Thursday, 23 April 2026

Blog

తూర్పు గోదావరి

భాష్యం పాఠశాలలో వైభవంగా ‘కల్చరల్ డే’ వేడుకలు ​

కొవ్వూరులోని భాష్యం పాఠశాలలో శనివారం ‘కల్చరల్ డే’ (సాంస్కృతిక దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థుల కేరింతలు, నృత్య ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రిన్సిపాల్ హరిబాబు, ప్రధానోపాధ్యాయురాలు కోటేశ్వరిదేవి మాట్లాడుతూ, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీసే లక్ష్యంతోనే ప్రతి ఏటా ఈ కల్చరల్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాకుండా, కళలు, క్రీడలు వంటి రంగాల్లో కూడా విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఇటువంటి వేదికలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక నృత్యాలు, వేషధారణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ, జానపద మరియు సినీ గీతాలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు సభికుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమం అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు.

కడప

కడప: కీర్తనకు పోస్టుమార్టం పూర్తి

ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన విద్యార్థి కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్య అధికారులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థిని కీర్తన మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణమంతా కన్నీటి సంద్రమైంది.

రాజన్న సిరిసిల్ల

నామాపూర్ ఆదర్శ పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ముస్తాబాద్ / ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం నామాపూర్ ఆదర్శ పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కందన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి చేసిన కృషి ఎంతో గొప్పదని తెలిపారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పూలే చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పూలే జీవిత విశేషాలను వివరించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఉపన్యాసాలు నిర్వహించారు. ఈ వేడుకలు పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

మహబూబ్ నగర్

బ్లాక్ బెల్ట్ కరాటే విద్యార్థులకు ప్రధానోస్తవ కార్యక్రమం

*ఆర్కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవం కార్యక్రమం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 11/0 4/20 26* *గౌరవనీయులైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు* తెలియజేయడమేమనగా* రేపు అనగా ఆదివారం:: 12/04/26 నాడు ఉదయం 8 గంటలకు స్థానిక పాలమూరు రెడ్డి సేవా సమితి హాల్లో కలర్, బ్లాక్ బెల్ట్ బహుమతి ప్రధానోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు, తప్పనిసరి బహుమతి ప్రధానోత్సవానికి* రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మరియు స్థానిక శాసనసభ్యులు, ఆర్కే స్పోర్ట్స్ అధ్యక్షులు సలహాదారులు తదితరులు పాల్గొంటున్నారని మాస్టర్ కె .రవికుమార్, తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం ఎర్రవల్లిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు.

*దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం.* *ఎర్రవల్లిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు.* *నివాళి అర్పించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మణి కుమార్* జోగులాంబ గద్వాల్ ఏప్రిల్ 11 (పున్నమి ప్రతినిధి) దేశ ప్రజలకు పూలే బాట ఆచరణనీయమనీ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. దేశంలోని ప్రజలకు విద్య రావాలనే ఉద్దేశంతో విద్యా విప్లవానికి కృషి చేశారని ఈ సందర్భంగా ఫూలే సేవలను ఆయన కొనియాడారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను ఎర్రవల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 సంవత్సరాల వయసులోనే దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య రావాలనే సంకల్పంతో చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేను బాల్య వివాహం చేసుకొని.. ఆమెకు విద్యను నేర్పించి అనంతరం దేశ ప్రజలకు విద్యను నేర్పాలని ఆమెను మహిళ ఉపాధ్యాయులుగా తయారు చేయడం జరిగిందన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీ వర్గాలకు విద్య ఉండాలనే ప్రతిపాదనలను అప్పటి విద్యా కమీటి హంటర్ కమిషన్ వినతి పత్రాన్ని అందజేశారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యకు అధిక ప్రాముఖ్యత నివ్వాలన్నారు. విద్య మరియు ఓటు హక్కు ద్వారానే మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు, అలంపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శాంతి రాజు, ఎర్రవల్లి మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు, ఇటిక్యాల మండల అధ్యక్షుడు టి.జీవన్ , వార్డ్ సభ్యులు హైమావతి, మహేశ్వరి, శిరోమణి, రామచంద్రుడు, సీనియర్ నాయకులు బొజ్జన్న, బీసన్న, దుబ్బన్న ఇతరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

BSP ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకలు

భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకలను తూర్పుగోదావరి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) శనివారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా BSP జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు  అర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫూలే ఆశయాలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాలు మరియు మహిళల విద్యా హక్కు కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. కుల వివక్ష లేని సమాజ స్థాపన కోసం ఆయన వేసిన పునాదులే నేటి బహుజన ఉద్యమాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, బహుజనుల రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BSP రాజమండ్రి సిటీ ఇన్‌చార్జి ఇసకపట్ల రాంబాబు, జిల్లా నాయకులు నక్క వెంకటరత్నం, రాజమండ్రి రూరల్ నాయకులు క్రొత్తపల్లి శేఖర్, అర్బన్ నాయకులు కొంకి రమేష్ , ఐటీఐ భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

జలదార–జలహారతి కార్యక్రమంలో రైతుల సమస్యలకు పరిష్కారం – కాలువల అభివృద్ధికి హామీ….

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): జలదార–జలహారతి కార్యక్రమం గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ విభాగం నుంచి ఏఈ హాజరై, గ్రామంలోని పంట కాలువల పరిస్థితిని పరిశీలించారు. పులపర్తి నుంచి ఏటికొప్పాక కాలువ ద్వారా గ్రామానికి నీరు సక్రమంగా అందుతున్నదా లేదా అన్న విషయంపై గ్రామసభలో విస్తృతంగా చర్చ జరిగింది. రైతులు తమ సమస్యలను వివరంగా తెలియజేస్తూ, కొన్ని ప్రాంతాలకు నీరు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏఈ, కాలువల పక్క భాగాల అభివృద్ధి పనులు త్వరలో చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ నీటిపారుదల చైర్మన్ చింతలపాటి దేవి ప్రసాద్ రాజు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ గిరి ప్రసాద్, కాండ్రకోట చిరంజీవి, అన్నం బాబూజీ,నగిరెడ్డి అచ్చయనాయుడు,సింహాచలం, నాయుడు మాస్టారు, రాయి చలపతి, సరోజిరావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామసభ స్పెషల్ ఆఫీసర్ ఎమ్మార్వో సమక్షంలో రైతుల ఇబ్బందులను గుర్తించి, పంట కాలంలో నీటి సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేతల ఘన నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి పూలే జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలోని అజ్ఞాన చీకట్లను తొలగించి విద్య అనే వెలుగును ప్రసారించిన మహనీయుడు పూలే సేవలను స్మరించుకుంటూ వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా పూలే సమాజ సంస్కరణలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడం, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, సమానత్వం కోసం పోరాడడం వంటి గొప్ప కార్యక్రమాలను ఆయన చేపట్టారని తెలిపారు. ఆ కాలంలో సామాజిక అసమానతలను తొలగించేందుకు పూలే చేసిన కృషి వల్లనే సమాజంలో పెద్ద మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విద్యా విస్తరణ, సమాన హక్కులపై అవగాహన వంటి అంశాలకు పూలే చేసిన సేవలే పునాది అని వారు అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకల్లో మంత్రి , జిల్లా కలెక్టర్

నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వారు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సమాజ సంస్కరణల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, సమానత్వం మరియు విద్యా విస్తరణలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో 104 వైద్య శిబిరం – వృద్ధులకు ఉచిత పరీక్షలు, అవగాహన…

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 11 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో శనివారం 104 వైద్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, ANM సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొని రోగులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే వైద్యుల సూచనల మేరకు మందులు క్రమంగా తీసుకోవాలని అవగాహన కల్పించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో హాజరై సేవలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో ఈ శిబిరం కీలకంగా నిలిచింది. ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.