Thursday, 23 April 2026

Blog

మహబూబ్ నగర్

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

*బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF) తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా శాఖ పక్షాన ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ ::11/04/2026* *ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తూ 199వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మ జ్యోతిరావు గారి సంఘ సంస్కరణ విద్యపై తన చేసిన పోరాటాన్ని, మరియు పుక్కిడి పురాణాల కథంతా మహాత్మ పూలే గారు తన గులాంగిరి పుస్తకంలో పూర్తిగా తెలియజేస్తూ బ్రామణిజంపై తను ఉక్కు పాదం మోపి బడుగు బలహీన వర్గాలకు శుద్రజాతులకు, అనగారిన వర్గాలకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి సావిత్రి బాయ్ పూలేను భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది దాదాపు 56 కు పైగా బాలికల విద్యాలయాలను స్థాపించి విద్యను అందించిన గొప్ప సంస్కరణ వాది ప్రజల చేత మహాత్మా అని అనిపించుకున్న వాడు అని బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య, తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర్ రస కార్యదర్శులు జై పవన్ కుమార్, మేడం విజయకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయ్ కుమార్ సత్తయ్య అలాగే సోదర సంఘం నాయకులు టి ఆర్ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమకాంత్ పాల్గొని పుష్పాంజలి ఘటించి శుభాకాంక్షలు తెలియజేసినారు*

తూర్పు గోదావరి

రాజమండ్రిలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ (ఏ ఎస్ జి హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్) రాజమండ్రిలో తన కొత్త బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించింది. కటారిగార్డెన్లో, కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక, అందుబాటులో ఉండే సమగ్ర కంటి చికిత్స సేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా 87 నగరాల్లో 172కు పైగా శాఖలతో విస్తరించిన ఏ ఎస్ జి ఐ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో భాగమైన ఈ ఆసుపత్రి, రెండు దశాబ్దాల అనుభవంతో అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యులతో ఉన్నత ప్రమాణాల చికిత్స అందిస్తోంది. రాజమండ్రి శాఖ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన కంటి సంరక్షణ సేవలను మరింత విస్తరించాలనే సంకల్పాన్ని సంస్థ వ్యక్తం చేసింది. కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రంలో కంటిశుక్లం (ఫాకో సర్జరీ), గ్లాకోమా నిర్ధారణ మరియు చికిత్స, లాసిక్ & రిఫ్రాక్టివ్ సర్జరీ, రెటినా సేవలు (డయాబెటిక్ రెటినోపతి, రాప్ ), కార్నియా వ్యాధులు, పిల్లల కంటి వైద్యం, ఆక్యులోప్లాస్టీ, న్యూరో ఆఫ్తాల్మాలజీ, అంబ్లయోపియా నిర్వహణ, అత్యవసర కంటి గాయాల చికిత్స వంటి అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక నిర్ధారణ పరికరాలు, అనుభవజ్ఞులైన నేత్ర వైద్యులు, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా రోగులకు భద్రతతో కూడిన నాణ్యమైన సేవలు అందిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ , మాజీ మంత్రి గోరంట్ల బుచయ్య చౌదరి , బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి , కందుల దుర్గేష్ మరియు అత్తి సత్యనారాయణ పాల్గొని ఆసుపత్రి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా డా. వరప్రసాద్, డా. నేహా కమలిని, డా. ఉమా మహేశ్వరరావు, డా. మణిమాల, డా. ఆడపా శ్రీ మోనికలు ప్రసంగిస్తూ కేంద్రంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు మరియు సేవల గురించి వివరించారు. ఈ శాఖ ప్రారంభంతో స్థానిక ప్రజలు ఇకపై మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రాజమండ్రిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స పొందే అవకాశాన్ని పొందారు. ప్రారంభోత్సవ సందర్భంగా పరిమిత కాలం పాటు ఉచిత కంటి పరీక్షలు, కటారాక్ట్ పరీక్షలు, కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి ప్రకటించింది. అందుబాటు ధరలు, ఇన్సూరెన్స్ మరియు క్యాష్‌లెస్ సౌకర్యాలతో సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోగులకు సాంకేతికత ఆధారిత నాణ్యమైన కంటి సేవలను అందిస్తూ తన సేవలను విస్తరించుకుంటోంది.

కడప

ప్రొద్దుటూరులో ఇద్దరు ఆత్మహత్య

ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. వారిరువురు శనివారం ఇంటిలోని వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి – బంగారం, వెండితో వినూత్న చీర

రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళా రత్న అవార్డు గ్రహీత. చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం రెండు గ్రాముల బంగారం, రెండు గ్రాముల వెండితో ఆకర్షణీయమైన చీరను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. సుమారు 25 రోజుల పాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ ప్రత్యేక చీరను నేసారు. హైదరాబాద్ వ్యాపారవేత్త చెన్నారావు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ చీరను మన సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్ల విజయ్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని చెప్పారు. సుమారు రూ.85 వేల వ్యయంతో రూపొందిన ఈ చీర సిరిసిల్ల నేతన్నల ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిందని పలువురు వ్యక్తులను మంత్రముగ్ధుల్ని చేసిందని నల్ల విజయిని అభినందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఎస్సై శివ రాకేష్ సత్కారం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు ఎస్సై శివ రాకేష్‌కు జిల్లా ఎస్పీ డాక్టర్ అజంతా వేజెండ్ల చేతుల మీదుగా అవార్డు లభించింది. నెల్లూరులో నిర్వహించిన క్రైమ్ మీటింగ్‌లో ఈ పురస్కారం అందజేశారు. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితులను సకాలంలో గుర్తించడంలో చూపిన ప్రతిభకు, అలాగే పలు దొంగతనం కేసుల్లో బంగారు నగల రికవరీలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. ఆయన సేవలను అధికారులు ప్రశంసించగా, సహచరులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రత్యేక పూజలు, అన్నదానంతో వెంకయ్య స్వామి ఆలయంలో ఉత్సాహం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతు విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టిన మనుబోలు నాయకులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 11( మల్లికార్జున్ రావు పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సూరపనేని కిషోర్ నాయుడు, ముంగర వెంకటరమణారెడ్డి రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీలుగా నియమితులైన సందర్భంగా స్థానికంగా హర్షం వ్యక్తమైంది. మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో ఈ నియామకాలు జరగడం గమనార్హం. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

రాజన్న సిరిసిల్ల

చీకుడు గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన యువత

ముస్తాబాద్ ఏప్రిల్ 11 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు , నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భరతమాత ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన ఫూలే గారు సామాజిక సంస్కరణలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శిగా, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు జీవితమంతా పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. ఫూలే గారి సేవలు సమాజ ప్రగతికి నిత్యం స్పూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు ., ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, ఐక్యతకు ప్రతీకగా కన్నుల పండుగగా జరిగింది.

రాజన్న సిరిసిల్ల

“సమాజ సంస్కరణల పితామహుడికి ఘన నివాళులు” – ముస్తాబాద్‌లో జయంతి

ముస్తాబాద్ ఏప్రిల్ పున్నమి ప్రతినిధి ముస్తాబాద్, ఏప్రిల్ 11: సమాజ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఫూలే గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల ముదిరాజ్ సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఫూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే గారు చేసిన కృషి అపారమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, ఐక్యతకు ప్రతీకగా జరిగింది.

తూర్పు గోదావరి

భాష్యం పాఠశాలలో వైభవంగా ‘కల్చరల్ డే’ వేడుకలు ​

కొవ్వూరులోని భాష్యం పాఠశాలలో శనివారం ‘కల్చరల్ డే’ (సాంస్కృతిక దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థుల కేరింతలు, నృత్య ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రిన్సిపాల్ హరిబాబు, ప్రధానోపాధ్యాయురాలు కోటేశ్వరిదేవి మాట్లాడుతూ, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీసే లక్ష్యంతోనే ప్రతి ఏటా ఈ కల్చరల్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాకుండా, కళలు, క్రీడలు వంటి రంగాల్లో కూడా విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఇటువంటి వేదికలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక నృత్యాలు, వేషధారణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ, జానపద మరియు సినీ గీతాలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు సభికుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమం అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.