై కాదు శాంతి, సహనం, సేవలపై ఆధారపడిందని హిందూ సమ్మేళన నిర్వాహకులు తెలిపారు. వివిధ కారణాల వల్ల తమ మూల ధర్మానికి దూరమైన వారు తిరిగి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకుని, ఆచరించేలా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవల రూపంలో గానీ, చదువుల రూపంలో గానీ ప్రజలను బలవంతంగా చేర్చుకోవడం ధర్మ లక్షణం కాదని, హిందూ ధర్మం వ్యక్తిగత ఆత్మపరిశీలన, సత్యాన్వేషణకు మార్గం చూపుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం ఇచ్చే ధర్మమే హిందూ ధర్మమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న హిందూ సమ్మేళనంలో సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యువత తమ చరిత్రను, సంస్కృతిని తెలుసుకుని గర్వంగా జీవించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. హిందువుగా జీవించు – హిందువుగా గర్వించు అనే నినాదంతో ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామలో శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్ మోహన్ రావు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు ప్రభుత్వం నూటికి నూరు శాతం పిచ్చి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలు కాదు, కేవలం ప్రైవేట్ ప్రయోజ నాలకే పాలన సాగుతోంది” అని అన్నారు.నందిగామలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు, ఆవేదన, పత్తి కొనుగోళ్ల సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని తెలిపారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఇప్పటివరకు మినుములు, పెసలు, అపరాలు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కపాస్ యాప్ ద్వారా దళారుల దోపిడీపై ప్రశ్నించాకే ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెండు సంవత్సరాల పాలనలో నందిగామకు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిని తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాల పై ఎమ్మెల్యే–ఎంపీలకు ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని విమర్శించారు. రాఘవపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల రెండు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి, మిర్చి, పప్పుధాన్యాల కొనుగోళ్లు జరిగాయని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి పాలనలో రైతులకు పట్టించుకునే నాథుడే లేడన్నారు. తమపై గతంలో చేసిన అవినీతి ఆరోపణలను ఇప్పుడు అధికారంలో ఉన్నవారే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించ డమే కూటమి ప్రభుత్వలక్ష్యమా అని ప్రశ్నించారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

విశాఖపట్నం

లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభంముఖ్య అతిధి సినీ నటి అనసూయ:

లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం – ముఖ్య అతిధి సినీ నటి అనసూయ: విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి ప్రకాశ రావు పేట లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను శనివారం ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు డిప్యుటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి, పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణ ప్రసాద్ సి ఎం ఆర్ అధినేత మాఊరి వెంకట రమణ లక్కీ శాపింగ్ మాల్ అధినేతలు స్వామి, శ్రీనివాస్, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశం.

*విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ…ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ముందంజలో ఉందన్నారు. నిన్న తొమ్మిది ఐటీ కంపనీలకు శంకుస్థాపన చేసుకున్నాము. మార్చి నెలలో గూగుల్ కు శంకుస్థాపన చేయబోతున్నామని, గూగుల్ విశాఖ ముఖ చిత్రం మార్చబోతుందని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపుచూస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కి సీఎం చంద్రబాబు విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… విశాఖ ఎకనామిక్ రీజియన్ తొలి సమావేశం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిందని తెలిపారు. 36 వేల చదరపు కిలోమీటర్లు పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటయిందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ మూలం నీతిఅయోగ్ లక్ష్యాలని, 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఏడూ గ్రోత్ సెక్టర్లు, 49 ప్రాజెక్టులు, ప్రతి మూడు నెలలకు ఒకసారి విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్ష ఉంటుందని అన్నారు. రాజకీయాలు ప్రక్కన పెట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ కు నిధులు తీసుకువచ్చామని, రాష్ట్రం నుంచి నిధులు ఇచ్చామని పేర్కొంటూ, స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో యజమాన్యం, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. విశాఖ ఉత్తర శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ…ఎవరు ఊహించని విధంగా విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు . వి ఈ ఆర్ లో 2031 నాటికి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ….విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. ప్రేవేటికరణ అవుతుందనుకున్న స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఐటీ సంస్థలకు 99 పైసలుకె ఎకరం భూమి ఇస్తున్నారని వ్యాఖ్యలు చేసేవారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎకరం భూమి ఒక రూపాయి కె కేటాయించారని తెలిపారు. తక్కువ ధరకు భూములు కేటాయించడం కొత్త కాదు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం*

*ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం* *విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ* *కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు* *విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * నిన్న విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశా రని, ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, నగర శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదన్నారు. వైసీపీ నేతలకు చేతనైతే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హితవు పలికారు.

విశాఖపట్నం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం*

*రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం* *ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పనవి కూడా అమలు చేస్తున్నాం* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి* *విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో కలిసి ఇల్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……సెంటు భూముల్లో ఆప్షన్-3 గృహాలు స్వాధీన పత్రాలు అందజేయడంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి అభినందనీయం. మీరు వెళ్లే ప్రాంతాలు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబునాయుడు 9 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన ఇల్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. నేడు కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, మరీ వెనుకబడిన వారికి రూ.1 లక్ష చొప్పున సాయం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛను రూ. 200 నుంచి రూ. 2 వేలు, రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే. పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది. ఆడపడుచులకు స్త్రీ శక్తి పధకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం -2 పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్ల చొప్పన ఉచితంగా ఇస్తున్నాం. ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నాం. అన్నా క్యాంటిన్లల్లో ఎవరైనా సరే 5 రూపాయలకే భోంచేసే సదుపాయం కల్పించాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. ఆరుగురు పిల్లలున్నవారికి కూడా డబ్బులొచ్చాయి. ఇలా చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు ఎస్సీ, బీసీలందరికి ఇళ్లపై సోలార్ కరెంటు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.