Saturday, 7 March 2026

Blog

తిరుపతి

శివునికి అభిషేకం విదేశీయ మహిళలు భజనలు

పున్నమి ప్రతినిధి 21 ఫిబ్రవరి రేణిగుంట మండలం తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞ్యానపీఠంలో శివలింగ ప్రతిష్టతను శుక్రవారం ఘనంగా జరిగింది 32 దేశాల నుంచి 140 మంది విదేశీయ భక్తులు హాజరయ్యారు శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం మహా చండీ హోమం నిర్వహించారు జర్మనీ గురూజీ పరమహంస విశ్వనాధ స్వామీజీ చేతులు మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి విదేశీ భక్తులు శివ నామ స్మరణతో మైమరిచిపోయారు Uploaded Video:

తిరుపతి

స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరంటు ర్యాలీ చేపట్టిన విద్యార్థినులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి పట్టణంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి సమాజ సేవకులుగా మారాలని కాసా గార్డన్ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన గైడ్స్ విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు, పాఠశాల గైడ్ కెప్టెన్ కుసుమ కుమారి, యూత్ చైర్మన్ ఎస్ కె అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైయస్ జగన్.. హైందవ సమాజ ద్రోహి -డా.యం.ఉమేష్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి నియోజికవర్గ తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అతి హేయమైన చర్యలగూర్చి పత్రిక ముఖంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ కల్తీ చేసిన మహాపాపం కప్పి పుచ్చుకోవడానికి వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి మరో మహాపరాధానికి పాల్పడిన జగన్ రెడ్డి, అతని సైకో వైసీపీ శాసనమండలి సభ్యులు హైందవ సమాజ ద్రోహులని ఆరోపణలు చేశారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి, అతని బృందం హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కల్తీ చేసిన నేరస్తుల పై చర్చ లేకుండా, స్వామి మీదకు చర్చను తీసుకుని వస్తారా ? చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో రావడం అనైతికం అని తెలిసీ.. వైసీపీ సభ్యులు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, రెచ్చగొట్టి దేవుడిని అవమానించిన వైసీపీ సభ్యులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్‌‌ని లక్ష్యంగా చేసుకొని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిందని కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చిందన్నారు. దీనికి సంబంధించిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీనిని ప్రజల దృష్టి నుండి మరల్చడానికి జగన్ రెడ్డి డైరెక్షన్ లో వైసిపికి చెందిన శాసనమండలి సభ్యులు నీచాతినీచమైన చర్యలకు పాల్పడి,కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి ఎలాగైతే చెప్పులతోనే ఆలయ ప్రాంగణం అంతా తిరిగాడో, అలాగే వైసీపీ నేతలు శాసనమండలిలో చెప్పులు, బూట్లు వేసుకునే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారని,ఇంత అపచారం చేసిన వారు తమ తప్పులకు లెంపలు వేసుకొని హిందువులకు క్షమాపణలు కోరాల్సింది పోయి… అడ్డంగా అబద్దాలు చెబుతూ ఛాలెంజ్ లు చేస్తున్న వీళ్ళను వెంకన్న స్వామే తగిన విధంగా శిక్షించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘జీరో లిట్టర్’ లక్ష్యంగా నేడు భారీ పారిశుధ్య డ్రైవ్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపాలిటీ చేపట్టిన ‘జీరో లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తునంరు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన భక్తులు భారీగా పాల్గొన్న గిరి ప్రదక్షిణ మార్గంలోని పరిసరాలను పారిశుధ్య సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయనున్నారు. మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నేడు పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కలిసి సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గిరి ప్రదక్షిణ మార్గానికి ఆనుకుని ఉన్న కీలక ప్రాంతాలైన కైలాసగిరి కాలనీ, టైలర్స్ కాలనీ, రాజీవ్‌నగర్,టిడ్కో (TIDCO) హౌసెస్ వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించి ‘లిటరింగ్’ (చెత్త వేయడం) నివారణపై స్థానికులకు అవగాహన కల్పిస్తూనే, క్షేత్రస్థాయిలో సిబ్బంది శ్రమదానం చేపడతారు. ఇటీవలే ప్రభుత్వం రూ. 10 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఆ మార్గం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని మునిసిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు విడిచివెళ్లిన వ్యర్థాలను వెంటనే తొలగించడం ద్వారా ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పట్టణ ప్రజలు కూడా ఈ ‘జీరో లిట్టర్’ నినాదంలో భాగస్వాములు కావాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మునిసిపాలిటీకి సహకరించాలని అధికారులు కోరారు.

తిరుపతి

ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవతో పెద్ద కన్నలి త్రాగునీటి సమస్య పరిష్కారం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం పెద్ద కన్నలి గ్రామంలో దీర్ఘకాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామస్థులు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి సూచనల మేరకు గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి ఎంపీ నిధుల నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రస్తుతం వాటర్ ప్లాంట్ యంత్రాంగం అమరిక పనులు చివరి దశలో ఉన్నాయి. రేపటిలోగా అన్ని పనులు పూర్తి చేసి ఆదివారం ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ వరంగా మారుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన బియ్యపు మధుసూదన రెడ్డికి, వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ఎంపీ మద్దిల గురుమూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకొవాలి-జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

శ్రీకాళహస్తి ఫిబ్రవరి 20: మండలలోని చల్లపాలెం గ్రామంలో ఈ పంట నమోదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం సిబ్బందిచే నమోదు ఈ పంట, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరలకు విక్రయించాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని, ఈ-కెవైసి ను ఈ నెల 25 వ తారీఖులోగా చేయించుకోవాలని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంతే ప్రాముఖ్యమైనది. త్వరలో ప్రభుత్వం నుండి రైతులకు కార్డు కూడా అందజేస్తుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోనని రైతులు ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులవుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టంగా తెలియజేశారు. ప్రతి రైతు తమ గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది వద్దకు తమ ఆధార్ కార్డు, పట్టదారు పాసు పుస్తకము తో పాటు ఆధార్ కార్డు కు అనుసంధానమైన ఫోన్ తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు ఈ నెల 28 వ తారీఖు ఆఖరి గడువు అని తెలియజేశారు. ప్రతి రైతు తమ ఫోన్ లో ఏపీ ఏఐఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. రాబోయే రోజులలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రైతు సోమ భూమి వివరములు, ఈ పంట నమోదు వివరములు, సస్య రక్షణ, వాతావరణ సమాచారం మొదలగు అన్ని విషయాలు ఈ యాప్ నందు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేంద్ర రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి రైతులు పార్థ సారథి రెడ్డి , గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రంగుల వెల్లువలో శ్రీకాళహస్తీశ్వరుడు.. కనువిందుగా వసంతోత్సవ వేడుకలు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామి, అమ్మవార్ల ‘వసంతోత్సవం’ అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది. ప్రకృతి పరవశించేలా, భక్తుల తన్మయత్వం మధ్య జరిగిన ఈ రంగుల వేడుకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంతరించుకున్నాయి. వసంత ఋతువు రాకకు సంకేతంగా, లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలు కలిపిన పసుపు, కుంకుమలు, వసంత తీర్థాన్ని స్వామివారిపై చిలకరించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ ‘హర హర మహాదేవ’ శంభో శంకర’ స్మరణతో ముక్కంటి క్షేత్రాన్ని మారుమోగించారు. బ్రహ్మోత్సవాల ముగింపు దశలో జరిగే ఈ వసంతోత్సవంలో పాల్గొంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే స్థానిక భక్తులతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగుల కేళిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు ఆలయ ఈఓ, అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

ముక్కంటిశునికి ముత్యాల సొబగులు-స్వామి, అమ్మవార్లకు ముత్యాల కవచాలు విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతుండగా, స్వామి, అమ్మవార్ల అలంకరణలో మరో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌ వాస్తవ్యులు శ్రీరంగ ఎంటర్ప్రైజెస్, అలంకార సేవా ట్రస్ట్ ప్రతినిధులు ముక్కంటిపై తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల కోసం ప్రత్యేకంగా చేయించిన ముత్యాల కవచాలను శనివారం నాడు ఆలయ అధికారులకు అందజేశారు. భక్తిభావంతో అపురూప కానుక హైదరాబాద్ వాస్తవ్యులైన దాతలు ఈ అపురూపమైన ముత్యాల కవచాలను ఆలయ కార్యనిర్వహణాధికారికి శాస్త్రోక్తంగా అందజేశారు. అత్యంత ఖరీదైన, నాణ్యమైన ముత్యాలతో నైపుణ్యం కలిగిన కళాకారులచే ఈ కవచాలను రూపొందించారు. ఉత్సవమూర్తులకు ఈ కవచాలను అలంకరించినప్పుడు వారి వైభవం మరింత దేదీప్యమానంగా వెలుగుతుందని దాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం జరిగే ఉత్సవాల్లో స్వామివారి అలంకరణకు ఇలాంటి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. దాతలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వారికి ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. బ్రహ్మోత్సవాల వేళ విదేశీ భక్తుల రాకతో పాటు, ఇలాంటి భారీ విరాళాలు అందడం ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతోందని భక్తులు చర్చించుకుంటున్నారు. ఆలయాదికారులు దాతలకు శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్సన ఏర్పాట్లు చేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో విదేశీయుల శివనామస్మరణ-ముక్కంటి సేవలో రష్యా, జర్మనీ భక్తులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా శుక్రవారం నాడు విదేశీ భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాగరంలో విదేశీయులు ఆలయానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం, సంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణతో దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహిమను, ఆలయ విశిష్టతను తెలుసుకున్న వీరు, స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికత, యోగా, శివతత్వంపై ఉన్న ఆసక్తితో తాము ఇక్కడికి వచ్చినట్లు భక్తులు తెలిపారు. ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని చూసి వారు అబ్బురపడ్డారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు.

తిరుపతి

కైలాసగిరి ప్రదక్షిణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల గిరిప్రదక్షిణ కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.